-
సరికొత్త టైటిల్తో సినిమా ప్రకటించిన అనుపమ పరమేశ్వరన్
టాలీవుడ్లో ఇప్పుడ అనుపమ పరమేశ్వరన్ ట్రెండ్ కనిపిస్తుంది. వరుస సినిమాలతో తన జోరు కొనసాగిస్తుంది. ఇప్పటికే 'టిల్లు స్క్వేర్'తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు 'పరదా' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. 'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులతో చేస్తున్న సినిమా నుంచి తాజాగా4 టైటిల్ టీజర్ విడుదలైంది.ఆనంద మీడియా బ్యానర్పై విజయ్ డొంకాడ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా సరికొత్తగా అనిపిస్తుందని అనుపమ చెబుతుంది. ఇప్పటి వరకు ఎక్కడా చూడని కథతో వస్తున్నామని ఆమె చెప్పింది. మలయాళ నటి దర్శన రాజేంద్రన్తో పాటు సంగీత, రాగ్ మయూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాస్తవంగా ఈ ప్రాజెక్ట్లో సమంత నటించాల్సింది. కానీ ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో అనుపమకు ఈ ఛాన్స్ దక్కింది. -
'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాతల మోసం.. చీటింగ్ కేసు నమోదు
ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాలో బాగా వినిపించిన మలయాళం సినిమాల్లో 'మంజుమ్మల్ బాయ్స్' ఒకటి. రూ.20కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఏకంగా రూ.250 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో కూడా ఇదే పేరుతో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేశారు.ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. అయితే, తాజాగా ఈ చిత్ర నిర్మాతలపై కేసు నమోదైంది. ఎర్నాకుళం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాతలైన సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోనీ, బాబు షాహిర్ల మీద చీటింగ్ కేసు నమోదు చేశారు. కొద్దిరోజుల క్రితం ఆ నిర్మాతలు తనని మోసం చేశారంటూ సిరాజ్ వలియతార న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 'మంజుమ్మల్ బాయ్స్' సినిమా కోసం తాను రూ.7 కోట్లు పెట్టుబడిగా పెట్టానని సిరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో 40 శాతం వాటా తనకు ఇస్తామని చెప్పడంతోనే పెట్టుబడి పెట్టినట్లు సిరాజ్ చెబుతున్నాడు. సినిమా భారీ విజయం అందుకున్న తర్వాత తనకు టచ్లో లేకుండా పోయారని ఆయన వాపోయాడు. లాభాల సంగతి పక్కనపెడితే తాను పెట్టిన రూ. 7 కోట్ల మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వలేదని ఆయన తెలిపాడు. పూర్తి విచారణ తర్వాత 'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాతలపై కేసు నమోదు చేయాలని ఎర్నాకుళం కోర్టు ఆదేశించింది.2006లో జరిగిన వాస్తవ సంఘటనలను బేస్ చేసుకుని 'మంజుమ్మల్ బాయ్స్' చిత్రాన్ని చిదంబరం తెరకెక్కించారు. సౌబిన్ షాహిర్,శ్రీనాథ్ భాసి, గణపతి, ఖలీద్ రెహమాన్, జార్జ్ మరియన్ తదితరులు నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. -
ప్రముఖ దర్శకుడి ఇంట్లో దొంగతనం చేసిన సర్పంచ్ భర్త
మలయాళంలో ప్రముఖ దర్శకుడిగా జోషికి మంచి గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు ఆయన సుమారు 80కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన కుమారుడు అభిలాష్ కూడా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా ద్వారా డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఆయన నివాసంలో సుమారు కోటి రూపాయలు విలువ చేసే ఆభరణాలు చోరీ చేశారు. ఈ కేసులో నిందితుడు మహ్మద్ ఇర్ఫాన్ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శకుడి ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన ఇర్ఫాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను పోలీసులు వెళ్లడించారు. బిహార్కు చెందిన ఇర్ఫాన్ ఒక గ్రామ సర్పంచ్ భర్త అని పోలీసులు తెలిపారు. సీసీ టీవీ దృశ్యాల ద్వారా నిందితుడిని గుర్తించగా పరారీలో ఉన్న అతడిని కర్ణాటక పోలీసుల సాయంతో ఉడిపి జిల్లాలో అరెస్ట్ చేశారు. సీసీ టీవీలో రికార్డ్ అయిన వీడియోలో ఇర్ఫాన్ ఉపయోగించిన కారు నంబర్ క్లియర్గా కనిపించడంతో అతన్ని పట్టుకోవడం సులభం అయిందని కొచ్చి నగర పోలీసు కమిషనర్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఆ కారు వెనుక భాగంలో గ్రామ సర్పంచ్ అనే బోర్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఇర్ఫాన్ పక్కా ప్లాన్తో ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ ధనవంతుల నివాసాలే టార్గెట్ చేస్తున్నాడు. దొంగతనంలో భాగంగా డబ్బులు, నగలు దొంగిలించి బిహార్లోని పేద ప్రజలకు పంచుతున్నాడని సమాచారం.. ఈ విషయం నిజమేనా అని ఓ విలేకరి పోలీసులను ప్రశ్నించగా.. అందుకు సరైన సమాధానం వారి నుంచి రాలేదు. తమ దృష్టిలో ఇర్ఫాన్ ఓ నిందితుడంటూ పోలీసులు పేర్కొన్నారు. ఇర్ఫాన్పై ఆరు రాష్ట్రాల్లో 19 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతనెలలోనే జైలు నుంచి ఆయన విడుదలయ్యారని వారు తెలిపారు. ప్రస్తుతం ఇర్ఫాన్ నుంచి రూ. కోటీ 20 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నిందితుడు ఏప్రిల్ 20న కొచ్చికి వచ్చాడని తెలిపారు. నగరంలో విలాసవంతంగా ఉండే ప్రాంతాల గురించి ఆరా తీసి ప్లాన్ వేసినట్లు చెప్పారు. అయితే ఈ దొంగతనం జరిగినప్పుడు జోషీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ దొంగతనం తెల్లవారుజామున జరగడంతో వారు నిద్రలో ఉన్నట్లు సమాచారం. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నిర్మాత గాంధీమతి బాలన్ (66) కన్నుమూశారు. 1980ల్లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన ఆయన గాంధీమతి పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మలయాళంలో 'సుఖమో దేవి', 'పంచవడి పాలం' 'తూవనతుంబికల్', మూన్నం పక్కం, నంబరతి పూవు, సుఖమో దేవి, ఇదిరి నేరమ్ ఒతిరి కార్యం వంటి హిట్ చిత్రాలు నిర్మించారు. బాలన్ కేవలం ఇరవై ఏళ్ళ వయసులో నిర్మాతగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. మలయాళంలో నిర్మాతగా దాదాపు 33 చిత్రాలు నిర్మించారు. కొన్నేళ్ల క్రితం బాలన్ తన కుమార్తెతో కలిసి సైబర్-ఫోరెన్సిక్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. -
జానకిగా వచ్చేస్తున్న 'అనుపమ పరమేశ్వరన్'
'టిల్లు స్క్వేర్'తో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ నుంచి మరో కొత్త సినిమా రానుంది. మలయాళం సినిమా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ ద్వారా దాదాపు రెండేళ్ల విరామం అనంతరం మలయాళంలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది అనుపమ పరమేశ్వరన్. ‘టిల్లు స్క్వేర్’లో గ్లామర్ పాత్రలో అదరగొట్టిన అనుపమ ఇప్పుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో కనిపించనుంది. ఇందులో జానకిగా అనుపమ ప్రేక్షకుల ముందుకు రానుంది. లాయర్గా మలయాళ సీనియర్ నటుడు సురేశ్ గోపి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న అనుపమ దర్శకుడితో ఉన్న ఫొటోను తాజాగా తన ఇన్స్టాలో పంచుకుంది. 'నా తదుపరి చిత్రానికి డబ్బింగ్ పూర్తైంది' అంటూ అందులో రాసుకొచ్చింది. కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడే జానకి అనే యువతిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుండగా.. ఆమె తరఫున కేసును వాదించే లాయర్ పాత్రలో సురేష్ గోపి నటిస్తున్నాడు. మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో సురేష్ గోపి కుమారుడు మాధవ్ సురేష్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
- పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- నిట్టనిలువునా చీలిపోతున్న 127 ఏళ్ల కంపెనీ
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
Advertisement