-
ఆరోజు నైట్ పార్టీకెళ్లా.. ఔటయ్యా..! అప్పటి నుంచి: విరాట్ కోహ్లి
హైదరాబాద్: ‘‘మానసిక ప్రశాంతతకైనా.. శారీరక విశ్రాంతికైనా నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా ప్రొఫెషనల్ అథ్లెట్లకు, క్రీడాకారుల భవిష్యత్ సజావుగా సాగడానికి సంపూర్ణమైన నిద్ర అతి ప్రామాణికం’’అని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. ‘‘ఫ్రొఫెషనల్ కేరీర్ అయినా, ప్రియమైనవారితోనైనా ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగించాలంటే సరిపడా నిద్ర చాలా అవసరం. ఈ విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. తగినన్ని గంటలు విశ్రాంతి తీసుకోవడమే కాదు.. డీప్ స్లీప్ అంటే నాకిష్టం’’ అని పేర్కొన్నాడు. ఫిట్నెస్, నిద్రకు చాలా ప్రాముఖ్యతనిచ్చే విరాట్ కోహ్లీని ప్రముఖ స్లీప్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘డ్యూరోఫ్లెక్స్’ బ్రాండ్ అంబాసిడర్గా కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన సోమవారం హోటల్ తాజ్కృష్ణాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విరాట్ కోహ్లి నిద్ర, ఫిట్నెస్తో పాటు తన క్రికెట్ కేరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలపై మాట్లాడాడు. నైట్ పార్టీకెళ్లా.. ఔటయ్యా.. ‘‘నేను అండర్–19 ఆడుతున్నప్పుడు ఒక రోజు కోల్కతాలో నైట్ పార్టీకి వెళ్లాను. అది పూర్తి చేసుకుని వచ్చేసరికి తెల్లవారుజామున 6 గంటలైంది. 7 గంటలకు మ్యాచ్ మొదలైంది. కేవలం 20 నిమిషాలే నిద్రపోయిన నేను బ్యాటింగ్కు వెళ్లిన లంచ్లోపే ఔటయ్యాను. అప్పుడు నిద్ర విలువ తెలిసొచ్చింది. నాకు 25 ఏళ్లు ఉన్నప్పటి నుంచి అనుకుంటా.. ఫిట్నెస్కు, నిద్రకు చాలా ప్రాముఖ్యతనిస్తున్నా. ఇక వన్డేలు లేదా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు పగటిపూట నిద్రపోవడం సాధ్యం కాదు. రోజంతా నిద్రపోయే అవకాశం ఉండదు. ప్రస్తుతం నేను సాయంత్రం సమయంలో జరిగే 20– 20 ఆడుతున్నాను. కాబట్టి మధ్యాహ్నం నిద్రపోవడం ప్రారంభించాను, ఇది రీసెట్ లాంటిది. ఈ కునుకుతో తాజాగా, ఎనర్జిటిక్ మారిపోతాను. ఈ అలవాటు ఎన్నో సార్లు గాయాలైనప్పుడు కూడా త్వరగా కోలుకునేలా చేసింది. ప్రశాంతమైన ఆరోగ్యం కోసం మెడిటేషన్ చేస్తాను. మ్యూజిక్ వింటాను. ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇలాంటి విషయాలను జీవితంలో భాగంగా చేసుకున్నాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్తో బిజీగా ఉన్నాడు. చదవండి: ICC: హెల్మెట్ కచ్చితం.. ఫ్రీ హిట్కు బౌల్డయితే బ్యాటర్ తీసిన పరుగులు? తండ్రి లాంటి వారు చనువుగా, ఏదో తెలిసీ తెలియక తాకితే అపార్థం చేసుకుంటారా? -
ఆహారంలో మునగాకు, మునక్కాయలు వారంలో రెండుసార్లైనా తీసుకోవాలి! ఇంకా..
ఎండ కన్నెరగని జీవితాల్లో డీ విటమిన్ లోపం సాధారణమైపోయింది. నరాలు, కండరాలు, వ్యాధినిరోధక శక్తి మీద విటమిన్ డీ ప్రభావం ఉంటుంది. దేహంలో డీ విటమిన్ లోపిస్తే... నీరసం, నిస్సత్తువ, తరచూ అంటువ్యాధుల బారిన పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్యాల్షియమ్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకున్నా సరే... దేహం ఆ క్యాల్షియమ్ను స్వీకరించదు. ఆహారంలోని క్యాల్షియమ్ని దేహం చక్కగా స్వీకరించాలంటే దేహంలో డీ విటమిన్ తగినంత ఉండాలి. అలాగే ఐరన్ కూడా. మనం ఆహారంలో తీసుకున్న ఐరన్ని దేహం గ్రహించాలంటే దేహంలో సీ విటమిన్ తగినంత ఉండాలి. విటమిన్ సీ లోపం ఉన్న వాళ్లు ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకున్నా సరే దేహం సంగ్రహించుకోలేదు. దాంతో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనతకు దారి తీస్తుంది. అంతేకాదు... మనం పీల్చిన గాలి నుంచి ఆక్సిజెన్ తగు పాళ్లలో మెదడుకు చేరడం కూడా ముఖ్యమే. అలాగే ఛాతీ నిండుగా గాలి పీల్చుకోగలగడమూ అంతే అవసరం. దైనందిన ఆహారపు అలవాట్లలో భాగంగా అన్నం కూరలు, రొట్టె, పప్పులకు తోడుగా అవసరాన్ని బట్టి ఈ కింద చెప్పిన వాటిని ఆహారంలో భాగం చేసుకుందాం. క్యాల్షియమ్ కోసం... ►రాగులు, నువ్వులు, సబ్జా, అవిశె గింజలు, వాల్నట్, గెనస గడ్డ (స్వీట్ పొటాటో), పాలకూర, పుదీనలో క్యాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది. ►ప్రొటీన్ పుష్కలంగా ఉండే సోయాబీన్స్తోపాటు మునగాకు, మునక్కాయలు వారంలో రెండు దఫాలు ఆహారంలో భాగం కావాలి. ►పాలు, పెరుగు లేదా మజ్జిగ రోజూ తీసుకోవాలి. ఐరన్ కోసం... ►మష్రూమ్, క్యాలీఫ్లవర్, లివర్, ట్యూనా ఫిష్, రొయ్యలు, బీట్రూట్, శనగలు, బ్రౌన్ రైస్, పుచ్చకాయ, దానిమ్మ, స్ట్రాబెర్రీలు, ఆపిల్తోపాటు విటమిన్ సీ సమృద్ధిగా ఉండే పైనాపిల్, పియర్, నారింజ, కమలాలు తీసుకోవాలి. ►డ్రైఫ్రూట్స్లో ఆప్రికాట్, కిస్మిస్, ఖర్జూరాలు, గుమ్మడి గింజలు నమిలి తినాలి. ►అన్ని కాలాల్లో దొరికే సంపూర్ణ పోషకాల అరటి పండ్లు నిత్య ఆహారంగా ఉండాలి. ►పైవన్నీ తీసుకుంటే డీ విటమిన్ కూడా తగినంత అందుతుంది. విటమిన్ డీ కోసం ►మష్రూమ్, సోయా, గుడ్లు, పాలు, పెరుగు, మీగడలు, చేపలు డీ విటమిన్నిచ్చే ఆహారాలు. ►వీటితోపాటు రోజుకు కనీసం పావుగంట సేపు దేహానికి సూర్యరశ్మి తగలాలి. ►సూర్యరశ్మి సోకే చోట మార్నిగ్ లేదా ఈవెనింగ్ వాకింగ్ చేస్తే మంచిది. ►ఇవి సాధారణ ఆరోగ్యం కోసం పాటించాల్సిన ప్రధానమైన ఆహార జాగ్రత్తలు మాత్రమే. ►మనదేహంలో క్యాల్షియమ్, ఐరన్ స్థాయులను బట్టి డాక్టర్ సూచన మేరకు కచ్చితమైన డైట్ ప్లాన్ను అనుసరించాలి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -
Health: రోజూ ఏం తింటున్నారు? ఎరుపు రంగు ఆహారంలోని లైకోపీన్ వల్ల..
ఆకాశంలో విరిసే ఇంద్ర ధనుస్సును చూసి మురిసిపోని వారెవరు? అందుకే కవులు, రచయితలు కూడా ఇంద్రధనుస్సు గురించి ఎంతో అందంగా వర్ణిస్తుంటారు. రెయిన్బో పేరుతో రెస్టారెంట్లు, హోటళ్లు, కాన్వెంట్లు కూడా కనిపిస్తుంటాయి. రెయిన్బో డైట్ కూడా ఈ కోవలోకే వస్తుంది. అంటే... రెయిన్ బోలో ఎన్ని రంగులు ఉంటాయో మన ప్లేట్లో కూడా అన్ని రంగుల ఆహారపదార్థాలు ఉండేలా చూసుకోవడమే. అలా రెయిన్బో డైట్లో చేర్చిన రకరకాల రంగుల ఆహారాల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. రంగులలో ముందు చెప్పుకోవలసినది తెలుపు గురించే. ఎందుకంటే తెలుపులో ఏ రంగయినా ఇట్టే కలిసిపోతుంది కాబట్టి. ముందుగా తెలుపు రంగు ఆహారం గురించి చూద్దాం. తెలుపు రంగు ఆహారం ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, పుట్టగొడుగులు, క్యాలీఫ్లవర్, పాలు, పెరుగు, కొబ్బరి వంటి ఆహారాలు తెలుపు రంగు ఆహారం కిందికి వస్తాయి. ఆహారంలో వీటిని భాగంగా చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు శరీరంపై దుష్ప్రభావం చూపకుండా అడ్డుకుంటాయి. ఎందుకంటే వాటిలో ఎక్కువ ఫైబర్ ..పొటాషియం ఉంటుంది. నారింజ రంగు ఆహారం నారింజ రంగు పండ్లు .. కూరగాయలలో కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నారింజ, మంచి గుమ్మడి, క్యారెట్లు... పీచ్ వంటివి కంటి చూపుతోపాటు కేశాలకు, చర్మ ఆరోగ్యానికీ కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆకుపచ్చ ఆహారం ఆకుపచ్చ కూరగాయలు ..పండ్లు మనకు ఎంతో మేలు చేస్తాయని ఎప్పటినుంచే వైద్యులు చెబుతున్నమాటే. అవి చాలా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి మధుమేహం ..గుండె జబ్బులతో పోరాడతాయి. ఇందులో ఫోలేట్.. ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, మీరు మీ ఆహారంలో బచ్చలికూర, మెంతికూర, క్యాబేజీ, బీన్స్, బఠాణి, బూడిద గుమ్మడి, కీరా, ద్రాక్ష, పచ్చి టొమాటో, పుదీనా చేర్చుకోవాలి. పసుపు రంగు ఆహారం బొప్పాయి, పైనాపిల్, నిమ్మ, మామిడి, మొక్కజొన్న వంటి పండ్లు ..కూరగాయలలో లభించే బ్రోమెలైన్ పాపైన్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పసుపు ఆహారాలలో ఉండే లుటీన్ జియాక్సంతిన్ పిగ్మెంట్లు, వయస్సు సంబంధిత వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావం చూపుతాయి. నీలం లేదా ఊదా రంగు ఆహారం బెర్రీలు, ఎర్రటి కూరగాయలు, నల్ల ద్రాక్ష, వంకాయ వంటివి మెదడు సామర్థ్యానికి ప్రోత్సాహకంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే ఆంథోసైనిన్ ..రెస్వెట్రోల్ సమ్మేళనాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే, ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.. శరీరంలో మంటలను, వాపులను తగ్గిస్తాయి. ఎరుపు రంగు ఆహారం ఎరుపు రంగులో ఉండే చాలా కూరగాయలు .. పండ్లు మన హృదయానికి మేలు చేస్తాయట.. రెడ్ బెల్ పెప్పర్స్, (ఎరుపు రంగులో ఉండే క్యాప్సికం) దానిమ్మపండ్లు, టొమాటో, పుచ్చకాయలు, యాపిల్ వంటి వాటిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది క్యాన్సర్.. తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది. దీంతోపాటు వాటి ఎరుపు రంగుకు కారణమైన ఆంథోసైనిన్ సమ్మేళనం గుండె కండరాలను బలంగా ఉంచుతుంది. ఒక రోజులో ఐదు రకాల పండ్లు .. కూరగాయలు.. ఒక వారంలో కనీసం 20 రకాల పండ్లు ..కూరగాయలు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. నోట్: ఇది కేవలం ఆరోగ్యంపై అవగాహన కోసం మాత్రమే అందించిన కథనం. -
తప్పు పిల్లలదా? తల్లితండ్రులదా? టార్చర్ అంటూ..
తప్పు పిల్లలదా? తల్లితండ్రులదా? ఈ మధ్యకాలంలో విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు తరచూ వింటున్నాం. చదువుల వత్తిడి తట్టుకోలేకపోతున్నామని, గురువుల టార్చర్ భరించలేకపోతున్నామని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ సమస్య వెనక బలహీనమైన పసి మనసు ఉందా? లేక అర్థం చేసుకోలేని తల్లితండ్రుల వైఖరి కారణమా? ఒత్తిడిలో మునిగిపోతున్నారా? కార్పొరేట్ కాలేజీల, పాఠశాలల విద్యార్థులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. తరుముకొస్తున్న పరీక్షలు, నానాటికీ పెరిగిపోతున్న ఎక్స్ పెక్టేషన్స్..ఒక పక్క తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు. మరోపక్క తోటి విద్యార్థులు సాధిస్తున్న విజయాలు, మొత్తం మీద చూస్తే ఆడుతూ పాడుతూ సాగాల్సిన చదువులు... బంగారు భవిష్యత్తును చంపేసే చదువులుగా మారుతున్నాయి. తీవ్రస్థాయి ఒత్తిడి తట్టుకోలేక చనిపోయే పిల్లలతోపాటు...భవిష్యత్తులో బతికే నైపుణ్యాలు లేక విలవిలలాడిపోతున్న విద్యార్థులు ఎందరో. తల్లితండ్రుల్లో తప్పేంటీ? పిల్లల ఆత్మహత్యల్లో విద్యావ్యస్థలో ఎన్ని లోపాలున్నాయో అన్నే లోపాలు తల్లిదండ్రుల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగువారిని చూసో, బంధువుల పిల్లల చదువుల్ని చూసో... అలాగే తమ పిల్లలకు కూడా ఎదగాలని.. వారికంటే ఒక మెట్టు ఎక్కువే వుండాలని తపన పడుతున్నారు. తమ బిడ్డలపై లేనిపోని ఒత్తిడి పెంచుతున్నారు. ఇలాంటి ఆలోచనా విధానం మంచిది కాదు. పిల్లలకు ఏ చదువు నచ్చితే ఆ చదువులో ఎదిగేలా సహకారం అందించాలి. అప్పుడే వారు అన్ని విధాలా ఎదుగుతారు. ఆత్మహత్యల జోలికి పోరు. ఫీజుల కోసం రాజీ పడ్డారా? విద్యాసంవత్సరం ప్రారంభంలో వాతావరణం వేరు, ముగింపు సమయంలో వాతావరణం వేరు. ఎన్నెన్నో ఆశలు, ఆకాంక్షలతో విద్యాలయంలో చేరే పిల్లలు ... రానురాను పెరుగుతున్న వత్తిడి వాతావరణంలో ఇమడలేకపోతున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించలేకపోతున్నారు. పిల్లల సమస్యలు తెలిసినా సరే... అప్పటికే లక్షలాది రూపాయలు కట్టడంతో ఎలాగోలా అడ్జస్ట్ అయిపోవాలని చెబుతున్నారు. మరో పక్క పిల్లల మనోభావాల్సి ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదు. ఫీజులు తప్ప మరొకటి పట్టని మేనేజ్ మెంట్ తీవ్రస్థాయిలో నిర్లక్ష్యంగా వుంటోంది. దాంతో విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకుంటేనే వారిలో చైతన్యం వికసించి వారు రేపటి అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. అంతే తప్ప వారు బట్టీకొట్టి చదువుకునే రోబోలు కాకూడదు. -యాజులు, సీనియర్ జర్నలిస్ట్, సాక్షి చదవండి: H3N2 Virus: ఈ వైరస్ అంత డేంజరా? ఇలా చేశారంటే మాత్రం.. -
Health: అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే డివైజ్! ధర ఎంతంటే!
‘ఆరోగ్యకరమైన జీవనానికి .. ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి’ అనేది తెలిసిన మాటే. కానీ బిజీ లైఫ్లో అదే వీలు కావట్లేదని ఫీలయ్యేవారికి ఈ డివైజ్ భలే మంచి చాయిస్. ఎందుకంటే.. ఇది సమయం వృథా కాకుండా.. అందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ మెషిన్ ఇంట్లో ఉంటే.. కూర్చున్నా, నిలుచున్నా ఫిట్నెస్సే మరి. ఈ డివైజ్ (ఎలక్ట్రో మజిల్స్ స్టిములేషన్ ఇన్హాన్స్ వైబ్రేటింగ్ ప్లాట్ఫామ్ ఎక్సర్సైజర్).. మిమ్మల్ని ఎల్లప్పుడూ నాజూగ్గా ఉంచుతుంది. శరీరానికి కావాల్సిన వ్యాయామాన్ని అందిస్తుంది. అదెలా అంటే.. దీనిపైన నిలబడి.. డివైజ్కి అమర్చిన ఎక్సర్సైజ్ బ్యాండ్స్ని పట్టుకుంటే చాలు.. అరికాళ్ల నుంచి బాడీ మొత్తానికీ వైబ్రేషన్ పొందొచ్చు. దీనిపైన నిలబడితే.. బాడీ మొత్తంలో ఉండే కండరాల పనితీరు మెరుగుపడి.. రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. ల్యాప్టాప్లో పనిచేసుకుంటూనో.. కూరగాయలు తరుక్కుంటూనో.. ఇలా ఏ పని చేసుకోవాల్సి వచ్చినా ఆ పని చేసుకుంటూనే.. ఈ ఎక్సర్సైజర్ ప్రయోజనాలను పొందొచ్చు. చైర్లో కానీ.. సోఫాలో కానీ కూర్చుని.. కాళ్లను దీనిపై పెట్టుకుని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. రిమోట్ సాయంతో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందులో 3 ప్రీసెట్ మోడ్స్ ఉంటాయి. అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. అలాగే టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. దీన్ని చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో కూడా సులభంగా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ స్థలాన్ని తీసుకోదు. సోఫా కిందో, మంచం కిందో ఈజీగా పట్టేస్తుంది. ధర 458 డాలర్లు. అంటే 37,899 రూపాయలు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
తప్పక చదవండి
Advertisement