-
ఏకకాలంలో ఎన్నోపనులు..!
ఒకేసమయంలో రెండు పనులు చేయడం సాధ్యమా.. అని అడిగితే చాలా కష్టమని చెబుతాం. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్లో క్యూబిట్స్ ఏకకాలంలో చాలా పనులు చేయగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.నిత్యం టెక్నాలజీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్నిరంగాల్లో అందరికంటే ముందుండాలనే భావనతో వేగంగా పనిచేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గుట్టు ప్రముఖ కంపెనీలు సాంకేతిక పరికరాలు తయారుచేస్తున్నాయి. వాటిలో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీను వాడే పరికరాలకు సమీప భవిష్యత్తులో గిరాకీ ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.ఈ ఏడాదిలో డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధ రంగాలను క్వాంటమ్ కంప్యూటింగ్ గణనీయంగా మలుపు తిప్పగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మానవ పురోగమనాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం వాడుతున్న కంప్యూటింగ్ టెక్నాలజీ కంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఎన్నోరెట్లు సమర్థంగా, వేగంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఎలా పనిచేస్తుందంటే..ఇది ఎంటాంజిల్మెంట్, సూపర్పొజిషన్స్ అనే అంశాల మూలంగా ఒకే సమయంలో వేలసంఖ్యలో గణనలు చేయగలదు. సంప్రదాయ కంప్యూటర్లు బైనరీ బిట్స్..అంటే 0 లేదా 1 రూపంలో సమాచారాన్ని నిల్వ చేసుకుంటాయి. దాన్ని విశ్లేషిస్తాయి. అదే క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్ సాయంతో పనిచేస్తాయి. ఇవి 1, 0.. లేదా ఒకే సమయంలో రెండు రూపాల్లోనూ ఉండొచ్చు. అంటే ఒక పని పూర్తి కాకుండానే మరో పనిని మొదలు పెడుతాయి. ఒకే సమయంలో రెండు పనులనూ చేస్తాయి.ఇదీ చదవండి: 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..క్వాంటమ్ రేణువులు ఎంటాంజిల్మెంట్ అనే విచిత్రమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. ఎంటాంజిల్ అయినప్పుడు అవి ఎంత దూరంలో ఉన్నా ఒకదాంతో మరోటి అనుసంధానమవుతాయి. అదీ లక్షలాది మైళ్ల దూరంలో ఉన్నాసరే ఎంటాంజిల్ అవుతాయి. ఈ ప్రక్రియలో క్యూబిట్ల సంఖ్యను పెంచితే క్వాంటమ్ పరికరాల సామర్థ్యం అనూహ్యంగా పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పరిజ్ఞానం ప్రయోగశాలలను దాటుకొని వాడకానికి దగ్గరవుతోంది. మందుల ఆవిష్కరణ, క్రిప్టోగ్రఫీ, వాతావరణ శాస్త్రం, పదార్థ విజ్ఞానం వంటి ఎన్నో రంగాల్లో ఇది సంచలన మార్పులకు కారణం కాగలదని భావిస్తున్నారు. -
First general elections: ఒక్క స్థానం.. ఇద్దరు ఎంపీలు!
ఒక్క లోక్సభ నియోజకవర్గానికి ఇద్దరు ఎంపీలుంటారా? ఇద్దరేం ఖర్మ... ముగ్గురు కూడా ఉన్నారు! ఎప్పుడు? ఎలా?మన దేశంలో రాజకీయాలు చాలా క్లిష్టంగా ఉ న్నాయని ఇప్పుడనుకుంటున్నాం. కానీ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగిన ఎన్నికల సమయంలో మరింత సంక్లిష్టంగా ఉన్నాయి. సాధారణంగా ఒక్క నియోజకవర్గానికి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తారు. ఎన్నికలు జరిగేదే ఆ ప్రతినిధిని ఎన్నుకోవడానికి. కానీ తొలి రెండు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పలు నియోజకవర్గాలకు ఇద్దరేసి ఎంపీల ను ఎన్నుకున్నారు. 1961లో రద్దయ్యే దాకా ఇది కొనసాగింది. కొన్ని నియోజకవర్గాలకైతే ముగ్గురు ఎంపీలూ ఉన్నారు! దళితులు, గిరిజన సమూహాల వంటి అణగారిన వర్గాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం పెంచేందుకు ఈ ఏర్పాటు కలి్పంచారు.తొలి ఎన్నికల్లో...మొట్టమొదటి ఎన్నికల సమయంలో లోక్సభలో 400 స్థానాలున్నాయి. వీటిలో 314 స్థానాలకు ఒక్క ఎంపీ ఉండగా, 86 నియోజకవర్గాలకు ఒక జనరల్, మరొక షెడ్యూల్ కులాల ప్రతినిధి చొప్పున ఇద్దరేసి ఎంపీలు ఎన్నికయ్యారు. ఇలా ఇద్దరు ఎంపీలున్న నియోజకవర్గాలు యూపీలో 17, నాటి మద్రాసు రాష్ట్రంలో 13, బిహార్లో 11, బాంబేలో 8 ఉన్నాయి. పశి్చమబెంగాల్లోని నార్త్ బెంగాల్ నియోజకవర్గానికయితే ఏకంగా ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు!1957లో...సీట్ల పునరి్వభజన అనంతరం 1957 సార్వత్రి క ఎన్నికల్లో 494 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీల స్థానాలు 57కు తగ్గాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రద్రేశ్లో 18, ఆంధ్రప్రదేశ్లో 8, బిహార్లో 8, పశి్చమబెంగాల్లో 8, బాంబేలో 8, మద్రాసులో 7 స్థానాలకు ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూఫ్టాప్ సోలార్ కిట్లకు తెగ డిమాండ్
న్యూఢిల్లీ: రూఫ్టాప్ సోలార్ కిట్లకు డిమాండ్ గణనీయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గతేడాది ద్వితీయ ఆరు నెలల కాలంలో 5.2 మిలియన్ కిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది మొదటి ఆరు నెలల అమ్మకాలతో పోలిస్తే 20 శాతం పెరగ్గా, 2019 ద్వితీయ ఆరు నెలల కాలంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని చూసినట్టు ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తెలిపారు. సోలార్ రూఫ్టాప్ మార్కెట్ గతేడాది బలమైన పనితీరు చూపించినట్టు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన దక్షిణాసియా ఫోరమ్ సదస్సులో భాగంగా మాథుర్ మాట్లాడారు. ఈ సదస్సును కేంద్ర పునరుత్పాదక ఇంధనం, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ శాఖల సహాయ మంత్రి భగవంత్ ఖుబా ప్రారంభించారు. సుస్థిర అభివృద్ధి, ఇంధన లభ్యత పెంపొందించడం తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో భాగంగా చర్చలు జరిగాయి. 200 వరకు దేశీ, అంతర్జాతీయ భాగస్వాములు ఇందులో పాల్గొన్నారు. -
శాన్ఫ్రాన్సిస్కోలో భారత నూతన కాన్సులేట్ జనరల్గా తెలుగు వ్యక్తి!
అమెరికా... అందులోనూ సిలికాన్ వాలీ అంటే తెలుగు రాష్ట్రాల వారికి ఎంతో ఆసక్తి. ఐటీ ఇండస్ట్రీకి పెట్టింది పేరైన ఈ ప్రాంతానికి ఇప్పుడు భారత నూతన కాన్సులేట్ జనరల్గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా శ్రీకర్ రెడ్డి పని చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నల్గొండ జిల్లా యాదాద్రి మోత్కూరు మండలంలోని కొండగడప శ్రీకర్ రెడ్డి స్వస్థలం. కాకతీయ వర్సిటీ నుంచి మెడిసిన్ చదివిన శ్రీకర్ రెడ్డి.. యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. జర్మనీలోని బెర్లిన్లో పనిచేసిన శ్రీకర్రెడ్డి.. దిల్లీలోని ఫారిన్ అఫైర్స్లో కూడా సేవలందించారు. ప్రస్తుతం భారత్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి (ఐఎఫ్ఎస్) శాన్ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. The Consulate General of India, San Francisco @CGISFO announces with pleasure, Dr. Srikar Reddy has assumed charge as the Consul General. pic.twitter.com/WW09HDiwPl — India in SF (@CGISFO) August 21, 2023 బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన ఇండిపెండెన్స్ డే కార్యక్రమంలో శ్రీకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను సాక్షి టీవీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. "రెండు తెలుగు రాష్ట్రాల్లో పాస్ పోర్ట్ అధికారిగా పని చేశాను. ఇక్కడ ఇండిపెండెన్స్ డే సమయంలో శాన్ఫ్రాన్సిస్కోలో కాన్సుల్ జనరల్గా బాధ్యతలు స్వీకరించడాన్ని సంతోషంగా భావిస్తున్నాను. ఎంతో మంది తెలుగు వారు టెకీలుగా ఈ ప్రాంతంలో ఉన్నారు. భారత్, అమెరికా ప్రభుత్వాలు రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు ప్రయత్నించడం శుభదాయకం. అమెరికా వీసాల కోసం పెరుగుతున్న టైంలైన్ను ఇప్పటికే ఇక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. విద్యార్థుల డీపోర్టేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని" శ్రీకర్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. తెలంగాణకు చెందిన శ్రీకర్ రెడ్డి శాన్ ఫ్రాన్సిస్కోలో కాన్సుల్ జనరల్గా బాధ్యతలు స్వీకరించడం తమకెంతో గర్వంగా ఉందంటూ ఆయనకు అభినందనలు తెలిపారు. Srikar Reddy, IFS from Telangana, has been posted as CG of India at San Francisco, USA. He will be incharge of eight States there. We look forward to more trade and business promotion. Best wishes, Srikar. We are so proud of you.#TelanganaPolice pic.twitter.com/N5HOa4YTzE — DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 12, 2023 (చదవండి: "మా తుఝే సలామ్" అని హోరెత్తిన లండన్ వీధులు) -
యువతి పొట్టలో వెంట్రుకల చుట్ట
లబ్బీపేట(విజయవాడతూర్పు): యువతి పొట్టలో చుట్టుకుపోయి గొంతు వరకూ వ్యాప్తి చెందిన వెంట్రుకలను ప్రభుత్వ ఆస్పత్రి జనరల్ సర్జరీ వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ కె.అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గడ్డిపాడు గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల యువతి వెంట్రుకలు చుట్టుకుని మింగుతుండేది. కొంతకాలానికి అవి పొట్టలో చుట్టుకుపోయి క్రమేణా గొంతులోకి వ్యాప్తి చెందాయి. దీంతో ఏమీ తినలేని, తాగలేని పరిస్థితుల్లో తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో బాధితురాలు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. తొలుత గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు పరీక్షించి ఎండోస్కోపీ ద్వారా తొలగించాలని ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో ఆమెకు శుక్రవారం సర్జన్లు దుర్గారాణి, చందన ప్రియాంక, గాయత్రి, ప్రవీణ్కుమార్లతో పాటు, ఎనస్థీషియన్లు ఏవీరావు, కిరణ్ బృందం శస్త్ర చికిత్స నిర్వహించారు. పొట్టలో చుట్టుకుపోయిన వెంట్రుకల చుట్టను తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.అప్పారావు మాట్లాడుతూ గొంతు వరకూ వ్యాప్తి చెందడంతో శస్త్ర చికిత్స క్లిష్టతరంగా మారిందన్నారు. ఈ తరహా కేసులను ట్రైకోబెజార్గా పిలుస్తామని, ఇలాంటి వాటిని చూడటం చాలా అరుదని చెప్పారు. -
జనరల్ బోగీల వద్దే భోజనం ప్లేట్ మీల్స్ రూ.50
సాక్షి, హైదరాబాద్: జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికోసం జనాహార్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ కేంద్రాలు ప్రధాన రైల్వేస్టేషన్లలో స్టాళ్లకే పరిమితమయ్యాయి. సాధారణ బోగీల్లో ప్రయాణించేవారి భోజన ఇబ్బందులు తొలగించేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. జనరల్ బోగీలు ఆగేచోటనే ఈ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే నాంపల్లి రైల్వేస్టేషన్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. విజయవాడ, గుంతకల్, రేణిగుంట స్టేషన్ల పరిధిలోనూ ఈ సేవలు అమలవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో ఈ తరహా సదుపాయం ప్రవేశపెట్టనున్నట్టు ఇటీవల రైల్వేశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొదటివిడతగా దక్షిణమధ్య రైల్వేలో మొదట నాలుగుస్టేషన్లలో జనాహార్ విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. జనరల్ బోగీ ప్రయాణికులు మాత్రం తమకు ఆహారం కావాలంటే ట్రైన్ దిగి స్టేషన్లో అందుబాటులో ఉన్న రెస్టారెంట్లు, ఫుడ్కోర్టుల నుంచి ఆహారం తెచ్చుకోవాలి. ఈ ఇబ్బందులను తొలగించేందుకే జనరల్ బోగీల వద్దకే జనాహార్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహారం అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో తయారు చేసిన శుభ్రమైన ఆహారపదార్థాలను ప్రయాణికులకు అందజేస్తారు. రూ.20కే ఏడు పూరీలు, కర్రీ ఇస్తారు. ఇది 250 గ్రాముల వరకు ఉంటుంది. దీనిని ఐఆర్సీటీసీ ఎకానమీ మీల్గా పేర్కొంది. కాంబో మీల్ రూ.50కే అందజేస్తారు. ఇందులో 350 గ్రాముల వరకు అన్నం, ఒక కర్రీతోపాటు పప్పు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రెండు రకాల ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. ప్రయాణికులు డిజిటల్ రూపంలో చెల్లించే సదుపాయం ఉంది. దశలవారీగా విస్తరణ దశలవారీగా సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు, కాకినాడ, వరంగల్, కాజీపేట్ తదితర స్టేషన్లలో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశముంది. ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం తక్కువ ధరలోనే లభిస్తుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్జైన్ తెలిపారు. ప్లేట్ ఇడ్లీ రూ.1,200 గోల్డ్ ఇడ్లీని అమ్ముతున్న హైదరాబాద్ కేఫ్ బంజారాహిల్స్(హైదరాబాద్): గోల్డెన్ ఇడ్లీ.. నగరంలో అందుబాటులోకి వచ్చిన కొత్త డిష్ ఇది. ప్లేట్ ఇడ్లీ ధర రూ.1200..అందుకే ఆ ఇడ్లీ బంగారమే అనడంతో అతిశయోక్తి లేదు. తినడానికి కొందరు..చూడడానికి మరికొందరు ఇలా భారీ సంఖ్యలో ఆ హోటల్కు జనాలు బారులుతీరుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.3 నుంచి శ్రీనగర్కాలనీకి వెళ్లే రోడ్డులో కర్ణాటక బ్యాంక్ ఎదురుగా రాఘవేంద్ర రెసిడెన్సీలో ఏర్పాటుచేసిన కృష్ణ ఇడ్లీ కేఫ్నకు తెల్లవారుజామునుంచే ఫుడ్డీలు చేరుకుంటున్నారు. బంగారు పూత పూసిన ఇడ్లీని గులాబీ రేకులతో కనువిందు చేసే రీతిలో సర్వ్ చేస్తున్నారు. ఒక ప్లేట్కు రెండు ఇడ్లీలు మాత్రమే ఇస్తారు. ఇక్కడ గోల్డ్ ఇడ్లీలే కాకుండా బంగారు దోశ, గులాబిజామ్ బజ్జీ, మలాయి కోవా వంటి 100కిపైగా ఫుడ్ ఐటమ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దక్షిణాది వంటకాలే కాకుండా చైనీస్ వంటకాలకూ ఈ హోటల్ స్పెషల్. -
పరస్పర సహకారానికి సిద్ధం: జర్మన్ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్
సాక్షి, అమరావతి: ఆంధ్రపదేశ్ రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్లో జర్మన్ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్లో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువవారం జర్మన్ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్తో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ కుచ్లర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థుల పరస్పర మార్పిడి, వైద్య పరిశోధనలో పరస్పర సహకారానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఆ మేరకు ఎంవోయూలు కుదుర్చుకుందామని ప్రతిపాదించారు. భారతీయులు, ముఖ్యమంగా తెలుగువారి మేధాశక్తిపై తమకు ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఉన్న అవకాశాలను తమతో చర్చిస్తే.. ఆ మేరకు కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. కోవిడ్ సమయంలో భారతదేశం అందించిన తోడ్పాటుకు జర్మనీ ఎప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు. యాంటీబయాటిక్, సర్జికల్ వస్తువులను ఆ సమయంలో భారతదేశం నుంచి తొలిసారి దిగుమతి చేసుకున్నామని, ఇప్పటికీ ఈ దిగుమతులు కొనసాగుతున్నాయని వివరించారు. యోగా, ఆయుర్వేదం లాంటి సాంస్కృతిక వైద్య విధానాలను తమ దేశంలోనూ అమలు జరిపేలా, మా వైద్య విధానాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చేలా అవగాహన ఒప్పందం కుదర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. పెట్టుబడులు పెట్టండి తమ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో అద్భుతమైన వనరులతో మెడ్టెక్ జోన్ ఉందని, జర్మన్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడితే ఇరుదేశాలకు మేలు చేకూరుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. వైద్య పరికరాల తయారీలో మెడ్ టెక్ జోన్ ముదువరుసలో ఉందని తెలిపారు. తమ రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులు వృత్తి నిర్వహణ కోసం జర్మనీ వెళ్లేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ఆ మేరకు వారికి కళాశాలల్లో జర్మన్ లాంగ్వేజ్ కోచింగ్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ విషయంలో జర్మనీ దేశ సహకారం కావాలని కోరారు. నర్సింగ్ విద్యార్థులు జర్మనీ వెళ్లాలంటే రెండేళ్ల కాలపరిమితి ఉన్న వీసాలను మాత్రమే జారీ చేస్తున్నారని, ఇది చాలా తక్కువ సమయం అని చెప్పారు. కనీసం నాలుగేళ్ల కాలపరిమితి ఉన్న వీసాలను జారీ చేస్తే తమ విద్యార్థులకు మేలు చేకూరుతుందని వెల్లడించారు. తమ విద్యార్థులు ఏజెన్సీల ఆధారంగా జర్మనీ వస్తున్నారని, అలాంటి ఏజెన్సీలకు జర్మనీ దేశం నుంచి అధికారిక గుర్తింపు ఉండేలా చూస్తే.. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని కోరారు. వైద్య పరిశోధనపై దృష్టి తమ రాష్ట్రంలో వైద్య పరిశోధనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని ఇప్పటికే డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో వైద్య పరిశోధనకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. జర్మనీ దేశ సాంకేతిక సహకారం కూడా తోడైతే వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. జర్మనీలో వైద్య రంగంలో మానవ వనరుల కొరత ఉందని, దాన్ని అధిగమించేందుకు భారత్ సహకారం తీసుకుంటామని జర్మన్ కాన్సుల్ జనరల్ కుచ్లర్ మంత్రి విడదల రజినితో అన్నారు. సంస్కరణలతో అద్భుత ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా అక్షరాస్యత పెరిగినట్లుగా తాము గుర్తించామని, ఇదెలా సాధ్యమైందని మంత్రిని కాన్సుల్ జనరల్ కుచ్లర్ అడిగారు. మంత్రి మాట్లాడుతూ విద్యా రంగంలో తమ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఆ ఫలితంగానే అక్షరాస్యత అనూహ్యంగా పెరిగిందని మంత్రి తెలిపారు. నాడు- నేడు కింద పాఠశాలల్లో వసతులను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దడం, అమ్మ ఒడి పథకం, గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన... లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా చదువును పేదలకు తమ ప్రభుత్వం అత్యంత చేరువ చేసిందని, బడికి పంపే తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నామని వివరించారు. వైద్య ఆరోగ్య రంగంలోనూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గొప్ప గొప్ప సంస్కరణలను జగనన్న తీసుకొచ్చారని మంత్రి వివరించారు. ప్రతి గ్రామానికి హెల్త్ సెంటర్ను ఏర్పాటుచేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకొచ్చి ఇంటింటికీ ప్రభుత్వ వైద్యం అందేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైద్య వసతులు అమాంతలం పెంచుతున్నామన్నారు. చదవండి: వాహనంలో పెట్రోల్ ఉదయం పోయించాలా? రాత్రి పోయించాలా?... అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా రూ.16 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగనన్న అని వివరించారు. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ ప్రోగ్రాం తమ రాష్ట్రంలో అమలవుతున్నదని చెప్పారు. జర్మనీలో వైద్య సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో పదివేల మంది నర్సులను జర్మనీకి సేవలు అందించేందుకు పంపాలన్నా తమ వద్ద సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అవసరమైన సహకారం అందిస్తే చాలని వెల్లడించారు. భేటీలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఏపీవీవీపీ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఎంఈ డాక్టర్ నర్సింహం, జర్మన్ రాయబార కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
Russia-Ukraine War: చేతులు కలపండి.. యుద్ధాన్ని ఆపండి
వాషింగ్టన్/ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్, రష్యా దేశాల సంక్షేమంతోపాటు మొత్తం ప్రపంచ శాంతి కోసం యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్ను ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కోరారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మతిలేని యుద్ధం వల్ల ప్రపంచానికి హాని తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. ప్రపంచానికి ఆహార, ఎరువుల కొరత తప్పాలంటే ఉక్రెయిన్, రష్యా, బెలారస్ల్లో ఉత్పత్తి యథాతథంగా కొనసాగాల్సిందేనన్నారు. ఏం చేయాలో మాకు తెలుసు: భారత్ ఉక్రెయిన్–రష్యా వ్యవహారంలో ఐరాసలో ఓటింగ్లకు భారత్ దూరంగా ఉంటుండడాన్ని తప్పుబడుతూ ఇంగ్లండ్లో నెదర్లాండ్స్ రాయబారి కరెల్ వాన్ ఊస్టెరోమ్ ట్వీట్ చేశారు. దీనికి ఐరాసలో భారత శాశ్వత రాయబారి టి.ఎస్.తిరుమూర్తి గట్టిగా బదులిచ్చారు. ‘‘మీ సలహాలు, సాయం అక్కర్లేదు, ఏం చేయాలో భారత్కు తెలుసు’’ అంటూ అన్నారు. ఈ యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరనిఐరాస భద్రతా మండలి భేటీలో మాట్లాడుతూ ఆయన అన్నారు. భారత్ ఎప్పటికీ శాంతిపక్షమేనన్నారు. రష్యాపై ‘యుద్ధ నేరాలు’: ఆమ్నెస్టీ ఉక్రెయిన్లో రష్యా సైనికులు యుద్ధ నేరాలకు పాల్పడ్డారని ఆమ్నెస్టీ సెక్రెటరీ జనరల్ ఆగ్నస్ కలామార్డ్ ఆరోపించారు. వారి అరాచకాలను నమోదు చేశామన్నారు. ఈ యుద్ధ నేరాలకు విచారణను రష్యా ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. విపత్తు పరిస్థితులు: జెలెన్స్కీ రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో విపత్తు తరహా పరిస్థితులు నెలకొన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా సైన్యం ఇప్పటివరకు ఉక్రెయిన్పై 2,014 క్షిపణులు ప్రయోగించిందని చెప్పారు. 400 ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను రష్యా సైన్యం ధ్వంసం చేసిందని తెలిపారు. 2,682 రష్యా యుద్ధ విమానాలు తమ గగనతలంపై ప్రయాణించాయని వెల్లడించారు. మరోవైపు మారియూపోల్ నుంచి రష్యా సేనలు చాలావరకు తూర్పు ప్రాంతానికి తరలివెళ్లాయని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. శరణార్థులతో జిల్ బైడెన్ భేటీ స్లొవేకియా సరిహద్దులో ఆశ్రయం పొందుతున్న ఉక్రెయిన్ శరణార్థులను అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కలిశారు. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. శరణార్థుల ఆవేదన ఒక తల్లిగా తనకు తెలుసని అన్నారు. జిల్ నాలుగు రోజుల పాటు యూరప్లో పర్యటించనున్నారు. -
భారీ ఎదురుదెబ్బ.. రష్యన్ మేజర్ జనరల్ హతం
ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన మిలిటరీ ఆపరేషన్ రోజుకో మలుపు తిరగుతోంది. యుద్ధం మొదలై ఎనిమిది రోజులైనప్పటికీ ఉక్రెయిన్లో విధ్వంసం మాత్రం ఆగడం లేదు. అయితే రష్యా తరపున సైనికులు, ఉక్రెయిన్ తరపున సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. యుధ్ధం మొదట్లో రష్యా ఆధిపత్యం చెలాయించినట్లు కనిపించినా, గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా తీవ్ర నష్టాలను చవి చూస్తోంది. తాజాగా రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యన్ మేజర్ జనరల్ హతమైనట్లు స్థానిక మీడియా తెలిపింది. ఎనిమిదో రోజు జరుగుతున్న యుద్ధంలో రష్యన్ మేజర్ జనరల్ అండ్రీ సుఖోవిట్స్కీ హతమైనట్లు బెలారస్ మీడియా వెల్లడించింది. దీనిపై రష్యన్ అధికారులు స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఆర్థిక ఆంక్షలతో అల్లాడుతున్న రష్యాకు, తాజా పరిణామం భారీ ఎదురు దెబ్బే అని చెప్పాలి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Railways: ఇకపై ఆ రైళ్లలో జనరల్ ప్రయాణం
సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ఆయా రైళ్లలో జనరల్ టికెట్లను పునరుద్ధరించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే చర్యలు తీసుకున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని స్టేషన్లలోని జనరల్ కౌంటర్స్లో ఈనెల 21 నుంచి టికెట్లు తీసుకోవచ్చని పేర్కొన్నారు. రాయగడ–గుంటూరు(17244)ఎక్స్ప్రెస్ (4 కోచ్లు), విశాఖపట్నం–విజయవాడ(12717)రత్నాచల్ ఎక్స్ప్రెస్ (6 కోచ్లు), విశాఖపట్నం–గుంటూరు(17240)సింహాద్రి ఎక్స్ప్రెస్ (6 కోచ్లు), విశాఖపట్నం–లింగంపల్లి(12805) జన్మభూమి ఎక్స్ప్రెస్(4 కోచ్లు)కు జనరల్ టికెట్లు ఇవ్వనున్నారని తెలిపారు. కోవిడ్ కారణంగా జనరల్ టికెట్లను రద్దు చేసి, అన్ని క్లాసులకు రిజర్వేషన్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చదవండి: (Warangal: ఏపీ ఎక్స్ప్రెస్ ఎస్-6 బోగీలో పొగలు) -
జనరల్ ఆదేశాలతో చైనా దుస్సాహసం
వాషింగ్టన్: చైనా మిలటరీ జనరల్ ఆదేశాలతోనే భారతీయ సైనికులపై గల్వాన్లో చైనా సైనికులు దాడి చేశారని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్తో గతంలో జరిగిన కొన్ని సరిహద్దు ఘర్షణలను పర్యవేక్షించిన చైనా పశ్చిమ థియేటర్ కమాండ్కు అధిపతి జనరల్ ఝావ్ జోంగ్కీ గల్వాన్ దాడికి అనుమతులిచ్చారని నిఘా అధికారి ఒకరు తెలిపారు. అమెరికా దాని మద్దతుదారు భారత్ దోపిడీ నుంచి తప్పించుకోవాలంటే చైనా బలహీనంగా కనిపించకూడదని ఝవ్ గతంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. గల్వాన్లో భారత జవాన్లపై దాడి ఘటన భారత్కు ఒక గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో జరిగిందేనని విశ్లేషకుల అంచనా. గల్వాన్ ఘర్షణలు అదుపు తప్పిన ఘటనకాదని, ముందస్తు ప్రణాళికతో చైనా చేపట్టిన ప్రాజెక్ట్గా చూడాలని భారత్కు తన సత్తా చాటాలన్న లక్ష్యంతో బీజింగ్ ఈ దుస్సాహసానికి పాల్పడిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే భారత్ ప్రతిఘటనతో చైనా లక్ష్యం నెరవేరకపోగా వారికే ఎదురుదెబ్బ తగలింది. చైనీయుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ని పెంచింది. సరిహద్దు వివాదాలపై భవిష్యత్తు లో భారత్తో చర్చలు జరిపే పరిస్థితి లేదు. వాణిజ్యం విషయంలో తన శత్రువు అమెరి కాకు భారత్ మరింత దగ్గరయ్యేందుకు ఈ ఘటన కారణమవుతోందని చైనా భావిస్తోంది. భారత్పై అమెరికా ఒత్తిడి.. గల్వాన్ ఘటన అసలు ఉద్దేశం భారత భూభాగంపై పట్టు సాధించడం కాకపోవచ్చు. ఎందుకంటే చైనా కంపెనీలకు ముకుతాడు వేయాల్సిందిగా అమెరికా కొన్ని నెలలుగా భారత్పై ఒత్తిడి తీసుకువస్తోంది. ఫైవ్జీ నెట్వర్క్ ఏర్పాటుకు హువాయి సాయం తీసుకోవాలని భారత్ భావించడంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది కూడా. గల్వాన్ ఘటన తర్వాత చైనా ఉత్పత్తులపై భారత్లో వ్యతిరేకత పెరగడం అమెరికా ఆశించిందే. ఈ ఘటనలన్నీ చైనా ఆశలకు వ్యతిరేకంగా జరుగుతున్నవేనని గల్వాన్ ఘటన చైనాకు విజయమేమీ కాదని కొన్ని వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే గల్వాన్ నిర్ణయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పాత్ర ఏమిటనేది స్పష్టంకాలేదు. సైన్యాధికారి ఆదేశాల విషయం జిన్పింగ్కు ముందే తెల్సి ఉంటుందని చైనా సైన్యం పనితీరు తెలిసిన కొందరు అంచనావేస్తున్నారు. -
లైన్ అక్కర్లేదు..ఆన్లైన్ చాలు!
సీతంపేట: ఓ వైపు ప్లాట్ఫారంపై రైలు ఉంటుంది. ఇటు చాంతాడంత క్యూ ఉంటుంది. నిత్యం రైళ్లలో ప్రయాణించే వారికి లైన్లో నించుని టికెట్ తీసుకోవడం ప్రహసనమే. దీంతో పాటు ప్లాట్ఫాం తీసుకోవడం కూడా కష్టమవుతూ ఉంటుంది. చిన్నపాటి దూరానికి రైళ్లను ఆశ్రయించే వారి సంఖ్య జిల్లాలో ఎక్కువగా ఉంది. రద్దీగా ఉండే స్టేషన్లలో అప్పటికప్పుడు వీరికి టికె ట్ తీసుకోవడం కష్టమైన పనే. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అరచేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా స్టేషన్కు 15 మీటర్ల నుంచి ఐదు కిలోమీట ర్ల లోపు దూరంలో ఉండి సాధారణ టికెట్, ప్లాట్ఫాం టికెట్ కొనుగోలు చేసేందుకు యూటీఎస్ యాప్ను రూపొందించింది. నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం, సాధారణ టికెట్ కొనుగోలు చేయాలంటే రైలు సమయాన్ని బట్టి యుద్ధం చేయాల్సిందే. టికెట్ కొనే సమయానికి రైలు వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ ఇబ్బందిని తొలగించేందుకు రైల్వేశాఖ ఈ యాప్ను సిద్ధం చేసింది. వాస్తవానికి ఇప్పటి వరకు ఆన్లైన్ టి కెట్ విధానం రిజర్వేషన్ ప్రయాణానికి మాత్ర మే పరిమితం. ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని ఇకపై జనరల్ టికెట్కూ విస్తరించారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే అధికారుల ఆధ్వర్యంలో ఆన్లైన్ టికెట్ సిస్టమ్ (యూటీఎస్) యాప్ను అందుబాటులో ఉంచారు. ఈ–టికెట్ వినియోగం ద్వారా పేపరు రహిత రైలు టికెట్ విధానం అమల్లోకి రానుంది. ఈ యాప్ ద్వారా జీపీఎస్ అనుసంధానం ఉన్న అన్ని మొబైల్స్ నుంచి ప్రతి ఒక్కరూ క్షణాల్లో జనరల్, ప్లాట్ఫాం సీజన్ టికెట్లు పొందే వెసులు బాటు రైల్వే అధికారులు కల్పించారు. ఈ యాప్ ద్వారా టికెట్ పొందే విధానంలో కొన్ని నిబందనలు/షరతులను మా త్రం ప్రయాణికులు తప్పక పాటించాల్సి ఉంటుంది. అన్ని రైళ్లకూ జనరల్ టికెట్ ఈ యాప్ ఉపయోగించి పాసింజర్, ఫాస్ట్ పాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ తదితర రై ళ్లలో క్షణాల్లో జనరల్ టిక్కెట్లు బుక్ చేసు కోవచ్చు. ఒక వేళ పెద్దలకు ఎవరికైనా టికెట్ బుక్ చేస్తే వారి వద్ద సెల్ఫోన్ లేకుంటే బుకింగ్ ఐడీ నంబర్, మొబైల్ నంబర్ చెబితే కౌంటర్ వద్ద టికెట్ పొందే అవకాశం ఉంది. ప్రత్యేకతలు రైల్వే బుకింగ్ కౌంటర్ వద్ద చాంతాడంత క్యూలో నిల్చుని అవస్థలు పడే అవసరం లేకుండా ఇంటి నుంచి బయల్దేరి రైల్వేస్టేషన్కు చేరే లోపే స్మార్ట్ ఫోన్ ద్వారా యూటీఎస్ యాప్ నుంచి టికెట్ పొందవచ్చు. ఈ యాప్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిదిలోని ఏ యూటీఎస్ స్టేషన్ నుంచైనా సీజన్, ప్లాట్ఫారం, జనరల్ టిక్కెట్లు పొందవచ్చు. ఒకేసారి నాలుగు టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. షో టికెట్ ఆప్షన్ ద్వారా టీసీకి వివరాలను చూపించి ప్రయాణం చేయవచ్చు. యాప్ డౌన్లోడింగ్ ఇలా.. 4 ఈ యాప్ను ఉచితంగా ఆండ్రాయిడ్ విండోస్, ఐఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి యూటీఎస్ అనే ఆంగ్ల అక్షరాలను టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. 4 మొబైల్ నంబర్, ఓ పాస్వర్డ్ను వ్యక్తిగత వివరాలతో ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్, స్టూడెంట్ ఐడీ తదితర కార్డులకు సంబంధించిన ఏదో ఒక నంబర్ను ఈ యాప్లో నమోదు చేసుకుని ఇన్స్టాల్ చేయాలి. నిబంధనలు.. ఏ ప్రయాణ టిక్కెట్లను రైలు ఎక్కేందుకు 3 గంటల ముందుగా బుక్ చేసుకోవాలి. అంటే టికెట్ బుక్ చేసిన 3 గంటల్లోపు ప్ర యాణం చేయాల్సి ఉంటుంది. ముందుగా టికెట్ బుక్ చేద్దామంటే ఈ యాప్ పనిచేయదు. అలాగే టికెట్ బుక్ చేసిన సమయానికి మూడు గంటలు దాటితే టికెట్ పనిచేయదన్నమాట. ఏ రైల్వే స్టేషన్కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే టికెట్ బుక్ చేసుకునేందుకు యాప్ ఉపయోగపడుతుంది. దూరాన్ని జీపీఎస్ ద్వారా లెక్కిస్తుంది. ఏ ఫ్లాట్ ఫాం టికెట్ తీసుకోవాలంటే స్టేషన్కు 15 మీటర్ల దూరం నుంచి 2 కిలోమీ టర్ల లోపు దూరంలో ఉన్న ప్రయాణికులు మాత్రమే అర్హులు. ఏ పేపర్ టికెట్ కావాలంటే బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లి మొబైల్ నంబర్, బుకింగ్ ఐడీని చూపించి పొందవచ్చును. ఈ సమయంలో ప్రయాణికుడి ఐడీ కార్డు తప్పనిసరిగా టీసీకి చూపాల్సి ఉంటుంది. -
హలో గూగూ...
ఇటలీకి చెందిన బెన్ యాక్టిస్ అనే అతను ఎక్కువగా సిస్టమ్తో గడుపుతుండేసరికి అతని బామ్మ అతన్ని ‘ఏముంటుంది అందులో’ అని విసుక్కునేది. దాంతో బెన్ ఆ ఎనభై ఐదేళ్ల బామ్మగారికి సిస్టమ్ ఎలా పని చేస్తుందో చూపించాలనుకున్నాడు. ఆమెను దగ్గర కూర్చోబెట్టుకుని గూగుల్ ఇటీవలే ప్రవేశపెట్టిన స్మార్ట్ స్పీకర్స్ సహకారంతో బామ్మగారిని ‘నువ్వు దానిని కొన్ని ప్రశ్నలు అడుగు, అది సమాధానం చెబుతుంది’ అని వాతావరణానికి సంబంధించినవి, ఇంకా కొన్ని జనరల్ ప్రశ్నలు కూడా అడిగించాడు. అపనమ్మకంగానే బామ్మగారు దాన్ని ప్రశ్నలడిగింది. అడిగిన వాటన్నిటికీ అటువైపు నుంచి ఠపీమని సమాధానాలు వస్తుండేసరికి ముందు ఉలిక్కిపడింది బామ్మ. గూగుల్ అని పలకడం కూడా సరిగా రాని బామ్మ, గూ గూ అని మాట్లాడింది దానితో. అది సమాధానాలు ఇవ్వడం చూసి ముచ్చట పడిపోయింది. బామ్మగారి ఆసక్తిని గమనించిన మనవడు ఆమెకు క్రిస్మస్ కానుకగా గూగుల్ హోమ్ కొనిపెట్టి మురిసిపోయాడు. ఈ బామ్మా మనవళ్ల వీడియోను చూసిన వాళ్లంతా కూడా ముచ్చటపడిపోయారు. -
రాష్ట్రంలో ఏడో స్థానం
⇒ ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ కోర్సులలో మొత్తం 25,290 మంది హాజరుకాగా వారిలో 14,816 మంది ఉత్తీర్ణులయ్యారు. - జనరల్ కోర్సులలో 24,608 మంది హాజరుకాగా 14,649 మంది అంటే 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులోనూ బాలికలదే పై చేయి. ⇒ ఒకేషనల్ కోర్సులలో మొత్తం 682 మంది హాజరుకాగా 367 మంది ఉత్తీర్ణులై 54 శాతంగా నిలిచారు. ⇒ ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 53 శాతం, 2014లో 56 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 8వ స్థానంలో నిలవగా ఈ ఏడాది 13 జిల్లాల పరిధిలో 7వ స్థానంలో నిలిచారు. ⇒ గత ఏడాదితో పోలిస్తే 4 శాతం ఉత్తీర్ణత పెరిగినా రాష్ట్రస్థాయిలో కేవలం ఒక్క స్థానానికి మాత్రమే జిల్లా ఎగబాకింది. ⇒ ఒకేషనల్లో రాష్ట్రస్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. ఒంగోలు వన్టౌన్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలలో బాలికలు పైచేయి సాధించారు. బాలురకంటే 12 శాతం అధిక ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ కోర్సులలో మొత్తం 25,290 మంది హాజరుకాగా వారిలో 14,816 మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్ కోర్సులలో 24,608 మంది హాజరుకాగా 14,649 మంది అంటే 60 శాతం ఉత్తీర్ణత సాధించగా వీరిలో బాలికలు 11,722 మంది పరీక్షలు రాయగా 7,678 మంది ఉత్తీర్ణులై 66 శాతం నమోదు చేశారు. బాలురు 12,886 మంది పరీక్షలు రాయగా 6,971 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలకంటే 12 శాతం తక్కువుగా 54 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సులలో మొత్తం 682 మంది హాజరుకాగా 367 మంది ఉత్తీర్ణులై 54 శాతంగా నిలిచారు. వీరిలో బాలురు 442 మంది పరీక్షరాయగా 211మంది, బాలికలు 240 మంది పరీక్షకు హాజరుకాగా 156 మంది పాసయ్యారు. బాలురకంటే 17 శాతం అధికంగా బాలికలు ఉత్తీర్ణత సాధించి శెహభాష్ అనిపించారు. రాష్ట్రస్థాయిలో 7వ స్థానంలో నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 53 శాతం, 2014లో 56 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 8వ స్థానంలో నిలవగా ఈ ఏడాది 13 జిల్లాల పరిధిలో 7వ స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే 4 శాతం ఉత్తీర్ణత పెరిగినా రాష్ట్రస్థాయిలో కేవలం ఒక్క స్థానానికి మాత్రమే ఎగబాకారు. ఒకేషనల్లో రాష్ట్రస్థాయిలో 5వ స్థానం దక్కింది. ప్రభుత్వ కళాశాలల్లో... ప్రభుత్వ కళాశాలలు కూడా ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించాయి. జనరల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవగా, ఒకేషనల్ విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. జనరల్ కోర్సులలో మొత్తం 3018 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1633 మంది 54 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో బాలికలు, బాలురకంటే 12శాతం అధికంగా పాసయ్యారు. బాలురు 1725 మంది పరీక్షలు రాయగా 845 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 1293 మంది పరీక్షలు రాయగా 788 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులలో కూడా బాలురకంటే బాలికలు 10 శాతం అధిక ఉత్తీర్ణత సాధించారు. బాలురలో 254 మంది పరీక్షకు హాజరుకాగా 178 మంది పాసయ్యారు. బాలికల్లో 177 మంది పరీక్షలు రాయగా వారిలో 143 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ఎంఈసీలో ప్రథమ స్థానం ఒంగోలులోని ఉమా మహేశ్వర కళాశాలలో చదివిన కె.సురేష్ రెడ్డి ఎంఈసీలో 500 మార్కులకుగాను 487 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానం సాధించారు. రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచారు. -
ఈవీఎంలలో నే‘తల’ రాతలు
ఎన్నికల్లో గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డిన నేతల తలరాతలు ఓట్ల రూపంలో స్ట్రాంగ్ రూముల్లోకి చేరిపోయాయి. గెలుపోటముల భవిష్యత్తు ఈవీఎంలలో భద్రంగా ఉన్నారుు. వచ్చే నెల 16వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు వరకు అన్ని పార్టీల నాయకుల్లో ఉత్కంఠ తప్పని పరిస్థితి నెలకొంది. 42 స్ట్రాంగ్ రూములకు మూడంచెల భద్రత వచ్చే నెల 16 వరకు తప్పని ఉత్కంఠ కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చెన్నై, సాక్షి ప్రతినిధి: లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తమిళనాడు,పుదుచ్చేరిలో గురువారం పోలింగ్ ముగిసింది. ప్రజలు భారీ శాతంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా తమ బాధ్యతను నెరవేర్చారు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి రాత్రింబవళ్లు ప్రచారం చేసి అలసిన నేతలు ఫలితాల కోసం ఎదురుచూస్తూ సేదతీరుతున్నారు. అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా ప్రధాని పీఠాన్ని అధిరోహిం చాలని అమ్మ ఆశతో ఎదురుచూస్తున్నారు. రెండు దఫాలుగా కేంద్రంలో చక్రం తిప్పిన డీఎంకే మూడోసారి ముచ్చటగా తాము బలపరిచిన ప్రభుత్వమే రావాలని ఆశిస్తోంది. యూపీఏ ప్రభుత్వానికి చెల్లుచీటి ఇచ్చి కేంద్రంలో బీజేపీ జెండా పాతడం ఖాయమని ఆ పార్టీ కూటమి గట్టి నమ్మకంతో ఉంది. పరువు దక్కించుకునేలా స్థానాలు వస్తే చాలని దింపుడు కళ్లెం ఆశగా కాంగ్రెస్ కాచుక్కూర్చుని ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. గెలుపు కోసం ఎన్ని అక్రమాలకైనా పాల్పడతారని ముందుగానే ఊహించిన ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఓటుకు నోటుతో ప్రజలను ప్రలోభపెట్టడ ంలో రాష్ట్ర నేతలు దేశంలోనే తమిళనాడును రెండవ స్థానం నిలిపారు. ఇది ఆందోళన కలిగించే అంశమని అధికారులు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఓట్ల లెక్కింపునకు మరో 22 రోజులు ఉండడంతో అంతవరకు బ్యాలెట్ బాక్సులను భద్రంగా ఉంచడం అధికారులకు సవాల్గా మారింది. గురువారం సాయంత్రం పోలింగ్ ముగియగానే ఎన్నికల ఏజెంట్లు, అధికారుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీలు వేశారు. వాటిని కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు రాత్రికి రాత్రే తరలించి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. మొత్తం 40 నియోజకవర్గాలకు సంబంధించి 42 లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు. లెక్కింపు కేంద్రాల్లోనే స్ట్రాంగ్ రూములు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి స్ట్రాంగ్ రూము వద్దా మూడంచెల సాయుధ పోలీసు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. అందరికీ శుక్రవార ప్రసన్నమే పరీక్షలు రాసిన విద్యార్థులకు, రాజకీయ నేతలకు ఫలితాల విషయంలో మే నెలలోని శుక్రవారాలే కీలకం కాను న్నాయి. ప్లస్-2 రాసిన విద్యార్థుల ఫలితాలు 9వ తేదీన, ఎస్ఎస్ఎల్సీ ఫలితాలు 23వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 15 లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే 40 లోక్సభ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు ఓటములు 16వ తేదీన తేలిపోనున్నారుు. ఈ మూడు తేదీలు శుక్రవారమే కావడం కాకతాళీయమే. -
సార్వత్రిక భేరీ
సాక్షి, కడప: నేటి నుంచి సార్వత్రిక సంరంభం ఊపందుకోనుంది. జిల్లాలోని కడప, రాజంపేట పార్లమెంట్తో పాటు 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించున్నారు. ఈ నెల 19 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. మే 7న పోలింగ్ ఉంటుంది. 23రోజుల పాటు ప్రధానరాజకీయపార్టీలన్నీ ప్రచారహోరుతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో నిమగ్నం కానున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ఒకేసారి వచ్చి రాజకీయపార్టీలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పదిరోజుల తేడాతో అన్ని ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. తొలిపోరైన మునిసిపల్ ఎన్నికలను పర్యవేక్షిస్తూనే స్థానిక సంస్థలపై దృష్టిసారించాల్సిన అనివార్య పరిస్థితి రాజకీయపార్టీలకు తలెత్తింది. మునిసిపల్ ఎన్నికలు ముగియడంతో స్థానికపోరుపై దృష్టి సారించారు. ఈ నెల7తో 29మండలాల్లో స్థానికంలో తొలిఅంకం ముగిసింది. రెండో విడతలోని 21 మండలాల్లో శుక్రవారంతో ఓటింగ్ ముగిసింది. ఇక అన్ని పార్టీలు దృష్టి సారిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో 20,75,410 మంది జిల్లా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ అభ్యర్థుల నామినేషన్ ఫారాలను ఈ నెల 12నుంచి 19వతేదీ వరకు ఉదయం 11 నుంచి 3గంటల వరకూ స్వీకరిస్తారు. 14, 18 తేదీలు సెలవు దినాలు.పార్లమెంటుకు సంబంధించి ఫారం-2ఏ, అసెంబ్లీకి సంబంధించి ఫారం2-బీలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలి. ప్రతి అభ్యర్థి నాలుగుసెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయొచ్చు. ఏ అభ్యర్థి అయినా రెండు పార్లమెంట్/అసెంబ్లీ నియోజకవర్గాలకు మంచి నామినేషన్లు దాఖలు చేయకూడదు. నామినేషన్ పత్రాలకు ఏదైనా డాక్యుమెంట్ జతచేయాల్సి వస్తే, 19 మధ్యాహ్నం 3గంటల్లోపు రిటర్నింగ్ అధికారులకు అందజేయాలి. రిటర్నింగ్ అధికారి కార్యాలయ ఆవరణలోకి అభ్యర్థులకు సంబంధించిన మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థి సహా నలుగురిని మాత్రమే అనుమతిస్తారు.నామినేషన్ ప్రతిపాదకుడు అదే నియోజకవర్గ ఓటరై ఉండాలి.స్వతంత్ర అభ్యర్థులకు పదిమంది ఓటర్లు ప్రతిపాదకులుగా ఉండాలి.నామినేషన్ దాఖలు చేసే వ్యక్తి ఆస్తులు, అప్పుల వివరాలను మనదేశంతో పాటు ఇతర దేశాల్లోని వాటిని కూడా పొందుపరచాలి. స్వీకరించిన అన్ని నామినేషన్ పత్రాలను, సీఈవో ఆంధ్రా వెబ్సైట్లో ఉంచుతారు. అన్ని నామినేషన్ పత్రాల అఫిడవిట్లు సంబంధిత రిటర్నింగ్ అధికారి నోటీసు బోర్డులో ప్రకటిస్తారు.నామినేషన్ ఫారం-5ద్వారా అభ్యర్థి సంతకంతో అతని ప్రతిపాదకుడి ద్వారా ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయి గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కోరుకునే మూడు గుర్తుల నుంచి ఒకదాన్ని కేటాయిస్తారు.ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి నామినేషన్ పత్రాలకు సంబంధించిన వివరాలు తెలుపుతారు. -
టెన్త్ పరీక్షలు ప్రారంభం
నల్లగొండ అర్బన్, న్యూస్లైన్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 250 సెంటర్లలో తెలుగు-1 (జనరల్, కాంపోజిట్) సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. దీనికి 50839 మంది విద్యార్థులు అలాట్కాగా 50290 మంది పరీక్ష రాశారు. 549 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు నజీమొద్దీన్ 9 సెంటర్లలో, డీఈఓ మదన్మోహన్ 6 సెంటర్లలో తనిఖీ చేశారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 80 సెంటర్లలో తనిఖీలు నిర్వహించాయి. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. రిలీవ్ ఉండదు... ఏకంగా సస్పెన్షనే పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఎక్కువగా మాల్ప్రాక్టీస్ కేసులు బుక్కావడం లాంటి విషయాల్లో ఇన్విజిలేటర్లను రిలీవ్ చేసే విధానం ఇకపై ఉండదు. ఇన్విజిలేషన్ విధుల పట్ల ఆసక్తిలేని వారు ఉద్దేశపూర్వకంగా పొరపాట్లు చేసి డ్యూటీ నుంచి రిలీవ్ అవుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తుండడంతో ఈ ఏడాది ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇన్విజిలేటర్లకు ఉన్నతాధికారులు మెమో జారీ చేస్తారు. వివరణ తీసుకుంటారు. సంతృప్తికరమైన కారణం లేకపోతే సస్పెన్షన్ వేటు వేసేస్థాయిలో చర్యలుంటాయని తెలిసింది. పరీక్షకు హాజరైన అంధవిద్యార్థులు నల్లగొండలోని అంధుల పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు స్క్రైబ్ (సహాయకుడు)తో పరీక్షకు హాజరయ్యారు. వారందరికీ విశ్వదీప్ పాఠశాల కేంద్రాన్ని కేటాయించారు. ఒకే పాఠశాల నుంచి 20 మంది అంధ విద్యార్థులు టెన్తపరీక్షలకు హాజరుకావడం రాష్ట్రంలో ఇదే ప్రథమం. గేట్లు తెరవని అధికారులు 10వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 8.45 గంటలకే చేరుకోవాలని అధికారులు ఆదేశించడంతో విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే చేరుకున్నారు. కానీ చాలా సెంటర్లలో 9 గంటల వరకు ఆయా పాఠశాలల గేట్లు తెరవకపోవడంతో విద్యార్థులు రోడ్లపైనే వేచి చూడాల్సి వచ్చింది. తమ ఆదేశాలను ఆయా పరీక్ష కేంద్రాల నిర్వాహకులు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఉన్నతాధికారులు మర్చిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్!.. శుభవార్త చెప్పిన కంపెనీ
జూన్ 4 తర్వాత అన్నీ మాట్లాడదాం: లోకేష్పై పెద్దిరెడ్డి ఫైర్
డైట్లో ఈ ఆహార పదార్థాలు చేర్చి..హైబైపీకి బ్రేక్ వేయండి
SRH vs PBKS: రాణించిన టాపార్డర్.. పంజాబ్ భారీ స్కోరు!
Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్బాస్ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)
మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!
పోలింగ్ ముగిసినా.. ‘ఆళ్లగడ్డ’లో ఆగని ఫ్యాక్షన్
ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా.. ఇదేంటి రాధికా అంటూ కామెంట్లు
థాయ్లాండ్ ఓపెన్ విజేతగా సాత్విక్-చిరాగ్ జోడీ
ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement