-
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ముంబై: లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మొత్తం 20 కేసుల్లో 12.74 కిలోల బంగారాన్ని ముంబై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు ఖరీదైన నాలుగు ఐఫోన్లను (15 ప్రో ఫోన్లను) కూడా స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని లోదుస్తులు, వాటర్ బాటిల్స్, బట్టలు, ముడి అభరణాలు, బంగారు కడ్డీలు, శరీరంపై దొంగచాటుగా దాచి తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం, ఐఫోన్ల విలువ సుమారు రూ.8.37 కోట్లకుపైమాటే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. ఐదుగురు ప్రయాణికుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.Officials of Mumbai Customs at Chhatrapati Shivaji Maharaj International Airport have seized goods worth a total of Rs 8.37 crores including 12.74 Kg Gold across 20 cases. Gold was found concealed in various forms like gold dust in wax and gold layered cloths, crude jewellery and… pic.twitter.com/4OQlYsATIE— ANI (@ANI) May 4, 2024 -
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్లో మాత్రం..
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఐఫోన్ విక్రయాలు తగ్గుతున్నట్లు తెలిసింది. మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో యాపిల్ ఐఫోన్ విక్రయాలు 10 శాతం తగ్గినట్లు కంపెనీ చెప్పింది. దాంతో కంపెనీ ఆదాయం 4 శాతం క్షీణించిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు.గడిచిన త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ విక్రయాలు తగ్గుతుంటే ఇండియాలో మాత్రం వీటికి ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఇండియాలో రికార్డు స్థాయిలో విక్రయాలు పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియాలో యాపిల్ ఉత్పత్తులకు అద్భుతమైన మార్కెట్ ఉంది. భారత్లో స్థిరంగా రెండంకెల వృద్ధి నమోదవుతోంది. ఇక్కడ రికార్డుస్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ముందుగా కంపెనీ ఆశించినమేరకు అంచనాలను అధిగమిస్తున్నాం’ అని అన్నారు.యాపిల్ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్లెట్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..ముంబై స్టోర్ యాపిల్ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్ సాకెట్ కంటే కొంచెం అధికంగా నమోదవుతోంది. త్వరలో భారత్లో మరో మూడు స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్లో వెలువడిన బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన స్టోర్లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
యాపిల్కు ఆదాయం సమకూర్చడంలో భారత్ టాప్
యాపిల్ భారత్లో తన ఆదాయాన్ని పెంచుకుంటుంది. కేవలం రెండు అవుట్లెట్ల ద్వారా 2024 ఆర్థిక సంవత్సరానికిగాను ఏకంగా రూ.190-రూ.210 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవుట్లెట్ల్లో ఇదే రికార్డు ఆదాయమని కంపెనీ తెలిపింది. ముంబై, దిల్లీలో రెండు యాపిల్ స్టోర్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ స్టోర్లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: కొత్త సౌండ్బాక్స్లు ప్రారంభించిన పేటీఎం.. ప్రత్యేకతలివే.. ముంబై స్టోర్ యాపిల్ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్ సాకెట్ కంటే కొంచెం అధికంగా నమోదైంది. త్వరలో భారత్లో మరో మూడు స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి యాపిల్ చర్చలు జరుపుతోందని తెలిసింది. అయితే గతేడాది జూన్లో బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన స్టోర్లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని అనుకుంటున్నట్లు తెలిసింది. -
భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచ నం.1 కంపెనీ అయిన యాపిల్ భారత్లో కార్యకలాపాలపై ఆసక్తిగా ఉందని తెలుస్తుంది. తాజాగా ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ సరఫరా చేసేందుకు భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురించాయి. ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ తయారీకి టాటా గ్రూప్నకు చెందిన టైటాన్ కంపెనీతో, మురుగప్ప గ్రూప్తో యాపిల్ చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే కుపెర్టినో కంపెనీ తన కార్యకలాపాలను చైనాతోపాటు భారత్లో విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కుపెర్టినో కంపెనీ చైనాలో ఐఫోన్ కెమెరాలను తయారుచేస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి మరో 5-6 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. టైటాన్ గడియారాలు, ఇతర ఆభరణాల తయారీలో ప్రత్యేకత చాటుకుంటోంది. చెన్నై ప్రధాన కార్యాలయంగా ఉన్న మురుగప్ప గ్రూప్నకు ఇంజినీరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కెమికల్స్ రంగంలో 100 ఏళ్ల అనుభవం ఉంది. ఈనేపథ్యంలో ఈ కంపెనీతో ఒప్పందం ఖరారు చేసుకోవచ్చని పరిశ్రమ వర్గాల ద్వారా తెలిసింది. ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని నోయిడాకు చెందిన కెమెరా మాడ్యూల్ తయారీ సంస్థ మోషిన్ ఎలక్ట్రానిక్స్లో మురుగప్ప గ్రూప్ 76% వాటాను కొనుగోలు చేసింది. బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న టైటాన్ కంపెనీ ఇంజినీరింగ్, ఆటోమేషన్లో సేవలందిస్తోంది. హై ప్రెసిషన్ కాంపోనెంట్ తయారీ, ఇంజినీరింగ్ డిజైన్ సర్వీస్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రక్షణ, ఏరోస్పేస్ వంటి పరిశ్రమల్లోను సేవలందిస్తోంది. యాపిల్ జనవరి నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత్లో దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన ఐఫోన్లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో స్థానికంగా ఆ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. ఇండియాలో తయారవుతున్న దాదాపు 70 శాతం ఐఫోన్లు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇది మరింత పెరిగి అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్రపంచంలోని రద్దీ ఎయిర్పోర్ట్ల్లో భారత విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంలో భాగంగా యాపిల్ భారత్లో తయారీకి ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే ఫాక్స్కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. -
ఐఫోన్ అప్డేట్ కూడా తెలియదా..పరువు పోగొట్టుకున్న లోకేష్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement