ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ | Sakshi
Sakshi News home page

ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌

Published Wed, May 8 2024 6:40 AM

ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌

కాళోజీ సెంటర్‌: వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌కు 14 బ్యాలెట్‌ యూనిట్లు, 50 కంట్రోల్‌ యూనిట్లు, 10 వీవీ ప్యాట్లు, పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 12 బ్యాలెట్‌ యూనిట్లు, 50 కంట్రోల్‌ యూనిట్లు, 8 వీవీ ప్యాట్లను కేటాయించినట్లు రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ప్రావీణ్య తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు బండారి స్వాగత్‌ రణవీర్‌చంద్‌ సమక్షంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం కలెక్టరేట్‌లో ఈవీఎంల రెండో విడత అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, రాధికాగుప్తా, ఎన్నికల పర్యవేక్షకుడు విశ్వనారాయణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ శ్రీనివాస్‌, అమరేందర్‌రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement