-
జో రూట్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్గా
ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్గా రూట్ రికార్డులకెక్కాడు. ధర్మశాల వేదికగా భారత్తో జరిగిన ఐదో టెస్టులో 84 పరుగులు చేసిన రూట్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ ఇప్పటివరకు భారత్పై టెస్టుల్లో 21 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ భారత్పై 20 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్తో పాంటింగ్ ఆల్టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ చేతిలో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి పాలైంది. భారత బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. చదవండి: IND vs ENG: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు. -
ఏంటి బషీర్ ఇది..? బౌల్డ్ అయితే రివ్యూనా? వీడియో వైరల్
స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను టీమిండియా ఘనంగా ముగించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్లో మూడో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ యువ ఆటగాడు షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డ్ అయినప్పటికి రివ్యూ కావాలని అడగడం అందరని ఆశ్చర్యపరిచింది. అసలేం జరిగిందంటే? ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 46 ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్లో ఆఖరి బంతికి షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే బషీర్ తను బౌల్డ్ కాకుండా వికెట్ కీపర్కు దొరికిపోయానని భావించి రివ్యూ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రివ్యూ కావాలని సిగ్నల్ ఇచ్చాడు. కానీ నాన్ స్ట్రైక్లో ఉన్న జోరూట్ ఒక్కసారిగా నవ్వుతూ బౌల్డయ్యావని బషీర్తో చెప్పాడు. ఇది చూసిన భారత ఆటగాళ్లు సైతం నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బాబు బషీర్ బౌల్డ్లకు రివ్యూలు ఉండవు అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2024: ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం..!? View this post on Instagram A post shared by TNT Sports (@tntsports) -
భారత అంపైర్కు గొప్ప గౌరవం
భారత అంపైర్ నితిన్ మీనన్కు గొప్ప గౌరవం దక్కనుంది. ప్రపంచ క్రికెట్లో ఫాబ్ ఫోర్గా పిలువబడే నలుగురు స్టార్ క్రికెటర్ల వందో టెస్ట్ మ్యాచ్లో ఇతను అంపైర్గా వ్యవహరించనున్నాడు. ఇదివరకే విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్ల వందో టెస్ట్ మ్యాచ్కు అంపైర్గా పని చేసిన మీనన్.. ఫాబ్ ఫోర్లోని మరో ఆటగాడైన కేన్ విలియమ్సన్ వందో టెస్ట్లో కూడా అంపైర్గా వ్యవహరించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు. ఓ తరంలో నలుగురు గొప్ప క్రికెటర్లకు చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్ల్లో అంపైర్గా వ్యవహరించే గొప్ప గౌరవం నితిన్ మీనన్ మాత్రమే దక్కనుంది. విలియమ్సన్ వందో టెస్ట్ మ్యాచ్ మార్చి 8న ప్రారంభమవుతుంది. క్రైస్ట్చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్ కేన్ మామతో పాటు న్యూజిలాండ్ ప్రస్తుత కెప్టెన్ టిమ్ సౌథీకి కూడా వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. కేన్, సౌథీ వందో టెస్ట్ మ్యాచ్కు సరిగ్గా ఒక్క రోజు ముందు మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు తమ వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ వికెట్కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో రేపటి నుంచి ప్రారంభంకాబోయే భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్ మ్యాచ్తో వంద టెస్ట్ల మైలురాయిని తాకనున్నారు. ధర్మశాల వేదికగా రేపటి నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య న్యూజిలాండ్ 0-1తో వెనుకపడి ఉంది. -
దూసుకొస్తున్న జైస్వాల్.. కెరీర్ బెస్ట్ సాధించిన జురెల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్తో ముగిసిన నాలుగో టెస్ట్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసిన యశస్వి జైస్వాల్ (73, 37), శుభ్మన్ గిల్ (38, 52 నాటౌట్), దృవ్ జురెల్ (90, 39 నాటౌట్) ర్యాంకింగ్స్ భారీ జంప్ కొట్టి కెరీర్ అత్యుత్తమ స్థానాలకు చేరుకున్నారు. యశస్వి మూడు స్థానాలను మెరుగుపర్చుకుని టాప్ 10 దిశగా (12వ స్థానం) దూసుకువస్తుండగా.. గిల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జురెల్ 31 స్థానాలు మెరుగుపర్చుకుని 69 స్థానానికి ఎగబాకారు. ఇదే టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో అజేయ సెంచరీతో కదంతొక్కిన ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకోగా.. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి టాప్-10లో విరాట్ కోహ్లి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. అయితే విరాట్ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్కు దూరంగా ఉండటంతో అతని ర్యాంక్ ఏడు నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయింది. నాలుగో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానాన్ని కోల్పోయి 13వ ప్లేస్కు పడిపోయాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్, జడేజా ఒకటి, రెండు, ఆరు స్థానాల్లో కొనసాగుతుండగా.. రబాడ, కమిన్స్, హాజిల్వుడ్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. మరో భారత స్పిన్నర్ కుల్దీప్ రాంచీ టెస్ట్లో మెరుగైన ప్రదర్శన కారణంగా 10 స్థానాలు మెరుగపర్చుకుని కెరీర్ అత్యుత్తమ 32వ ర్యాంక్కు చేరుకున్నాడు. భారత్తో నాలుగో టెస్ట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఏకంగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని 80వ ర్యాంక్కు ఎగబాకాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లోనూ పెద్దగా మార్పులేమీ జరగలేదు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ జో రూట్ మాత్రం మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో ప్లేస్కే చేరాడు. -
జడేజా స్పిన్ మయాజాలం.. 353 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
రాంఛీ వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ జట్టు 353 పరుగులకు ఆలౌటైంది. 302/7 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన స్టోక్స్ సేన అదనంగా 51 పరుగులు చేసి ఆలౌటైంది. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్పిన్ మయాజాలంలో ఇంగ్లండ్ బ్యాటర్లు చిక్కుకున్నారు. ఆఖరి మూడు వికెట్లను కూడా జడ్డూనే పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(122 నాటౌట్) అద్భుత శతకంతో చెలరేగగా.. బెన్ ఫోక్స్(47), ఓలీ రాబిన్సన్(58) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. -
Ind vs Eng: ముగిసిన రెండో రోజు ఆట.. హైలైట్స్ ఇవే
India vs England 4th Test Day2 Live Updates And Highlights: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 302/7 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి 353 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 219 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ షోయబ్ బషీర్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. టామ్ హార్లే రెండు, జేమ్స్ ఆండర్సన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక భారత తొలి ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు ఓపెనర్ యశస్వి జైస్వాల్(73) ఒక్కడే అర్థ శతకం బాదాడు. మిగతా వాళ్లలో శుబ్మన్ గిల్ 38 పరుగలతో ఫర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సరికి ధ్రువ్ జురెల్ 30, కుల్దీప్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. Jaiswal has cracked the code for run-making! 🙌🏻 He brings up his fiery 5️⃣0️⃣ in style to keep #TeamIndia's momentum. 🔥#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/nFAmYZPaX4 — JioCinema (@JioCinema) February 24, 2024 నిలకడగా ఆడుతున్న టీమిండియా ప్లేయర్లు జురెల్ 30, కుల్దీప్ 17 పరుగులతో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా స్కోరు: 219-7(72) 61.4: 200 పరుగుల మార్కు అందుకున్న టీమిండియా కుల్దీప్ 14, జురెల్ 20 పరుగులతో ఆడుతున్నారు. 55.2: ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా అశ్విన్ రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. టామ్ హార్లే బౌలింగ్లో అశూ (1) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. స్కోరు: 177/7 (55.2). ఆరో వికెట్ డౌన్ 51.3: రాంచి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హార్లే బౌలింగ్లో సర్ఫరాజ్ ఖాన్ రూట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని ఓపికగా క్రీజులో నిలబడిన ఈ ముంబై బ్యాటర్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. స్కోరు: 171/6 (51.3). అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 46.4: యశస్వి జైస్వాల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 73 పరుగులతో నిలకడగా ఆడుతున్న జైస్వాల్ను ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌల్డ్ చేశాడు. టీమిండియా స్కోరు: 161/5 (46.4). ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు. సర్ఫరాజ్ 10 పరుగులతో ఉన్నాడు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 131/4 (38) జైస్వాల్ 54, సర్ఫరాజ్ ఖాన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. జడేజా ఔట్.. టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. షోయబ్ బషీర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. భారత్ స్కోర్: 130/4. క్రీజులోకి సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు. మూడో వికెట్ డౌన్.. పాటిదార్ ఔట్ టీమిండియా ఆటగాడు రజిత్ పాటిదార్ మరోసారి విఫలమయ్యాడు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. పాటిదార్ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 35 ఓవర్లు ముగిసే సరికి భార స్కోర్: 112/3. క్రీజులోకి జడేజా వచ్చాడు. యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీ... టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 89 బంతుల్లో అర్ధ శతకాన్ని యశస్వీ పూర్తి చేసుకున్నాడు. 32 ఓవర్లకు భారత్ స్కోర్: 105/2. జైశ్వాల్తో పాటు రజిత్ పాటిదార్(12) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. గిల్ ఔట్ 86 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన శుబ్మన్ గిల్.. షోయబ్ బషీర్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి రజిత్ పాటిదార్ వచ్చాడు. నిలకడగా ఆడుతున్న భారత్.. టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్(40), శుబ్మన్ గిల్(27) నిలకడగా ఆడుతున్నారు. 21 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. లంచ్ విరామానికి భారత్ స్కోర్: 34/1 లంచ్ విరామానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(16), శుబ్మన్ గిల్(4) ఉన్నారు. 5 ఓవర్లకు భారత స్కోర్: 20/1 5 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(16), శుబ్మన్ గిల్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ శర్మ ఔట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ను బారత్ కోల్పోయింది. కేవలం 2 పరుగులు చేసిన రోహిత్.. ఆండర్సన్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి శుబ్మన్ గిల్ వచ్చాడు. 353కు ఇంగ్లండ్ ఆలౌట్.. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ జట్టు 353 పరుగులకు ఆలౌటైంది. 302/7 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ అదనంగా 51 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ను ముగించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. అదే విధంగా ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(122 నాటౌట్) అద్భుత శతకంతో చెలరేగగా.. బెన్ ఫోక్స్(47), ఓలీ రాబిన్సన్(58) పరుగులతో రాణించారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో షోయబ్ బషీర్.. పాటిదార్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 103 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 351/9 ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 347 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన ఓలీ రాబిన్సన్.. రవీంద్ర జడేజా బౌలింగ్లో ఔటయ్యాడు. నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్.. ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్(119), ఓలీ రాబిన్సన్(58) నిలకడగా ఆడుతున్నారు. 102 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్.. 302/7 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. భారత పేసర్లను ఓలీ రాబిన్సన్, జో రూట్ను ఎటాక్ చేస్తున్నారు. 94 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 324/7, క్రీజులో జో రూట్(107), ఓలీ రాబిన్సన్(49) ఉన్నారు. ►రాంఛీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బౌలింగ్ ఎటాక్ను మహ్మద్ సిరాజ్ ప్రారంభించాడు. క్రీజులో జో రూట్(106), ఓలీ రాబిన్సన్(31) పరుగులతో ఉన్నారు. కాగా తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. తుది జట్లు భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ -
ఆకాశ్ దెబ్బ కొట్టినా... ఇంగ్లండ్ 'రూట్' మారింది
అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్ పేస్కు... అశ్విన్, జడేజా స్పిన్కు... లంచ్ లోపే ఇంగ్లండ్ కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయింది . దాంతో టీ విరామం వరకు ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు తెర పడుతుందేమోననే సందేహం కలిగింది... కానీ అలా జరగలేదు. అనుభవజ్ఞుడైన జో రూట్ తన అసలు సిసలు ఆటతీరును ప్రదర్శించాడు... ఈ సిరీస్లో తమ జట్టు దూకుడైన ‘బజ్బాల్’ వ్యూహానికి భిన్నంగా ‘రూట్’ మార్చాడు... సంయమనంతో ఆడుతూ ఇంగ్లండ్ను ఆదుకున్నాడు... సహచరుడు ఫోక్స్ సహాయంతో రెండో సెషన్లో భారత బౌలర్లను కాచుకున్నాడు ...ఆ తర్వాత ఫోక్స్ వెనుదిరిగినా... రాబిన్సన్ అండగా నిలబడటంతో... రూట్ పట్టుదలతో ఆడుతూ వీరోచిత సెంచరీతో ఇంగ్లండ్ స్కోరును 300 దాటించాడు. రాంచీ: సిరీస్ గెలిచేందుకు భారత్... సమం చేసేందుకు ఇంగ్లండ్... ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య మొదలైన నాలుగో టెస్టు తొలిరోజు ఆట ఆసక్తికరంగా సాగింది. కొత్త పేసర్ ఆకాశ్ దీప్ (3/70) నిప్పులు చెరిగే బౌలింగ్ భారత్ను మురిపిస్తే... సీనియర్ బ్యాటర్ జో రూట్ (226 బంతుల్లో 106 బ్యాటింగ్; 9 ఫోర్లు) అజేయ శతకం ఇంగ్లండ్ను కుప్పకూలకుండా కాపాడింది. దీంతో పూర్తిగా ఎవరి పైచేయి లేకుండా తొలిరోజు ఆట సమఉజ్జీగా ముగిసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 7 వికెట్లకు 302 పరుగులు చేసింది. ఓపెనర్ క్రాలీ (42 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో బెన్ ఫోక్స్ (126 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ఆకాశ్ దీప్ 3 వికెట్లు తీయగా.. సిరాజ్కు 2 వికెట్లు దక్కాయి. స్పిన్నర్లు జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీశారు. ‘టాప్’లేపిన ఆకాశ్ ఈ సిరీస్లో భారత్ తరఫున నాలుగో ఆటగాడిగా అరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్ తన పేస్తో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ఐదో బంతికి క్రాలీని ఆకాశ్ దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ అది నోబాల్ కావడంతో ఆకాశ్ దీప్కు నిరాశ తప్పలేదు. ఆ తర్వాత క్రాలీ దూకుడు పెంచాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో క్రాలీ చెలరేగిపోయాడు. వరుసగా 4,4,4,6తో అదరగొట్టాడు. సాఫీగా సాగిపోతున్న ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను ఆకాశ్ దీప్ దెబ్బ కొట్టాడు. పదో ఓవర్లో ఆకాశ్ రెండో బంతికి ఓపెనర్ డకెట్ (11)ను, నాలుగో బంతికి వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ (0)లను అవుట్ చేసి భారత శిబిరాన్ని సంబరంలో ముంచాడు. ఇదే జోరుతో తన మరుసటి ఓవర్లో (ఇన్నింగ్స్ 12వ) ఓపెనర్ క్రాలీని క్లీన్బౌల్డ్ చేశాడు. 47/0తో ఉన్న ఇంగ్లండ్ ఆకాశ్ దెబ్బకు 57/3 స్కోరు వద్ద టాపార్డర్ను కోల్పోయింది. ఈ దశలో జో రూట్కు జతయిన బెయిర్స్టో (35 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) భారత బౌలింగ్పై ఎదురుదాడికి దిగాడు. దీంతో వన్డేను తలపించేలా 20వ ఓవర్లోనే ఇంగ్లండ్ స్కోరు 100కు చేరింది. రెండో సెషన్ ఆరంభంలో బెయిర్స్టోను అశ్విన్ ఎల్బీగా పంపాడు. అంపైర్ తోసిపుచ్చినా... రివ్యూకు వెళ్లడంతో బెయిర్స్టో వికెట్ దక్కింది. కాసేపటికే కెప్టెన్ స్టోక్స్ (3)ను జడేజా వికెట్ల ముందు దొరక బుచ్చుకున్నాడు. అక్కడే 112/5 స్కోరు వద్ద తొలి సెషన్ ముగిసింది. అడ్డుకుని... ఆదుకున్నాడు ఒక్క సెషన్లోనే 5 వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు వెటరన్ బ్యాటర్ రూట్ అంతా తానై నడిపించాడు. బెన్ ఫోక్స్ అండతో రెండో సెషన్లో పరుగులు పేర్చాడు... వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో 108 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఈ సెషనంతా భారత సీమర్లు, స్పిన్నర్లు ఎంతగా కష్టపడినా రూట్, ఫోక్స్ జోడీని మాత్రం విడగొట్టలేకపోయారు. రెండో సెషన్లో 86 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఒక్క వికెట్ను సమర్పించుకోలేదు. ఆఖరి సెషన్లో ఎట్టకేలకు సిరాజ్ పేస్ పదును పెంచడంతో ఫోక్స్ ఆట ముగిసింది. ఆరో వికెట్కు 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికి హార్ట్లీ (13)ని సిరాజే అవుట్ చేయగా... రాబిన్సన్ (60 బంతుల్లో 31 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) అండతో రూట్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇంకో వికెట్ చిక్కేదే కానీ... మూడో సెషన్లో అప్పటికే భారత జట్టు 3 రివ్యూలు అయిపోవడంతో రాబిన్సన్ బతికిపోయాడు. ఇన్నింగ్స్ 81వ ఓవర్లో జడేజా బౌలింగ్లో రాబిన్సన్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ను అంపైర్ ధర్మసేన తిరస్కరించాడు. టీవీ రీప్లేలో బంతి వికెట్లను తాకుతున్నట్లు తేలింది. కానీ భారత జట్టుకు డీఆర్ఎస్కు వెళ్లే అవకాశం లేకపోవడంతో రాబిన్సన్ బతికిపోయాడు. ఇంత కష్టంలో అంత స్కోరు... ఈ సిరీస్లో మూడు టెస్టుల్లో రూట్ అత్యధిక స్కోరు 29! కానీ ఈ మ్యాచ్ తన అనుభవాన్నంతా రంగరించి క్లాసిక్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఆరంభంలో 57/3తో కష్టాల్లో పడిన ఇంగ్లండ్ లంచ్ విరామానికే 112/5 స్కోరు వద్ద సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఇంకా రెండు సెషన్ల ఆటలో ఏ జట్టయినా ఆలౌట్ అయినా అవుతుంది. లేదంటే... కిందామీదా పడినా 200 నుంచి 240 పరుగులు చేయడానికి కష్టపడుతుంది. కానీ ఇన్నింగ్స్ను నడిపించిన రూట్ ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని జట్టు స్కోరును ఒక్కరోజులోనే 300 పైచిలుకు చేర్చడం అతని అసాధారణ పోరాటానికి నిదర్శనం! 100 ఇంగ్లండ్ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్ గుర్తింపు పొందాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్గా నిలిచాడు. గతంలో షేన్ వార్న్, డెన్నిస్ లిల్లీ, ట్రంబెల్, గ్లెన్ మెక్గ్రాత్, నాథన్ లయన్ (ఆ్రస్టేలియా), ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక), కొట్నీ వాల్‡్ష (వెస్టిండీస్) ఇంగ్లండ్పై 100 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. 8 అరంగేట్రం టెస్టులో నోబాల్పై తొలి వికెట్ తీసి దానిని దక్కించుకోలేకపోయిన ఎనిమిదో బౌలర్గా ఆకాశ్ దీప్ నిలిచాడు. ఈ జాబితాలో లసిత్ మలింగ (శ్రీలంక), మైకేల్ బీర్ (ఆస్ట్రేలియా), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), మార్క్ వుడ్ (ఇంగ్లండ్), స్టువర్ట్ బిన్నీ (భారత్), టామ్ కరన్ (ఇంగ్లండ్), నసీమ్ షా (పాకిస్తాన్) కూడా ఉన్నారు. 313 టెస్టుల్లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన 313 ప్లేయర్గా ఆకాశ్ దీప్ నిలిచాడు. ఇంగ్లండ్తో ప్రస్తుత సిరీస్లోనే భారత్ నుంచి నలుగురు (రజత్ పటిదార్, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్ దీప్) అరంగేట్రం చేయడం విశేషం. 10 భారత్పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా జో రూట్ గుర్తింపు పొందాడు. రూట్ భారత్పై 10 సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో స్టీవ్ స్మిత్ (9– ఆ్రస్టేలియా), గ్యారీ సోబర్స్ (8–వెస్టిండీస్), వివియన్ రిచర్డ్స్ (8–వెస్టిండీస్), రికీ పాంటింగ్ (8–రికీ పాంటింగ్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 31 టెస్టుల్లో రూట్ సెంచరీల సంఖ్య. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రూట్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. మరో రెండు సెంచరీలు చేస్తే ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన అలిస్టర్ కుక్ (33) రికార్డును రూట్ సమం చేస్తాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (బి) ఆకాశ్ దీప్ 42; డకెట్ (సి) జురెల్ (బి) ఆకాశ్ దీప్ 11; ఒలీ పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆకాశ్ దీప్ 0; రూట్ (బ్యాటింగ్) 106; బెయిర్స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 38; స్టోక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 3; ఫోక్స్ (సి) జడేజా (బి) సిరాజ్ 47; హార్ట్లీ (బి) సిరాజ్ 13; రాబిన్సన్ (బ్యాటింగ్) 31; ఎక్స్ట్రాలు 11; మొత్తం (90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 302. వికెట్ల పతనం: 1–47, 2–47, 3–57, 4–109, 5–112, 6–225, 7–245. బౌలింగ్: సిరాజ్ 13–3–60–2, ఆకాశ్దీప్ 17–0–70–3, జడేజా 27–7–55–1, అశ్విన్ 22–1–83–1, కుల్దీప్ 10–3–21–0, యశస్వి 1–0–6–0. -
IND VS ENG 4th Test: జో రూట్ ఖాతాలో మరో రికార్డు
రాంచీ టెస్ట్లో సెంచరీతో (106 నాటౌట్) కదంతొక్కిన జో రూట్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్ల పరంగా) 19000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. రూట్ 19000 పరుగుల మైలురాయిని చేరుకునేందుకు 444 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం 444 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మైలురాయిని విరాట్ కోహ్లి అందరికంటే వేగంగా చేరుకున్నాడు. కోహ్లి 399 ఇన్నింగ్స్ల్లోనే ఈ ల్యాండ్మార్క్ను రీచ్ అయ్యాడు.కోహ్లి తర్వాత సచిన్ టెండూల్కర్ (432), బ్రియాన్ లారా (433) అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న వారిలో ఉన్నారు. రాంచీ టెస్ట్లో సెంచరీతో రూట్ చాలా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ల్లో 31వ సెంచరీ, ఓవరాల్గా (అన్ని ఫార్మాట్లలో) 47 సెంచరీ పూర్తి చేసుకున్న రూట్.. ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (80) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు) రెండో ప్లేస్లో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (47) కలిసి రూట్ మూడో స్థానంలో నిలిచాడు. తాజా సెంచరీతో రూట్ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్పై అత్యధిక టెస్ట్ సెంచరీలు (10) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్స్టో (38), బెన్ స్టోక్స్ (3), బెన్ ఫోక్స్(47), టామ్ హార్ట్లీ (13) ఔట్ కాగా.. రూట్ (106), రాబిన్సన్ (31) క్రీజ్లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్ 2, రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
IND VS ENG 4th Test Day 1: మెరిసిన ఆకాశ్దీప్.. సెంచరీతో కదంతొక్కిన రూట్
రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటలో పర్యాటక ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్ను చేయగలిగింది. జో రూట్ కెరీర్లో 31వ టెస్ట్ సెంచరీతో ఇంగ్లండ్ను ఆదుకున్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్స్టో (38), బెన్ స్టోక్స్ (3), బెన్ ఫోక్స్(47), టామ్ హార్ట్లీ (13) ఔట్ కాగా.. రూట్ (106), రాబిన్సన్ (31) క్రీజ్లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్ 2, రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి రోజు హైలైట్స్.. టీమిండియా అరంగేట్రం పేసర్ ఆకాశ్దీప్ అద్బుతమైన ఇన్ స్వింగర్తో జాక్ క్రాలేను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఆ బంతిని ఆకాశ్ క్రీజ్ దాటి సంధించడంతో అంపైర్ నో బాల్గా ప్రకటించాడు. దీంతో ఆకాశ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. టెస్ట్ క్రికెట్లో ఓ ప్రత్యర్థిపై 1000 పరుగులు మరియు 100 వికెట్లు తీసిన తొలి ఆసియా క్రికెటర్గా.. ఇంగ్లండ్పై 100 టెస్ట్ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా అశ్విన్ రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్లో రూట్ చేసిన సెంచరీ టెస్ట్ల్లో అతనికి 31వది. అన్ని ఫార్మాట్లలో కలిపితే 47వది. ఈ సెంచరీతో రూట్ ప్రస్తుత క్రికెటర్లలో (అన్ని ఫార్మాట్లలో) అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (80) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు) రెండో ప్లేస్లో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (47) కలిసి రూట్ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (45) ఉన్నాడు. తాజా సెంచరీతో రూట్ ఫాబ్ ఫోర్లో (కోహ్లి, రూట్, స్మిత్, కేన్) మూడో అత్యుత్తమ ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ జాబితాలో విలియమ్సన్ (32), స్టీవ్ స్మిత్ (32) టాప్లో ఉండగా.. రూట్ (31), కోహ్లి (29) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ సెంచరీతో రూట్ మరో భారీ రికార్డును సైతం ఖాతాలో వేసుకున్నాడు. భారత్పై అత్యధిక టెస్ట్ సెంచరీలు (10) చేసిన ఆటగాడిగా రూట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో రూట్.. స్టీవ్ స్మిత్ను (9) అధిగమించాడు. -
IND VS ENG 4th Test: రోహిత్ శర్మ సరసన చేరిన రూట్
రాంచీలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆటగాడు జో రూట్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ప్రస్తుత భారత పర్యటనలో పేలవ ప్రదర్శనలతో ముప్పేట దాడిన ఎదుర్కొన్న రూట్.. ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చి సెంచరీతో కదంతొక్కాడు. ఈ సెంచరీని రూట్ జట్టు కష్ట సమయం ఉన్నప్పుడు సాధించాడు. తాజా సెంచరీతో రూట్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ల్లో రూట్కు ఇది 31 సెంచరీ. అన్ని ఫార్మాట్లలో ఇది 47 శతకం. ఈ సెంచరీతో రూట్ ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (80) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు) రెండో ప్లేస్లో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (47) కలిసి రూట్ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (45) ఉన్నాడు. తాజా సెంచరీతో రూట్ ఫాబ్ ఫోర్ ఆటగాళ్లలో (కోహ్లి, రూట్, స్మిత్, కేన్) మూడో అత్యుత్తమ ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగు చేసుకున్నాడు. ఫాబ్ ఫోర్లో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ (31) మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో విలియమ్సన్ (32), స్టీవ్ స్మిత్ (32) టాప్లో ఉండగా.. రూట్, కోహ్లి (29) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ సెంచరీతో రూట్ మరో భారీ రికార్డును సైతం ఖాతాలో వేసుకున్నాడు. భారత్పై అత్యధిక టెస్ట్ సెంచరీలు (10) చేసిన ఆటగాడిగా రూట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో రూట్.. స్టీవ్ స్మిత్ను (9) అధిగమించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. రాంచీ టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్స్టో (38), బెన్ స్టోక్స్ (3), బెన్ ఫోక్స్(47), టామ్ హార్ట్లీ (13) ఔట్ కాగా.. రూట్ (106), రాబిన్సన్ (31) క్రీజ్లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్ 2, రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
Joe Root: రూట్ సరికొత్త చరిత్ర! ఇప్పటికి ఒకే ఒక్కడు..
‘‘రూట్ నుంచి ఇంత వరకు తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ రాలేదు. అనూహ్య రీతిలో బంతితో రాణిస్తున్నాడే తప్ప బ్యాట్తో మ్యాజిక్ చేయలేకపోతున్నాడు’’.. టీమిండియాతో తాజా టెస్టు సిరీస్లో భాగంగా తొలి మూడు మ్యాచ్ల ప్రదర్శన ఆధారంగా ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్పై వచ్చిన విమర్శలు. అయితే, వాటన్నింటికీ నాలుగో టెస్టు సందర్భంగా బ్యాట్తోనే సమాధానమిచ్చాడు రూట్. రాంచి మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ ధాటికి 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకున్న రూట్.. బజ్బాల్ అంటూ దూకుడు ప్రదర్శించకుండా అచ్చమైన సంప్రదాయ క్రికెట్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఏకాగ్రత చెదరనీయక.. పట్టుదలగా నిలబడి 219 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన కెరీర్లో 139 టెస్టు ఆడుతున్న రూట్.. 31వ శతకం నమోదు చేశాడు. ఇక ఓవరాల్గా రూట్కు ఇది 31వ టెస్టు సెంచరీ కాగా.. టీమిండియాపై పదవది. తద్వారా భారత్పై అత్యధిక టెస్టు శతకాలు బాదిన క్రికెటర్గా రూట్ చరిత్రకెక్కాడు. టీమిండియాపై అత్యధిక టెస్టు సెంచరీలు ►10- జో రూట్(ఇంగ్లండ్- 52 ఇన్నింగ్స్*) ►9- స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా- 37) ►8- గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్- 30) ►8- వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్- 41) ►8- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా- 51) -
IND VS ENG 4th Test: చరిత్ర సృష్టించిన జో రూట్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (91) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాడు అలిస్టర్ కుక్ (90) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. రాంచీలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్లో రూట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో రూట్ జట్టు కష్టాల్లో (47/2) ఉన్నప్పుడు బరిలోకి దిగి అర్దసెంచరీ సాధించాడు. ప్రస్తుతం అతను 67 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. కెరీర్లో 139వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న రూట్.. 30 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీల సాయంతో 11560 పరుగులు సాధించి ఇంగ్లండ్ తరఫున టెస్ట్ల్లో సెకెండ్ లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డు అలిస్టర్ కుక్ పేరిట ఉంది. కుక్ తన 161 మ్యాచ్ల కెరీర్లో 33 సెంచరీలు, 57 అర్దసెంచరీల సాయంతో 12472 పరుగులు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. రాంచీ టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ టీ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్స్టో (38), బెన్ స్టోక్స్ (3) ఔట్ కాగా.. రూట్ (67), బెన్ ఫోక్స్ (28) క్రీజ్లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
కెరీర్ ముగిసిండేది.. జో రూట్పై ఆర్పీ సింగ్ సంచలన కామెంట్స్
రాజ్కోట్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ దారుణంగా విఫలమయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన రూట్.. ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రివర్స్ ర్యాంప్ షాట్ ఔటయ్యాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో రూట్ను ఉద్దేశించి భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదే షాట్ వేరే ఆటగాడు రంజీల్లో గానీ, క్లబ్ స్థాయి క్రికెట్లోనైనా ఆడి వుంటే అతడు కెరీర్ ముగిసిపోయి ఉండేదని ఆర్పీ సింగ్ అన్నాడు. ముందు బ్యాటింగ్ టెక్నిక్ను సరిచేసుకుని ఆ తరహా షాట్స్ ఆడాలని ఆర్పీ సింగ్ సూచించాడు. కాగా ఈ సిరీస్లో రూట్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సిరీస్లో కనీసం హాఫ్ సెంచరీ మార్క్ను కూడా అందుకోలేకపోయాడు. ఇక మూడో టెస్టు విషయానికి వస్తే.. టీమిండియా పట్టుబిగించింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(104 133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు శుబ్మన్ గిల్(65 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా ప్రస్తుతం ఆధిక్యం 322 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: IND vs ENG: టీమిండియాకు బిగ్ షాక్.. జైశ్వాల్కు గాయం! ఆట మధ్యలోనే? -
తగ్గుతూ వస్తున్న కోహ్లి ప్రభ.. గణనీయంగా పుంజుకుంటున్న విలియమ్సన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 2021 నుంచి రెండేళ్ల పాటు కెరీర్ పరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. 2022 చివర్లో కోహ్లి ఎట్టకేలకు ఫామ్ను దొరకబుచ్చుకుని పూర్వవైభవం సాధించగలిగాడు. అయితే కోహ్లి ఫామ్ కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమైంది. గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో గతం కంటే మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్న కోహ్లి.. టెస్ట్ల్లో మాత్రం ఆశించినంతగా రాణించలేకపోతున్నాడు. తాజాగా సోషల్మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ పోస్ట్ ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏం సూచిస్తుందంటే.. 2021లో కోహ్లి 27 టెస్ట్ సెంచరీలు చేసే నాటికి ఫాబ్ ఫోర్గా పిలువబడే వారిలో మిగతా ముగ్గురు కోహ్లి కంటే తక్కువ సెంచరీ కలిగి ఉన్నారు. స్టీవ్ స్మిత్ 26, కేన్ విలియమ్సన్ 23, జో రూట్ 17 సెంచరీలు చేశారు. అయితే నేటి దినం వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. అప్పట్లో సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ఫాబ్ ఫోర్లో ప్రథముడిగా పరిగణించబడిన కోహ్లి.. ప్రస్తుతం చివరివాడిగా మారిపోయాడు. Kane Williamson is just one century away from equaling Steve Smith among the Fab 4 for the most Test centuries. pic.twitter.com/ZtFIV45lmE — CricTracker (@Cricketracker) February 6, 2024 టెస్ట్ సెంచరీల సంఖ్యలో కోహ్లి ఫాబ్ ఫోర్లో చివరి స్థానానికి పడిపోయాడు. నేటికి 32 సెంచరీలతో స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉండగా.. వరుస సెంచరీలు చేస్తూ పరుగులు వరద పారిస్తున్న విలియమ్సన్ 31 సెంచరీలతో రెండో స్థానానికి దూసుకువచ్చాడు. అప్పట్లో 17 సెంచరీలు చేసిన రూట్.. ఈ మధ్యకాలంలో ఏకంగా 13 సెంచరీలు చేసి 30 సెంచరీలతో మూడో ప్లేస్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేసిన కోహ్లి ఫాబ్ ఫోర్లో చివరివాడిగా కొనసాగుతున్నాడు. ఓ పక్క టెస్ట్ల్లో తనకు పోటీదారులుగా పిలువబడే వారు సెంచరీల మీద సెంచరీలు చేస్తూ దూసుకుపోతుంటే కోహ్లి మాత్రం చల్లబడ్డాడు. కోహ్లికి ప్రధాన పోటీదారుడైన విలియమ్సన్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు చేయడంతో పాటు చివరి 10 ఇన్నింగ్స్ల్లో ఆరు శతకాలు బాది శతక వేటలో దూసుకుపోతుంటే కోహ్లి మాత్రం రేసులో వెనుకపడ్డాడు. కోహ్లి టెస్ట్ సెంచరీ సంఖ్య తగ్గడానికి ఓ ప్రధానమైన కారణంగా ఉంది. కోహ్లి ఫాబ్ ఫోర్లోని మిగతా సభ్యులతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో టెస్ట్ మ్యాచ్లు చాలా తక్కువగా ఆడాడు. ఏదో టెస్ట్ క్రికెట్ అంటే ఆసక్తి లేనట్లు మ్యాచ్కు మ్యాచ్కు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఓ పక్క స్టీవ్ స్మిత్, కేన్ మామ, రూట్ దాదాపుగా ప్రతి మ్యాచ్ ఆడుతుంటే కోహ్లి ఏ అమవాస్యకో పున్నానికో టెస్ట్ల్లో కనిపిస్తున్నాడు. కోహ్లి సెంచరీలు చేయకపోతేనేం పరుగులు సాధిస్తున్నాడు కదా అని అతని అభిమానులు వాదించవచ్చు. అయితే సహచరులతో పోలిస్తే కోహ్లి సాధించిన పరుగులు చాలా తక్కువ అన్న విషయాన్ని వారు మరువకూడదు. అభిమాన ఆటగాడు కదా అని మనం ఎంత సమర్ధించుకు వచ్చినా అంతిమంగా గణాంకాలు మాత్రమే మాట్లాడతాయని గుర్తించాలి. ఇంగ్లండ్తో చివరి మూడు టెస్ట్లకైనా కోహ్లి అందుబాటులోకి వస్తాడో లేదో వేచి చూడాలి. -
భారత గడ్డపై జో రూట్ అరుదైన రికార్డు
India vs England, 2nd Test: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ భారత గడ్డపై అరుదైన రికార్డు సాధించాడు. భారత్లో అత్యధిక పరుగులు సాధించిన విదేశీ క్రికెటర్ల జాబితాలో చేరాడు. టీమిండియాతో రెండో టెస్టు సందర్భంగా రూట్ ఈ ఫీట్ నమోదు చేశాడు. వైజాగ్ వేదికగా రోహిత్ సేన- ఇంగ్లండ్తో రెండో టెస్టులో తలపడుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో సోమవారం నాటి నాలుగో రోజు ఆట ఆసక్తికరంగా మారింది. లక్ష్య ఛేదనలో తడబడుతున్న ఇంగ్లండ్ టీమిండియా విధించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ తడబడుతోంది. భోజన విరామ సమయానికి 42.4 ఓవర్లలో 194 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయింది. గెలుపునకు ఇంకా 205 పరుగుల దూరంలో ఉంది. టీమిండియా గెలవాలంటే ఇంకో నాలుగు వికెట్లు తీస్తే చాలు!! ఇదిలా ఉంటే.. నాలుగో రోజు ఆటలో భాగంగా 30.4 ఓవర్లో రవిచంద్రన్అశ్విన్ బౌలింగ్లో సింగిల్ తీసిన రూట్.. భారత గడ్డపై వెయ్యి పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో భారత్లో ఈ మైలురాయి అందుకున్న ఐదో విదేశీ బ్యాటర్గా జో రూట్ చరిత్రకెక్కాడు. ఇక.. ఈ ఘనత సాధించిన తర్వాత మరొక్క పరుగు చేసిన రూట్(16).. అశ్విన్ బౌలింగ్లో అక్షర్ పటేల్ పటేల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక జో రూట్ భారత్లో వేదికగానే 2012లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ భారత్లో పర్యటిస్తోంది. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో గెలుపొంది 1-0తో ఆధిక్యంలో ఉండగా.. వైజాగ్లో విజయం సాధించి 1-1తో సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. భారత్లో వెయ్యి.. అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన విదేశీ బ్యాటర్లు క్లైవ్ లాయిడ్(వెస్టిండీస్)- 1359 పరుగులు(సగటు 75.50) అలిస్టర్ కుక్(ఇంగ్లండ్)- 1235 పరుగులు(సగటు 51.45) సర్ గోర్డాన్ గ్రీనిడ్జ్(వెస్టిండీస్)- 1042 పరుగులు (సగటు 45.3) మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా)- 1027 పరుగులు(సగటు 51.35) జో రూట్(ఇంగ్లండ్)- 1004 పరుగులు(సగటు 45.59). చదవండి: Ind vs Eng: 0.45 సెకన్లలో మెరుపు వేగంతో రోహిత్.. రెప్పపాటులో క్యాచ్! -
IND VS ENG 2nd Test Day 3: ఇంగ్లండ్కు ఎదురుదెబ్బ.. రూట్కు గాయం
వైజాగ్ టెస్ట్లో టీమిండియా ఇంగ్లండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత సెకెండ్ ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు జో రూట్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. స్లిప్లో క్యాచ్ అందుకనే క్రమంలో రూట్ కుడిచేతి చిటికెన వేలుకు గాయమైంది. దీంతో హుటాహూటిన అతన్ని డ్రెస్సింగ్ రూమ్కు తీసుకెళ్లారు. రూట్ ప్రస్తుతం ఇంగ్లండ్ మెడికల్ టీమ్ పర్యవేక్షనలో ఉన్నాడు. అతనికి ఐస్ ట్రీట్మెంట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రూట్ గాయం తీవ్రత ఏంటనేది తెలియాల్సి ఉంది. 399 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రూట్ బరిలోకి దిగకపోతే ఇంగ్లండ్ విజయావకాశాలు దెబ్బతినవచ్చు. మిడిలార్డర్లో రూట్ కీలకమైన ప్లేయర్. భారత్ సెకెండ్ ఇన్నింగ్స్ అనంతరం ఇంగ్లండ్ లక్ష్య ఛేదనకు దిగింది. ఆ జట్టు 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ముకేశ్ కుమార్ వేసిన రెండో ఓవర్లో బెన్ డకెట్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. భారత సెకెండ్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (104) సెంచరీతో కదంతొక్కగా.. అక్షర్ పటేల్ (45) పర్వాలేదనిపించాడు. రోహిత్ (13), శ్రేయస్ (29), కేఎస్ భరత్ (6) మరోసారి విఫలం కాగా.. తొలి ఇన్నింగ్స్ సెన్సేషన్, డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు. అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ 9 వరుసగా రెండో ఇన్నింగ్స్లోనూ విఫలమయ్యాడు. ఆఖర్లో అశ్విన్ 29 పరుగులు చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు తోడ్పడ్డాడు. ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి 209 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. బుమ్రా (6/45), కుల్దీప్ (3/71) ధాటికి 253 పరుగులకే ఆలౌటైంది. -
Ind vs Eng: ఇంగ్లండ్కు షాక్.. కీలక స్పిన్నర్ దూరం
టీమిండియాపై తొలి టెస్టులో జోరు మీదున్న ఇంగ్లండ్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక స్పిన్నర్ జాక్ లీచ్ రెండో మ్యాచ్కు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోకాలి కారణంగా అతడు విశాఖ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో జాక్ లీచ్ స్థానంలో పాక్ మూలాలున్న యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఉపఖండ పిచ్లపై బంతి బాగా టర్న్ అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అనుభవజ్ఞుడైన జాక్ లీచ్తో పాటు యువ బౌలర్లు రెహాన్ అహ్మద్, టామ్ హార్లీలను తుదిజట్టులో ఆడించింది. వీరంతా మెరుగ్గా ఆడి జట్టు విజయంలో పాలుపంచుకోగా.. పార్ట్టైమ్ స్పిన్నర్ జో రూట్ కూడా అద్భుతంగా రాణించాడు. అరంగేట్ర బౌలర్ హార్లీ అత్యధికంగా తొమ్మిది వికెట్లు తీస్తే.. రూట్ ఐదు, రెహాన్ మూడు, జాక్ లీచ్ రెండు వికెట్లు పడగొట్టారు. అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా జాక్ లీచ్ ఎడమ మోకాలికి గాయమైంది. ఇదిలా ఉంటే... బ్యాటర్ ఒలి పోప్ అద్భుత ఇన్నింగ్స్కు తోడు.. బౌలర్లు రాణించడంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ టీమిండియా మీద 28 రన్స్ తేడాతో గెలిచింది. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్టేడియంలో రెండో మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా- ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్కు సిద్ధం కాగా.. జాక్ లీచ్ నెట్ సెషన్కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కోహ్లి కెప్టెన్గా ఉంటే టీమిండియా గెలిచేది: ఇంగ్లండ్ మాజీ సారథి -
ICC: ఎవరికీ అందనంత ఎత్తులో జడేజా.. నంబర్ వన్ గానే అశూ
ICC Test Bowling Rankings: ఐసీసీ తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో ప్రదర్శన కారణంగా నంబర్ వన్ ర్యాంకును కాపాడుకోగలిగాడు. ఇక భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపరచుకుని నాలుగో స్థానంలో నిలిచాడు. అదే విధంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆరో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇలా టాప్-10 బౌలర్లలో టీమిండియా నుంచి ముగ్గురికి స్థానం లభించింది. బ్యాటర్లలో పోప్ ఏకంగా... కాగా టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు తీశాడు. అదే విధంగా.. బుమ్రాకు కూడా ఆరు వికెట్లు లభించగా.. జడ్డూ ఐదు వికెట్లతో రాణించాడు. అయితే, ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్ ఒలీ పోప్ అద్భుత సెంచరీ(196)తో జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఏకంగా 20 స్థానాలు ఎగబాకి సత్తా చాటాడు. MEN'S TEST ALL-ROUNDER RANKINGS: ఎవరికీ అందనంత ఎత్తులో జడేజా! మరోవైపు ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో.. రవీంద్ర జడేజా 425 రేటింగ్ పాయింట్లతో ఫస్ట్ ర్యాంకు నిలబెట్టుకుని ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ మ్యాచ్లో వికెట్లు తీయడంతో పాటు జడ్డూ 89 పరుగులు చేశాడు. ఇక అశూ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియాతో మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన రూట్ స్టోక్స్ను దాటేశాడు. ఇక హైదరాబాద్లో 28 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో ఇంగ్లండ్తో రెండో టెస్టులో తలపడనుంది. ఈ టెస్టుకు విరాట్ కోహ్లి ఇప్పటికే దూరం కాగా.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, కీలక బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాల కారణంగా అందుబాటులో ఉండటం లేదు. ఐసీసీ మెన్స్ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-5 1. రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 853 పాయింట్లు 2. కగిసో రబడ(సౌతాఫ్రికా)- 851 పాయింట్లు 3. ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 828 పాయింట్లు 4. జస్ప్రీత్ బుమ్రా(ఇండియా)- 825 పాయింట్లు 5. జోష్ హాజిల్వుడ్(ఆస్ట్రేలియా)- 818 పాయింట్లు ఐసీసీ మెన్స్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ టాప్-5 1. రవీంద్ర జడేజా(ఇండియా)- 425 పాయింట్లు 2. రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 328 పాయింట్లు 3. షకీబ్ అల్హసన్(బంగ్లాదేశ్)- 320 పాయింట్లు 4. జో రూట్(ఇంగ్లండ్)- 313 పాయింట్లు 5. బెన్ స్టోక్స్(ఇంగ్లండ్)- 307 పాయింట్లు. చదవండి: Mayank Agarwal: ఆ బాటిల్ తీసుకుని తాగగానే వాంతులు.. భయంకర పరిస్థితి -
జో రూట్ మాయాజాలం.. టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే!
India vs England, 1st Test Day 3: టీమిండియాతో తొలి టెస్టులో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ బ్యాటింగ్లో విఫలమైనా.. బౌలింగ్లో అదరగొట్టాడు. ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ ఏకంగా నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. భారత తొలి ఇన్నింగ్స్లో... ఇంగ్లండ్ రెగ్యులర్ బౌలర్లు ఒకటీ రెండు వికెట్లకే పరిమితమైన వేళ రూట్ టాప్ వికెట్ టేకర్గా నిలవడం విశేషం. హైదరాబాద్ వేదికగా గురువారం మొదలైన టెస్టులో ఇంగ్లండ్ 246 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. శనివారం నాటి మూడో రోజు ఆటను 421/7తో మొదలుపెట్టి 436 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అయితే, శనివారం టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లలో రెండు వికెట్లు రూట్ తీసినవే. అవి కూడా ఒకే ఓవర్లో వరుస బంతుల్లో తీయడం విశేషం. 119.3 ఓవర్లో రవీంద్ర జడేజా(87)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న రూట్.. అతడిని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో జడ్డూ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన జస్ప్రీత్ బుమ్రా(0)ను అద్భుత రీతిలో క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్కు చేర్చాడు. ఒక్క పరుగు చేయకుండానే ఆఖరి మూడు వికెట్లు డౌన్ ఆ తర్వాతి రెండో ఓవర్కే రెహాన్ అహ్మద్ అక్షర్ పటేల్(44)ను అవుట్ చేయడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. రూట్, రెహాన్ దెబ్బకు టీమిండియా తమ స్కోరుకు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే ఆఖరి మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆటలో భాగంగా జో రూట్ యశస్వి జైస్వాల్(80) రూపంలో బిగ్ వికెట్ పడగొట్టడం విశేషం. అదే విధంగా శ్రీకర్ భరత్(41)ను కూడా ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసిన టీమిండియా ఓవరాల్గా 190 పరుగుల ఆధిక్యంలో నిలవగా.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. దెబ్బకు దెబ్బ రెండో ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్లో రూట్(2) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మూడో వికెట్గా వెనుదిరిగాడు. 21 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 117-3 చదవండి: Rohit Sharma: ఎన్ని సెంచరీలు చేస్తే ఏం లాభం?.. అదొక్కటి తప్ప అన్నీ గెలిచాం Joe Root in Indian condition is more threatening as a bowler than a batsman. England is asking too much from him after playing three front line spinners.#INDvsENG #RavindraJadeja #Axar #AUSvsWI #TestCricket #CricketTwitterpic.twitter.com/hmE1SYflNk — Sujeet Suman (@sujeetsuman1991) January 27, 2024 -
IPL 2024: రూట్తో పాటు ఇద్దరు విండీస్ స్టార్లను వదిలేసిన రాజస్థాన్
ఐపీఎల్ 2024 సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తొమ్మిది మంది ఆటగాళ్లను వదిలేసింది. ఆటగాళ్ల రిలీజ్ ప్రక్రియలో భాగంగా రాజస్థాన్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాయల్స్ యాజమాన్యం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్తో పాటు మరో ఎనిమిది మందిని రిలీజ్ చేసింది. గత సీజన్లో ఆడిన స్టార్ ఆటగాళ్లతో పాటు కెప్టెన్గా సంజూ శాంసన్ను కొనసాగించింది. రాజస్థాన్ మేనేజ్మెంట్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో ఇద్దరు విండీస్ ఆటగాళ్లు ఉన్నారు. జేసన్ హోల్డర్, ఓబెద్ మెక్కాయ్లను రాజస్థాన్ మేనేజ్మెంట్ వేలానికి వదిలేసింది. రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. జో రూట్ జేసన్ హోల్డర్ ఓబెద్ మెక్కాయ్ అబ్దుల్ బాసిత్ ఆకాశ్ వశిష్ట్ కుల్దీప్ యాదవ్ మురుగన్ అశ్విన్ కేసీ కరియప్ప కేఎం ఆసిఫ్ రాజస్థాన్ నిలబెట్టుకున్న ఆటగాళ్లు వీరే.. సంజూ శాంసన్ (కెప్టెన్) జోస్ బట్లర్ షిమ్రోన్ హెట్మైర్ యశస్వి జైస్వాల్ ధృవ్ జురెల్ రియాన్ పరాగ్ డొనోవన్ ఫెరియెరా కునాల్ రాథోడ్ రవిచంద్రన్ అశ్విన్ కుల్దీప్ సేన్ నవ్దీప్ సైనీ ప్రసిద్ద్ కృష్ణ సందీప్ శర్మ ట్రెంట్ బౌల్ట్ యుజ్వేంద్ర చహల్ ఆడమ్ జంపా ఆవేశ్ ఖాన్ (లక్నో నుంచి ట్రేడింగ్) -
ఐపీఎల్-2024కు రాజస్తాన్కు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం
ఐపీఎల్-2024 సీజన్కు ముందు రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టు స్టార్ బ్యాటర్, ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ ఐపీఎల్-2024 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ శనివారం ధృవీకరించింది. రూట్ గత సీజన్తో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్-2023 వేలంలో అతడిని రూ. కోటి రూపాయల కనీస ధరకు రాజస్తాన్ కొనుగోలు చేసింది. అయితే తన డెబ్యూ సీజన్లో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే రూట్ ఆడాడు. మూడు మ్యాచ్ల్లో ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఆ మ్యాచ్లో రూట్ కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. అయితే పార్ట్ టైమ్ బౌలర్గా కూడా రూట్ తన సేవలందించాడు. జో రూట్ ఐపీఎల్-2024లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు. మా ఆటగాళ్ల రిటేన్షన్ను జాబితాను సిద్దం చేసే క్రమంలో అతడు తన నిర్ణయాన్ని మాకు తెలియజేశాడు. అతడు మా జట్టుతో కేవలం ఒక్క సీజన్ మాత్రమే ఆడినప్పటికీ.. మా ఫ్రాంచైజీలో ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరుచుకున్నాడు. మేము కచ్చితంగా అతడి అనుభవాన్ని, ఎనర్జీని మిస్ అవుతాం. ఏదైనప్పటికి అతని నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాము. అతడు తన కెరీర్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము అని రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగక్కర పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో ఆయా ఫ్రాంచైజీలు తమ అంటిపెట్టుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 26 సాయంత్రం లోపు బీసీసీఐకి అందజేయాల్సి ఉంది. చదవండి: IPL 2024: ముంబై ఇండియన్స్కు హార్దిక్ పాండ్యా.. ఆ విలువ ఎంత? -
జో రూట్ అరుదైన రికార్డు.. తొలి ఇంగ్లండ్ బ్యాటర్గా
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో 1000 పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్.. ఈ అరుదైన మైలు రాయిని రూట్ అందుకున్నాడు. రూట్ ఇప్పటివరకు వన్డే వరల్డ్కప్ టోర్నీల్లో 25 ఇన్నింగ్స్లలో 1034 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్గా ఈ మ్యాచ్లో 72 బంతులు ఎదుర్కొన్న రూట్.. 4 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. అయితే ఈ ఏడాది వరల్డ్కప్లో రూట్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్లు ఆడిన రూట్.. 248 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: World Cup 2023: వరల్డ్కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. -
పాపం రూట్.. చెత్త షాట్కు తప్పదు భారీ మూల్యం! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. పుణే వేదికగా నెదర్లాండ్స్తో మ్యాచ్లో కేవలం 28 పరుగులు మాత్రమే చేసి రూట్ ఔటయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన రూట్.. ఓ నిర్లక్షమైన షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 20 ఓవర్ వేసిన లోగాన్ వాన్ బీక్ బౌలింగ్లో రెండో బంతికి రూట్ ర్యాంప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. రూట్ సరైన పొజిషేషన్లో లేకపోవడంతో బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి స్టంప్స్ను గిరాటేసింది. అస్సలు ఆ బంతికి రూట్ ఆ షాట్ ఆడే అవసరమే లేదు. కానీ అనవసరపు షాట్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అయితే అంతకుముందు ఓవర్లో ఆ తరహా షాటే ఆడి బౌండరీని రూట్ రాబట్టాడు. కానీ రెండో సారి మాత్రం తన వికెట్ను సమర్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా 2019 వరల్డ్కప్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచిన రూట్.. ఈ సారి మాత్రం తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్లు రూట్ కేవలం 203 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో మ్యాచ్లో అయితే ఏకంగా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. చదవండి: #Maxwell-Cummins: ప్రతి ‘బ్యాట్మ్యాన్’కి ఇలాంటి రాబిన్ ఉండాలన్న ఐసీసీ! ఫాస్టెస్ట్ సెంచరీ చేసినపుడు కూడా. View this post on Instagram A post shared by ICC (@icc) -
IND VS ENG: 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఇలా..
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్లో జరిగిన ఓ ఆసక్తికర విషయం, ప్రస్తుతం క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకర్శిస్తుంది. అదేంటంటే.. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో మొట్టమొదటిసారి ఇరు జట్లలోని నంబర్ 3 ఆటగాళ్లు సున్నా పరుగులకే ఔటయ్యారు. ఇన్నేళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అందులోనూ ఔటైన ఇద్దరు బ్యాటర్లు వరల్డ్ క్లాస్ బ్యాటర్లు కావడంతో ఈ విషయం మరింత వైరలవుతుంది. భారత్ తరఫున నంబర్ త్రీగా బరిలోకి దిగిన విరాట్ 9 బంతులు ఆడి డేవిడ్ విల్లే బౌలింగ్లో బెన్ స్టోక్స్కు క్యాచ్ ఇచ్చి డకౌట్ కాగా.. ఇంగ్లండ్ తరఫున నంబర్ త్రీగా బరిలోకి దిగిన జో రూట్ బుమ్రా బౌలింగ్లో తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. Just out for a morning walk pic.twitter.com/Mv425ddQvU — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) October 29, 2023 ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. విరాట్ కోహ్లి డకౌటయ్యాక ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ (ఇంగ్లండ్ మద్దతుదారుల క్లబ్) ఓవరాక్షన్ చేసి ఓ వ్యంగ్యమైన ట్వీట్ చేసింది. కోహ్లి డకౌట్ అయ్యాడని హేళన చేస్తూ బాతుకు (డక్) అతని ఫోటో అతికించి అతి చేసింది. అయితే వారి రాక్షసానందం ఎంతోసేపు నిలువలేదు. వారు విపరీతంగా అభిమానించే సొంత జట్టు ఆటగాడు జో రూట్ కూడా సున్నా పరుగులకే డకౌటయ్యాడు. అది కూడా కోహ్లి కంటే హీనంగా గోల్డెన్ డక్గా (తొలి బంతికే ఔట్) వెనుదిరిగాడు. అనంతరం బార్మీ ఆర్మీ అతికి కౌంటర్గా భారత అభిమానులు కూడా విరుచుకుడుతున్నారు. Karma is a bitch Barmy Army 💪🏽💥 #INDvsENG https://t.co/pHMSWlqfCG pic.twitter.com/cSvOAHrcdq — Maddy (@maddified18) October 29, 2023 ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్తో పాటు కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతూ ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 23.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 81 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెయిర్స్టో (14), మలాన్ (16), రూట్ (0), స్టోక్స్ (0), బట్లర్ (10), మొయిన్ అలీ (15) ఔట్ కాగా.. లివింగ్స్టోన్ (20), క్రిస్ వోక్స్ క్రీజ్లో ఉన్నారు. షమీ 3, బుమ్రా 2, కుల్దీప్ ఓ వికెట్ పడగొట్టారు. -
CWC 2023 ENG VS AFG: వరల్డ్కప్ రికార్డును సమం చేసిన రూట్
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (అక్టోబర్ 15) జరుగుతున్న వరల్డ్కప్ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఓ వరల్డ్కప్ రికార్డును సమం చేశాడు. బ్యాటర్, బౌలర్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన రూట్.. ఈ మ్యాచ్లో ఏకంగా నాలుగు క్యాచ్లు పట్టి, వరల్డ్కప్ మ్యాచ్లో అత్యధిక క్యాచ్లు ఆందుకున్న నాన్ వికెట్కీపర్గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో మొహమ్మద్ కైఫ్ (2003లో శ్రీలంకపై), సౌమ్య సర్కార్ (2015లో స్కాట్లాండ్పై), ఉమర్ అక్మల్ (2015లో ఐర్లాండ్పై), క్రిస్ వోక్స్ (2019లో పాకిస్తాన్పై)లు వరల్డ్కప్ మ్యాచ్ల్లో నాలుగు క్యాచ్లు పట్టిన నాన్ వికెట్కీపర్లుగా ఉన్నారు. తాజా ప్రదర్శనతో రూట్ వీరి సరసన చేరాడు. ఆఫ్ఘన్తో మ్యాచ్లో రూట్ నాలుగు క్యాచ్లు పట్టడంతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ షాహీదిని రూట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్లో రూట్ పట్టిన రషీద్ ఖాన్ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. లాంగ్ ఆన్లో పరిగెత్తుకుంటూ వచ్చి తన కుడిపక్కకు డైవ్ చేస్తూ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు రూట్. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆఖర్లో ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (28), రషీద్ ఖాన్ (23), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (28) రాణించడంతో ఆ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. వరల్డ్కప్లో ఆఫ్ఘనిస్తాన్కు ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4-0-41-0), మార్క్ వుడ్ (9-0-50-2), సామ్ కర్రన్ (4-0-46), రీస్ టాప్లే (8.5-1-52-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. ఆదిల్ రషీద్ (10-1-42-3), లియామ్ లివింగ్స్టోన్ (10-0-33-1), జో రూట్ (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. అనంతరం 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెయిర్స్టోను (2) ఫజల్ హక్ ఫారూఖీ.. రూట్ను (11) ముజీబ్ ఔట్ చేశారు. 7 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 33/2గా ఉంది. డేవిడ్ మలాన్ (19), హ్యారీ బ్రూక్ క్రీజ్లో ఉన్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
T20 WC: నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు
వర్షం ఎఫెక్ట్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్
డిప్రెషన్లో ఉపాసన, అత్తారింటికి వెళ్లిన రామ్చరణ్ (ఫోటోలు)
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. త్వరలోనే రిటైర్మెంట్!?
ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తింది: సజ్జల
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement