-
IND vs ENG : ఐదో టెస్టు కోసం ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా (ఫొటోలు)
-
Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్.. ఇద్దరు ప్లేయర్ల అరంగ్రేటం
India vs England, 3rd Test: రాజ్కోట్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక, ఈ టెస్టులో టీమిండియా తరఫున సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధృవ్ జూరెల్కు అవకాశం కల్పించడంతో వీరిద్దరూ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరగ్రేటం చేశారు. ఇక ఇంగ్లండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో వెటరన్ పేసర్ మార్క్ వుడ్ తుదిజట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఇద్దరు పేసర్లు జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్లను ఆడించనుంది. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ హైదరాబాద్ టెస్టులో.. టీమిండియా విశాఖపట్నం టెస్టులో గెలిచాయి. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తుది జట్ల వివరాలు.. టీమిండియా: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ -
టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ ఎంట్రీ..?
-
అక్కడ ఉన్నది జడ్డూ.. అలా వదిలేస్తే ఎలా? పాపం జానీ! వీడియో
హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్లో సైతం తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోను సంచలన బంతితో జడేజా బోల్తా కొట్టించాడు. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ 28 ఓవర్లో జడేజా.. బెయిర్ స్టోకు అద్బుతమైన డెలివరీని సంధించాడు. జడ్డూ వేసిన బంతిని బెయిర్ స్టో వెనుక్కి వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే మిడిల్లో పడిన బంతి మాత్రం అనూహ్యంగా టర్న్ అయ్యి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. దీంతో బెయిర్ స్టో షాక్కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో జడ్డూ 87 పరుగులతో పాటు మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లండ్పై టీమిండియా అధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 436 పరుగులకు ఆలౌటైంది. భారత్కు మొదటి ఇన్నింగ్స్లో 190 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లండ్ 61 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. pic.twitter.com/PbWQuJr9Jc — Sitaraman (@Sitaraman112971) January 27, 2024 -
అచ్చొచ్చిన ఉప్పల్.. ఇక్కడ టీమిండియాకు తిరుగేలేదు..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్లో నిమగ్నమై ఉన్నారు. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కావడంతో హైదరాబాద్ నగర వాసులు ఈ మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్ మైదానంలో టీమిండియాకు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. పరుగుల వరద...వికెట్ల జాతర.. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐదు టెస్టులు అభిమానులకు పసందైన క్రికెట్ అందించాయి. ఒకవైపు పరుగుల వరద పారడంతో పాటు వికెట్ల జాతర కూడా కనిపించింది. ఈ వేదికపై తొలిసారిగా 2010 నవంబర్ 12 నుంచి 16 వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. అయితే ఈ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 117.3 ఓవర్లలో 350 పరుగులకు ఆలౌటైంది. టిమ్ మెకింటోష్ (102; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ నాలుగేసి వికెట్లు తీశారు. ధోని కెపె్టన్సీలో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 143.4 ఓవర్లలో 472 పరుగులకు ఆలౌటైంది. హర్భజన్ సింగ్ (111 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్స్లు) అజేయ సెంచరీతో అదరగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 122 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టును ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ (225; 22 ఫోర్లు, 4 సిక్స్లు) డబుల్ సెంచరీతో ఆదుకున్నాడు. న్యూజిలాండ్ 135 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసి భారత జట్టుకు 327 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో 17 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. అశ్విన్ మాయాజాలం.. 2012 ఆగస్టు 23 నుంచి 26 వరకు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ జట్టుతో భారత జట్టు రెండో టెస్టు ఆడింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశి్వన్ (6/31, 6/54) మ్యాచ్ మొత్తంలో 12 వికెట్లు తీసి భారతజట్టు ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో గెలుపొందడంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా భారత్ తొలి ఇన్నింగ్స్లో 134.3 ఓవర్లలో 438 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా (159; 19 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీ చేశాడు. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 61.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఫాలోఆన్ ఆడిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 79.5 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. పుజారా ధమాకా.. 2013 మార్చి 2 నుంచి 5 వరకు భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఈ వేదికపై మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్లకు 237 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. భువనేశ్వర్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీశారు. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 154.1 ఓవర్లలో 503 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా (204; 30 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ... మురళీ విజయ్ (167; 23 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించారు. 266 పరుగులతో వెనుకబడిన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ్రస్టేలియా అశి్వన్ (5/63), రవీంద్ర జడేజా (3/33) దెబ్బకు 67 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కోహ్లి కేక.. 2017 ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈ వేదికపై నాలుగో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 208 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లి (204; 24 ఫోర్లు) డబుల్ సెంచరీ... మురళీ విజయ్ (108; 12 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (106 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలు సాధించారు. దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్ను 166 ఓవర్లలో 6 వికెట్లకు 687 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 127.5 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. 299 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన భారత్ రెండో ఇన్నింగ్స్ను 4 వికెట్లకు 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్కు 459 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అశ్విన్ (4/73), జడేజా (4/78) బంగ్లాదేశ్ను దెబ్బ కొట్టారు. పది వికెట్లతో విజయం.. 2018 అక్టోబర్ 12 నుంచి 14 వరకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈ వేదికపై ఐదో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 10 వికెట్లతో ఘనవిజయం నమోదు చేసింది. ముందుగా విండీస్ తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 367 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (92), అజింక్య రహానే (80), పృథ్వీ షా (70) అర్ధ సెంచరీలు చేశారు. 56 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 127 పరుగులకే కుప్పకూలింది. ఉమేశ్ యాదవ్ (4/45), అశి్వన్ (2/24), జడేజా (3/12) విండీస్ను కట్టడి చేశారు. అనంతరం విండీస్ నిర్దేశించిన 72 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ కోల్పోకుండా ఛేదించి గెలిచింది.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement