-
వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
చేతకాని సన్నాసులు.. సీఎం జగన్పై దాడి.. నందిగామ సురేష్ స్ట్రాంగ్ వార్నింగ్
-
దళితులు, డ్రైవర్లంటే అంత చిన్నచూపా చంద్రబాబూ?
సాక్షి, తాడేపల్లి: దళితులు వేలిముద్రగాళ్లని, డ్రైవర్లంటూ ఎగతాళి చేసిన చంద్రబాబుకు రాజకీయ సమాధి కడతామని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అహంకారానికి దళిత, బీసీ, మైనార్టీలు, డ్రైవర్లు తగిన బుద్ధి చెబుతారన్నారు. ‘‘చంద్రబాబు రక్తంలోనే కులపిచ్చి ఉంది. అందుకే, దళితుల్ని పదేపదే అవమానిస్తున్నాడు. దళితుల్లోఎవరైనా పుట్టాలని కోరుకుంటారా.? అని నాడు అవమానించాడు. సీఎం జగన్ నేడు ఎస్సీ వ్యక్తికి ఎమ్మెల్యే సీటిస్తే వేలిముద్రగాళ్లకూ సీట్లంటూ ఎగతాళి చేస్తున్నాడు. పేదోడి పట్ల ప్రేమ చూపే జగన్ మళ్లీ సీఎం అవుతారు’’ ఎంపీ సురేష్ అన్నారు. నందిగం సురేష్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. దళితుల పట్ల మరోసారి చంద్రబాబు అహంకారం: రాజకీయాల్లో సుదీర్ఘకాలం అనుభవమున్న నాయకుడిగా చెప్పుకునే నారా చంద్రబాబు ఎస్సీల పట్ల తనకున్న భావాన్ని మరొక్కసారి బయటపెట్టుకున్నాడు. ఇవాళ ఆయన ఒక మీటింగ్లో ఒక ఎస్సీ నాయకుడి గురించి ఏం మాట్లాడారో అందరం చూశాం. అదే విషయాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. (శింగనమల వైఎస్సార్సీపీ అభ్యర్థి గురించి చంద్రబాబు ఏమన్నారో.. ఆయన వ్యాఖ్యల వీడియోను ప్లే చేసి చూపారు) ఎస్సీలను ఉద్దేశించి ఇదే చంద్రబాబు గతంలో ఏమన్నారు..? ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారంటూ ఎస్సీలను తీవ్రంగా అవమానించా డు. ఇవాళేమో.. ఎడమచేత్తో వేలిముద్ర వేసేవాళ్లు టిప్పర్ డ్రైవర్లంటూ ఎస్సీ నాయకుడి గురించి ఎగతాళిగా మాట్లాడాడు. చంద్రబాబు అనే వ్యక్తి నీచ సంస్కృతి కలిగిన వాడనేందుకు ఇంతకన్నా వేరే నిదర్శనమేదీ లేదు. ఏంటి .. ఆయన అహంకారం..? ఎస్సీలు రాజకీయ నాయకులుగా ఎదగకూడదని ఆయన భావించడం చాలా బాధాకరం. బాబు రక్తంలోనే కులపిచ్చి: గతం నుంచి ఇప్పటిదాకా చూస్తే చంద్రబాబుకు కులపిచ్చి కొనసాగుతూనే ఉంది. అది ఇక ఎప్పటికీ ఆయన్నుంచి పోయేది కాదు. ఎందుకంటే, కుల పిచ్చి అనేది ఆయన రక్తంలోనే ఇమిడిపోయి ఉంది. సామాన్యుడైన ఒక దళితుడు టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తుంటే.. ఆ పేదవాడిని వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించి పిలిచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటిస్తే.. చంద్రబాబుకు మాత్రం ఆ దళితుడి పట్ల అంత చిన్నచూపా..? జగన్ గారి నిర్ణయం పట్ల మీకెందుకంత చులకన భావం..? అంటే, నీ దృష్టిలో దళితులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పనికిరారా..? నీ జీవితంలో ఎన్ని సార్లు దళితులను అదేపనిగా అవమానిస్తావు..? దళితులు.. డ్రైవర్లంటే అంత చిన్నచూపా..?: దళితులకు రాజకీయ పదవులొస్తే నీకెందుకు అంత కడుపుమంట? డ్రైవర్ల పట్ల మీకెందుకంత చిన్నచూపు..? టిప్పర్డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు దేనికీ పనికిరారనట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. మరి, రాష్ట్రంలో ఆటోడ్రైవర్లుగా.. టిప్పర్ డ్రైవర్లుగా లక్షల మంది పనిచేస్తున్నారు. ఆఖరికి, చంద్రబాబుకు, లోకేశ్కు, ఆయన కోడలి కార్లు నడుపుతున్నవారంతా డ్రైవర్ల వ్యవస్థ నుంచి వచ్చినవారే కదా..? వాళ్లు లేకపోతే.. రాష్ట్రంలో కొన్ని వ్యవస్థలకు ఒక్క పూట గడవదనే సంగతి అందరికీ తెలుసు. ఆర్టీసీ గానీ.. ఇతర ట్రాన్స్పోర్టు వ్యవస్థలైనా ప్రతీరోజూ డ్రైవర్ల మీద ఆధారపడే ముందుకు నడుస్తూ ఉన్నాయి. అంతటి గొప్పదిగా డ్రైవర్ల వ్యవస్థను మనమంతా గుర్తించాల్సిందే. అలాంటి గొప్ప డ్రైవర్లను పట్టుకుని.. అందునా ఒక దళిత నాయకుడ్ని ఎడమచేత్తో వేలిముద్ర వేసేవాళ్లంటూ చంద్రబాబు ఎగతాళి చేస్తున్నాడు. నీకులాగ వెన్నుపోట్లు, మోసాలు మాకు తెలియవు: చంద్రబాబు ఒక సంగతి గుర్తించాలి. నీకులాగా మోసాలు చేయడం, వెన్నుపోటు పొడవడమనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులకో.. డ్రైవర్ల వ్యవస్థలో పనిచేసేవారికో ఎవరికీ తెలియదు. నీలాంటి నీచ సంస్కృతికి మేం ఆమడదూరంలో ఉంటాం. నీకులాగా తిరుపతిలో జేబులు కొట్టి బతకడం మావల్ల కాలేదు. నమ్మినోడిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకుని సొంత తమ్ముడ్ని ఇంట్లో కట్టేసి చిత్రహింసలు పెట్టే కిరాతకులం మేం కాదు. వెన్నుపోట్లు, మోసాలు నీ పేటెంట్ హక్కులని అందరికీ తెలుసు. నీ కులంలో పుట్టిన నీ తండ్రే గొప్పోడా..?: చంద్రబాబూ.. నిన్నొక ప్రశ్న అడుగుతున్నాను. నీ తండ్రి ఏం చేశాడు..? అమెరికాలో పెద్ద కార్పొరేట్ కంపెనీ వ్యవస్థ నడపలేదు కదా..? చిన్న రైతుగా వ్యవసాయం చేసినోడే కదా..? మరి, అతను వేలిముద్రతో పుట్టలేదా..? మరి, నీ కులంలో పుట్టినోడు గొప్పోడు ఎలా అయ్యాడు..? మా ఎస్సీల్లోనో.. ఎస్టీల్లోనే పుట్టినవాడు వేలిముద్ర వేసే వ్యక్తిగా ఎలా తక్కువయ్యాడో నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరముంది. రెండెకరాలతో రాజకీయంలోకి వచ్చినోడివి ఇవాల్టికి రూ.6 లక్షల కోట్లు ఎలా సంపాదించావు...? నీ బతుకే 420 బతుకుని గూగుల్లో కొట్టినా తెలుస్తోంది. నీ కంచంలో కూడు లాక్కోలేదుగా? ఎవరో పెట్టిన రాజకీయ పార్టీని వెన్నుపోటుతో లాగేసుకోవడం.. ఎవరో డబ్బు పెడితే నీ కొడుకును విదేశాల్లో చదివించుకోవడం.. మోసాలు, దగాలు చేసి మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికార పీఠం ఎక్కడం.. వంటి నీచసంస్కృతి ఏనాడూ మా దళితుకు తెలియవు. మా రక్తంలో కూడా అలాంటి తప్పుడు ఆలోచనలు ఉండవు. మా జీవితాలను మొదట్నుంచి నువ్వు ఎక్కిరిస్తూనే ఉన్నావు. ఏనాడైనా.. చీమూనెత్తురు ఉన్నోడైతే, మాపట్ల గౌరవం మర్యాదగా మసలుకుంటాడని ఆశిస్తే.. అవేమీ లేనోడిగా బతుకుతున్న నీచపు కుక్క ఈ చంద్రబాబు. నీ కంచంలో కూడు మేం ఏమైనా లాక్కున్నామా..? టిప్పర్ డ్రైవర్గా పనిచేసినా.. వేలిముద్ర వేసేవాడైనా మా ఎస్సీ అభ్యర్థి తన కష్టంతో తన కూడు తాను తింటున్నాడు తప్ప.. నీకులాగా ఇతరుల కూడును లాక్కుని తినడం లేదు. నీ దగ్గర పనిచేసే కొండల్రెడ్డి అనే డ్రైవర్ ఎందుకు చనిపోయాడో.. ఎలా చనిపోయాడో సమాధానం అడిగితే చెప్పలేని వ్యక్తి ఈ చంద్రబాబు. మాకు తెలిసిందల్లా నీతిగా బతకడమే: రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులేసి నీకులాగా పదవుల్ని ఆక్రమించుకోవడం మాకు తెలియదు చంద్రబాబూ.. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తెలిసిందల్లా నీతిగా బతకడమే. కాయాకష్టం చేసుకుని పనిచేసే దగ్గర పని ఇచ్చిన వ్యక్తి దగ్గర నమ్మకంగా ఉండటమే మాకు తెలుసు. నీలాంటి నీచ సంస్కృతిని నీ కొడుకు లోకేశ్కు నేర్పుకున్నావేమో.. అతను కూడా నిన్నేం మించిపోడు. లోకేశ్ అనే వ్యక్తి ఒక హాఫ్నాలెడ్జ్ ఫెలో.. నువ్వు నేర్పిన బుద్ధులతోనే మాట్లాడుతాడు గానీ.. మా తల్లిదండ్రులు మాత్రం అలాంటి వాటిని మాకు నేర్పలేదు. నువ్వు కించపరిచినోళ్లే..నిన్ను నిలదీస్తారు చూడు: నందమూరి కుటుంబాన్ని చేతిలో బొమ్మల్లాగా ఆడిస్తూ తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకుని ఇన్నాళ్లూ దళిత, బీసీ, మైనార్టీల సొమ్ముతో బాగుపడ్డావు. అధికారం తలకెక్కి నీ వాపును బలుపనుకుంటున్నావు. ఇన్నాళ్లకు నీకు దళితులు, డ్రైవర్లు వేలిముద్రగాళ్లుగా కనిపిస్తున్నారేమో.. రేపటికి.. అదే వేలిముద్రగాళ్లు నాయకులుగా అసెంబ్లీలోనో.. మరెక్కడ్నో.. నిన్ను నిలదీసే పరిస్థితి వస్తుంది చూసుకో.. ఇవాళ, ఎంత అహంకారంతో మాట్లాడుతున్నావో.. వాటన్నింటికీ, నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పుకునే రోజు వస్తుందని రాసిపెట్టుకో చంద్రబాబు. పేదోడి పట్ల జగన్ ప్రేమ అది: ఇదే అమరావతి ప్రాంతంలో ఒక సామాన్య ఎస్సీ కార్యకర్తను నువ్వు కించపరిస్తే.. మా నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు మాత్రం అదే వ్యక్తిని ఎంపీని చేశారు. ఆ వ్యక్తే నందిగం సురేష్ అనే నేను. పేదోడి పట్ల శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రేమ అది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పేద కుటుంబాల్లో పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి ఉన్నతమైన ఉద్యోగాల్లో నిలబెట్టాలని సంకల్పించి పనిచేస్తున్నారు మా నాయకుడు సీఎం జగన్ ఆయనకు కులాలు, మతాలతో సంబంధం లేదు. ఏనాడూ ఆయన మమ్మల్ని చులకనగా చూడలేదు. చిన్నబుచ్చినట్లు ఎక్కడా పల్లెతు మాటా అనలేదు. అలాంటి గొప్ప నేతల పక్కన దళితులు, బీసీలు, మైనార్టీలు ఉంటారు. నీ బతుక్కి నీ హయాంలో ఏనాడైనా పేదోడి పిల్లోడు ఐక్యరాజ్యసమితికి వెళ్లి ఆ వేదికపై మాట్లాడిన సందర్భం ఉందా..? అదే మా జగనన్న గడచిన నాలుగున్నరేళ్లల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని కాపాడారు. కాబట్టే.. ఆయన్ను జీవితాంతం మా వర్గాలు గుండెల్లో గుడి కట్టుకుని దేవుడిలా పూజిస్తాయి. రేపటి ఎన్నికల్లో మేమంతా ఆయన్నే మరోమారు సీఎంగా చూసుకుంటాం. ఇది తథ్యం. నీ రాజకీయ సమాధి మా చేతుల్లో ఖాయం: ఒకటికి పలుమార్లు మమ్మల్ని చులకన భావంతో మాట్లాడుతుంటే.. నీకు రాజకీయ సమాధి కట్టాలని దళితులంతా పూనుకుంటుంటే.. నీలో మా పట్ల రోజురోజుకూ అక్కసు పెరుగుతోంది. ఇది మేం గ్రహించాం. ఆయన అహంకారానికి భవిష్యత్తులో తప్పకుండా మేం సమాధానమిస్తాం. రేపటి ఎన్నికల్లో చంద్రబాబుకు శాశ్వత రాజకీయ సమాధి ఖాయమని చెబుతున్నాం. టీడీపీలో ఉన్న దళిత నాయకులు కూడా చంద్రబాబు అహంకార ధోరణిని గ్రహించి ఆయన్ను నిలదీయాలని కోరుతున్నాను. -
చంద్రబాబు,పవన్ ను ఏకిపారేసిన నందిగం సురేష్
-
ఇదే నాకు ఎక్కువ ఆనందాన్ని కలిగించింది : నందిగం సురేష్
-
నాతో అభ్యర్థుల ప్రకటన..కన్నీళ్లు పెట్టుకున్న నందిగాం సురేష్
-
చంద్రబాబుకు మాస్ సవాళ్లు విసిరిన నందిగామ సురేష్, అనిల్ కుమార్ యాదవ్
-
బాబు, పవన్ కు కొడాలి, నందిగాం సురేష్ కౌంటర్
-
పవన్ కళ్యాణ్ బండారం బయటపెట్టిన నందిగం సురేష్
-
చంద్రబాబు, పవన్, లోకేష్ పై ఎంపీ నందిగం సురేష్ ఫైర్
-
‘రాజధాని’పై చర్చకు రండి.. టీడీపీ నేతలకు ఎంపీ సురేష్ సవాల్
సాక్షి, తాడేపల్లి: వయసు పెరిగేకొద్దీ చంద్రబాబుకు అసహనం పెరుగుతోందని, రాజధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వీరుడు, శూరుడైతే పవన్ చంక ఎందుకు ఎక్కారంటూ ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడావో ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నావ్? అంటూ సురేష్ నిలదీశారు. ‘‘రాజధానిలో పచ్చటి పొలాలను సర్వనాశనం చేసింది చంద్రబాబే. బలవంతంగా భూ సేకరణ చేయలేదని మనవడిపై ఒట్టేసి చెప్పాలి. హైదరాబాద్ని అభివృద్ధి చేసిన మగోడివైతే మరి ఏపీని ఎందుకు అభివృద్ధి చేయలేదు?. అబద్దాల బతుకు ఇంకెంతకాలం?. కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచే చంద్రబాబు పర్చూరు గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఉన్న చెత్త చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా అధినేతలే’’ అంటూ ఎంపీ సురేష్ దుయ్యబట్టారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు గెలిచినట్టు చంకలు కొట్టుకుంటున్నారు. రాజధాని ఫైల్స్ పేరుతో సినిమా తీసి ఆత్మవంచన చేసుకున్నారు. రాజధానిని కుల రాజధానిగా మార్చారు. జగన్ని చూసి చంద్రబాబు భయపడుతున్నారు. పంటపొలాలను ఎవరు కాల్చారో నార్కో టెస్టులతో తేల్చుకుందామా?. నాలుగు వందలు చొప్పున జనానికి ఇచ్చి సభకు తెచ్చుకునే దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఎస్సీలను దొంగల్లాగా చిత్రీకరించాలని చంద్రబాబు చూస్తున్నారు. ఎస్సీలు, బీసీలతో పెట్టుకునే 2019లో ఓడిపోయాడు. ఒళ్లంతా రోగాలని చెప్పుకుని బెయిల్పై బయటకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ ఎంపీ ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రజలకు భవిష్యత్తు ఇవ్వటమేంటి?. రాజధానిపై చర్చకు 24 గంటల సమయం ఇస్తున్నా. దమ్ముంటే ఎవరైనా సరే చర్చకు రావాలంటూ ఎంపీ నందిగం సురేష్ సవాల్ విసిరారు. ఇదీ చదవండి: రాజధాని ‘ఫెయిల్స్’.. బాబు ‘భ్రమరావతి’ -
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదు: ఎంపీ సురేశ్
-
‘పవన్ దమ్ము చాలదని బీజేపీ కాళ్ళా వెళ్ళా పడుతున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని తిట్టిన చంద్రబాబు మళ్లీ బీజేపీ నేతల గుమ్మం దగ్గర నిలబడడం సిగ్గు చేటు అని వైఎస్సార్సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మండ్డిపడ్డారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ప్రజలకు చేసిందేమిటో చెప్పకుండా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. తన మీద తనకు నమ్మకం లేక పొత్తుల కోసం తాపత్రయపడుతున్నారు. ..పవన్ కల్యాణ్ దమ్ము చాలదని, బీజేపీ కాళ్లా వెళ్ళా పడుతున్నాడు. చంద్రబాబు 14 ఏళ్ళల్లో దోచుకున్నాడు. తన జీవితంలో చంద్రబాబు ఏనాడూ సొంతంగా పోటీ చేసి గెలవలేదు. ఒక్కడుగా ఎదుర్కొనే ధైర్యం లేక.. పవన్, బీజేపీ, కాంగ్రెస్తో చంద్రబాబు జత కట్టాడు. భయంతో చంద్రబాబు రేపు కేఏ.పాల్తో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. చంద్రబాబు జిమ్మిక్కులతో సర్వేలు చేయించాడు’ అని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. తన పాలనలో మంచి జరిగితేనే ఓటు వేయాలని అడిగే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని అన్నారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. పేదల ఖాతాల్లో ఉందని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. చదవండి: నేరుగా వెళ్లి పులిబోనులో పడ్డట్లుగా.. జనసేన రాజకీయ వైనం! -
జగన్ ను ఓడించాలంటే అటువైపు కూడా జగనే ఉండాలి
-
కేఏ పాల్ కు ఉన్న దమ్ము కూడా షర్మిలకు లేదు
-
చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకం: నందిగం సురేష్
సాక్షి, బాపట్ల: టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకమని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. బడుగు బిడ్డలకు సీఎం జగన్ పాలనలోనే మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. సీఎం ప్రజలకు చేసిన మేలే మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిని చేస్తుందని అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో పార్టీ ఇంచార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ , రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్సీపీ యువనాయలు, ఏపీఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్, తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. బాబుకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. బీసీలను ఎప్పుడూ బాబు బ్యాక్వర్డ్గానే చూశారని మేరుగు నాగార్జున మండిపడ్డారు. బాబు హయాంలో దళితులపై జరిగినన్ని దాడులు దేశంలో ఎక్కడా జరగలేదని పర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్దేనని అన్నారు. సోనియా, రాహుల్, బాబు చేతుల్లో షర్మిల కీలు బొమ్మ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో షర్మిల ఉనికి కోల్పోయి, కాంగ్రెరస్లో పార్టీనిని వీలినం చేశారంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనను తప్పుబట్టే అర్హత షర్మిలకు లేదని తెలిపారు. వైఎస్సార్సీపీపై షర్మిల విమర్శలు రాజకీయ స్వార్థంతో చేసినవని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆమెకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చదవండి: AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే -
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర
-
AP: మళ్లీ జగనే సీఎం: బస్సు యాత్రలో ఎంపీ నందిగాం
అన్నమయ్య, సాక్షి: రైల్వేకోడూరు ప్రజల అనందం చూస్తుంటే ఎమ్మెల్యేగా శ్రీనివాసులు, మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించడం ఖాయంగా కనిపిస్తోందని బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. రైల్వేకోడూరులో బుధవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ఎంపీ నందిగాం సురేష్బాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించాలని కోరారు. ‘నాలుగున్నరేళ్ల సీఎం జగన్ పాలనకు పద్నాలుగున్నర నెలల చంద్రబాబు పాలనకు చాలా తేడా ఉంది. చంద్రబాబు పాలనలో కుళ్లు కుతంత్రాలు తప్ప చేసిందేమీ లేదు. బినామీలకు దోచిపెట్టారు. బాబు ఎవరికీ చేసిందేమీ లేదు. ఏమి చేశారంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. వెన్నుపోటు గురించి మాత్రమే చెప్పుకుంటున్నారు. అదే వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజల అభివృద్దికి కృషి చేశారు. ఎంత మంది ఏకమై వచ్చినా ఊడేదేమి లేదు. రాష్టానికి మేలు చేసే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. ఏపీకి దశ దిశ చూపే వ్యక్తి సీఎం జగన్. కోడూరు అభివృద్దికి జగన్ అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి శ్రీనివాసులు. మీరు మళ్లీ అవకాశమిస్తే మళ్లీ మంత్రి అవుతారు’అని ఎంపీ సురేష్ అన్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నవ్వులోనే ఎవరికి ఏ కష్టమోచ్చినా అండగా నేను ఉన్నానన్న నమ్మకం కలుగుతుంది. యాదవులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చి సీఎం వైఎస్ జగన్ రాజకీయ సమానత్వం తీసుకువచ్చారు. చంద్రబాబు మాత్రం బడుగు బలహీన వర్గాల వారిని అవమానపరిచారు. ఇలాంటి సీఎంను, ఎమ్మెల్యే శ్రీనివాసులును మళ్లీ భారీ మోజార్టీతొ గెలిపించాలి’ అని రమేష్ యాదవ్ అన్నారు. ఇదీచదవండి.. కేశినేని నాని వర్సెస్ చిన్ని -
సీఎం జగన్ సంక్షేమ పాలనను వివరిస్తున్న YSRCP నేతలు
-
ఎంపీ నందిగం సురేశ్ కారును ఢీకొట్టే ప్రయత్నం
తాడేపల్లి రూరల్: దళిత ఎంపీ నందిగం సురేష్ కారును మరో కారుతో ఢీకొట్టేందుకు మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. బాపట్ల ఎంపీ సురేష్కు తృటిలో ప్రమాదం తప్పింది. అమరావతి కరకట్ట వెంబడి ఇస్కాన్ టెంపుల్ సమీపంలో బిబి1 మధ్య జరిగిన ఈ సంఘటనలో ఎంపీ కారును ఢీకొట్టబోయిన కారులో ఉన్నవారు బొటనవేలు, చిటికెనవేలు చూపిస్తూ, చూపుడు వేలుతో వార్నింగ్ ఇచ్చి ప్రకాశం బ్యారేజ్ వైపు పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఎంపీ సురేష్ పీఎస్వో బషీర్ తెలిపిన వివరాల మేరకు.. సురేష్ కాన్వాయ్ కరకట్ట మీదుగా వెళుతున్న సమయంలో ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఉద్దేశపూర్వకంగా ఏపీ16 జెఎఫ్ 0828 గల కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఆపి ఉన్న కారు ఒక్కసారిగా రోడ్డు మీదుగా వచ్చి ఎస్కార్ట్ వాహనాన్ని, సురేష్ కారును ఢీకొట్టేందుకు ప్రయత్నించింది. డ్రైవర్ అప్రమత్తమై కారును కంట్రోల్ చేశారు. లేకపోతే కారు కరకట్ట మీద నుంచి 30 అడుగుల లోతులో ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయేది. ఏపీ16 జెఎఫ్ 0828 కారులో డ్రైవర్ వెనుక కూర్చున్న వ్యక్తి కారు అద్దాలు దించి చూపుడువేలుతో వార్నింగ్ ఇస్తూ, టీడీపీ సింబల్ అయిన విక్టరీ సింబల్ చూపిస్తూ నాలుక మడత పెట్టి వార్నింగ్ ఇస్తున్నట్లు సైగలు చేశాడు. వెళ్లిపోబోతున్న కారును ఆపడంతో అందులో ఉన్న వ్యక్తి కిందకు దిగి వేళ్లు చూపిస్తూ ఎంపీ అయితే ఏమిటి.. త్వరలోనే మీ సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. కారుకు అడ్డుగా నిలిచిన బషీర్ను ఢీ కొట్టేందుకు ప్రయత్నించారు. ఎంపీ సురేష్ వచ్చి కారులో డ్రైవర్ వెనుక సీటులో కూర్చున్న వ్యక్తిని నువ్వెవరని ప్రశ్నించగా.. నీకు చెప్పేది ఏమిట్రా అంటూ కారు ఎక్కుతూ మరోసారి చేతివేళ్లు ఊపుతూ నీ సంగతి తేలుస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ కారులో డ్రైవర్తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఈ ఘటనపై తుళ్ళూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి కారు నంబరు ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని బషీర్ తెలిపారు. -
లోకేష్, పవన్ పై నందిగామ సురేష్ సెటైర్లు
-
మోడీ పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి ఏమ్మన్నారంటే..!
-
సీఎం జగన్ చేసిన మేలును వివరిస్తున్న నేతలు
-
నందిగాం సురేష్: చంద్రబాబు దోచుకోవడం తప్పిస్తే ఏం చేశారు
-
గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను మోసం చేసింది
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
Advertisement