-
హేవలాక్.. గోదావరి ఐకానిక్..
సాక్షి డెస్క్, రాజమహేంద్రవరం: అమ్మమ్మగారింటికనో.. చుట్టాలింటికనో గోదావరి అవతల ఉన్న ఏ విజయవాడకో.. మెడ్రాసుకో (ఇప్పుడంటే చైన్నె కానీ.. అప్పట్లో అలానే కాస్త స్టైలుగా అనేవారు ఎందుకో! కాకపోతే కొందరు మద్రాసు, మదరాసు అనేవారు) చిన్నప్పుడు వెళ్లిన వాళ్లందరికీ రాజమండ్రి పాత రైలు బ్రిడ్జిపై ప్రయాణం ఎప్పటికీ చెదరని ఓ మధుర జ్ఞాపకమే. పగటి పూట అయితే చాలామంది కాకినాడ – మెడ్రాసు సర్కార్ ఎక్స్ప్రెస్ లేకపోతే ప్యాసింజర్ రైలు ఎక్కేవారు. అప్పట్లో బొగ్గు ఇంజన్. కూ... అంటూ చెవులు చిల్లులు పడేలా పే....ద్ధ కూత పెట్టుకుంటూ చుక్చుక్చుక్ మంటూ వచ్చేది. రైలు నెమ్మదిగా రాజమండ్రి (కొంతమంది ‘రాజమంట్రి’ అనేవారు. అదేమిటో!) చేరిందంటే చాలు.. గోదావరి వచ్చేసిందని పెద్దవాళ్లు అప్రమత్తం చేసేవారు. అందరూ పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు, పది, 20 పైసలు.. కాస్త ఉన్న వాళ్లయితే పావలా నుంచి రూపాయి కాసు వరకూ చేతులతో పట్టుకుని రైలు బోగీ కిటికీలు, గేట్ల వద్దకు ఉరికేందుకు సిద్ధంగా ఉండేవారు. ఏదో యుద్ధానికి సిద్ధమైన యోధుల్లా..రైలు కూత పెట్టి నెమ్మదిగా రాజమండ్రి స్టేషన్ను వీడేది. ఇంజిన్.. దాని వెనుకనే ఒకదాని వెనుకన ఒక్కో బోగీ గోదావరి బ్రిడ్జి మీదుగా పరుగులు తీసేవి. ఇప్పుడంటే రోడ్ కం రైల్వే బ్రిడ్జి, ఆర్చి బ్రిడ్జి ఉన్నాయి కానీ.. అప్పట్లో రైలు గోదావరి దాటాలంటే ఒక రకం జేగురు రంగులో ఉండే రెడ్ ఆకై ్సడ్ పూత పూసిన పాత బ్రిడ్జి ఒక్కటే దిక్కు.. దీనికే హేవలాక్ బ్రిడ్జి అని మరో పేరు. అమ్మో బ్రిడ్జి మీద ప్రయాణమే.. అప్పట్లో ఆ బ్రిడ్జిపై ప్రయాణం అంటే చాలామందికి హడల్.. గుండెలు గుబగుబలాడిపోయేవి. ఓపక్క ఠక్ఠక్.. ఠక్ఠక్ అంటూ రైలు చక్రాల సౌండ్.. అది ఇనుప బ్రిడ్జి కావడంతో వాటి అదురు నుంచి వచ్చే రీసౌండ్.. చిన్న పిల్లలైతే భయంతో బిర్రబిగుసుకుపోయేవాళ్లు. మరోపక్క కిందన అఖండ గోదావరి. ఎటు చూసినా కనుచూపు మేరంతా అగాధంలాంటి జలరాశే. అసలే ఆ బ్రిడ్జికి అటూ ఇటూ ఏమీ ఉండేవి కావు. ఒక వేళ ఈ రైలు ఆ బ్రిడ్జి మీంచి కింద పడిపోతే.. అనే ఆలోచన వస్తేనే పై ప్రాణాలు పైనే పోయినట్టుండేది. (ఒకవేళ బ్రిడ్జికి అటూ ఇటూ గోడలుంటే మాత్రం వేగంగా వెళ్తున్న రైలు పడితే ఆపుతాయా? అదో వెర్రి ఆలోచన.) ఈలోగా గోదావరిలో డబ్బులేసేవాళ్లు.. పూలు, పండ్లు విసిరేవారు.. చల్లగా చూడాలమ్మా అంటూ తల్లి గోదారికి దణ్ణాలు పెట్టేవాళ్లు. ఈ ప్రాంత ప్రజలతోనే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజలతో కూడా అనుబంధం పెనవేసుకున్న ఈ హేవలాక్ వంతెనకు చాలానే చరిత్ర ఉంది. అంతకు ముందు కేవలం పడవలే.. హేవలాక్ బ్రిడ్జి నిర్మించక ముందు గోదావరి నదిని దాటడానికి ఇక్కడి ప్రజలు పడవలే వినియోగించేవారు. ఆ రోజుల్లో గోదావరి వరద ఉధృతంగా ఉంటే ఒక్కోసారి పడవలు తలకిందులై ప్రాణనష్టం కూడా జరిగేది. అటువంటి దుస్థితికి ఈ వంతెన చెక్ చెప్పింది. ప్రజలు సురక్షితంగా గోదావరి దాటడానికి ఒక రవాణా సాధనం లభించింది. అప్పట్లో బ్రిడ్జిపై ఎలాంటి ఆధారం లేకుండా రైలు వెళ్తూంటే అందులోని ప్రయాణికులు చాలా భయపడేవారు. అదే సమయంలో థ్రిల్గా కూడా ఫీలయ్యేవారు. పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు ప్రణాళిక రైళ్ల రాకపోకలను 1997లో నిలిపివేసిన పదేళ్ల తరువాత ఈ వంతెనను పర్యాటకంగా, రాజమహేంద్రవరం – కొవ్వూరు మధ్య పాదచారుల మార్గంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 2008లో ఈ వంతెన సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టేందుకు తీర్మానం చేసింది. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించలేదు. నాటి ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఈ ప్రాజెక్ట్ను ఆమోదించాల్సిందిగా రైల్వే శాఖకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. హేవలాక్ బ్రిడ్జిని తొలగించి, దానిలోని ఉక్కును తీసుకువెళ్లాలని రైల్వే శాఖ చేసిన యత్నాలను స్థానికులు తిప్పి కొట్టారు. ఈ ఐకానిక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. బ్రిడ్జిపై రోడ్డు వేస్తే చిరు వ్యాపారులకు, రైతులకు ఉపయోగపడుతుందని, వాకింగ్ ట్రాక్గా కూడా పనిస్తుందని చెప్పారు. చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేస్తే పర్యాటకంగా ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2017లో రైల్వే శాఖకు కొంత మొత్తం చెల్లించి, సొంతం చేసుకుంది. దీనిని వారసత్వ సంపదగా అభివృద్ధి చేస్తామని చెప్పింది. అడుగులు ముందుకు పడలేదు. ప్రస్తుత రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ కల సాకారమయ్యే రోజు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు పొడవు : 2.7 కిలోమీటర్లు – వెడల్పు: 1.7 మీటర్లు నిర్మాణం ప్రారంభం : 1897 నవంబర్ 11 నిర్మాణ అంచనా వ్యయం : రూ.47 లక్షలు వంతెన ప్రారంభం : 1900 ఆగస్టు 30 వంతెన మూసివేత : 1997 స్తంభాలు : 56 (రాతి కట్టడాలు) మొట్టమొదట ప్రయాణించిన రైలు : మెయిల్ చివరిసారి ప్రయాణించిన రైలు : కోరమాండల్ ఎక్స్ప్రెస్ 1897లో నిర్మాణం ఆరంభం ఈ వంతెనను అఖండ గోదావరిపై బ్రిటిష్ వారి పాలనలో హౌరా – మద్రాసు (నేటి చైన్నె) రైలు మార్గంలో రాజమహేంద్రవరం – కొవ్వూరు పట్టణాల మధ్య 1897లో నిర్మించారు. దీనిని వంద సంవత్సరాల పాటు వినియోగంలో ఉండేలా అప్పట్లో డిజైన్ చేశారు. స్తంభాలు పూర్తి రాతి కట్టడాలు. బలమైన ఉక్కు గడ్డర్లు ఉపయోగించారు. దీని నిర్మాణానికి ఫ్రెడరిక్ థామస్ గ్రాన్విల్లే వాల్డన్ ఇంజినీర్ ఇన్ చీఫ్గా వ్యవహరించారు. ఈ వంతెనకు అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్ సర్ ఆర్థర్ ఎలిబ్యాంక్ హేవ్లాక్ పేరు పెట్టారు. -
సికింద్రాబాద్ టు సిద్దిపేట రూ.440
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి సిద్దిపేటకు ఎక్స్ప్రెస్ బస్ చార్జి రూ.140. వెళ్లి రావటానికి రూ.280. రెండు రోజులకు రూ.560. అదే రైలులో నెల రోజులు ప్రయాణించేందుకు రూ.440 చెల్లిస్తే సరి. రెండు రోజుల బస్ చార్జి కంటే చవకగా, ఏకంగా నెలరోజుల పాటు ప్రయా ణించే వెసులుబాటును రైల్వే శాఖ కల్పించింది. ఈ నెల మూడో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన సికింద్రాబాద్–సిద్దిపేట ప్యాసింజర్ రైలు ఆ ప్రాంత వాసులకు కారు చవక ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య 117 కి.మీ. ప్రయాణానికి రైలు టికెట్ ధర కేవలం రూ.60 మాత్రమే. ఇప్పుడు దానిని మరింత చవకగా మారుస్తూ నెలవారీ సీజన్ టికెట్ను అందుబాటులోకి తెచ్చింది. మామూలు టికెట్ ప్రకారం.. వెళ్లి రావటానికి రూ.120 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెల రోజులకు రూ.3,600 అవుతుంది. కానీ, నెల రోజుల సీజన్ టికెట్ కొంటే కేవలం రూ.440తో నెల రోజుల పాటు ఎన్ని ట్రిప్పులైనా తిరగొచ్చు. ఇంతకాలం బస్సులు, ప్రైవేటు వాహనాలకు ఎక్కువ మొత్తం చెల్లిస్తూ ప్రయాణిస్తున్న నిరుపేద వర్గాలకు ఇది పెద్ద వెసులుబాటుగా మారనుంది. స్పెషల్ రైలు సర్వీసుగా సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య ఈ రైలు సేవలు ప్రారంభమైనప్పటికీ, సీజన్ టికెట్ను జారీ చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రత్యేక రైలులో ఎక్స్ప్రెస్ టికెట్ ధరలను అమలు చేస్తారు. దాన్ని రెగ్యులర్ సర్వీసుగా మార్చగానే ఆర్డినరీ టికెట్ ధరలను వర్తింపచేస్తారు. ఈ ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న టికెట్ ధర రూ.60 నుంచి రూ.50కి తగ్గుతుంది. అయితే దీనితో సంబంధం లేకుండా ఇప్పుడు సీజన్ టికెట్ను అందుబాటులోకి తెచ్చారు. 101 కి.మీ. నుంచి 135 కి.మీ. వరకు ప్రయాణ దూరానికి సీజన్ టికెట్ ధర రూ.440 ఉంటుంది. సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రైలు ప్రయాణ దూరం 117 కి.మీ.గా ఉంది. దీంతో ఈ టికెట్ ధరను రూ.440 ఖరారు చేశారు. నెల తర్వాత దానిని మళ్లీ రెన్యూవల్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ –సిద్దిపేట మధ్య ఇతర స్టేషన్ల వరకు కూడా ఈ సీజన్ టికెట్ పొందే వెసులుబాటు కల్పించారు. ఆయా స్టేషన్ల మధ్య దూరం ఆధారంగా ఆ టికెట్ ధర ఉంటుంది. ట్రిప్పు వేళలు ఇలా.. ♦ సిద్దిపేటలో రైలు (నంబరు:07483) ఉదయం 6.45కు బయలుదేరి సికింద్రాబాద్కు 10.15కు చేరుకుంటుంది. ♦ తిరిగి సికింద్రాబాద్లో రైలు (నంబరు:07484) ఉదయం 10.35కు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకుంటుంది. ♦ తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి సిక్రింద్రాబాద్కు సాయంత్రం 5.20 గంటలకు చేరుకుంటుంది. ♦ సికింద్రాబాద్లో సాయంత్రం.5.45 గంటలకు బయలుదేరి సిద్దిపేట కు రాత్రి 8.45 గంటలకు చేరుకుంటుంది. ♦ హాల్ట్స్టేషన్లు: మల్కాజిగిరి, కేవలరీ బ్యారెక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చ ల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట -
ప్యాసింజర్ రైళ్లు ఆలస్యం..
పెద్దపల్లి: సాధారణ, మధ్య తరగతి ప్రజలు తక్కువ ఖర్చు.. భద్రతతో కూడిన రైలులో సకాలంలో గమ్యం చేరేందుకు ప్రయాణిస్తుంటారు. అయితే ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖాజీపేట–సిర్పూర్ కాగజ్నగర్, నిజామాబాద్– సిర్పూర్కాగజ్నగర్ మధ్య నడిచే రామగిరి, పుష్పుల్, ఇంటర్సిటీ, సింగరేణి ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. 98 కిలోమీటర్ల దూరంలో కాజీపేట, 220కిలోమీటర్ల దూరంలో ఉన్న సికింద్రాబాద్, ని జామాబాద్ వెళ్లేందుకు పొద్దస్తమానం పడిగాపులు కాయాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ట్రాక్ పనులు చేపడితే రద్దే.. కరీంనగర్, కాజీపేట– కాగజ్నగర్ మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడితే గతంలో ఒకటి రెండు రైళ్లను నడిపించిన రైల్వేశాఖ.. ప్రస్తుతం వారం రోజుల పాటు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తోంది. ఆర్టీసీ బస్సు చార్జీలతో పోల్చితే నాలుగో వంతు రైలు చార్జీలు ఉండడంతో సాధారణ, నిరుపేద ప్రయాణికులు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. కాగా గంటల తరబడి రైళ్ల ఆలస్యంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్స్ప్రెస్, గూడ్సులకే మొదటి ప్రాధాన్యం క్రమంగా పెరుగుతున్న రైళ్ల సంఖ్యకు అనుగుణంగా రైల్వే ట్రాక్స్ విస్తరిస్తున్న రైల్వేశాఖ ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ప్యాసింజర్ రైలు రాకపోకలు సాగించే క్రమంలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్లు మొదటగా పంపించేందుకు వీటిని గంటల తరబడి నిలిపివేస్తుండడంతో సాధారణ ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. గూడ్స్ రాకపోకలతో వందలాది కోట్ల ఆదాయం ఉండగా, రైల్వేశాఖ సేవా దృక్పథాన్ని మరిచి లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుందనే విమర్శలు మూటగట్టుకుంటుంది. -
ప్యాసింజర్ రైళ్లకు మంగళం
స్వాతంత్రోద్యమ కాలం నుంచి రైళ్లు ప్రజల జీవితాలతో ముడిపడి ఉండేవి. రోడ్డు మార్గాలు, రవాణా సాధనాలు అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో పేద, మధ్య, ఎగువ తరగతి ప్రజలకు ప్రయాణ సాధనం రైలు మాత్రమే. దీంతో రైల్వే శాఖ నిరంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పనిచేసేది. కాలక్రమేణా ఆధునికత సంతరించుకున్న రైల్వే శాఖ సేవామార్గాన్ని విస్మరించి లాభార్జనే పరమావధిగా పనిచేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి, వాటిని ఎక్స్ప్రెస్లుగా మర్పు చేయడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయాణం భారంగా మారింది. ఏలూరు (టూటౌన్): ఒక నాడు అధికంగా కనిపించే ప్యాసింజర్ రైళ్లు క్రమేణా కనుమరుగయ్యాయనే చెప్పవచ్చు. ఎక్కడో కొన్ని మార్గాల్లో మినహా ప్యాసింజర్ రైళ్లు అనేవి కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా విజయవాడ డివిజన్ పరిధిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి–విజయవాడ ప్యాసింజర్ రైలు ప్రతి రోజు అప్ అండ్ డౌన్గా తిరిగేది. ఇది పేద ప్రజలకు, నిత్యం ప్రయాణించే చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు అక్కరకు వచ్చేది. ఉదాహరణకు ఏలూరు నుంచి కేవలం రూ.15 చార్జీతో విజయవాడ ప్రయాణం చేసి మళ్లీ సాయంత్రం తిరిగి వచ్చే వెసులుబాటు ఉండేది. అంటే ఒక ప్రయాణికుడు కేవలం రూ.30 ఖర్చుతో ఏలూరు నుంచి విజయవాడ వెళ్లి వచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ రైలు ఎక్స్ప్రెస్గా మార్చి వేశారు. అలాగే చార్జీలు పెద్ద ఎత్తున పెంచి వేశారు. దీంతో గతంలో కిక్కిరిసి ఉండే ప్రయాణికులు ప్రస్తుతం ఎక్స్ప్రెస్ రైలుగా మార్చిన తరువాత నామమాత్రంగానే కనిపిస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి విజయవాడ వచ్చే ఫాస్ట్ ప్యాసింజర్ రైలు సైతం నేడు ఎక్స్ప్రెస్ రైలుగా రూపాంతరం చెందింది. సుదూర ప్రాంతం నుంచి వచ్చే రాయగడ–గుంటూరు ప్యాసింజర్ సైతం ఎక్స్ప్రెస్గా మార్చి వేశారు. దీంతో ఈ ప్రాంతం నుంచి విశాఖపట్టణం, శ్రీకాకుళం, రాయగడ ప్రాంతాలకు వెళ్లే వలస కూలీలు, సాధారణ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పాత సీసాలో కొత్త సారా నింపినట్లు గతంలో నడిచే ప్యాసింజర్ రైళ్లనే ఎక్స్ప్రెస్లుగా మార్చి వేసి పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తున్నారే తప్ప ఆ రైళ్లల్లో అదనంగా ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. స్లీపర్ బోగీలు కుదింపు.. ఏసీ బోగీలు పెంపు రైళ్లలో ప్రయాణించే జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల విషయంలో రైల్వే శాఖ పట్టించుకోవడం లేదనేది ప్రయాణికుల వాదనగా ఉంది. రద్దీ ఉండే అనేక రైళ్లలో ఏసీ బోగీల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నారు. ఇదే సమయంలో జనరల్, స్లీపర్ బోగీల సంఖ్యను కుదిస్తున్నారు. భువనేశ్వర్ నుంచి బెంగుళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్లో గతంలో స్లీపర్ బోగీలు 10, ఏసీ బోగీలు 3 ఉండేవి. తాజాగా స్లీపర్ బోగీలను ఆరుకు తగ్గించి, ఏసీ బోగీలను ఆరుకు పెంచారు. అలాగే విశాఖపట్టణం–హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్ప్రెస్లో గతంలో స్లీపర్ బోగీలు 12 ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య ఏడుకు తగ్గించి, ఏసీ బోగీలను మూడు నుంచి ఏడుకు పెంచారు. ఇలా పలు ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్ బోగీలను తగ్గించి, ఏసీ బోగీలను పెంచడం వల్ల సాధారణ ప్రజలకు రైలు ప్రయాణం అందని ద్రాక్షలా చేస్తున్నారనేది ప్రయాణికుల వాదనగా ఉంది. రైళ్ల రద్దుతోనూ తప్పని అవస్థలు ఇటీవల ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంతో పాటు ట్రాక్ల మెయింట్నెన్స్ పేరుతో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. నిత్యం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండే విజయవాడ–విశాఖపట్టణం రత్నాచల్ ఎక్స్ప్రెస్, గుంటూరు–విశాఖపట్టణం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్టు–విజయవాడ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలును పలు పర్యాయాలు రద్దు చేస్తుండటంతో వాటిలో ప్రయాణించేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు నిత్యం ప్రయాణించే రైళ్లే. వీటిని పలు కారణాలతో ఎక్కువ సార్లు రద్దు చేస్తుండటంతో నిత్యం ప్రయాణించే వారి బాధలు వర్ణనాతీతంగా చెప్పుకోవచ్చు. ఆదాయం బాగుంటేనే గ్రీన్సిగ్నల్ పలు కారణాలతో ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్న రైల్వే శాఖ అంతరాష్ట్ర సర్విసులను, రైల్వేకు అధిక ఆదాయం తెచ్చే వందేభారత్ వంటి రైళ్ళను మాత్రం యధావిధిగా నడపడంపై సాధారణ ప్రయాణికులు విమర్శలు చేస్తున్నారు. భిన్నమతాలు, భాషలు, ప్రాంతాలను కలిపే రైళ్లు నేడు లాభాలు తెచ్చే మార్గాల వైపే దృష్టి సారించడం శోచనీయమంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్లీపర్ బెర్త్ దొరకడమే కష్టమే స్లీపర్ క్లాస్ బోగీల సంఖ్యల తగ్గించి వేస్తుండటంతో రిజర్వేషన్ దొరకడమే కష్టంగా మారింది. నెల ముందు రిజర్వేషన్ కోసం ప్రయత్నించినా వెయిటింగ్ లిస్ట్ వస్తోంది. గతంలో నాలుగు రోజుల ముందు ప్రయత్నిస్తే స్లీపర్ క్లాస్లో రిజర్వేషన్ దొరికేది. సామాన్య, మధ్యతరగతి ప్రయాణికుల పట్ల రైల్వే శాఖ శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. – కొరబండి బాబూరావు, సామాజిక కార్యకర్త, ఏలూరు -
రెండు రైల్వే లైన్లు !
కోదాడ: ఇప్పటి వరకు ప్యాసింజర్ రైలు ముఖం చూడని జిల్లా వాసులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. జిల్లా మీదుగా రెండు రైల్వే లైన్లు వేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కొద్ది సంవత్సరాల్లోనే జిల్లా వాసులకు ఒక సాధారణ, మరో హైస్పీడ్ రైల్వేలైన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే డోర్నకల్–మిర్యాలగూడ మార్గానికి సంబంధించి సర్వే దాదాపు పూర్తికావొచ్చింది. తాజాగా శుక్రవారం కేంద్ర రైల్వే, పర్యాటకశాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్రెడ్డిలు తెలుగు రాష్ట్రాల విభజన హామీల్లో భాగంగా శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ వరకు హైస్పీడ్ రైల్వేలైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని సర్వే కోసం కాంట్రాక్టర్ను కూడా నియమించడంతో ఈ ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కే అవకాశముంది. కేంద్ర మంత్రుల తాజా ప్రకటనతో జిల్లావాసులకు ఆనందాన్ని కలిగిస్తుంది. తీరనున్న జిల్లా వాసుల చిరకాల వాంఛ తమ పట్టణంలో రైలు ఎక్కాలనుకుంటున్న జిల్లావాసుల చిరకాలకోరిక తీరే సమయం దగ్గరపడింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్రెడ్డి ప్రకటించిన ఈ కొత్త రైల్వేలైన్ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే జిల్లాలోని సూర్యాపేట, కోదాడ వాసులు హైస్పీడ్ రైలు ఎక్కడానికి ఎక్కువ సమయం పట్టదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల విభజన హామీల్లో భాగంగా రెండు రాష్ట్రాలను కలుపుతూ శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ వరకు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వేకు రైల్వేబోర్డు అనుమతులు మంజూరు చేసింది. దీనికి కాంట్రక్టర్ను కూడా నియమించింది. ఆరు నెలల్లో సదరు కాంట్రాక్టర్ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. 220 కి.మీ. గరిష్ట వేగంతో (సెమీ హైస్పీడ్) రైళ్లను నడిపే విధంగా ఈ లైన్ వేయాలని నిర్ణయించారు. రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రాథమికంగా శంషాబాద్ నుంచి అంబర్పేట ఓఆర్ఆర్ మీదుగా 65వ నంబర్ జాతీయ రహదారికి సమాంతరంగా ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల ఉమ్మడి జిల్లాలోని చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, సూర్యాపేట, కోదాడ పట్టణాల సమీపంలోనుంచి ఈ లైన్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పూర్తికావొచ్చిన డోర్నకల్ – మిర్యాలగూడ లైన్ సర్వే డోర్నకల్ నుంచి మిర్యాలగూడ వరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న బ్రాడ్గేజ్ రైల్వేలైన్ సర్వే పనులు గడిచిన ఆరు నెలలుగా జరుగుతున్నాయి. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో సర్వే పనులు ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం నల్లగొండ జిల్లా పరిధిలో సర్వే జరుగుతోంది. ఈ లైన్ డోర్నకల్, నేలకొండపల్లి, కోదాడ, హుజూర్నగర్ల మీదుగా మిర్యాలగూడకు చేరుకోనుంది. మరో ప్రతిపాదనలో డోర్నకల్, నేలకొండపల్లి, కోదాడ, హుజూర్నగర్ మీదుగా ఇప్పటికే ఉన్న జాన్పహాడ్ వద్ద లైన్కు కలిసే విధంగా తయారు చేస్తున్నట్లు సమాచారం. దీనిలో మొదటి ప్రతిపాదనకే అధికారులు మొగ్గుచూపుతున్నారని.., వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ లైన్కు నిధులు మంజూరు చేయించడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడకు చెందిన ఐఆర్టీఎస్ అధికారి బర్మావత్ నాగ్యానాయక్ తీవ్ర కృషి చేస్తున్నట్లు తెలిసింది. ఎంపీ కాగానే పార్లమెంట్లో ప్రతిపాదించా.. హైదరాబాద్ – విజయవాడల మధ్య హైస్పీడ్ రైల్వేలైన్ ఆవశ్యకతను నేను ఎంపీగా ఎన్నిక కాగానే తొలిసారి పార్లమెంట్లో ప్రతిపాదించాను. రెండు రాష్ట్రాల మధ్య ఈ లైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాను. ప్రభుత్వం దీనిపై ఇన్నాళ్లకు నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. దీనికి వెంటనే నిధులు మంజూరు చేయించడానికి నావంతు ప్రయత్నం చేస్తాను. – ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీ నల్లగొండ -
సిబ్బంది లేని రైల్వే స్టేషన్లు అవి.. టిక్కెట్లు ఎవరిస్తారంటే..
మనం పలు రైల్వే స్టేషన్ల పేర్లు వినేవుంటాం. వాటిలో కొన్నింటి పేర్ల చివర సెంట్రల్, టెర్మినల్, రోడ్డు అని ఉండటాన్ని చూసేవుంటాం. అయితే కొన్ని రైల్వే స్టేషన్ల పేరు చివర పీహెచ్ అని రాసివుంటుంది. అలా ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రైల్వే స్టేషన్ల పేర్ల చివరన పీహెచ్ అని ఉంటుంది. ఇక్కడ పీహెచ్ అంటే పాసింజర్ హాల్ట్ అని అర్థం. అంటే ఈ స్టేషన్లలో కేవలం పాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. ఇటువంటి స్టేషన్లు మిగిలిన స్టేషన్ల కన్నా కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ స్టేషన్లలో రైల్వేశాఖ తరపున ఎటువంటి అధికారిగానీ, ఉద్యోగిగానీ ఉండరు. పాసింజర్ హాల్ట్ అనేది డీక్లాస్ తరహా స్టేషన్. రైళ్లు ఆగేందుకు సిగ్నల్ చూపేలా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉండవు. అయితే సిగ్నల్స్ లేని ఇటువంటి స్టేషన్లలో రైళ్లు ఎలా ఆగుతాయనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఇటువంటి రైల్వే స్టేషన్లలో రైళ్లను రెండు నిముషాల పాటు ఆపాలంటూ ట్రైన్ డ్రైవర్కు ముందుగానే ఆదేశాలు అందుతాయి. ఈ మేరకు డ్రైవర్ ఆయా స్టేషన్లలో రైళ్లను ఆపుతాడు. కాగా ఇటువంటి స్టేషన్లలో రైల్వే సిబ్బందే లేకపోతే మరి ప్రయాణికులు టిక్కెట్లు ఎలా తీసుకోవచ్చనే సందేహం కలుగుతుంది. ఇటువంటి డీ క్లాస్ స్టేషన్లలో రైల్వేశాఖ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తిని కమిషన్ ఆధారంగా టిక్కెట్లు విక్రయించేందుకు నియమిస్తుంది. అయితే ప్రస్తుతం ఇటువంటి రైల్వేస్టేషన్లకు స్వస్తి పలకాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ఇటువంటి స్టేషన్ల నుంచి రైల్వేకు ఎటువంటి ఆదాయం రావడంలేదని సమాచారం. -
తీవ్ర విషాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
ఇటీవలే గ్రీస్ దేశంలో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 50కిపైగా మందికి మృతిచెందిన ఘటన మరువక ముందే మరో విషాదం నెలకొంది. ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ప్రమాద ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఈజిప్టు దేశంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఈజిప్టులోని కైరో నగరంలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కాగా, నైలు డెల్టాలోని మెనోఫ్ నగరానికి వెళ్లే మార్గంలో కల్యుబ్ నగరంలోని స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుండగా ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ రైలు ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించినట్టు వెల్లడించారు. AFP: Two people were killed and several others injured Tuesday in a #train_accident north of #Cairo, #Egypt's #health_ministry said. A ministry statement said there were "two dead in the train accident at #Qalyub, while the injured are in a stable condition." pic.twitter.com/ILBz8R0xs4 — Usama Farag (@VOAFarag) March 7, 2023 -
హైదరాబాద్: పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు ఎంఎంటీఎస్లు, దూర ప్రాంతాలకు మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. మరమ్మతుల పనుల కారణంగానే దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. నేడు(బుధవారం),రేపు(గురువారం) నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ప్యాసింజర్ రైళ్లలో.. విజయవాడ-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-విజయవాడ, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-సికింద్రాబాద్ సర్వీసులు ఉన్నాయి. అలాగే.. ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలకొస్తే.. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్నుమా-లింగంపల్లి లింగంపల్లి-ఫలక్నుమా ఆర్సీ పురం-ఫలక్నుమా ఫలక్నుమా-ఆర్సీ పురం ఫలక్నుమా-హైదరాబాద్ల మధ్య ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. రెండురోజుల పాటు ఈ అంతరాయం కొనసాగుతుందని ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది దక్షిణ మధ్య రైల్వే. Cancellation of Passenger and MMTS Trains pic.twitter.com/RuX3ewtDG2 — South Central Railway (@SCRailwayIndia) January 11, 2023 -
Train Video: ఇది రైలు ప్రయాణమా? ఇంత ఘోరమా?
వైరల్: మన దేశంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ.. భారతీయ రైల్వేస్. అలాగే.. అత్యంత రద్దీ వ్యవస్థ కూడా ఇదే!. పండుగలు, ఇతర సెలవుల సమయంలో రైళ్లలో రద్దీ ఏపాటి ఉంటుందో తెలియంది కాదు. అయితే.. సాధారణ రోజుల్లోనూ కొన్ని మార్గాల్లో రద్దీ అధికంగా ఉంటోంది. ఆ రద్దీని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించలేకపోతోందనే విమర్శ ఇండియన్ రైల్వేస్పై ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా రాజేష్ దుబే అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అమృత్సర్ కథిహార్ ఎక్స్ప్రెస్లో 72 బెర్త్ స్లీపర్లు ఉన్న కోచ్లో ఏకంగా 350 మంది ప్రయాణించారు. ఎటు చూసినా ప్యాసింజర్లు, లగేజీలతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. అంత నరకంలోనూ గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లు, మరో మార్గం లేక ఇలా చేసినట్లు కొందరు ప్రయాణికులు వెల్లడించారు. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులు అలా ప్రయాణించడం నేరమే!. కానీ, ఆ టైంకి అక్కడ టీటీఈ కూడా లేకపోవడంతో.. విషయం రైల్వేస్ దృష్టికి వెళ్లింది. రైల్వే సేవా అధికారిక ట్విటర్ అకౌంట్ ఈ ప్రయాణ వివరాలను అందించమని కోరగా.. చివరకు ఫిర్యాదు నమోదు అయ్యింది. Video Credits: The Logical Indian -
దేశంలో అత్యంత నెమ్మెదిగా నడిచే రైలు ఇదే.. అయినా ‘యూనెస్కో’ గుర్తింపు
చెన్నై: ఒక రైలు తన ప్రయాణం మొదలు పెట్టిందంటే.. అది గమ్యం చేరేందుకు గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుంది. వందే భారత్, రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్, దురంతో ఎక్స్ప్రెస్ వంటి రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని తెలుసు. కానీ, దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో తెలుసా? అసలు అలాంటి ఓ ట్రైన్ ఉంటుందని ఊహించారా? అవునండీ నిజమే ఉంది. అది కేవలం గంటకు 10 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. కానీ, అది యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు సంపాదించింది. అదే తమిళనాడులోని ‘మెట్టుపాలయం ఊటీ నీలగిరి ప్యాసెంజర్ ట్రైన్’. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఓసారి తెలుసుకుందాం. భారత్లో అత్యంత నెమ్మెదిగా నడిచే ట్రైన్గా ఈ రైలు ప్రసిద్ధిగాంచింది. అత్యంత వేగంగా నడిచే రైలుతో పోలిస్తే.. ఇది 16 రెట్లు నెమ్మదిగా వెళ్తుందంటే నమ్మశక్యం కాదు. ఐదు గంటల్లో కేవలం 46 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యం చేరుకుంటుంది. అయితే, అందుకు ప్రధాన కారణం అది కొండ ప్రాంతంలో నడవటమే. ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో ఈ రైలును ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. యునెస్కో ప్రకారం.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే లైన్ నిర్మాణం కోసం 1854లో తొలుత ప్రతిపాదన చేశారు. కానీ, కొండల్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు 1891లో పనులు ప్రారంభం కాగా.. 1908లో పూర్తయ్యాయి. The slowest train goes uphill at the speed of 10 kilometers per hour You can jump off the train, light up a smoke, take few drags and climb on the train again. It’s the Mettupalayam Ooty Nilgiri Passenger train. pic.twitter.com/DHyFKe3cbp — Gouthama Venkata Ramana Raju Chekuri (@gouthamaraju) May 2, 2020 ఆహ్లాదానిచ్చే రైడ్.. ఐఆర్టీసీ ప్రకారం.. ఈ రైలు చాలా సొరంగాల గుండా ప్రయాణిస్తుంది. 46 కిలోమీటర్ల ప్రయాణంలో 100కుపైగా వంతెనలను దాటుతుంది. పెద్ద పెద్ద రాళ్లు, లోయలు, తేయాకు తోటలు, పచ్చని కొండల అందాలు ఆహ్లాదానిస్తాయి. మెట్టుపాలయం నుంచి కూనూర్ మధ్య సుందరమైన దృశ్యాలు కనిపిస్తాయి. ప్రధాన స్టేషన్లు.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే ప్రతిరోజు మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు సేవలందిస్తుంది. రోజు ఉదయం 7.10 గంటలకు ఈ రైలు మెట్టుపాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఊటీకి చేరుకుంటుంది. తిరిగి ఊటీలో 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.35 గంటలకు మెట్టుపాలయంకు చేరుకుంటుంది. ఈ రూట్లో ప్రధానంగా కూనూర్, వెల్లింగ్టన్, అరవన్కుడు, కెట్టి, లవ్డేల్ వంటి స్టేషన్లు వస్తాయి. ఈ రైలులో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని రెండు రకాల కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్లో తక్కువ సంఖ్యలో సీట్లు ఉంటాయి. డిమాండ్ పెరిగిన క్రమంలో 2016లో నాలుగో బోగీని జత చేసింది రైల్వే శాఖ. టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? నీలగిరి మౌంటెయిన్ రైల్వేలో ప్రయాణించేందుకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. హాలీడేస్, వీకెండ్లో పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదీ చదవండి: ఏనుగుతో ఫోటోకు కొత్త జంట పోజు.. చిర్రెత్తి కుమ్మిపడేసిందిగా! -
పట్టాలు తప్పిన రైలు.. విశాఖ వైపు వెళ్లే పలు ట్రైన్స్ ఆలస్యం!
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బాలాజీపేట వద్ద గూడ్స్ రైలు పట్టింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు భోగి పూర్తిగా పట్టాలపై పడిపోయింది. ఇక, ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని భోగిని పట్టలాపై నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం కారణంగా విశాఖ వైపునకు వెళ్లు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్తిలి వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి. -
100 బోగీలు..1.9 కిలోమీటర్ల పొడవు!
జెనీవా: ప్రపంచంలోనే అతి పొడవైన ప్రయాణికుల రైలు తమదేనంటూ స్విట్జర్లాండ్కు చెందిన రేషియన్ రైల్వే కంపెనీ ప్రకటించింది. 100 బోగీలతో 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ రైలును ఆల్ఫ్స్ పర్వతాల గుండా అల్బులా/బెర్నినా మార్గంలో నుంచి ప్రీడా నుంచి బెర్గ్యున్ వరకు శనివారం విజయవంతంగా నడిపినట్లు తెలిపింది. సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పట్టిందని వివరించింది. పర్వతాల దిగువన మెలికలు తిరుగుతూ ఉండే 22 టన్నెళ్లు, 48 వంతెనల మీదుగా సాగే సుందరమైన ఈ మార్గాన్ని 2008లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చిందని తెలిపింది. 175వ వార్షిక ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుంటున్న స్విస్ రైల్వేల ఇంజినీరింగ్ ప్రతిభను చాటేందుకే ఈ ప్రయత్నాన్ని చేపట్టినట్లు రేషియన్ రైల్వే డైరెక్టర్ రెనాటో ఫసియాటి చెప్పారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. -
మెదక్లో రైలు కూత
మెదక్జోన్: మెదక్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. శుక్రవారం మెదక్లో రైలు కూత వినిపించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మెదక్–అక్కన్నపేట రైల్వేస్టేషన్ మధ్య నూతన రైల్వే లైన్ను జాతికి అంకితం చేస్తూ మెదక్ నుంచి కాచిగూడ వరకు ప్యాసింజర్ రైలును మెదక్ రైల్వేస్టేషన్లో కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, రఘునందన్రావు, ఎమ్మెల్సీ సుభాష్రెడ్డితో కలిసి ప్రారంభించి రైలు టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎన్నికై ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడి ప్రజలు రైలు కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మెదక్ జిల్లా ప్రజలకు ఇది పండుగ వేళ అన్నారు. మెదక్–అక్కన్నపేట వరకు 17.2 కిలోమీటర్ల రైల్వేలైన్ కోసం రూ.205 కోట్లు వ్యయమైందన్నారు. మెదక్ నుంచి రెండు ప్యాసింజర్ రైళ్లను ప్రారంభిస్తున్నామన్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్–ముంబై ట్రాక్కు కనెక్ట్ చేస్తారని చెప్పారు. త్వరలో వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు గతంలో ఈ ప్రాంతంలోని మాసాయిపేట వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొట్టిన దుర్ఘటన ఇంకా తన కళ్ల ముందే కదలాడుతోందని, అలాంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 43 స్టేషన్ల పరిధిలో ప్రత్యేక పనులను చేపట్టామని కిషన్రెడ్డి చెప్పారు. భద్రాచలం, సత్తుపల్లిలో రైల్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు సైతం రూ.221 కోట్ల వ్యయంతో జరుగుతున్నాయని, రూ.653 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి అభివృద్ధి చేసుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టంచేశారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి అన్ని రంగాల్లో్ల ప్రాధాన్యత ఇస్తోందని, మెదక్ జిల్లా కేంద్రానికి నేషనల్ హైవే నర్సాపూర్ మీదుగా నిర్మించారని చెప్పారు. అలాగే జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.లక్షా నాలుగు వేల కోట్లను ఖర్చుపెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య నియంత్రణ కోసం చర్లపల్లి రైల్వేస్టేషన్లో రూ.221 కోట్లతో రైల్వే టర్మినల్ నిర్మిస్తున్నామన్నారు. వరంగల్లో రూ.400 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
నిరీక్షణ ఫలించిన వేళ.. మెతుకుసీమకు రైలుబండి
మెదక్జోన్: ఎన్నో దశాబ్దాలుగా రైలుకోసం ఎదురు చూస్తున్న మెతుకు సీమ ప్రజల కల ఎట్టకేలకు నెరవేరే సమయం ఆసన్నమైంది. శుక్రవారం రైలు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. దివంగత ఇందిరా గాంధీ ఎంపీగా మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటినుంచే ఈ ప్రాంతానికి రైల్వే సౌకర్యం కల్పించాలన్న డిమాండ్ ఉంది. అందుకోసం చాలా కాలం ఉద్యమాలు కొనసాగాయి. 2012 –13లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకు ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి ఫలితంగా కాస్ట్ షేరింగ్ పద్ధతిలో రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు కొత్త బ్రాడ్గేజ్ రైల్వేలైన్ మంజూరైంది. 2014లో శంకుస్థాపన.. మెదక్–అక్కన్నపేట రైల్వేలైన్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 17.2 కిలోమీటర్ల దూరం కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి 2012–2013 సంవత్సరంలో రూ.117 కోట్లు అవసరమని అంచనా వేసి ఆమోదం తెలిపారు. 2014లో రైల్వేలైన్ నిర్మాణానికి అప్పటి ఎంపీ విజయశాంతి చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత పనుల ఆలస్యంతో అంచనా వ్యయం రూ.206 కోట్లకు చేరింది. ఇందులో రూ.103 కోట్లు రాష్ట్రం భరించగా, మిగతా నిధులు కేంద్రం విడుదల చేసింది. భూసేకరణకు రాష్ట్ర నిధులు రైల్వేలైన్ కోసం అవసరమయ్యే 392 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైతులకు రూ.16.80 కోట్ల పరిహారం అందజేసింది. రేక్పాయింట్తో రైతులకు మేలు.. రెండు నెలల క్రితమే మెదక్కు రేక్పాయింట్ మంజూరు కాగా, మంత్రి హరీశ్రావు దానిని ప్రారంభించారు. రైతులు తాము పండించిన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా తరలించుకోవడానికి ఈ పాయింట్ ఉపయుక్తంగా ఉంటుంది. అదే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎరువులు, ఇతర ఉత్పత్తులు కూడా దిగుమతి చేసుకోవచ్చు. మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు సౌలభ్యం మెదక్ నుంచి రైళ్ల రాకపోకలతో మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. మెదక్, హవేళిఘనాపూర్, చిన్నశంకరంపేట, కొల్చారం మండలాలు, కామారెడ్డి జిల్లా లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వారు ఈ సేవలు పొందొచ్చు. కలనెరవేరింది... మెదక్ నుంచి ఇందిరాగాంధీ ఎంపీగా గెలుపొంది దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచే ఇక్కడి ప్రజలు రైలు కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని రాష్ట్ర వాటాగా 50 శాతం నిధులు విడుదల చేయడంతోపాటు భూసేకరణ కూడా వేగవంతం చేసి పరిహారం చెల్లించారు. దీంతో పనులు త్వరగా పూర్తయ్యాయి. ఎట్టకేలకు రైలు రాకతో ఈ ప్రాంత ప్రజల కల నెరవేరింది. :: పద్మాదేవేందర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మూడు రైల్వేస్టేషన్లు.. మెదక్– అక్కన్నపేట మధ్యలో కొత్తగా నిర్మించిన రైల్వేలైన్ దూరం 17.2 కిలోమీటర్లు. ఈ మధ్యలో మెదక్, శమ్నాపూర్, లక్ష్మాపూర్లలో కొత్తగా రైల్వేస్టేషన్లు నిర్మించారు. ప్రస్తుతానికి మెదక్ టు కాచిగూడ, మెదక్ టు మహబూబ్నగర్కు ఉదయం, సాయంత్రం వేళ రెండు రైళ్లు నడుపుతారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని రైళ్లు నడిపేందుకు ప్రయత్నిస్తామని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెప్పారు. -
ప్యాసింజర్ రైళ్ల రద్దు.. ఆలస్యం! కారణం ఏంటంటే..
దేశవ్యాప్తంగా పలు ప్యాసింజర్ రైళ్లను అర్ధాంతరంగా ఇండియన్ రైల్వేస్ రద్దు చేస్తోంది. అంతేకాదు చాలావరకు ప్యాసింజర్ రైళ్లు విపరీతమైన ఆలస్యంతో నడుస్తున్నాయి. ఈ పరిణామాలేవీ ఊహించని ప్రయాణికులు.. ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ఎందుకంటారా?.. తీవ్రమైన బొగ్గు కొరత. అవును.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కొనసాగుతోంది. వేసవి కావడం.. విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో బొగ్గుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో.. విద్యుత్ సంక్షోభం తలెత్తే ఘటింకలు మోగుతుండడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. బొగ్గు సరఫరా కోసం మార్గం సుగమం చేసేందుకే ప్యాసింజర్ రైళ్లను రద్దుచేయడం, ఆలస్యంగా నడపడం చేస్తోంది రైల్వే శాఖ. అంతేకాదు గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతంగా బొగ్గు లోడ్ను గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నాలు చేస్తోంది. భారత్లో 70 శాతం కరెంట్ బొగ్గు నుంచే ఉత్పత్తి అయ్యేది. అలాంటిది దేశంలో ప్రస్తుతం అనేక ప్రాంతాలు చాలా గంటలు కరెంట్ కోతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని పరిశ్రమలు అయితే ఈ శిలాజ ఇంధనం కొరత కారణంగా ఉత్పత్తిని తగ్గించేశాయి. ఉక్రెయిన్పై రష్యా దాడికి ఆజ్యం పోసిన అధిక ఇంధన ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కష్టపడుతున్న సమయంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. మొత్తంగా 670 ప్యాసింజర్ ట్రిపులను మే 24వ తేదీవరకు రద్దు చేసినట్లు.. మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు నొటిఫై చేసింది రైల్వేస్. అయితే ఏయే రూట్లలో ప్రయాణాలు రద్దు అనేది ప్రయాణికులే గమనించాలని కోరింది. అలాగే ప్యాసింజర్ రైళ్ల అంతరాయం తాత్కాలికం మాత్రమేనని, అతిత్వరలోనే పరిస్థితి చక్కబడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్కృష్ణ బన్సాల్. ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరుతున్నారు. బొగ్గు సరఫరాలో అంతరాయాలకు భారతీయ రైల్వే తరచు విమర్శలు ఎదుర్కొనడం సహజంగా మారింది. సరిపడా క్యారేజీలు లేకపోవడం వల్ల ఎక్కువ దూరాలకు ఇంధనాన్ని తీసుకెళ్లడం కష్టంగా ఉంటోంది. అలాగే రద్దీగా ఉండే మార్గాల్లో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు తమ తమ ప్రయాణాల కోసం తంటాలు పడుతుంటాయి. కొన్నిసార్లు సరుకులు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ, గనులకు దూరంగా ఉన్న వినియోగదారుల కోసం క్యారియర్ బొగ్గు రవాణా కొనసాగుతోంది. ఢిల్లీలో పరిస్థితి ఘోరం ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే బొగ్గు కొరత తీవ్రంగా మారుతోంది. దీంతో డిల్లీ సర్కార్.. కేంద్రం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఢిల్లీకి అవసరమయ్యే 30 శాతం పవర్ను దాద్రి-2, ఊంచహార్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం వాటిలో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే.. అవి పని చేయడం ఆగిపోతాయని ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మెట్రో రైళ్లతో పాటు ఆస్పత్రుల్లోనూ కరెంట్ సరఫరా నిలిచిపోతుందటూ ఢిల్లీ సర్కార్ ఒక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. -
ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: పలు మార్గాల్లో ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–రేపల్లె–సికింద్రాబాద్ రైలు (17645/17646)ఈ నెల 27 నుంచి రాకపోకలు సాగించనుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 7.45కు రేపల్లెకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 7.50 గంటలకు రేపల్లె నుంచి బయలుదేరి సాయంత్రం 4.55 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాచిగూడ–నిజామాబాద్ రైలు (07594/07595)ఈ నెల 29 నుంచి రాకపోకలు సాగించనుంది. సాయంత్రం 6.50 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 11.50కి నిజామాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి ఉదయం 9.40గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. రాయచూర్–గద్వాల్ (07496/07495) ఈ నెల 27నుంచి అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం 1.10 కి బయలుదేరి 2.30 కు గద్వాల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.20 కి రాయచూర్ చేరుకుంటుంది. -
విశాఖ – కోరాపుట్ ప్యాసింజర్ పునఃప్రారంభం
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖపట్నం – కోరాపుట్ – విశాఖపట్నం ప్యాసింజర్ రైలును రైల్వే మంత్రి అశ్వినివైష్టవ్ శుక్రవారం కోరాపుట్ స్టేషన్లో జెండా ఊపి పునః ప్రారంభించారు. అనంతరం ఇదే రైలులో ఈ మార్గంలో స్పెషల్ బోగీలో విండో ఇన్స్పెక్షన్ చేశారు. గతంలో విశాఖపట్నం – కోరాపుట్ – విశాఖపట్నం మధ్య నడిచే డైలీ ప్యాసింజర్ రైలును కరోనా కారణంగా నిలిపేశారు. ఈ క్రమంలో ప్రజల విజ్ఞప్తి మేరకు పునః ప్రారంభించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించిందని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. శనివారం నుంచి విశాఖపట్నం–కోరాపుట్(08538), ఆదివారం నుంచి కోరాపుట్–విశాఖపట్నం (08537) రైళ్లు పాత టైమింగ్స్ ప్రకారమే నడువనున్నాయి. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం–నిజాముద్దీన్–విశాఖపట్నం సమతా ఎక్స్ప్రెస్, విశాఖపట్నం –నిజాముద్దీన్–విశాఖపట్నం స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్లు త్వరలో పూర్తిస్థాయిలో ఎల్హెచ్బీ కోచ్లతో నడుస్తాయని తెలిపారు. సమ్మలేశ్వరి ఎక్స్ప్రెస్, హిరాఖండ్ ఎక్స్ప్రెస్, జగదల్పూర్–రూర్కెలా–జగదల్పూర్ ఎక్స్ప్రెస్లకు లఖింపూర్ రోడ్ను అదనపు హాల్ట్గా అంగీకరించామన్నారు. ఇదే విధంగా విశాఖపట్నం – కిరండూల్ –విశాఖపట్నం ఎక్స్ప్రెస్కు బచేలిలో అదనపు హాల్ట్ కేటాయించనున్నట్లు తెలిపారు. (క్లిక్: సికింద్రాబాద్– కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు) -
చిన్న స్టేషన్లలో ఆగనున్న ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు
కాకినాడ: ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు చిన్న స్టేషన్లలో కూడా నిలుపుదల చేయాలంటూ కాకినాడ ఎంపీ వంగా గీత చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. కరోనా సమయంలో ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసి వాటిని ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్పుచేయడంతో చిన్న స్టేషన్లలో రైళ్ల నిలుపుదల నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఎంపీ వంగా గీత రైల్వే మంత్రి, రైల్వేబోర్డు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరించకపోవడం వల్ల రైతులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, చిరువ్యాపారులు, సాధారణ పేద, మధ్య తరగతి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఆమె కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆమె చేసిన కృషి నేపథ్యంలో ఇప్పటికే తిమ్మాపురం, హంసవరం, రావికంపాడు, రైల్వే స్టేషన్లలో ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను నిలుపుదల చేసేందుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. కాకినాడ–విశాఖ, విశాఖ–కాకినాడ మధ్య శుక్రవారం నుంచి ఈ మూడు స్టేషన్లలో రైలు ఆగనుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం తన విజ్ఞప్తితో రాష్ట్రంలోని ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరణతోపాటు చిన్న స్టేషన్లలో రైళ్ల నిలుపుదల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్న రైల్వే అధికారులకు ఎంపీ వంగా గీత కృతజ్ఞతలు తెలిపారు. ఇది చదవండి: అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్న ఆలోచనే బాబుకు లేదు: సీఎం జగన్ -
మంటల్లో ఇంజన్.. రైలును ముందుకు తోసిన ప్యాసింజర్లు
ఐకమత్యమే మహాబలం అనేవాళ్లు పెద్దలు. అలాగే భిన్నత్వంలో ఏకత్వం.. బహుశా మన గడ్డకే సొంతమైన స్లోగన్ కాబోలు. కొన్ని పరిస్థితులు, ఘటనలు మినహాయిస్తే.. కలిసికట్టుగా ముందుకు సాగడంలో మనకు మనమే సాటి. ఇందుకు సంబంధించిన వీడియో ఇది. యూపీలో జరిగిన ఓ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. షార్నాపూర్-ఢిల్లీ మధ్య రైలు, మీరట్ దౌరాలా రైల్వే స్టేషన్ దగ్గర రైలు శనివారం అగ్నిప్రమాదానికి గురైంది. ఇంజన్కు మంటలు అంటుకోగా.. దాని నుంచి వెనకాల రెండు బోగీలకు మంటలు విస్తరించాయి. వెంటనే అధికారులు స్పందించి.. ఆ ఇంజన్, బోగీలను మిగతా బోగీలతో విడదీశారు. ఆ వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు.. మిగతా కంపార్ట్మెంట్లను ముందుకు తోసి మంటలు అంటుకోకుండా చూడగలిగారు. #WATCH | Uttar Pradesh: Fire broke out in engine & two compartments of a Saharanpur-Delhi train, at Daurala railway station near Meerut. Passengers push the train in a bid to separate the rest of the compartments from the engine and two compartments on which the fire broke out. pic.twitter.com/Vp2sCcLFsd — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2022 ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రయాణికులు రైలును ముందుకు తోస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది. కశ్మీర్లో రోడ్డు ప్రమాదం జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుంది. సాంబా నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఒక కారు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చికిత్స పొందుతున్న డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఆ వాహనం అనంత్నాగ్ వ్యాలీకి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. -
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.. 706 రోజుల తర్వాత..
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. 2020 మార్చి 24 కోవిడ్ తొలి లాక్డౌన్ వేళ నిలిచిన విషయం తెలిసిందే. రైల్వేచరిత్రలో ఇంత సుదీర్ఘకాలం రైళ్లు స్తంభించిన సందర్భం లేదు. కోవిడ్ వల్ల తొలిసారి ఆ పరిస్థితి ఎదురైంది. కోవిడ్ ఆంక్షలను తొలగించేకొద్దీ విడతలవారీగా రైళ్లను తిరిగి పునరుద్ధరించినా, ప్యాసింజర్ రైళ్లకు పచ్చజెండా ఊపలేదు. 706 రోజుల తర్వాత అన్రిజర్వ్డ్ ప్రయాణాలకు అనుమతినిస్తూ, కోవిడ్ ముందు ఉన్న తరహాలో ప్యాసింజర్ రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు రైల్వేబోర్డు అనుమతించింది. కోవిడ్ ప్రబలుతుందని... కోవిడ్ మొదటిదశ తీవ్రత తగ్గిన తర్వాత మూడు నెలలకాలంలో 80% ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించారు. పండగల కోసం కొన్ని స్పెషల్ రైళ్లు నడిపించారు. రెండోదశ లాక్డౌన్తో మళ్లీ రైళ్లకు బ్రేక్పడింది. మళ్లీ తొందరగానే ఎక్స్ప్రెస్, స్పెషల్ రైళ్లను తిరిగి ప్రారంభించారు. కానీ, ఎంత రద్దీ పెరిగినా ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించలేదు. చివరకు స్టేషన్లకు వచ్చే రద్దీని నిలువరించలేక తప్పని పరిస్థితిలో కొన్ని ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించినా, వాటిని ఎక్స్ప్రెస్ రైళ్లుగానే నడిపారు. అన్రిజర్వ్డ్ టికెట్లు జారీ చేస్తే బోగీల్లో రద్దీ పెరిగి కోవిడ్ ప్రబలుతుందని అధికారులు పేర్కొంటూ వచ్చారు. చదవండి: (ఆ మానవ మృగాన్ని అరెస్ట్ చేయకపోవడం దారుణం: బండి సంజయ్) ఇదీ అసలు కారణం... దక్షిణమధ్య రైల్వేలో 230 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. రోజుకు సగటును పదిన్నర లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తే, అందులో 8 లక్షలమంది ప్యాసింజర్ రైళ్లలోనే తిరుగుతారు. కానీ, ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధర నామమాత్రంగా ఉండటంతో వాటి ద్వారా భారీ నష్టాలు వచ్చిపడుతున్నాయి. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణవ్యయంలో 20 శాతం మాత్రమే టికెట్ ద్వారా తిరిగి వసూలవుతుంది. అంటే, 80 శాతం నష్టాలేనన్నమాట. ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా కలుపుకుంటే, మొత్తం నిర్వహణ వ్యయంలో 65 శాతం తిరిగి వసూలవుతాయి. దీంతో వాటిని నడిపే విషయంలో అధికారులు ఆసక్తి చూపలేదన్న అభిప్రాయముంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మొత్తం 230 ప్యాసింజర్ రైళ్లకుగాను 160 రైళ్లు ప్రస్తుతం ఎక్స్ప్రెస్ రైళ్ల తరహాలో అన్రిజర్వ్డ్ టికెట్లు లేకుండా నడుస్తున్నాయి. ఇవి ఇక కోవిడ్ ముందు ఉన్న ప్యాసింజర్ రైళ్ల తరహాలో నడుస్తాయి. ఇప్పటికీ ప్రారంభం కాకుండా ఉన్న మిగతా ప్యాసింజర్ రైళ్లను దశలవారీగా ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. -
కరోనా: ఈ నెల 24 వరకు కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి విస్తరణ ఉధృతంగా కొనసాగుతోంది. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య మూడు లక్షలను దాటేసిన కొత్త కేసుల సంఖ్య 3,47,254గా ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జనవరి ఈ నెల 21 నుండి 24 వరకు కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసింది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. క్రితం రోజు మూడు లక్షలు దాటేయగా 24 గంటల వ్యవధిలో మరింత పెరిగాయి. దేశంలో పాజిటివిటీ రేటు 17.94 శాతానికి ఎగబాకింది. కేసుల పరంగా తెలంగాణాలో రోజుకు నాలుగువేలకు పైగా, ఏపీలో 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 1.40 లక్షల కేసులతో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ ఒమిక్రాన్ బారినపడిన వారి సంఖ్య 9,692కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. (2/3) Cancellation of Passenger Trains from 21st to 24th January, 2022 @drmsecunderabad @drmhyb @drmgtl @VijayawadaSCR @drmgnt #IndiaFightsCorona pic.twitter.com/kPpHJOHHen — South Central Railway (@SCRailwayIndia) January 21, 2022 (1/3) Cancellation of Passenger Trains from 21st to 24th January, 2022 @drmsecunderabad @drmhyb #Unite2FightCorona #IndiaFightsCorona pic.twitter.com/oy6WOCKYbH — South Central Railway (@SCRailwayIndia) January 21, 2022 -
Indian Railways: ప్యాసింజర్ రైళ్లలో ఛార్జీల మోత
Indian Railways continue To reservations For passenger trains second class Journey: సెకండ్ క్లాస్ ప్రయాణాలను రిజర్వేషన్ కేటగిరీలో కొనసాగించడంపై రైల్వే శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. సామాన్యుడికి రిజర్వేషన్ ఛార్జీల భారం తప్పదని పరోక్షంగా తేల్చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈ మేరకు ప్యాసింజర్ రైళ్లలో ద్వితియ శ్రేణి తరగతిలో ప్రయాణాలకు ‘రిజర్వేషన్’ కొనసాగుతుందని పార్లమెంట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎదురైన ఓ ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిచ్చారు. కరోనా ఫస్ట్ ఫేజ్ తర్వా తి సడలింపులతో భారతీయ రైల్వే శాఖ ‘కొవిడ్ స్పెషల్’ పేరిట ప్రత్యేక రైళ్లు నడిపింది. ఆ టైంలో ప్యాసింజర్ రైళ్లను మెయిల్ ఎక్స్ప్రెస్లుగా, పండుగ స్పెషల్గా మార్చేసి ఎక్కువ ఛార్జీలతో రైళ్లను నడిపించింది భారతీయ రైల్వేస్. పైగా సెకండ్ క్లాస్ సహా అన్ని కేటగిరీలను రిజర్వేషన్ కోటాలోకి మార్చేసింది. అయితే.. తాజాగా కొవిడ్ స్పెషల్ కేటగిరీని ఎత్తేస్తూ.. రెగ్యులర్ సర్వీసులుగా వాటిని మార్చేస్తున్నట్లు ప్రకటించింది రైల్వే శాఖ. దీంతో టికెట్ రేట్లు తగ్గుతాయని, సామాన్యుడికి ఊరట లభించిందని, ప్యాసింజర్ రైళ్లు ప్రయాణికుల కోలాహలంతో పూర్వవైభవం సంతరించుకోవచ్చని భావించారంతా. కానీ,. అనూహ్యంగా ప్యాసింజర్ రైళ్లలో సెకండ్క్లాస్ ప్రయాణాలకు ఇంకా రిజర్వేషన్ కేటగిరీ కిందే కొనసాగుతోంది. ఈ విషయమై ఎదురైన ప్రశ్నకు రైల్వే మంత్రి పార్లమెంట్లో బదులిచ్చారు. ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ప్రయాణాలకు, ప్రయాణికులు రిజర్వేషన్ బుకింగ్ చేసుకోవాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ అత్యవసర లేదంటే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే మాత్రం.. కొన్ని రైళ్లకు మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీంతో రిజర్వేషన్ ఛార్జీల రూపంలో సామాన్యుడికి మోత మోగనుంది. అంతేకాదు తక్కువ దూరం ప్రయాణాలైనా సరే.. రిజర్వేషన్ కింద భారం మోయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే రవాణాశాఖ నివేదికల ప్రకారం.. 364 ప్యాసింజర్ రైళ్లను 2020-2021 ఏడాది మధ్య ఎక్స్ప్రెస్ సర్వీసులుగా మార్చేసి నడిపించింది రైల్వే శాఖ. సెకండ్ క్లాస్ కేటగిరీలో సగటున రెండున్నర కోట్ల మంది ప్రయాణిస్తున్నట్లు ఒక అంచనా. సింగిల్ క్లిక్తో 35పై.లకే 10 లక్షల ఇన్సూరెన్స్ -
ఒమిక్రాన్ కేసులు.. రైల్వే గుండెల్లో ‘రైళ్లు’
సాక్షి, హైదరాబాద్: రేపో మాపో పట్టాలెక్కుతాయనుకున్న ప్యాసింజర్ రైళ్లకు బ్రేక్ పడింది. వేగంగా వ్యాపిస్తుందని భావిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్లోనూ వెలుగు చూడటంతో, ప్యాసింజర్ రైళ్లు నడిపే విషయంలో రైల్వే బోర్డు వెనక్కి తగ్గింది. దేశవ్యాప్తంగా 2020 మార్చి చివరలో కోవిడ్ మొదటి లాక్డౌన్ సందర్భంగా రైళ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దశలవారీగా ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కిస్తూ వస్తున్న రైల్వేబోర్డు ప్యాసింజర్ రైళ్లను మాత్రం ప్రారంభించలేదు. ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణికుల నియంత్రణకు అవకాశం లేకపోవటం, ఎక్కువ స్టాపుల్లో ఆగాల్సి ఉండటంతో ఎక్కేవారు, దిగేవారు సైతం ఎక్కువగా ఉంటారనే ఉద్దేశంతో వీటిని నడిపే విషయంలో వెనుకంజ వేస్తూ వచ్చింది. అలా చూస్తుండగానే 20 నెలలు గడిచిపోయాయి. కోవిడ్ రెండో దశ పూర్తిగా తగ్గిపోయినందున ఇక అన్ని రైళ్లను ప్రారంభించాలని అక్టోబర్ చివరలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. పది రోజు ల క్రితం పాత పద్ధతిలో రైళ్లను పునరుద్ధరిస్తూ పాత నంబర్లతో, పాత సమయాల్లో నడపటం మొదలుపెట్టింది. రైళ్లు మామాలుగా తిరుగుతున్నా.. ఎక్కడా కోవిడ్ కేసుల పెరుగుదల లాంటి సమస్యలు రాలేదు. దీంతో ఈ వారం లో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లు ప్రారంభిద్దామనుకున్న సమయంలో తొలిసారిగా కర్ణాటక లో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. కొత్త కేసుల పెరుగుదల లేకుంటే.. కొత్త వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి అనేకమంది ప్రయాణికులు మన దేశానికి వచ్చారని, వారిలో కొందరు కోవిడ్ పాజిటివ్గా ఉన్నారని తేలింది. అలాగే మూడో దశ పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో ఎక్కడా ప్యాసింజర్ రైళ్లు ప్రారంభించొద్దని రైల్వేబోర్డు తాజాగా ఆదేశించింది. మరికొన్ని రోజులు వేచిచూసి, కొత్త కేసుల పెరుగుదల లేకుంటే ప్రారంభించాలని నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 250 ప్యాసింజర్ రైళ్లు తిరుగుతాయి. ప్రస్తుతం వీటిల్లోంచి 50 రైళ్లను మాత్రం ఎక్స్ప్రెస్ రైళ్ల తరహాలో నడుపుతున్నారు. ఇక నగరంలో 121 ఎంఎంటీఎస్ రైళ్లు తిరగాల్సి ఉండగా, దశలవారీగా 60 రైళ్లను ప్రారంభించారు. తాజాగా మరో 25 రైళ్లను గురువారం పట్టాలెక్కించారు. ఎంఎంటీఎస్ రైళ్ల విషయంలో నిర్ణయం జోన్ స్థాయిలో తీసుకునే వీలున్నందున స్థానిక అధికారులు వీటికి పచ్చజెండా ఊపారు. కానీ ప్యాసింజర్ రైళ్ల విషయంలో మాత్రం రెడ్ సిగ్నల్ రావటంతో వీటి ప్రారంభాన్ని వాయిదా వేశారు. -
నష్టాలను తప్పించుకునేందుకు కరోనా సాకు
సాక్షి, హైదరాబాద్: ప్యాసింజర్ రైళ్ల నిర్వహణతో వచ్చే నష్టాలను కొంతమేర తగ్గించుకునేందుకు రైల్వేశాఖ కోవిడ్ బూచిని సాకుగా వాడుకుంటోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, ఆంక్షలు ఎత్తివేసి చాలా రోజులైనా ఈ రైళ్లను పట్టాలెక్కించకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎక్స్ప్రెస్ రైళ్ల పేరుతో సాధారణ రైళ్లను ప్రారంభించి రిజర్వేషన్ టికెట్లతో ప్రయాణాలకు అనుమతించిన రైల్వేశాఖ, తాజాగా అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్నూ ప్రారంభించింది. కానీ, ప్యాసింజర్ రైళ్లను మాత్రం షురూ చేయడం లేదు. ప్యాసింజర్ రైళ్లను ప్రారంభిస్తే కరోనా కేసులు విస్తరించే అవకాశం ఉందని, అందుకే వాటిని ప్రారంభించడం లేదని రైల్వేశాఖ పేర్కొంటోంది. సిటీ బస్సులు, మెట్రో సర్వీసులు, సాధారణ బస్సులు, అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్రార్థన మందిరాలు, ఉత్సవాలు, బహిరంగ సభలు, పెళ్లిళ్లుపేరంటాలు.. ఇలా వేటివల్లా విస్తరించని కరోనా, ప్యాసింజర్ రైళ్లతోనే వ్యాపిస్తుందన్న వాదన వింతగా కనిపిస్తున్నాయి. ఈ రైళ్లు లేకపోవటంతో అల్పాదాయ ప్రయాణికులు ఎక్కువ ధర చెల్లించి ఇతర ప్రయాణ సాధనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. (చదవండి: సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు: బడి బండి భద్రమేనా?) నిర్వహణ వ్యయం ఎక్కువే.. ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరల్లో ప్రయాణికులపై 30 శాతమే భారం పడుతోందని, 70 శాతాన్ని రైల్వేనే రాయితీగా భరిస్తోందని రైల్వేశాఖ స్పష్టం చేస్తోంది. సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ రాయితీ 55 శాతం వరకు ఉందని పేర్కొంటోంది. అలాగే, ప్యాసింజర్ రైళ్లకు హాల్టులు ఎక్కువ. ప్రయాణికులున్నా.. లేకున్నా.. నిర్ధారిత స్టేషన్లో కచ్చితంగా ఆగాల్సిందే. ఇలా రైలును ఆపి మళ్లీ పరిగెత్తించేందుకు డీజిల్/విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో చమురు/కరెంట్ ఛార్జీ భారం పెరుగుతుంది. 400 కి.మీ. దూరం ఉండే గమ్యం చేరటంలో ఎక్స్ప్రెస్ రైళ్లు నాలుగైదు స్టేషన్లకు మించి ఆగవు. కానీ, 150 కి.మీ. దూరంలో ఉండే ప్రాంతానికి వెళ్లే ప్యాసింజర్ రైళ్లు 15 నుంచి 18 వరకు స్టేషన్ల్లో ఆగుతాయి. ఇది నిర్వహణ ఖర్చును పెంచేందుకు కారణమవుతోంది. టికెట్ ధరలు చవక, నిర్వహణ వ్యయం ఎక్కువతో ప్యాసింజర్ రైళ్లు భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. రావాల్సింది రూ.900 కోట్లు.. వస్తోంది రూ.400 కోట్లు.. దక్షిణమధ్య రైల్వేకు కోవిడ్కు ముందు నెలకు రూ.400 కోట్ల మేర టికెట్ రూపంలో ఆదాయం వచ్చేది. ఇందులో ప్యాసింజర్ రైళ్లతో వచ్చేది రూ.60 కోట్లు మాత్రమే. నష్టాలు లేకుండా బ్రేక్ ఈవెన్ రావాలంటే ఈ ఆదాయం రూ.900 కోట్ల వరకు ఉండాలి. అంటే.. అంతమేర నష్టాలొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇంత నష్టాలొస్తున్నా.. సరుకు రవాణా రైళ్లతో సమకూరుతున్న భారీ వసూళ్లతో దీన్ని కొంత పూడ్చుకుంటోంది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ నిబంధనల మేరకు ప్యాసింజర్ రైళ్లను గతేడాది మార్చి ఆఖరున నిలిపేశారు. ఆ తర్వాత వాటిని ప్రారంభించలేదు. కానీ, దశలవారీగా ఎక్స్ప్రెస్ రైళ్లను స్పెషల్ ఎక్స్ప్రెస్లుగా, పండగ ప్రత్యేక రైళ్లుగా తిప్పుతూ ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రారంభించారు. అవి కిక్కిరిసి ప్రయాణికులతో పరుగుపెడుతున్నాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం దేశం మొత్తమ్మీద కేరళ మినహా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కువ కరోనా కేసులు నమోదు కావడం లేదు. మూడో వేవ్ వస్తుందన్న హెచ్చరికలున్నా.. దేశంలో ఎక్కడా కఠిన నియంత్రణలు, ఆంక్షలు లేవు. కానీ, ఒక్క ప్యాసింజర్ రైళ్ల విషయంలోనే ఏడాదిన్నరగా ఆంక్షలు కొనసాగిస్తుండటం విడ్డూరంగా కనిపిస్తోంది. కనీసం వాటిని ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి రైల్వే బోర్డు నుంచి జోన్లకు కనీస సమాచారం కూడా లేదు. ► దక్షిణమధ్య రైల్వే పరిధిలో నిత్యం నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లు: 350 ► ప్యాసింజర్ రైళ్లు: 200 ► నిత్యం జోన్ పరిధిలో ప్రయాణించేవారు: 10.5 లక్షలు ► వీరిలో అన్రిజర్వ్డ్ బోగీల్లో ఎక్కేవారు: 8 లక్షలు ► నిత్యం టికెట్ల ద్వారా సమకూరే ఆదాయం: రూ.12–15 కోట్లు ► ఈ మొత్తంలో ప్యాసింజర్ రైళ్ల వాటా: రూ.3 కోట్లలోపే ► ప్యాసింజర్ రైలు టికెట్పై రూపాయికి 70 పైసల నష్టం వాటిల్లుతోంది.. ఇదీ రైల్వే మాట. ► కోవిడ్ ఆంక్షల పేరుతో ఏడాదిన్నరగా ప్యాసింజర్ రైళ్ల సిబ్బంది జీతాలు మినహా నిర్వహణ నష్టాలన్నీ ఆగిపోయాయి. ► టికెట్ ఆదాయం కూడా ఆగినా.. అది నామమాత్రమే. -
నష్టాలను తప్పించుకునేందుకే కరోనా సాకు
సాక్షి, హైదరాబాద్: ప్యాసింజర్ రైళ్ల నిర్వహణతో వచ్చే నష్టాలను కొంతమేర తగ్గించుకునేందుకు రైల్వేశాఖ కోవిడ్ బూచిని సాకుగా వాడుకుంటోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, ఆంక్షలు ఎత్తివేసి చాలా రోజులైనా ఈ రైళ్లను పట్టాలెక్కించకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎక్స్ప్రెస్ రైళ్ల పేరుతో సాధారణ రైళ్లను ప్రారంభించి రిజర్వేషన్ టికెట్లతో ప్రయాణాలకు అనుమతించిన రైల్వేశాఖ, తాజాగా అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్నూ ప్రారంభించింది. కానీ, ప్యాసింజర్ రైళ్లను మాత్రం షురూ చేయడం లేదు. ప్యాసింజర్ రైళ్లను ప్రారంభిస్తే కరోనా కేసులు విస్తరించే అవకాశం ఉందని, అందుకే వాటిని ప్రారంభించడం లేదని రైల్వేశాఖ పేర్కొంటోంది. సిటీ బస్సులు, మెట్రో సరీ్వసులు, సాధారణ బస్సులు, అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్రార్థన మందిరాలు, ఉత్సవాలు, బహిరంగ సభలు, పెళ్లిళ్లుపేరంటాలు.. ఇలా వేటివల్లా విస్తరించని కరోనా, ప్యాసింజర్ రైళ్లతోనే వ్యాపిస్తుందన్న వాదన వింతగా కనిపిస్తున్నాయి. ఈ రైళ్లు లేకపోవటంతో అల్పాదాయ ప్రయాణికులు ఎక్కువ ధర చెల్లించి ఇతర ప్రయాణ సాధనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. చదవండి: ‘ట్యాంక్బండ్ను చూసి ఎలా ఫీల్ అవుతున్నారు.. పాండిచ్చేరిలా ఉంది’ నిర్వహణ వ్యయం ఎక్కువే.. ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరల్లో ప్రయాణికులపై 30 శాతమే భారం పడుతోందని, 70 శాతాన్ని రైల్వేనే రాయితీగా భరిస్తోందని రైల్వేశాఖ స్పష్టం చేస్తోంది. సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ రాయితీ 55 శాతం వరకు ఉందని పేర్కొంటోంది. అలాగే, ప్యాసింజర్ రైళ్లకు హాల్టులు ఎక్కువ. ప్రయాణికులున్నా.. లేకున్నా.. నిర్ధారిత స్టేషన్లో కచి్చతంగా ఆగాల్సిందే. ఇలా రైలును ఆపి మళ్లీ పరిగెత్తించేందుకు డీజిల్/విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో చమురు/కరెంట్ ఛార్జీ భారం పెరుగుతుంది. 400 కి.మీ. దూరం ఉండే గమ్యం చేరటంలో ఎక్స్ప్రెస్ రైళ్లు నాలుగైదు స్టేషన్లకు మించి ఆగవు. కానీ, 150 కి.మీ. దూరంలో ఉండే ప్రాంతానికి వెళ్లే ప్యాసింజర్ రైళ్లు 15 నుంచి 18 వరకు స్టేషన్ల్లో ఆగుతాయి. ఇది నిర్వహణ ఖర్చును పెంచేందుకు కారణమవుతోంది. టికెట్ ధరలు చవక, నిర్వహణ వ్యయం ఎక్కువతో ప్యాసింజర్ రైళ్లు భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. చదవండి: ట్యాంక్ బండ్: ఆదివారం.. ఆనంద విహారం రావాల్సింది రూ.900 కోట్లు.. వస్తోంది రూ.400 కోట్లు.. దక్షిణమధ్య రైల్వేకు కోవిడ్కు ముందు నెలకు రూ.400 కోట్ల మేర టికెట్ రూపంలో ఆదాయం వచ్చేది. ఇందులో ప్యాసింజర్ రైళ్లతో వచ్చేది రూ.60 కోట్లు మాత్రమే. నష్టాలు లేకుండా బ్రేక్ ఈవెన్ రావాలంటే ఈ ఆదాయం రూ.900 కోట్ల వరకు ఉండాలి. అంటే.. అంతమేర నష్టాలొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇంత నష్టాలొస్తున్నా.. సరుకు రవాణా రైళ్లతో సమకూరుతున్న భారీ వసూళ్లతో దీన్ని కొంత పూడ్చుకుంటోంది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ నిబంధనల మేరకు ప్యాసింజర్ రైళ్లను గతేడాది మార్చి ఆఖరున నిలిపేశారు. ఆ తర్వాత వాటిని ప్రారంభించలేదు. కానీ, దశలవారీగా ఎక్స్ప్రెస్ రైళ్లను స్పెషల్ ఎక్స్ప్రెస్లుగా, పండగ ప్రత్యేక రైళ్లుగా తిప్పుతూ ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రారంభించారు. అవి కిక్కిరిసి ప్రయాణికులతో పరుగుపెడుతున్నాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం దేశం మొత్తమ్మీద కేరళ మినహా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కువ కరోనా కేసులు నమోదు కావడం లేదు. మూడో వేవ్ వస్తుందన్న హెచ్చరికలున్నా.. దేశంలో ఎక్కడా కఠిన నియంత్రణలు, ఆంక్షలు లేవు. కానీ, ఒక్క ప్యాసింజర్ రైళ్ల విషయంలోనే ఏడాదిన్నరగా ఆంక్షలు కొనసాగిస్తుండటం విడ్డూరంగా కనిపిస్తోంది. కనీసం వాటిని ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి రైల్వే బోర్డు నుంచి జోన్లకు కనీస సమాచారం కూడా లేదు. ►దక్షిణమధ్య రైల్వే పరిధిలో నిత్యం నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లు: 350 ►ప్యాసింజర్ రైళ్లు: 200 ►నిత్యం జోన్ పరిధిలో ప్రయాణించేవారు: 10.5 లక్షలు ►వీరిలో అన్రిజర్వ్డ్ బోగీల్లో ఎక్కేవారు: 8 లక్షలు ► నిత్యం టికెట్ల ద్వారా సమకూరే ఆదాయం: రూ.12–15 కోట్లు ►ఈ మొత్తంలో ప్యాసింజర్ రైళ్ల వాటా: రూ.3 కోట్లలోపే ►ప్యాసింజర్ రైలు టికెట్పై రూపాయికి 70 పైసల నష్టం వాటిల్లుతోంది.. ఇదీ రైల్వే మాట. ►కోవిడ్ ఆంక్షల పేరుతో ఏడాదిన్నరగా ప్యాసింజర్ రైళ్ల సిబ్బంది జీతాలు మినహా నిర్వహణ నష్టాలన్నీ ఆగిపోయాయి. ► టికెట్ ఆదాయం కూడా ఆగినా.. అది నామమాత్రమే.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- భర్తతో విడిపోయిన సీరియల్ నటి.. సోషల్ మీడియాలో పోస్ట్
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement