-
మెహరీన్పై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పాలంటూ ఫైర్
‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’లో బోలెడంత సందడి చేశారు మెహరీన్. ఈ సినిమాతో ఆమెకు టాలీవుడ్లో భారీగా పాపులారిటీ దక్కింది. అయితే, కొద్దిరోజుల క్రితం మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఒక పోస్ట్ పెట్టారు.పిల్లలు అప్పుడే వద్దని భావించే తల్లి దండ్రులకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో కొందరు సెలబ్రటీలు కూడా పెళ్లి కాకుండానే తమ అండాలను భద్రపరుచుకుంటున్నారు. ఈ విధానాన్ని ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన యువతులే కాకుండా హీరోయిన్లు కూడా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో మెహరీన్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ను ఎంపిక చేసుకుంది. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది.అయితే, తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని మెహరీన్ ఫైర్ అయింది. ఈ అంశం గరించి తప్పుగా వార్తలను ప్రచురించిన వారు వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరింది. ' పలు మీడియా సంస్థల్లో పనిచేసే వారు వారి వృత్తి పట్ల చాలా గౌరవంగా ఉండాలి. ఇలాంటి అంశాలను అర్థం చేసుకుని వార్తలను అందించండి. ఎవరికితోచినట్లు వారు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో నేను పెట్టిన 'ఎగ్ ఫ్రీజింగ్' పోస్ట్పై కొందరు రకరకాల వార్తలు రాశారు. ఈ విధానంలో అమ్మాయిలు గర్భవతులు కావాల్సిన అవసరం లేదు. మొదట ఈ విషయాన్నిఅందరూ తెలుసుకోవాలి. నేను ఒక సెలబ్రిటీగా అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఆ పోస్ట్ పెట్టాను. పిల్లలు అప్పుడే వద్దని భావించే వారందరికీ ఎగ్ ఫ్రీజింగ్ ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటివి ఏమీ తెలుసుకోకుండా మీ స్వార్థం కోసం తప్పుడు వార్తలు రాశారు. నేను ప్రెగ్నెంట్ అని ప్రచారం చేశారు. ఇదీ చాలా తప్పుగా అనిపించలేదా..? ఇప్పటికైనా ఇలాంటి వార్తలకు ఫుల్స్టాప్ పెట్టిండి. మీ తప్పును తెలుసుకొని సరిచేసుకోండి లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వెంటనే నాపై పెట్టిన పోస్ట్లను తొలగించండి. ఆపై బహిరంగ క్షమాపణలు చెప్పండి.' అని మెహరీన్ కోరింది.'ఎగ్ ఫ్రీజింగ్' పద్ధతి ఎందుకు పాటిస్తున్నారంటే..?ఈ కాలంలో మహిళలు తమ కెరీర్, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా వ్యాపారం, సినిమా రంగలో ఉండే మహిళలు పెళ్లి, అమ్మతనాన్ని వాయిదా వేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. లైఫ్లో అనుకున్నంతగా సెటిల్ అయ్యాక పిల్లల్ని కంటాం అని ఇప్పటికే చాలామంది దంపతులు చెప్పారు కూడా.. ఆ కోవకు చెందిన వారు తీరా పిల్లల్ని కనాలనుకునే సరికి.. వయసు దాటి పోవడం, అండాల నిల్వ, నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. అలాంటి వారికి 'ఎగ్ ఫ్రీజింగ్' పద్ధతి ఒక వరం అని చెప్పవచ్చు. 30 ఏళ్ల వయసులోపు ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన తమ అండాల్ని ఇలా భద్రపరుచుకుంటారు. ఆపై వారికి నచ్చినప్పుడు పిల్లల్ని కంటారు. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
ఎగ్ ప్రీజింగ్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్
తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన మెహ్రీన్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేందుకు ప్లానే చేసేసింది. అదేనండి మొన్నీ మధ్య 'ఎగ్ ఫ్రీజింగ్' అని హీరోయిన్ మృణాల్ ఠాకుర్ చెప్పిందిగా. ఇప్పుడు దాన్ని మెహ్రీన్ చేసి చూపించేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలానే దీనికి గల కారణాల్ని కూడా చెప్పుకొచ్చింది.'ఎగ్ ఫ్రీజింగ్' అంటే ఏంటి?ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు పెళ్లి లేటుగా చేసుకుంటున్నారు. అయితే 30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువ. అందుకే చాలామంది హీరోయిన్లు.. వయసులో ఉన్నప్పుడే తమ ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరుచుకుని, కావాల్సినప్పుడు పిల్లల్ని కనే ప్లాన్ చేసుకుంటున్నారు. దీన్ని 'ఎగ్ ఫ్రీజింగ్' అంటారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు 'ఎగ్ ఫ్రీజింగ్' చేసుకోగా, ఇప్పుడా లిస్టులోకి మెహ్రీన్ చేరింది.(ఇదీ చదవండి: అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక)మెహ్రీన్ ఏమని చెప్పింది?'గత రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా. చివరకు ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఇది నా వ్యక్తిగత విషయం కదా దీన్ని అందరికి చెప్పాలా? వద్దా? అని ఆలోచించాను. కానీ నాలాంటి చాలామంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు. పెళ్లి, బిడ్డని కనే విషయంలో వాళ్లు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నేను మాత్రం భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమని భావించాను. దీని గురించి మనం పెద్దగా మాట్లాడట్లేదు. కానీ టెక్నాలజీ సాయంతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం''తల్లి కావడమనేది నా కల. కాకపోతే అది కొన్నేళ్లు ఆలస్యం కావొచ్చు. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్. ఆస్పత్రులంటే భయముండే నాలాంటి వాళ్లకు ఇది సవాలే. ఎందుకంటే ఇంజెక్షన్స్ కారణంగా ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారీ నేను కళ్లు తిరిగి పడిపోయేదాన్ని. ఇక ఎగ్ ఫ్రీజింగ్ మంచిదా కాదా అంటే.. కచ్చితంగా మంచిదే అని చెబుతాను. మీరు ఏం చేసినా సరే మీకోసం చేయండి. అలానే ఈ జర్నీలో నాకు అండగా ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ, మా అమ్మకు థ్యాంక్స్' అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?) -
Mehreen Pirzada: చాలా రోజుల తర్వాత గ్లామర్ ట్రీట్ ఇచ్చిన మెహరీన్ (ఫోటోలు)
-
Spark Review: 'స్పార్క్' సినిమా రివ్యూ
టైటిల్: స్పార్క్ నటీనటులు: విక్రాంత్, మెహరీన్, రుక్సార్ థిల్లాన్, నాజర్ తదితరులు నిర్మాత: విక్రాంత్ రచన-దర్శకత్వం-స్క్రీన్ప్లే: విక్రాంత్ సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ విడుదల తేది: 2023 నవంబర్ 17 (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) స్కార్క్ కథేంటంటే? లేఖ(మెహరీన్) కలలోకి ప్రతి రోజు ఓ వ్యక్తి వస్తుంటాడు. దీంతో ఆమె అతన్నే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. స్నేహితులతో కలిసి అతని కోసం వెతుకుతుంటుంది. ఓ ఆస్పత్రిలో అనుకోకుండా అతన్ని చూస్తుంది. అతనే ఆర్య(విక్రాంత్ రెడ్డి). లేఖ ఎదురింట్లోనే ఉంటాడు. అతన్ని ప్రేమలో పడేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆర్య మాత్రం లేఖ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే.. నగరంలో వరుసగా అమ్మాయిలు చనిపోతుంటారు. సడెన్గా సైకోలుగా మారి తమ కుటుంబ సభ్యులను చంపి, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఈ హత్యలకు కారణం ఆర్యనే అని లేఖ తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్) ఆరోపిస్తాడు. పోలీసులు కూడా అతని కోసం గాలిస్తుంటారు. అసలు సిటీలో జరుగుతున్న హత్యలకు కారణం ఎవరు? అమ్మాయిలు సడెన్గా సైకోలుగా ఎందుకు మారుతున్నారు? ఆర్యకు ఈ మర్డర్లతో ఉన్న సంబంధం ఏంటి? వైజాగ్కు చెందిన జై.. ఆర్యగా పేరు మార్చుకొని హైదరాబాద్కు ఎందుకు వెళ్లాడు? యువతుల మరణాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? జై ప్రియురాలు అనన్య(రుక్సార్ థిల్లాన్) ఎలా చనిపోయింది? ఈ మర్డర్లతో ఇండియన్ ఆర్మీలో పనిచేసే డాక్టర్ రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఇదో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. దానికి ట్రయాంగిల్ లవ్స్టోరీని జోడించారు. ఫస్టాఫ్లో ఒకపక్క హీరోహీరోయిన్లతో లవ్ట్రాక్ నడిపిస్తూనే.. మరోపక్క వరుస హత్యలు చూపిస్తూ ఆసక్తిని పెంచేశాడు దర్శకుడు. హత్యలకు సంబంధించిన సన్నివేశాలు భయంకరంగా ఉంటాయి. లవ్ట్రాక్ మాత్రం రొటీన్గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక అసలు కథ ద్వితీయార్థంలో మొదలవుతుంది. నాజర్,గురు సోమసుందరం పాత్రల ఎంట్రీ తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది. ఎదుటి మనిషిలోని మెదడును కంట్రోల్ చేసే ప్రయోగం సఫలం అయితే జరిగే అనార్థాలను గురించి ఇందులో చర్చించారు. హత్యలతో సంబంధం ఉన్నవారిని గుర్తించేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న కథ చాలా కొత్తది. పాన్ ఇండియా సబ్జెక్టు. ఇలాంటి భారీ కథకు స్టార్ హీరో అయితే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే? విక్రాంత్ కొత్తవాడే అయినా.. తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఒకవైపు దర్శకత్వ బాధ్యతలు చేపడుతూనే.. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఆర్య, జై పాత్రల్లో చక్కగా నటించాడు. కొన్ని చోట్ల నటనలో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. డ్యాన్స్ విషయంలో విక్రాంత్ ఇంకాస్త కసరత్తు చేయాల్సింది. లేఖ పాత్రలో మెహరిన్ ఒదిగిపోయింది. ఇక హీరో ప్రియురాలు అనన్యగా రుక్సార్ చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. విలన్గా గురు సోమసుందరం తనదైన నటనతో మెప్పించాడు. సుహాసినీ మణిరత్నం సరికొత్త పాత్రలో నటించింది. నాజర్, రాహుల్ రవీంద్ర, వెన్నెల కిశోర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. హేషం అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో ప్రతి సీన్ చాలా రిచ్గా కనిపిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) -
‘స్పార్క్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఈ సినిమాలో కూడా నా క్యారెక్టర్ అందరికి గుర్తుంటుంది..!
-
Mehreen Pirzada Birthday: మెహరీన్ బర్త్ డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ
-
అలా విమర్శించేవారికి కూడా అక్కా చెల్లెళ్లు ఉంటారు: హీరోయిన్
తమిళసినిమా: ఆడవారిని విమర్శలతో బాధించడం నీచమైన చర్యగా నటి మెహ్రిన్ పేర్కొంది. ఈ బ్యూటీ తెలుగులో నానీకి జంటగా కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంలో కథానాయకిగా పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. తమిళం, హిందీ భాషల్లోనూ కథానాయకిగా నటించిన మెహ్రిన్కి ఇప్పటికీ స్టార్ ఇమేజ్ రాలేదని చెప్పాలి. అంతేకాదు ప్రస్తుతం అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తమిళంలో నెంజిల్ తునివిరిందాల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ధనుష్కు జంటగా పటాస్, విజయ్ దేవరకొండ సరసన నోటా చిత్రాల్లో ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు రాలేదు. అలాంటిది ప్రస్తుతం స్పార్క్ అనే చిత్రంలో నటిస్తోంది. కాగా సినిమా అవకాశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ అమ్మడు కూడా వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సీరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మెహ్రిన్ బెడ్ రూమ్ సన్నివేశాల్లో హద్దు మీరి ఉందంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. అశ్లీల సన్నివేశాలలో బరితెగించి నటించింది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విమర్శలపై స్పందించిన మెహ్రిన్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సీరీస్లో చోటుచేసుకున్న మానభంగం సన్నివేశంలో అశ్లీలంగా నటించాలని తనపై విమర్శలు గుర్తిస్తున్నారని ఇది తనను ఎంతగానో బాధకు గురిచేస్తోందని పేర్కొంది. ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలనే ఆ వెబ్ సీరీస్లో చూపించినట్లు చెప్పింది అయితే తనను చాలా నీచంగా చిత్రీకరించి ట్రోలింగ్ చేయడం బాధిస్తోందని పేర్కొంది. విమర్శలు చేసే వారికి అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని ఆడవారిని బాధించడం వారిపై రాక్షసంగా ప్రవర్తించడం హేయమైన చర్య అనే భావనను మెహ్రిన్ వ్యక్తం చేసింది. Recently I made my OTT Debut in the web series, “Sultan of Delhi” on Disney Hotstar. I hope my fans have enjoyed watching the series. Sometimes scripts demand certain actions which might go against your own morals. As a professional actor who considers acting an art and at the… — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) October 17, 2023 -
అది శృంగార సీన్ ఎలా అవుతుంది?.. మండిపడ్డ మెహ్రీన్
కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మెహ్రీన్ పీర్జాదా. తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ టాలీవుడ్ స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించింది. గతేడాది ఎఫ్3 సినిమాతో ప్రేక్షకులను అలరించిన మెహ్రీన్.. ఈ ఏడాదిలో ఓటీటీలోనూ అరంగేట్రం చేసింది. ఇటీవలే ఆమె నటించిన సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. అయితే ఈ సిరీస్లో ఆమె ఓ అత్యాచార సన్నివేశంలో నటించింది. అయితే ఈ సీన్ ప్రస్తుతం వివాదానికి దారితీసింది. ఆ సన్నివేశాన్ని కొందరు శృంగార సీన్గా అభివర్ణించడంపై మెహ్రీన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా రాయడం తనకు తీవ్ర బాధ కలిగించిందని ట్వీట్ ద్వారా వెల్లడించింది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!) మెహ్రీన్ ట్వీట్లో రాస్తూ.. 'ఢిల్లీ సుల్తాన్లో వైవాహిక అత్యాచారాన్ని చిత్రీకరించే ఓ సన్నివేశం ఉంది. మనదేశంలో ఇది తీవ్రమైన సమస్య. ఇలాంటి సమస్యను మీడియాలో చాలా మంది శృంగార సీన్గా అభివర్ణించడం నాకు బాధ కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలకు ఇది తీవ్రమైన సమస్య. ఈ విషయాన్ని ఇలా చెప్పడం సమస్యను చిన్నదిగా చూపించినట్లు అవుతుంది. సోషల్ మీడియాలోని వ్యక్తులు ఇలా చేయడం నన్ను కలవరపెడుతోంది. ఇలాంటి వారు తమకు సోదరీమణులు, కుమార్తెలు కూడా ఉన్నారన్న విషయం అర్థం చేసుకోవాలి. వారు తమ నిజ జీవితంలో అలాంటి బాధను ఎప్పటికీ ఎదుర్కోవద్దని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. మహిళలపై ఇలాంటి క్రూరత్వం, హింస అనే ఆలోచన చాలా అసహ్యకరమైనది.' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా నటుడిగా ఆ పాత్రకు న్యాయం చేయడం నా పని అని తెెలిపింది. మిలన్ లుథ్రియా సర్ నేతృత్వంలోని సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ బృందం చాలా కష్టతరమైన సన్నివేశాల షూటింగ్ సమయంలో నటులుగా మేం చాలా ప్రొఫెషనల్గా ఉన్నామని పేర్కొంది. నేను చేసే పాత్ర మహాలక్ష్మి అయినా, సంజన అయినా, హనీ అయినా నా ఫ్యాన్స్ కోసం ప్రతి పాత్రలోనూ ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది. (ఇది చదవండి: అలాంటి పాత్రల్లో నటించను.. అదే నా కోరిక : మృణాల్ ఠాకూర్) Recently I made my OTT Debut in the web series, “Sultan of Delhi” on Disney Hotstar. I hope my fans have enjoyed watching the series. Sometimes scripts demand certain actions which might go against your own morals. As a professional actor who considers acting an art and at the… — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) October 17, 2023 -
నా మూడేళ్ల కల స్పార్క్
విక్రాంత్ హీరోగా పరిచయం అవుతూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం నవంబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో విక్రాంత్ మాట్లాడుతూ – ‘‘నాకు సినిమాలంటే ఇష్టం. అమెరికాలో జాబ్ చేస్తున్న క్రమంలో సంపాదనలో పడి కలను మర్చిపోకూడదని ఈ సినిమా తీశాను. ఏడాదిన్నర పాటు ‘స్పార్క్’ కథ రాసుకుని, కష్టపడి మరో ఏడాదిన్నర పాటు ఈ సినిమాను నిర్మించాం. ‘స్పార్క్’ నా మూడేళ్ల కల. యాక్షన్, థ్రిల్, లవ్, కామెడీ, డ్రామా.. అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. యూనివర్సల్ అప్పీల్ ఉన్న మల్టీజానర్ ఫిల్మ్ ఇది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు తమిళ నటుడు గురు సోమసుందరం. ‘‘టైటిల్కు తగ్గట్లే మా సినిమా ‘స్పార్క్’లా ఉంటుంది’’ అన్నారు మెహరీన్. ‘‘ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్. -
Mehreen Pirzada: తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న మెహరీన్ (ఫోటోలు)
-
బక్కచిక్కిన లుక్ లో మెహరీన్ తిట్టిపోస్తున్న నెటిజన్లు
-
షాకింగ్ లుక్లో హీరోయిన్ మెహ్రీన్
-
హీరోయిన్ మెహ్రీన్కు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి?
ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ఉన్నా అందం కూడా అంతే ముఖ్యం. అందుకే హీరో,హీరోయిన్లు ఫిట్నెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జిమ్లో గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తూ అందాన్ని కాపాడుకుంటారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఒకప్పుడు బొద్దుగా మెస్మరైజ్ చేసే బ్యూటీలు ఇప్పుడు జీరో సైజే సో బెటర్ అంటున్నారు. చదవండి: కమెడియన్ మనోబాల మృతికి కారణం ఇదేనా?.. ఆ వ్యసనం వల్లేనా? తాజాగా ఈ లిస్ట్లో మెహ్రీన్ కూడా చేరింది. ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ బ్యూటీ ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన మెహ్రీన్ ఈ మధ్యకాలంలో బాగా సన్నబడింది. వర్కవుట్స్, డైట్ పాటిస్తూ జీరో సైజ్కి వచ్చేసింది. లేటెస్ట్గా తన లుక్కి సంబంధించిన ఫోటోలను మెహ్రీన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసి.. మెహ్రీన్కు ఏమైంది ఇంత సన్నబడింది? అయినా ఒకప్పటిలా బొద్దుగా ఉంటేనే బాగుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: గొప్పమనసు చాటుకున్న నిర్మాత.. లైట్మన్ కుటుంబానికి ఆర్థికసాయం -
జహీరాబాద్ : షాపింగ్ మాల్లో హనీరోజ్, మెహ్రీన్ సందడి (ఫొటోలు)
-
హీరోయిన్ ముఖం నిండా సూదులు, ఏమైంది?
కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది మెహరీన్ పిర్జాదా. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ఇటీవలే ఎఫ్ 3తో ప్రేక్షకులను అలరించిన మెహరీన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేయగా అది కాస్తా నెట్టింట వైరల్గా మారింది. ఇందులో మెహరీన్ ముఖమంతా సూదులతో గుచ్చి ఉంది. ఇది చూసిన మెహరీన్ ఫ్యాన్స్ ముఖానికి సూదులు గుచ్చుకోవడమేంటని కంగారుపడుతున్నారు. అయితే తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసమే ఇలా చేసింది మెహరీన్. తను ఆక్యుస్కిన్లఫ్ట్ అనే థెరపీ చేయించుకుంది. ఈ థెరపీ చేసి నా ముఖాన్ని మరింత కాంతివంతంగా మార్చిన వైద్యుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) చదవండి: జిన్నా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది తుప్పాస్ పని చేశా, అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది: గీతూ -
నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్
ఓ పక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటారు హీరోయిన్లు. సినిమా విశేషాలు, వ్యక్తిగత విషయాలు, విహార యాత్రలకు సంబంధించిన పోస్టులు, వీడియోలు పెడుతూ అభిమానులను, ఫాలోవర్స్ను ఎంటర్టైన్ చేస్తుంటారు. అంతేకాకుండా ఈ పోస్టులతో మూవీ ప్రమోషన్స్ చేస్తూ కొత్త ఫాలోవర్స్, సినిమా అవకాశాలను ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ తను పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. 'ఎఫ్3'తో సక్సెస్ జోష్లో ఉన్న బ్యూటిఫుల్ మెహ్రీన్ పిర్జాదా. ఇటీవల తన దగ్గరి బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గోంది హీరోయిన్ మెహ్రీన్. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో నిర్వహించిన బారాత్లో నడిరోడ్డుపై స్టెప్పులేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. మరో అమ్మాయితో కలిసి తీన్మార్ ఉత్సాహంగా చిందులేసింది. పెళ్లి బరాత్ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది మెహ్రీన్. ఈ పోస్ట్కు 'పంజాబీ వెడ్డింగ్ సీన్స్' అనే క్యాప్షన్స్ ఇవ్వగా.. ఈ వీడియో అతి కొద్ది సమయంలోనే వైరల్గా మారింది. కాగా 'కృష్ణగాడి వీర ప్రేమకథ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ పంజాబీ భామ. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
హైదరాబాద్లో ప్రారంభమైన మెహరీన్ స్పార్క్ మూవీ
విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘స్పార్క్’. మెహరీన్ హీరోయిన్. సినిమాటోగ్రాఫర్ అరవింద్ కుమార్ రవివర్మ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, దర్శకుడు సురేందర్ రెడ్డి, కెమెరామేన్ రత్నవేలు, నిర్మాత అన్వేష్ రెడ్డి, పారిశ్రామికవేత్త రామరాజు పాల్గొన్నారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఈ చిత్రం రూపొందుతోంది. రత్నవేలు దగ్గర అసోసియేట్ సినిమాటోగ్రాఫర్గా చేశారు అరవింద్. దర్శకులు శంకర్, సుకుమార్గార్ల దగ్గర దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
నా కెరీర్లో బెస్ట్ పాత్ర ఇదే!: మెహరీన్
‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’లో బోలెడంత సందడి చేశారు మెహరీన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్కి జోడీగా మెహరీన్ నటించిన విషయం తెలిసిందే. ఇదే కాంబినేషన్లో ఈ చిత్రానికి సీక్వెల్గా ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన చిత్రం ‘ఎఫ్ 3’. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. కాగా ‘ఎఫ్ 2’లో అల్లరి, అమాయకత్వం నిండిన హనీ పాత్రలో కనిపించిన మెహరీన్ ‘ఎఫ్ 3’లో ఈ రెండు షేడ్స్తో పాటు పరిణతి చెందిన అమ్మాయిలానూ కనిపించనున్నారు. ‘‘మెహరీన్ క్యారెక్టర్ మెచ్యూర్డ్గా డిఫరెంట్ లేయర్స్తో ఉంటుంది. అలాగే పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని చిత్రబృందం తెలిపింది. ‘‘నా కెరీర్లో ఇది బెస్ట్ ఎంటర్టైనింగ్ రోల్’’ అని మెహరీన్ అన్నారు. సోనాల్ చౌహాన్ ఓ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే పార్టీ సాంగ్లో నటించారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి. చదవండి: మందు తాగుతూ పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టాడు -
'రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోతుంటాయి'.. హీరోయిన్ ఎమోషనల్
Heroine Mehreen Pirzada Opens Up About Troubles In Film Industry: ‘సినిమా ఆర్టిస్టుల జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి’ అంటున్నారు హీరోయిన్ మెహరీన్. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ పోస్ట్ చేశారు. ‘‘మేము (ఆర్టిస్టులను ఉద్దేశిస్తూ) అన్నీ తెలిసే అనిశ్చితితో కూడిన జీవితాన్ని ఎంచుకుంటాం. జీవితానికి ఓ గ్యారంటీ ఉండదు. కొన్నిసార్లు సినిమాల్లోని మా పాత్రల లుక్స్ కోసం శారీరకంగా కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. షూటింగ్ షెడ్యూల్స్కు తగ్గట్లుగా మా జీవనశైలిలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చోటుచేసుకుంటుంటాయి. ఇది మా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చలికాలం, వర్షాకాలం, వేసవి.. అనే తేడాలు చూడకుండా సినిమాల కోసం పని చేస్తుంటాం. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇది చాలా బాధగా ఉంటుంది. మా జీవితాల్లోనూ ఎత్తు పల్లాలు ఉంటాయి. కెరీర్లో ఓ అద్భుతమైన విజయం దక్కిందనుకునేలోపే మరో వైఫల్యం వస్తుంది. ఒక్కోసారి రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోతుంటాయి(సినిమా హిట్ అండ్ ఫెయిల్యూర్లను ఉద్దేశిస్తూ). ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సినిమాను ఓ కళారూపంగానే గౌరవిస్తాను’’ అన్నారు. కాగా తెలుగులో మెహరీన్ ఓ హీరోయిన్గా నటించిన ‘ఎఫ్ 3’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
నాగ్ సరసన మెహరీన్
నాగార్జునకు జోడీగా మెహరీన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ మూవీ ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్గా కనిపిస్తారు నాగార్జున. ఈ చిత్రంలో హీరోయిన్గా ఫస్ట్ కాజల్ అగర్వాల్ను ఎంపిక చేశారు. కానీ వ్యక్తిగత కారణాలతో కాజల్ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో అమలా పాల్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఫైనల్గా మెహరీన్ ఈ చిత్రంలో హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు సమాచారం. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కాగా మెహరీన్ ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్ 3’, కన్నడంలో శివరాజ్కుమార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. -
ఓసీడీ ఉంది..ఎప్పటి నుంచో అవి వాడుతున్నా: హీరోయిన్
Mehreen Reveals About Her Real Life Ocd Disease: 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన మెహ్రీన్ ఇటీవలె 'మంచి రోజులు వచ్చాయి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మెహ్రీన్..పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకుంది. మహానుభావుడు సినిమాలో హీరో శర్వానంద్కు ఓసీడీ ఉంటుంది. అయితే తనకు రియల్ లైఫ్లో అంతకన్నా ఎక్కువ ఓసీడీ ఉందని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.చదవండి: విడాకులపై ఫోటోతో క్లారిటీ ఇచ్చిన ప్రియమణి కరోనా వచ్చిన తర్వాత అంతా శానిటైజర్లు వాడుతున్నారు. కానీ నాకు చాలా ఏళ్లుగా శానిటైజర్లు అలవాటు. అప్పట్లో నా బ్యాగ్ లో 2-3 శానిటైజర్ బాటిళ్లు ఉండేవి. ఇప్పుడు 6-7 ఉంటున్నాయి. నా మేకప్ స్టాఫ్ అయితే చేతులు చేతులు కడుక్కొని, శానిటైజర్ రాసుకున్న తర్వాత నా ఫేస్ టచ్ చేయాలి. మొదటి నుంచి నాకు ఈ ఓసీడీ ఉందని చెప్పుకొచ్చింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. చదవండి: ప్రియుడితో కలిసి దీపావళి చేసుకున్న స్టార్ హీరో కూతురు రీసెంట్గానే బ్రేకప్ అయ్యింది.. బాధలో ఉన్నా: విజయ్ దేవరకొండ -
‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ రివ్యూ
టైటిల్ : మంచి రోజులు వచ్చాయి నటీనటులు : సంతోష్ శోభన్, మెహరీన్, అజయ్ ఘోష్, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు నిర్మాణ సంస్థ : యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ నిర్మాత : ఎస్కేఎన్ దర్శకత్వం : మారుతి సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్ విడుదల తేది : నవంబర్ 4, 2021 Manchi Rojulu Vachayi Review: ఒకవైపు పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో తనకు నచ్చిన కాన్సెప్ట్తో చిన్న చిన్న సినిమాలు తీస్తుంటాడు దర్శకుడు మారుతి. అలా ఆయన తెరకెక్కించిన మరో చిన్న చిత్రమే ‘మంచి రోజులు వచ్చాయి’.దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అతి భయస్తుడైన తిరుమలశెట్టి గోపాల్ అలియాస్ గుండు గోపాల్(అజయ్ ఘోష్)కి కూతురు పద్మ తిరుమల శెట్టి అలియాస్ పద్దు(మెహ్రీన్ ఫిర్జాదా) అంటే ప్రాణం. తన కూతురు అందరి ఆడపిల్లలా కాదని, చాలా పద్దతిగా ఉంటుందని భావిస్తాడు. అయితే పద్దు మాత్రం బెంగళూరు సాఫ్ట్వేర్గా పనిచేస్తూ.. సహోద్యోగి సంతోష్(సంతోష్ శోభన్)తో ప్రేమలో పడుతుంది. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సంతోషంగా ఉండే గోపాల్ని చూసి అసూయ పడిన పక్కింటి వ్యక్తులు పాలసీ మూర్తి, కోటేశ్వరరావు.. ఆయనలో లేనిపోని భయాలను నింపుతారు. కూతురు ప్రేమ విషయంలో లేనిపోని అనుమానాలను నింపుతారు. దీంతో గోపాలం కూతురి విషయంలో ఆందోళన చెందడం మొదలుపెడతాడు. ఎలాగైన కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఈ క్రమంలో గోపాల్కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ప్రియురాలు పద్దు ప్రేమను దక్కించుకోవడానికి సంతోష్ చేసిన ప్రయత్నాలు ఏంటి? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? ఈ సినిమాకు ప్రధాన బలం అజయ్ ఘోష్ పాత్రే. గుండు గోపాల్గా అజయ్ అదరగొట్టేశాడు. కథ మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది. అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా తనదైన కామెడీ యాక్టింగ్తో నవ్వించాడు. పద్దుగా మెహ్రీన్, సంతోష్గా సంతోష్ శోభన్ పాత్రల్లో పెద్దగా వైవిద్యం కనిపించదు కానీ.. వారిమధ్య మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. పాలసీ మూర్తిగా శ్రీనివాసరావు అద్భుత నటనను కనబరిచాడు. వెన్నెల కిశోర్, ప్రవీణ్, వైవా హర్ష, సప్తగిరి, రజిత తదితరులు తమ పాత్రల మేరకు నటించారు. ఎలా ఉందంటే.. మారుతి సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కంటనీరు పట్టిస్తున్నాడు. ‘మంచి రోజులు వచ్చాయి’కూడా అలాంటి చిత్రమే. ‘భయం’అనే అంశాన్ని తీసుకొని ఎప్పటిలానే ఎమోషన్స్ జోడిస్తూ హాస్యంతో కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీనికోసం కరోనా పరిస్థితును కూడా వాడుకున్నాడు. ఫస్టాఫ్ అంతా మారుతి మార్క్ కామెడీ, పంచులతో సరదాగా గడిచిపోతుంది. డాక్టర్గా వెన్నెల కిశోర్ ఫ్రస్ట్రేషన్, సప్తగిరి అంబులెన్స్ సీన్స్, అప్పడాల విజయలక్ష్మీ ఫోన్ కాల్ సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్లో కరోనా పరిస్థితుల సన్నీవేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండా రొటీన్గా సాగుతుంది. క్లైమాక్స్ కూడా సింపుల్గా ఊహకందే విధంగా ఉంటుంది. క్లైమాక్స్లో భయం గురించి సాగిన చర్చ ఆలోచింపజేసేదిగా ఉంటుఉంది. ఇక సాంకెతిక విభాగానికి వస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతం అందించాడు. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
గ్లామర్ ఒలకబోస్తోన్న ఎఫ్ 3 భామ..మెహ్రీన్ కౌర్ ఫొటోలు..
-
‘మంచి రోజులోచ్చాయి’ ట్రైలర్ వచ్చేసింది
మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. కామెడీ, ఎంటర్టైన్మెంట్తో రూపొందుతోన్న ఈ మూవీ ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, టీజర్లు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 4వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ‘మై వాట్సాప్ అంకుల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్.. నా పేరు సంతోష్.. ఆనందానికి కేరాఫ్ అడ్రెస్.. వీడు అనేది నా ట్యాగ్లైన్’ అంటూ సంతోష్ శోభన్ తనను తాను పరిచయం చేసే సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది. ఇక ‘నా కూతురు లాంటి కూతురిని కన్న ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాల్సిందే.. అంటూ అశిష్ ఘోష్ మెహ్రీన్ గురించి చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా ఎస్కేఎన్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అశిష్ ఘోష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
తారక్ అభిమానుల మంచి మనసు.. 'రా ఎన్టీఆర్ 2.0' టీమ్ రక్తదానం
నా ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
సెంటరాఫ్ అట్రాక్షన్గా ఉండాలనే తపన ..!
14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’
ఎస్బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?
నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!
క్లాసెన్ మాస్ క్యాచ్.. బ్యాటర్ మైండ్బ్లాంక్! వీడియో
ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్!.. శుభవార్త చెప్పిన కంపెనీ
తప్పక చదవండి
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement