బీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలవబోతోంది | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలవబోతోంది

Published Wed, May 8 2024 6:40 AM

బీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలవబోతోంది

ఐనవోలు: వరంగల్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ 50 వేల భారీ మెజార్టీతో గెలవబోతున్న దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని పంథిని, కక్కిరాలపల్లి, నందనం, రాంనగర్‌, ఒంటిమామిడిపల్లి, ఐనవోలు, పున్నేలు గ్రామాల్లో దయాకర్‌రావు పర్యటించి పార్టీ విస్త్రతస్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయని కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి కడియం శ్రీహరి ద్రోహం చేశారని, అలాగే అరూరి రమేశ్‌ పచ్చి మోసకారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పి ఉద్యమకారుడు వరంగల్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మారెపల్లి సుధీర్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గుజ్జ గోపాల్‌రావు, తంపుల మోహన్‌, ఉస్మాన్‌ అలీ, తక్కళ్లపల్లి చందర్‌రావు, కడుదూరి రాజు, సోమేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కడియం శ్రీహరి ద్రోహి..

అరూరి రమేశ్‌ పచ్చి మోసకారి

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

 
Advertisement
 
Advertisement