-
ఫ్లిప్కార్ట్ గుడ్న్యూస్.. ఇక హైదరాబాద్లోనూ కొత్త ఆఫర్!
హైదరాబాద్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇటీవల బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, ముంబైలలో ప్రారంభించిన వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ను ఇప్పుడు హైదరాబాద్కు విస్తరించింది. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లు ఉచిత డెలివరీ, తగ్గింపు వంటి ఆఫర్లను పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ వీఐపీ (Flipkart VIP) సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ను కొత్తగా హైదరాబాద్తోపాటు అహ్మదాబాద్, భువనేశ్వర్, కోయంబత్తూర్, గౌహతి, పాట్నా, పూణే, రాంచీలలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు సంవత్సరానికి రూ. 499 చెల్లించి ఫ్లిప్కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు ఈ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ లక్షలాది ఉత్పత్తులపై 48-గంటల ఉచిత డెలివరీ, అన్ని ఉత్పత్తులపైనా చెల్లింపుల కోసం సూపర్ కాయిన్స్ను ఉపయోగించి 5 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. క్లియర్ట్రిప్లో ఒక్క రూపాయికే ఫ్లైట్ క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. క్లియర్ట్రిప్ హోటల్ బుకింగ్లపై అదనపు ఆఫర్లు, 48 గంటలలోపు రిటన్ పికప్. షాపింగ్ ఫెస్టివల్స్కు ముందస్తు యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా ఎలా నమోదు చేసుకోండి.. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లేదా యాప్ని సందర్శించండి మీ వివరాలతో లాగిన్ చేయండి. ఒకవేళ మీరు ప్లాట్ఫామ్కు కొత్త అయితే, మీ వివరాలను అందించి అకౌంట్ను క్రియేట్ చేసుకోండి. వీఐపీ ల్యాండింగ్ పేజీకి స్క్రోల్ చేసి, 'గెట్ వీఐపీ బెనిఫిట్స్' బటన్పై నొక్కండి చెల్లింపు, తుది ప్రక్రియ కోసం 'కంనిన్వ్యూ' క్లిక్ చేయండి మీకు అనువైన మోడ్ ద్వారా చెల్లింపు వివరాలను నమోదు చేసి ఆర్డర్ను కన్ఫర్మ్ చేఏయండి విజయవంతంగా నమోదు చేసుకున్న తర్వాత, వెబ్సైట్ లేదా యాప్లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. -
25 వేల రూట్లు, 10 లక్షల బస్సులు.. ఈకామర్స్ సంస్థ కొత్త సేవలు
ఆన్లైన్ ఈకామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్ తన వాటాను పెంచుకున్నప్పటి నుంచి కంపెనీను లాభాలబాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఫ్లిప్కార్ట్ ఆధ్వర్యంలో ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్ సేవలను ప్రారంభించారు. ఈమేరకు రాష్ట్ర రవాణా కార్పొరేషన్లు, ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీలు వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతానికి ఈ సేవలు బెంగళూరు, ఛండీగఢ్, దిల్లీ, జైపూర్, ఇందోర్, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఇదీ చదవండి: లగేజీ తీసుకురావడానికి రూ.25 కోట్ల కాన్వాయ్! ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆన్లైన్ బస్ బుకింగ్ ప్లాట్ఫామ్లు టికెట్ ధరతోపాటు ఇతర ఛార్జీలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. అయితే కొత్తగా వచ్చిన ఫ్లిప్కార్ట్ బుకింగ్ పోర్టల్లో టికెట్ కొంటే ఎలాంటి ఛార్జీలు ఉండవని చెప్పారు. కొత్తసేవలు ప్రారంభించిన సందర్భంగా ఏప్రిల్ 15 వరకు టికెట్ ధరలో 20 శాతం వరకు రాయితీని సైతం పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా బస్సులను అనుసందానిస్తూ ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. -
కొత్త ఈ-కామర్స్ కంపెనీ.. చవకా.. వీక్నెస్ పట్టేశారు!
దేశంలో సగటు కస్టమర్ల బలహీనతను కంపెనీలు పట్టేస్తున్నాయి. ఇలాంటి కస్టమర్ల కోసం ప్రత్యేక ఈ-కామర్స్ విభాగాలను తెరుస్తున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా "బజార్" అనే పేరుతో కొత్త చవక ఉత్పత్తుల విభాగాన్ని పరిచయం చేసింది. ఈ వినూత్న విభాగం కస్టమర్లకు అతి తక్కువ ధరలలో అన్బ్రాండెడ్ ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఉత్పత్తులను అందిస్తుంది. భారతీయ వినియోగదారుల విభిన్న అవసరాలు, ప్రాధాన్యతలను తీరుస్తుంది. ఈ కొత్త వెంచర్ ఇప్పుడు అమెజాన్ ఇండియా ఆండ్రాయిడ్ యాప్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ‘ది ఎకనామిక్ టైమ్స్’ ప్రకారం.. ఈ-కామర్స్ దిగ్గజం రూ. 600లోపు ధర కలిగిన దుస్తులు, వాచీలు, బూట్లు, ఆభరణాలు, బ్యాగ్లతో సహా బ్రాండెడ్ ఉత్పత్తులను జాబితా చేయడానికి విక్రేతలను ఆన్బోర్డింగ్ చేసింది. వీటిని ఆర్డర్ చేసే ప్రైమ్ సభ్యులకు 4-5 రోజుల్లోనే డెలివరీ చేయనుంది. సాధారణంగా చవకైన ఉత్పత్తుల డెలివరీకి ఎక్కువ సమయం పడుతుంది. ‘బజార్’ పరిచయాన్ని అమెజాన్ ఇండియా ప్రతినిధి ధ్రువీకరించారు. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, భారతదేశం అంతటా ఉన్న తయారీ కేంద్రాల నుండి విక్రేతలు అందించే ఫ్యాషన్, ఇతర వస్తువులను తక్కువ ధరలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు అని కంపెనీ పేర్కొంది. దేశంలో ఇప్పటికే ఇలాంటి లోకాస్ట్ ఈ-కామర్స్ సంస్థలు కొన్ని ఉన్నాయి. చవక ధర ఉత్పత్తులను విక్రయించడానికి మరో దిగ్గజ ఆన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) కూడా షాప్సీ (Shopsy) పేరుతో వేరే యాప్ని నిర్వహిస్తుంది. దీంతోపాటు లోకాస్ట్ ఈ-కామర్స్ మార్కెట్లో పురోగతి సాధిస్తున్న సాఫ్ట్బ్యాంక్-మద్దతు గల మీషోతోనూ అమెజాన్ బజార్ పోటీపడనుంది. -
Flipkart: రెండేళ్లలో రూ.41000 కోట్లు తగ్గిన ఫ్లిప్కార్ట్ విలువ!
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ వేల్యుయేషన్ గత రెండేళ్లలో రూ. 41,000 కోట్ల మేర (సుమారు 5 బిలియన్ డాలర్లు) తగ్గింది. 2022 జనవరిలో ఇది 35 బిలియన్ డాలర్లుగా ఉండగా ఈ ఏడాది జనవరి 31 నాటికి 35 బిలియన్ డాలర్ల స్థాయికి పరిమితమైంది. ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్ ఈక్విటీ స్వరూపంలో వచి్చన మార్పుల పరిశీలనతో ఇది వెల్లడైంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్ 8 శాతం వాటాని 3.2 బిలియన్ డాలర్లకు విక్రయించింది. తద్వారా సంస్థ వేల్యుయేషన్ 40 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లయింది. మరోవైపు, 2024 ఆర్థిక సంవత్సరంలో వాల్మార్ట్ 3.5 బిలియన్ డాలర్లతో తన వాటాను 10 శాతం పెంచుకోవడంతో వేల్యుయేషన్ 35 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లయింది. అయితే, వేల్యుయేషన్ తగ్గిపోయిందనడానికి లేదని, 2023లో ఫోన్పే సంస్థను విడగొట్టడం వల్ల సర్దుబాటు అయినట్లుగా మాత్రమే భావించాల్సి ఉంటుందని ఫ్లిప్కార్ట్ వర్గాలు తెలిపాయి. సంస్థ వేల్యుయేషన్ ప్రస్తుతం 38–40 బిలియన్ డాలర్లుగా ఉంటుందని సంబంధిత వర్గాలు వివరించాయి. -
రేపటి నుంచి బిగ్ అప్గ్రేడ్ సేల్ ప్రారంభం
ఫ్లిప్కార్ట్ బిగ్ అప్గ్రేడ్ సేల్ ఈనెల 9 నుంచి ప్రారంభంకానున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఈవెంట్కు సంబంధించిన టీజర్ ఇప్పటికే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో ప్రత్యేక్షమైంది. వారం రోజుల పాటు సాగే ఈ సేల్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. ఈ సేల్లో భాగంగా పలు ప్రముఖ ఫోన్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫ్లిఫ్కార్ట్ అధికారిక సైట్ బిగ్ అప్డేట్ సేల్ పేజ్లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఐఫోన్ 15 ఈ సేల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ హాట్ డివైజ్ ప్రస్తుతం రూ.72,999కి లభించనుంది. ఇదీ చదవండి: బంగారం ధర ఆల్టైమ్హైకు చేరనుందా..? ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, రియల్మి 12 ప్రొ+, వివో టీ2 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ, మోటో జీ34 5జీ, రెడ్మి 12, పోకో ఎం6 ప్రొ, రియల్మి సీ53, పోకో ఎం6, రెడ్మి 13సీ, పోకో సీ51, మోటో జీ54, రియల్మి 11ఎక్స్ వంటి ఫోన్లపైనా ఫ్లిప్కార్ట్ సేల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement