-
ICC: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ విజేతలు వీరే!
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను సోమవారం ప్రకటించారు. పురుషుల విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. మహిళా క్రికెట్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ రాచెల్ హేన్స్లను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మార్చి నెలకు గానూ వీరిద్దరిని ఎంపిక చేసినట్లు ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. కాగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో కరాచీ వేదికగా జరిగిన టెస్టు సిరీస్లో బాబర్ ఆజమ్ రాణించాడు. ముఖ్యంగా రెండో టెస్టులో 196 పరుగులు చేసి సత్తా చాటాడు. మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఉస్మాన్ ఖవాజా(ఆసీస్ బ్యాటర్), అబ్దుల్లా షఫీక్ తర్వాతి స్థానంలో (టాప్-3 రన్ స్కోరర్) నిలిచాడు. ఈ సిరీస్లో మొత్తంగా ఒక సెంచరీ, రెండు అర్ధ శతకాల సాయంతో 390 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్, ఆస్ట్రేలియా టెస్టు సారథి ప్యాట్ కమిన్స్లను వెనక్కి నెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. The crowd cheers, the lion roars. @babarazam258 owns the day. #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/ndM0RNWPTG — Pakistan Cricket (@TheRealPCB) March 15, 2022 రాచెల్ అద్బుతం! ఇదిలా ఉండగా.. ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలవడంలో ఆ జట్టు ఓపెనర్ రాచెల్ హేన్స్ పాత్ర కీలకం. మార్చి నెలలో ఆమె సాధంచిన మొత్తం పరుగుల సంఖ్య 429 పరుగులు. ఇంగ్లండ్తో మ్యాచ్లో రాచెల్ చేసిన క్లాసీ సెంచరీ(130 పరుగులు) అన్నింటికంటే హైలైట్గా నిలిచింది. ఈ అద్భుత ప్రదర్శనతో ఆమె మార్చి నెలకు గానూ ఆసీస్ స్టార్ అలిస్సా హేలీని, ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లిస్టోన్, దక్షిణాఫ్రికా ఓపెనర్ లారా వొల్వార్డ్లను వెనక్కి నెట్టి అవార్డు దక్కించుకున్నారు. నిలకడైన ఆట తీరుతో ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
'ఆ సమయంలో పూర్తి నిరాశలో కూరుకుపోయా'
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇంకా బోణీ కొట్టలేదు. తాను ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. ఇప్పటికే ఐదుసార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మ ఈసారి ముంబై ఇండియన్స్ను మరోసారి విజేతగా నిలుపుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పక్కనబెడితే.. రోహిత్ శర్మను టీమిండియా మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ఇంటర్య్వూ చేసింది. కాగా ఇటీవలే ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్ 2022కు జెమిమా రోడ్రిగ్స్ టీమిండియా జట్టుకు ఎంపిక కాలేదు. తాను కచ్చితంగా జట్టులో ఉంటానని భావించిన రోడ్రిగ్స్కు భంగపాటే ఎదురైంది. ''నేను మహిళల వన్డే వరల్డ్కప్కు ఎంపిక కాలేదు. అది నన్ను బాధించింది. కానీ ఆ బాధ నాకంటే ముందు మీరు అనుభవించారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి?'' అని రోడ్రిగ్స్ ప్రశ్నించింది. దీనిపై రోహిత్ స్పందిస్తూ.. ''సరిగ్గా 11 ఏళ్ల క్రితం నాకు ఇలాగే జరిగింది. 2011 వన్డే ప్రపంచకప్కు ఎంపిక కాలేదు. ఆ సమయంలో నేను దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నా. విషయం తెలియగానే నిరాశలో కూరుకుపోయాను. డ్రెస్సింగ్రూమ్లో ఒంటరిగా ఉన్న నేను ఎవరితో ఈ విషయాన్ని షేర్ చేసుకోలేకపోయాను. కానీ అప్పుడు నా వయసు 23.. 24 ఏళ్లే అనుకుంటా. మంచి భవిష్యత్తు ముందున్న తరుణంలో ఇలా బాధపడితే ప్రయోజనం లేదని అనుకున్నా. వెంటనే 2015 వన్డే వరల్డ్కప్ సన్నాహకాలకు సిద్దమయ్యా.'' అంటూ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Jemimah Jessica Rodrigues (@jemimahrodrigues) -
భారత క్రికెటర్లకు ఘోర అవమానం.. ఆ జట్టులో ఒక్కరికి కూడా..!
భారత మహిళా క్రికెటర్లకు ఘోర అవమానం జరిగింది. మహిళల ప్రపంచకప్-2022 అత్యుత్తమ జట్టును ఐసీసీ ప్రకటించింది. అయితే ఐసీసీ ప్రకటించిన జట్టులో ఒక్క భారత క్రికెటర్కు కూడా చోటు దక్కలేదు. కాగా మహిళల ప్రపంచకప్-2022లో భారత జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఐసీసీ ప్రకటించిన అప్స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టుకు ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ కెప్టెన్గా ఎంపికైంది. ఈ జట్టులో నలుగురు ఆసీస్ క్రికెటర్లకు చోటు దక్కడం గమనార్హం. ఇక ఈ మెగా టోర్నమెంట్లో లానింగ్ 394 పరుగులు చేసింది. ఆమెతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అలిస్సా హీలీ, రాచెల్ హేన్స్, బెత్ మూనీకు చోటు దక్కింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా), అలిస్సా హీలీ(ఆస్ట్రేలియా)లను ఎంపిక చేసిన ఐసీసీ.. మూడో స్థానం కోసం మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), నాలుగో ప్లేస్కు రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా),ఐదో ప్లేస్కు నాట్ స్కివర్ (ఇంగ్లండ్), ఆ తరువాత వరుసగా బెత్ మూనీ (ఆస్ట్రేలియా),హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్), ఎంచుకుంది. ఐసీసీ అప్స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టు: అలిస్సా హీలీ (వికెట్ కీపర్) (ఆస్ట్రేలియా) మెగ్ లానింగ్ (కెప్టెన్) (ఆస్ట్రేలియా), రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా), నాట్ స్కివర్ (ఇంగ్లండ్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్) చార్లీ డీన్ (ఇంగ్లండ్) -
అప్పుడు 75.. ఇప్పుడు 170 పరుగులు.. భర్త ఉంటే చాలు.. ‘తగ్గేదేలే..!’
మహిళల వన్డే ప్రపంచకప్-2022ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇంగ్లండ్తో జరిగిన ఫైన్లలో 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 7వ సారి వరల్డ్ ఛాంపియన్గా ఆస్ట్రేలియా నిలిచింది. కాగా ఆస్ట్రేలియా విజయంలో ఆ జట్టు ఓపెనర్ అలీసా హీలీ 170 పరుగులు సాధించి కీలక పాత్ర పోషించింది. ఇది ఇలా ఉంటే.. హీలీ భర్త, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ స్టాండ్స్ నుంచి ఆమెను ఉత్సాహపరిస్తూ కనిపించాడు.ఈ మ్యాచ్లో ఆమె సెంచరీ సాధించినప్పుడు చప్పట్లు కొడూతూ స్టార్క్ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక 2020 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు కూడా మిచెల్ స్టార్క్ హాజరై హీలీను ఉత్సాహపరిచాడు. ఆమె ఆ మ్యాచ్లో 75 పరుగులు చేసి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా.. ఓపెనర్ అలీసా హీలీ (138 బంతుల్లో 170; 26 ఫోర్లు) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లల్లో 5 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. హీలీతో పాటు రేచల్ హేన్స్ (68), మూనీ (62) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ష్రబ్సోల్ 3, ఎక్లెస్టోన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 43.4 ఓవర్లల్లో 285 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నతాలీ స్కీవర్ 148 పరుగులతో ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఇంగ్లండ్కు ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ వికెట్లు,జెస్ జోనాస్సెన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. మెగాన్ షట్ రెండు వికెట్లు సాధించింది. ఇక ఫైనల్ మ్యాచ్లో 170 పరుగలు, అదే విధంగా ఈ మెగా టోర్నమెంట్లో 509 పరుగులు సాధించి అద్భుతంగా రాణించిన హీలీకి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్తో పాటు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. చదవండి: IPL 2022: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. విధ్వసంకర ఆటగాడు వచ్చేశాడు.. ఇక బౌలర్లకు చుక్కలే! View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2022 Final: వరల్డ్కప్ ఫైనల్కు రిఫరీగా ఆంధ్రప్రదేశ్ మహిళ
ICC Women World Cup 2022 Final Aus Vs Eng- క్రైస్ట్చర్చ్లో ఆదివారం జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్కు భారత్కు చెందిన జీఎస్ లక్ష్మి మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన లక్ష్మి గతంలోనూ ఇలాంటి పాత్ర పోషించారు. 2020లో యూఏఈలో జరిగిన పురుషుల ప్రపంచకప్ లీగ్–2 మ్యాచ్లకు ఆమె మ్యాచ్ రిఫరీగా సేవలందించారు ఇక ఇప్పుడు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరిగే టైటిల్ పోరుకు రిఫరీగా సేవలు అందించనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రపంచకప్-2022 ఫైనల్కు ఫీల్డ్ అంపైర్లుగా లారెన్ (దక్షిణాఫ్రికా), కిమ్ కాటన్ (న్యూజిలాండ్), థర్డ్ అంపైర్ (టీవీ)గా జాక్వెలిన్ (వెస్టిండీస్) వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో నలుగురు మహిళలు ఒకేసారి భిన్న బాధ్యతలు నిర్వర్తిస్తూ భాగం కావడం చరిత్రలో ఇదే తొలిసారి. చదవండి: IPL 2022: రసెల్ విధ్వంసం View this post on Instagram A post shared by ICC (@icc)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
వివాహితపై అత్తింటివారి దాడి
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
వేడుకునేది ఓటర్ని కాదు! సూర్యుడ్ని!!
సాంఘిక విప్లవ నాయకుడు
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
జాలీ రైడ్
తప్పక చదవండి
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
Advertisement