-
మే 13న ఎన్నికలు.. ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
భారత ఎన్నికల సంఘం టైమ్టేబుల్ ప్రకారం ఏడు దశల లోక్సభ 2024 ఎన్నికల నాలుగో రౌండ్ మే 13న (సోమవారం) జరగనుంది. అయితే ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా నియోజకవర్గాలలోని స్కూల్స్, ఇతర సంస్థలకు ఈసీ సెలవు ప్రకటించింది. ఆర్బీఐ ప్రకారం ఓటింగ్ జరగనున్న అన్ని నియోజకవర్గాల్లో బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు మే 13న 4వ దశ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ- కాశ్మీర్లో బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. -
గోల్డ్ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ ) నగదు పంపిణీని రూ.20,000కి పరిమితం చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. లోన్కోసం వచ్చిన వినియోగదారులకు ఎన్బీఎఫ్సీలు నగదు రూపంలో గరిష్ఠంగా రూ.20వేలు మాత్రమే అందించేలా ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. తాజా ప్రకటనతో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు గురువారం బలహీనపడ్డాయి. ముత్తూట్ ఫైనాన్స్ షేర్ ధర 3.73%, మణప్పురం ఫైనాన్స్ 7.3%, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ 4% క్షీణించింది. ఆర్బీఐ నిర్ణయంతో బంగారం తాకట్టుపెట్టి నగదు తీసుకోవాలనుకునే వారికి ఇబ్బంది కలుగుతుందని పలువురు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలుఎన్నికల నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం సరైందేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో భాగంగా ఖర్చులకు డబ్బు సమకూర్చాలంటే ఇంట్లో బంగారం తాకట్టుపెట్టి నగదు తీసుకుంటారు. అలాంటి చర్యలను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకొచ్చినట్లు కొందరు చెబుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. బంగారం తాకట్టు పెట్టే వారికి ఇకపై గరిష్ఠంగా రూ.20వేలు నగదు మాత్రమే ఇస్తారు. మిగతా డబ్బు నేరుగా తమ బ్యాంకు అకౌంట్లో జమచేస్తారు. తిరిగి బ్యాంకుకు వెళ్లి నిబంధనల ప్రకారం డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. -
ఇక ఆ బ్యాంక్ యాప్ వాడుకోవచ్చు.. ఆర్బీఐ ఊరట
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ ఆర్బీఐ ఊరట కలిగించింది. బీవోబీ వరల్డ్ మొబైల్ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు తాజాగా బీవోబీకు అనుమతినిచ్చింది.బీవోబీ వరల్డ్ యాప్ ద్వారా వినియోగదార్లను చేర్చుకోరాదంటూ 2023 అక్టోబర్ 10న ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వర్తించే మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా వినియోగదార్లను చేర్చుకుంటామని బీవోబీ తెలిపింది.'బీవోబీ వరల్డ్' యాప్ అనేది పెద్ద సంఖ్యలో కస్టమర్ల కోసం ఒక ప్రాథమిక ఛానెల్, వీడియో కేవైసీ ద్వారా ఖాతా తెరవడాన్ని సులభతరం చేస్తుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఓ మొబైల్ బ్యాంకింగ్ ఛానెల్ని ఆర్బీఐ నిషేధించడం ఇదే తొలిసారిగా నిలిచింది. ఈ నెల ప్రారంభంలో, కొత్త కస్టమర్లను డిజిటల్గా ఆన్బోర్డ్ చేయకుండా కోటక్ బ్యాంక్ను కూడా ఆర్బీఐ నిషేధించింది. -
బజాజ్ ఫైనాన్స్కు ఆర్బీఐ ఉపశమనం
బజాజ్ ఫైనాన్స్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉపశమనం కల్పించింది. బజాజ్ ఫైనాన్స్కు సంబంధించిన రెండు ఉత్పత్తులు ఈకామ్ (eCOM), ఆన్లైన్ డిజిటల్ ఇన్స్టా ఈఎంఐ (Insta EMI) కార్డ్పై ఉన్న ఆంక్షలను తక్షణమే తొలగించింది. ఈమేరకు కంపెనీ మే 2న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది.ఈఎంఐ కార్డ్ల జారీతో సహా రెండు వ్యాపార విభాగాలలో రుణాల మంజూరు, పంపిణీని ఇప్పుడు పునఃప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. 2023 నవంబర్ 15న బజాజ్ ఫైనాన్స్ లెండింగ్ ఉత్పత్తులైన ఈకామ్, ఇన్స్టా ఈఎంఐ కార్డ్ కింద రుణాల మంజూరు, పంపిణీని తక్షణమే నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. తమ డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలు, నిబంధనలకు కంపెనీ కట్టుబడి ఉండకపోవడంతో ఆంక్షలు విధించింది.ఆర్బీఐ గత సంవత్సరం తమ రెండు రుణ ఉత్పత్తులపై వ్యాపార పరిమితులను విధించిన తర్వాత అవసరమైన మార్పులు చేసినట్లు బజాజ్ ఫైనాన్స్ ఏప్రిల్ 25న జనవరి-మార్చి ఫలితాలను ప్రకటిస్తూ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీన్ని అనుసరించి, ఆంక్షలను సమీక్షించాలని ఆర్బీఐని అభ్యర్థించింది. -
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
అనంతపురం, సాక్షి: జిల్లాలో భారీగా డబ్బుతో కంటెయినర్లు వెళ్తుండడం ఒక్కసారిగా కలకలం రేపింది. హైదరాబాద్ - బెంగళూరు హైవేపై నాలుగు కంటెయినర్లలో వెళ్తున్న భారీ డబ్బును పోలీసులు గుర్తించారు. అయితే ఆ నగదు సస్పెన్స్ కాసేపటికే వీడింది.పామిడి మండలం గజరాంపల్లి దగ్గర హైవేపై నాలుగు కంటెయినర్లను పోలీసులు తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నారు. ఆ కంటెయినర్లలో ఒక్కోదాంట్లో రూ.500 కోట్ల చొప్పున రూ.2 వేల కోట్ల దాకా నగదు కనిపించింది. ఎన్నికల కోడ్ అమల దృష్ట్యా కలెక్టర్, సంబంధిత అధికారులతో పాటు ఐటీ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.చివరకు పత్రాల పరిశీలన తర్వాత కొచ్చి(కేరళ) నుంచి హైదరాబాద్కు ఆ కంటెయినర్లు వెళ్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ ఆర్బీఐ బ్రాంచ్లో ఆ నగదును డిపాజిట్ చేసేందుకు ఆ కంటెయినర్లు అధికారికంగానే వెళ్తున్నాయని, క్షుణ్ణంగా పరిశీలించాక ఆ కంటెయినర్లను ముందుకు వెళ్లేందుకు అనుమతించినట్లు పామిడి సీఐ రాజశేఖర్రెడ్డి మీడియాకు వివరించారు. -
భారీగా తగ్గుతున్న ఫారెక్స్ నిల్వలు.. కారణం..
దేశంలో విదేశీ మారకం నిల్వలు(ఫారెక్స్) క్రమంగా పడిపోతున్నాయి. ఈమేరకు భారతీయ రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో కీలక అంశాలను ప్రస్తావించింది. వరుసగా రెండోవారం ఈ నెల 19తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.82 బిలియన్ డాలర్లు కరిగిపోయి 640.334 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది.అంతకుముందు వారంలో ఈ నిలువలు 5.401 బిలియన్ డాలర్లు తరిగిపోయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2021లో రికార్డు స్థాయిలో 642.453 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ గరిష్ఠ స్థాయిని అధిగమించాయి. మరోవైపు పసిడి రిజర్వులు పెరుగుతున్నాయి. తాజాగా 1.01 బిలియన్ డాలర్లమేర బంగారు రిజర్వులు పెరిగి 56.808 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదీ చదవండి: ఒకసారి ఛార్జ్చేస్తే 516 కి.మీ వెళ్లేలా కొత్త ఈవీపడిపోతున్న రూపాయిఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ప్రధానంగా అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో గత కొన్ని నెలలుగా రూపాయి విలువ క్రమంగా పతనమవుతోంది. దీంతో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 3.793 బిలియన్ డాలర్లు తరిగిపోయి 560.86 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్బీఐ తెలిపింది. డాలర్తోపాటు యూరో, పౌండ్, యెన్ కరెన్సీలు ఒత్తిడిని ఎదుర్కొనడం వల్ల విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తులు తరిగిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
ఆర్బీఐ కొట్టిన దెబ్బ.. షేర్లు భారీగా పతనం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొట్టిన దెబ్బతో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాని వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఉదయ్ కోటక్ సంపదకు కూడా భారీగా గండి పడింది.కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది.ఆర్బీఐ చర్యల తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం 13 శాతం వరకు పడిపోయాయి. కంపెనీలో దాదాపు 26 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్న ఉదయ్ కోటక్ భారీ నష్టాన్ని చవిచూశారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన సంపద 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10 వేల కోట్లు) తగ్గింది. ఏప్రిల్ 24 నాటికి ఉదయ్ కోటక్ నెట్వర్త్ 14.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.1 లక్షల కోట్లు).ప్రత్యర్థి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ 2016 సెప్టెంబర్ తర్వాత మొదటిసారి కోటక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించింది. విశ్లేషకుల అంచనాలను అధిగమించిన తర్వాత యాక్సిస్ షేర్లు పుంజుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవోగా ఉదయ్ కోటక్ తప్పుకొన్న తర్వాత అశోక్ వాస్వానీ ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్నారు. -
Srishti Dabas: పగలు ఉద్యోగం... రాత్రి చదువు.. ఇప్పుడు ఐ.ఏ.ఎస్.
సృష్టి దబాస్ ముంబై ఆర్.బి.ఐ.లో హెచ్.ఆర్.లో పని చేస్తుంది. ఉద్యోగానికి రానూ పోనూ సమయం పని ఒత్తిడి ఇవేవీ ఆమె ఐ.ఏ.ఎస్. లక్ష్యానికి అంతరాయం కలిగించలేదు. కేవలం సొంతంగా చదువుకొని యు.పి.ఎస్.సి. 2023లో టాప్ 6 వ ర్యాంక్ సాధించింది. ఆమె పరిచయం. ముంబై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ స్థాయిలో హెచ్.ఆర్.లో పని చేస్తున్న సృష్టి దబాస్ నెల జీతం 2,80,000. బహుశా ఒక జిల్లా కలెక్టర్కు కూడా అంతే ఉండొచ్చు. లేదా దరిదాపుల్లో ఉండొచ్చు. 25 ఏళ్ల వయసులో అంత జీతం వస్తున్న ఉద్యోగం (కాంపిటిటివ్ ఎగ్జామ్ రాసి సాధించింది) వేరొకరికి ఉంటే చాలు ఈ జీవితానికి అనుకునేవారు. కాని సృష్టి అలా అనుకోలేదు. ముంబైలో తన రూమ్ నుంచి ఆఫీస్కు రోజూ తిరుగుతూనే, ఉద్యోగం చేస్తూనే ఐ.ఏ.ఎస్ కల నెరవేర్చుకోవాలనుకుంది. సాధించింది. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించడం అంటే మాటలు కాదు. ఆమె చెప్పినట్టుగా ‘దాని వెనుక చాలా కష్టం ఉంది’. అవును. కష్టం లేనిది ఏ విజయమూ దక్కదు. ముందు కుటుంబం ఢిల్లీలో పొలిటికల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన సృష్టి వెంటనే ఉద్యోగం చేసి ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంది. పోటీ పరీక్ష రాసి ‘సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్’మంత్రిత్వ శాఖ’లో ఉద్యోగం సంపాదించింది. మరో పోటీ పరీక్ష రాసి రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించి ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ‘నా కుటుంబం కుదురుకోవాలనుకున్నాను. అందుకే ఉద్యోగాలు చేశాను. నాకు చదువుకోవాలని ఉన్నా ఓపెన్ యూనివర్సిటీ ద్వారానే ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ చదివాను’ అని చెప్పిందామె. సృష్టి తండ్రి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏ.ఎస్.ఐ. స్థాయికి వచ్చిన మధ్యతరగతి ఉద్యోగి. తల్లి గృహిణి. సృష్టి బాల్యం నుంచి కూడా చదువులో చురుగ్గా ఉండేది. మొదటి అటెంప్ట్ టాప్ 10 ర్యాంకుల్లో స్థానం సంపాదించాలంటే చాలామంది రెండోసారి, మూడోసారి ప్రయత్నించి సాధిస్తుంటారు. కాని సృష్టి తన మొదటి ప్రయత్నంలోనే 6వ ర్యాంకు సాధించింది. అదీ ఉద్యోగం చేస్తూ. ‘ఇదెలా సాధ్యం’ అనడిగితే ‘ఉద్యోగం చేస్తూ చదవాలని నిశ్చయించుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా నా మనసుకు తర్ఫీదు ఇచ్చుకున్నాను. నా ఉద్యోగం ఐదు రోజులే. శని, ఆదివారాలు పూర్తిగా చదివేదాన్ని. తెల్లవారు జామున లేవడం నాకు అలవాటు. అప్పుడు చదివేదాన్ని. ఆఫీసు నుంచి తిరిగి వచ్చి అలసట ఉన్నా చదివేదాన్ని. మా అమ్మ నా కష్టం చూసి సతమతమయ్యేది. కాని నేను గట్టిగా నిశ్చయించుకున్నాను. మా ఆఫీస్లో కూడా నాకు ్రపోత్సాహం దొరికింది. పనిలో కాసేపు విరామం దొరికినా ఆర్.బి.ఐ.లోని లైబ్రరీకి వెళ్లి చదువుకునేదాన్ని. నాకున్న సెలవులని పొదుపుగా వాడి ప్రిలిమ్స్కు, మెయిన్స్కు, ఇంటర్వ్యూకు ముందు ఉపయోగించుకున్నాను’ అని తెలిపింది సృష్టి. చట్ట ప్రకారం సృష్టి అటెండ్ అయిన మాక్ ఇంటర్వ్యూల్లో ‘మీ నాన్న పోలీస్ కదా. నువ్వు పోలీసు వారి పని స్వభావంలో ఎటువంటి మార్పు తెస్తావ్’ అని అడిగితే ‘ముందు ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. ఖాళీల వల్ల పని ఒత్తిడి పోలీసులకు ఎక్కువ. అలాగే సాంకేతికంగా వారికి ఆధునిక ఆయుధాలు, ఎక్విప్మెంట్ సమకూర్చాలి’ అని చెప్పింది. ‘ఉత్తర ప్రదేశ్లో జరుగుతున్న ఎన్కౌంటర్లను ఎలా చూస్తావ్’ అనంటే ‘అది చట్టసమ్మతం కాదు. నేనైతే ఎన్కౌంటర్లను కేవలం ఆత్మ రక్షణకు మాత్రమే ఉపయోగిస్తాను’ అని తెలిపింది. ‘బుల్డోజర్లతో ఆక్రమణల తొలగింపు పై నీ అభి్రపాయం ఏమిటి?’ అనడిగితే ‘కూల్చడం కన్నా అక్కడ ఉన్నవారికి పునరావాసం కల్పించడం కీలకం’ అంది. అంతర్జాతీయల వ్యవహారాలను తన ప్రధాన ఆసక్తిగా చెప్పిన సృష్టి మన దేశ అంతర్జాతీయ వ్యవహారాలపై లోతైన అవగాహన కలిగి ఉంది. ఆమె కథక్ డాన్సర్ కూడా. ‘భారతదేశంలో ఎన్ని క్లాసికల్ డాన్సులున్నాయి?’ అనే ప్రశ్నకు ‘మన సంగీత నాటక అకాడెమీ 8 డాన్సులను గుర్తించింది. కాని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చౌవ్ డాన్స్ను కూడా క్లాసికల్గా పేర్కొంది. కాబట్టి సరైన ఆన్సర్ 8 కావచ్చు. 9 కూడా కావచ్చు’ అంది సృష్టి. ఆమె సక్సెస్ స్టోరీ చాలామందికి తప్పకుండా స్ఫూర్తి అవుతుంది -
రఘురామ కేసులో స్టే ఎత్తేయండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఇండ్–భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్ బ్యాంకులను మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై దర్యాప్తు కొనసాగించడానికి వీలుగా స్టే ఎత్తేయాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సర్క్యులర్ను సవాల్ చేస్తూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. ఆర్బీఐ సర్క్యులర్కు సంబంధించి క్రిమినల్ చర్యల్లో ఎఫ్ఐఆర్ కొనసాగుతోందన్నారు. దీనికి సంబంధించి తీర్పు ఉందని తెలిపారు. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగకుండా సుప్రీంకోర్టు స్టే విధించిందని గుర్తుచేశారు. దర్యాప్తు కొనసాగించడానికి వీలుగా స్టే ఎత్తేయాలని అభ్యర్థించారు. రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సీనియర్ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా కేసును కొద్దిసేపు వాయిదా వేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రెండు వారాల తర్వాత విచారణ చేపడతామని కేసును వాయిదా వేసింది. రూ.వందల కోట్ల బ్యాంకు రుణాల మోసం కేసులో ఇండ్–భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్, రఘురామకృష్ణరాజు మరో 15 మందిపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏర్పాటు చేస్తామన్న కంపెనీని నెలకొల్పకుండా.. ఇతర బ్యాంకుల్లో ఆ సొమ్ములు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి వాటిపై మళ్లీ రుణం తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. రంగంలోకి దిగిన ఈడీ మరోవైపు ఇండ్ – భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులను అక్రమంగా తరలించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. తన సంస్థ కోసమని రఘురామ 2011లో మారిషస్కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ.202 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే నిధులు అందిన మరుసటి రోజే రూ.200 కోట్లను ఇండ్ – భారత్ ఎనర్జీ లిమిటెడ్ (ఉత్కళ్)కు తరలించేశారు. ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) దృష్టిలో పడింది. దీంతో విషయాన్ని లోతుగా పరిశీలించిన ఫెమా అధికారులు మారిషస్ కంపెనీ నుంచి రఘురామకృష్ణరాజుకు చెందిన కంపెనీ ఇండ్ –భారత్ సన్ ఎనర్జీకి రూ.202 కోట్లు అందినట్లు గుర్తించారు. అలాగే మరుసటి రోజే ఇండ్ –భారత్ ఎనర్జీ లిమిటెడ్కు ఈ మొత్తం బదిలీ అయినట్లు కూడా నిర్ధారించుకున్నారు. రఘురామరాజు కంపెనీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రూ.40 కోట్లు జరిమానా కూడా విధించింది. ఎన్సీఎల్టీని ఆశ్రయించిన బ్యాంకులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం దివాలా ప్రక్రియకు అనుమతి కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించింది. ఇండ్–భారత్ థర్మల్ రూ.1,383 కోట్ల రుణాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉండగా, చాలాకాలంగా బకాయిలు చెల్లించడం లేదని బ్యాంకుల కన్సార్టియం ఫిర్యాదు చేసింది. రఘురామ కంపెనీ తనఖా పెట్టిన ఆస్తుల విలువ కేవలం రూ.872 కోట్లే ఉండటంతో ఈ కంపెనీ దివాలా తీసినట్లుగా భావిస్తూ దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలని కోరింది. దీంతో బ్యాంకుల వాదనతో ఏకీభవించిన ఎన్సీఎల్టీ దివాలా ప్రక్రియకు అనుమతించింది. బ్యాంకులను నిండా ముంచిన రఘురామకృష్ణరాజు బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని వాటిని నిండా ముంచిన రఘురామకృష్ణరాజుపై దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. గతంలో సీబీఐ దర్యాప్తును ఆపాలంటూ ఆయన తెచ్చుకున్న స్టేను ఎత్తివేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మరోసారి రఘురామ మోసాలు చర్చనీయాంశంగా మారాయి. ఇండ్– భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో ఆయన వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్ల రుణాలను తీసుకున్నారు. ఈ మొత్తాలను కంపెనీ అవసరాలకు వినియోగించకుండా వాటిని తన వారి ఖాతాల్లోకి తరలించి బ్యాంకులను నిండా ముంచారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు వడ్డీ కూడా చెల్లించడం లేదంటూ ఆ బ్యాంకు సీబీఐని ఆశ్రయించడంతో రఘురామ మోసాలు వెలుగులోకి వచ్చాయి. తనకు తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేసుకోవడం, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు చేయడంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 2020 అక్టోబర్లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో 11 సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించాయి. వీటిలో పలు ఫైళ్లు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నాయి ఈ సందర్భంగా సంస్థకు చైర్మన్గా ఉన్న రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. -
ఐదు నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: దేశీయ మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం 4.85 శాతంతో ఐదు నెలల కనిష్ట స్థాయిలో క్షీణించింది. వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 5.09 శాతం, మార్చిలో 5.66 శాతంగా ఉంది. గతేడాది అక్టోబర్లో 4.87 శాతంగా ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన డేటా ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం మార్చిలో 8.52 శాతంగా ఉంది, ఫిబ్రవరిలో 8.66 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చూడాలని ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్కు బాధ్యతలు అప్పగించింది. కాగా, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.9 శాతంగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 3.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. -
చెరుకూరి త్రిపాత్రాభినయం
సాక్షి, అమరావతి: ప్రేక్షకులను అలరించేందుకు కథానాయకులు కొన్ని సినిమాల్లో ద్విపాత్రా భినయం... త్రిపాత్రాభినయం చేయటాన్ని చూస్తుంటాం. చట్టం కళ్లకు గంతలు కట్టి ఆర్థిక అక్రమాలకు పాల్పడేందుకు త్రిపాత్రాభినయం చేయడం మాత్రం చెరుకూరి రామోజీరావుకే చెల్లింది. ఆర్బీఐ కళ్లుగప్పేందుకు చెరుకూరి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఆర్బీఐను బురిడీ కొట్టించేందుకే... ఆర్బీఐ చట్టం 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం ప్రకారం నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. కాగా రామోజీరావు తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్యూఎఫ్) కింద నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అంటే హెచ్యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. దీనిపై ఆర్బీఐగానీ ఇతర దర్యాప్తు సంస్థలుగానీ ప్రశ్నిస్తే తప్పించుకునేందుకు ఆయనో ఎత్తుగడ వేశారు. అదే త్రిపాత్రాభియనం... సాంకేతిక కారణాలతో తప్పించుకునే ఎత్తుగడ చెరుకూరి రామోజీరావు అనే వ్యక్తి ఏకకాలంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్ రశీదులపై హెచ్యూఎఫ్ కర్తగా... చెక్కులపై ప్రొప్రైటర్గా... బోర్డు మీటింగుల మినిట్స్ బుక్లో చైర్మన్గా సంతకాలు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనేది చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థ. ఆ సంస్థ ముసుగులో ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించారు మరి. సాంకేతిక కారణాలను సాకుగా చూపించి తప్పించుకునేందుకే రామోజీరావు ఇలా వేర్వేరు హోదాలతో సంతకాలు చేశారన్నది సుస్పష్టం. కరడుగట్టిన ఆర్థిక నేరస్తులు మినహా ఇతరులు ఇంత పక్కాగా మోసగించలేరని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. డిపాజిట్ పత్రాలపై హెచ్యూఎఫ్ కర్తగా... మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్ల విలువ మేరకు తమ డిపాజిట్దారులకు పత్రాలను జారీ చేసింది. వాటిపై రామోజీరావు తనను తాను ‘హెచ్యూ ఎఫ్ కర్త’గా పేర్కొంటూ సంతకం చేశారు. బోర్డు మీటింగులో చైర్మన్గా... ఇక మార్గదర్శి ఫైనాన్సియర్స్ బోర్డు మీటింగుల విషయం వచ్చేసరికి రామోజీరావు మరో పాత్రలోకి ప్రవేశించారు. బోర్డు మీటింగు మినిట్స్ బుక్లో, తీర్మానాల్లోనూ ఆయన ‘చైర్మన్’ అని సంతకం చేశారు. చెక్కులపై ప్రొప్రైటర్గా... మార్గదర్శి ఫైనాన్సియర్స్ తమ డిపాజిట్దా రులకు కాలపరిమితి తరువాత చెక్కుల రూపంలో చెల్లింపులు చేసింది. ఆమేరకు జారీ చేసిన చెక్కులపై రామోజీరావు ‘ప్రొప్రైటర్’ అని పేర్కొంటూ సంతకం చేశారు. అంటే డిపాజిట్ రశీదు మీద హెచ్యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీరావు చెక్కు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ప్రొప్రైటర్ అయిపోయారు. -
Surinder Chawla : పేటీఎం పేమెంట్ బ్యాంక్కు మరో షాక్!
ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) సీఈఓ పదవికి సురీందర్ చావ్లా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు చావ్లా తెలిపారు. మెరుగైన కెరీర్ కోసం అవకాశాలను అన్వేషించాలని ఉద్దేశంతో పీపీబీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు స్టాక్ మార్కెట్ ఫైలింగ్లో వెల్లడించారు. పీపీబీఎల్లో చావ్లా జూన్ 26 వరకు కొనసాగనున్నారు. గత ఏడాది జనవరి 9న చావ్లా పేమెంట్ బ్యాంక్లో చేరారు. అంతకు ముందు ఆర్బీఎల్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్గా ఉన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్తో పాటు ఇతర సంస్థలలో పనిచేసిన చావ్లాకు బ్యాంకింగ్ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. పేటీఎం పేమెంట్ బ్యాంక్పై ఆరోపణలు పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బయటి ఆడిటర్లు పూర్తిస్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది. 2024 ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లలో డిపాజిట్లతో పాటు ఇతర లావాదేవీలు నిలిపివేయాలని ఆదేశించింది. ఆ గడువు తేదీని మార్చి 15వరకు పొడిగింది. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో లావాదేవీలు నిలిచిపోయాయి. ఇతర యూపీఐ పేమెంట్స్ గూగుల్ పే, ఫోన్పే తరహాలో సేవలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి పీపీబీఎల్ నుంచి విడిపోయిన పేటీఎం ఆర్బీఐ ఆదేశాల మేరకు పీపీబీఎల్ నుంచి పేటీఎం వ్యాపార లావాదేవీలకు స్వస్తి చెప్పింది. బ్యాంక్ బోర్డు స్వతంత్ర చైర్పర్సన్తో పాటు ఐదుగురు స్వతంత్ర డైరెక్టర్లతో పునర్నిర్మించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. -
ఆర్బీఐ కఠిన చర్యలు.. నాలుగు కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఓ ప్రైవేటు బ్యాంక్పై కఠిన చర్యలు తీసుకుంది. నాలుగు ఎన్బీఎఫ్సీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను రద్దు చేసింది. అలాగే ఓ ప్రైవేటు బ్యాంకుకు రూ.1కోటి జరిమానా విధించింది. ఆర్బీఐ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కంపెనీలలో ఉత్తరప్రదేశ్కు చెందిన కుండల్స్ మోటార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడుకు చెందిన నిత్య ఫైనాన్స్ లిమిటెడ్, పంజాబ్ ఆధారిత భాటియా హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్, హిమాచల్ ప్రదేశ్ ఆధారిత జీవన్జ్యోతి డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ లిమిటెడ్ ఉన్నాయి. ఆర్బీఐ చట్టంలో నిర్వచించిన విధంగా ఈ కంపెనీలు ఇప్పుడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వ్యాపార లావాదేవీలను నిర్వహించలేవు. ఇక 'రుణాలు, అడ్వాన్సులు - చట్టబద్ధమైన ఇతర పరిమితులు'పై ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించనందుకు గానూ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు రూ.1కోటి పెనాల్టీ విధించింది. తమ ఆదేశాలు, చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఈ బ్యాంకుకు ఇదివరకే షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. -
త్వరలో ఆర్బీఐ కొత్త మొబైల్ యాప్.. ఎందుకంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కొత్తగా ఓ మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ యాప్తో ప్రభుత్వ బాండ్లు లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు కానున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ను 2021 నవంబర్లో ప్రారంభించింది. ఆర్బీఐ డైరెక్ట్ పోర్టల్ ద్వారా ప్రస్తుతం ప్రైమరీ, సెకండరీ మార్కెట్ ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేయొచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు వేలంలో ఈ సెక్యూరిటీలను అమ్మడం/ కొనడం చేసే వీలుంది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో రిటైల్ డైరెక్ట్ పోర్టల్కు సంబంధించిన మొబైల్ యాప్ను తీసుకురానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇదీ చదవండి: హోమ్ రోబోటిక్స్ విభాగంలోకి ప్రపంచ నం.1 కంపెనీ..? ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలను తెలియజేసే క్రమంలో యాప్కు సంబంధించిన అంశాన్ని దాస్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాప్ సిద్ధమవుతోందని, త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పారు. ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి రూ.14.13 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో తొలి అర్ధభాగంలోనే రూ.7.5 లక్షల కోట్లు సేకరించాలనుకుంటోంది. -
ఎన్నికల బాండ్లు.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
-
ఆర్బీఐ శుభవార్త : యూపీఐతో క్యాష్ డిపాజిట్.. ఎలా చేయొచ్చంటే?
ముంబై : బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త. త్వరలో క్యాష్ డిపాజిట్ చేసేందుకు బ్యాంక్కు వెళ్లే అవసరం లేకుండా యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతాదారులు తమ క్యాష్ డిపాజిట్ చేసేందుకు బ్యాంక్కు వెళ్లే అవసరం లేకుండా బ్యాంకుల్లో ఉన్న ‘క్యాష్ డిపాజిట్ మెషీన్ల’(సీడీఎంఏ)లో నేరుగా యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసేలా కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పెరిగిపోతున్న యూపీఐ వినియోగం దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న యూపీఐ వినియోగంతో బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లావాదేవీల్లో పలు మార్పులు చేస్తున్నామన్న శక్తికాంత్ దాస్.. గతంలో డెబిట్ కార్డ్ సాయంతో ఏటీంఎలో డబ్బుల్ని డ్రా చేసే వీలుండేది. యూపీఐ రాకతో ఏటీఎంలలో కార్డ్ లేకుండా డబ్బుల్ని డ్రా చేసుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా బ్యాంకుల్లో డబ్బుల్ని డిపాజిట్లను సీడీఎంఏ మెషీన్లలలో యూపీఐ ద్వారా చేసుకోవచ్చని సూచించారు. త్వరలో అమలుకు సంబంధించిన సూచనలను ప్రకటిస్తామని అన్నారు. పీపీఐ లింక్ థర్డ్ పార్టీ యూపీఐ అప్లికేషన్ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPIs) లింక్ చేసుకోవడానికి కూడా అనుమతించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన యూపీఐ యాప్స్ ద్వారా మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతోంది. కానీ ఈ సదుపాయం ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPIs) కు అందుబాటులో లేదు. పీపీఐలు యూపీఐ లావాదేవీలు చేయాలంటే, కచ్చితంగా పీపీఐ జారీచేసిన అప్లికేషన్లు మాత్రమే వాడాల్సి వస్తోంది. దీని వల్ల ఖాతాదారులకు ఎంతో అసౌకర్యం కలుగుతోంది. అందుకే పీపీఐ హోల్డర్లు కూడా బ్యాంక్ ఖాతాదారుల లాగా నేరుగా యూపీఐ చెల్లింపులు చేయడానికి అనుమతించాలని ఆర్బీఐ నిర్ణయించింది. -
కీలక వడ్డీరేట్లు యథాతథం
భారతీయ రిజర్వ్బ్యాంక్ వరుసగా ఏడోసారి కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈమేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన (ఆర్బీఐ మానిటరీ పాలసీ) సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఆర్బీఐ మానిటరీ పాలసీలోని ముఖ్యాంశాలు.. బెంచ్మార్క్ వడ్డీరేటు, రెపోరేటు స్థిరంగా 6.5శాతంగా ఉంది. 2024-25 ఏడాదికిగాను జీడీపీ వృద్ధి 7 శాతం నమోదుకానుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం చేరే అవకాశం ఉంది. తొలి త్రైమాసికంలో 4.9%, రెండో త్రైమాసికంలో 3.8%, మూడో త్రైమాసికంలో 4.6%, నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా ఉంటుందని అంచనా. 2023-24కుగాను భారత్కు వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు 625 బిలియన్డాలర్లుగా ఉన్నాయి. ఇవి 2014-15 తర్వాత వచ్చిన రెండో అత్యధిక పెట్టుబడులుగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణ పెరుగుదలపై ఆర్బీఐ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గ్రామీణ గిరాకీ పుంజుకుంటోంది. ఇది 2024-25లో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని అంచనా. ప్రపంచ వృద్ధి నేపథ్యంలో ముడి చమురు ధరల పెరుగుదలను నిశితంగా పరిశీలించాలి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొంటున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కమొడిటీ ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో సావరిన్ గ్రీన్ బాండ్పై ట్రేడింగ్ కోసం ఆర్బీఐ త్వరలో స్కీమ్ను నోటిఫై చేయనుంది. కీలక రేట్లు ఇలా.. రెపోరేటు: 6.5 శాతం ఎస్డీఎఫ్ రేటు: 6.25 శాతం ఎంఎస్ఎఫ్ రేటు: 6.75 శాతం బ్యాంక్ రేటు: 6.75 శాతం -
శని, ఆదివారాల్లో ఎల్ఐసీ ఆఫీసులు ఓపెన్.. కారణం..
ఆర్థిక సంవత్సరం 2023-24 ముగింపు సందర్భంగా కొన్ని ఆర్థిక లావాదేవీలకు గడువు ముగియనుంది. దాంతో కొన్ని సంస్థలు సెలవుదినాల్లోనూ తమ వినియోగదారులకు సేవలందించేందుకు సిద్ధపడుతున్నాయి. అందులో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కార్యాలయాలు శని, ఆదివారాలు (మార్చి 30, 31 తేదీల్లో) పని చేస్తాయని ప్రకటించింది. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా సంబంధిత బ్యాంకు శాఖలు పనిచేసేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే బ్యాంకులకు సూచించింది. ఇదీ చదవండి: టికెట్ లేకుండా విమానం ఎక్కిన వ్యక్తి.. చివరికి ఏమైందంటే.. ఈ నేపథ్యంలోనే భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) సూచనల మేరకు.. పాలసీదారులకు అవసరమైన సేవలను అందించేందుకు జోన్లు, డివిజన్ల పరిధిలోని కార్యాలయాలు సాధారణ పనివేళల వరకు తెరిచే ఉంటాయని ఎల్ఐసీ చెప్పింది. పన్ను శాఖ సంబంధిత కార్యకలాపాల కోసం, పెండింగ్లో ఉన్న డిపార్ట్మెంటల్ పనిని పూర్తి చేయడానికి దేశం అంతటా ఆదాయపు పన్ను కార్యాలయాలు మార్చి 30, 31 తేదీల్లో తెరిచే ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. Press Release: Special Measures for extending services to Policy Holders of LIC of India#LIC pic.twitter.com/qH4oNVe7Gi — LIC India Forever (@LICIndiaForever) March 28, 2024 -
రూ. 2000 నోట్ల మార్పిడి బంద్!
చలామణి నుంచి ఉపసంహరించిన రూ. 2000 నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. ఖాతాల వార్షిక మూసివేత కారణంగా ఏప్రిల్ 1న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో రూ. 2000 నోట్లను మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడానికి వీలు ఉండదని పేర్కొంది. రూ. 2000 నోట్ల మార్పిడి ఈ సదుపాయం ఏప్రిల్ 2న తిరిగి ప్రారంభమవుతుందని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. మే 19, 2023 నుండి ఆర్బీఐ 19 ఇష్యూ కార్యాలయాల్లో రూ. 2000 నోట్ల మార్పిడికి అనుమతిస్తోంది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలో ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్బీఐ గత ఏడాది అక్టోబరు నుంచి ఖాతాదారులు రూ.2000 నోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు స్వీకరిస్తోంది. 2023 మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో 2024 మార్చి 1 నాటికి 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటించిన 2023 మే 19న వ్యాపారం ముగిసే సమయానికి రూ. 3.56 లక్షల కోట్ల నుంచి, 2024 ఫిబ్రవరి 29 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.8,470 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఎన్నికలు అయిపోయాక... ఆర్బీఐ మాజీ గవర్నర్ వార్నింగ్
Raghuram Rajan Warning: ఆర్థిక వృద్ధికి సంబంధించి "హైప్"ను నమ్మి భారత్ పెద్ద తప్పు చేస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. దేశం దాని సామర్థ్యాన్ని చేరుకోవడానికి గణనీయమైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాలు శ్రామిక శక్తి, నైపుణ్యాలను మెరుగుపరచడం అని రఘురామ్ రాజన్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ సవాలును పరిష్కరించకుంటే యువత ప్రయోజనాలను కాపాడటంలో కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. దేశంలోని 140 కోట్ల జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు యువతే ఉన్నారన్నారాయన. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాన్ని ఈ ఆర్బీఐ మాజీ గవర్నర్ కొట్టిపారేశారు. డ్రాప్-అవుట్ శాతం అధికంగా ఉండి పిల్లలలో చాలా మందికి హైస్కూల్ విద్య లేకపోతే ఆ ఆశయం గురించి మాట్లాడటమే వ్యర్థం అన్నారు. భారతదేశంలో అక్షరాస్యత రేట్లు వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాల కంటే తక్కువగా ఉన్నాయన్నారు. స్థిరమైన ప్రాతిపదికన 8% వృద్ధిని సాధించడానికే దేశం మరింత ఎక్కువ పని చేయాల్సి ఉందన్నారు. దేశంలో ఉన్నత విద్య కోసం కంటే చిప్ల తయారీకి రాయితీలపై ఎక్కువ ఖర్చు చేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను రఘురామ్ రాజన్ తప్పుపట్టారు. భారతదేశంలో కార్యకలాపాలను స్థాపించడానికి సెమీ-కండక్టర్ కంపెనీలకు రాయితీల కింద సుమారు రూ. 76 వేల కోట్లు కేటాయించగా ఉన్నత విద్య కోసం రూ. 47 వేల కోట్లనే కేటాయించడాన్ని ఎత్తి చూపారు. -
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, జేఎంఎఫ్పీలో ప్రత్యేక ఆడిట్
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘనలపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, జేఎం ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ (జేఎంఎఫ్పీ)లో ఆర్బీఐ ప్రత్యేక ఆడిట్ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి ఆడిటర్ల నియామక ప్రక్రియ చేపట్టింది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన టెండరు ప్రకటన ప్రకారం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు సెబీ ఆమోదం పొందిన ఆడిట్ సంస్థలు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమరి్పంచేందుకు ఆఖరు తేదీ ఏప్రిల్ 8 కాగా, ఎంపికైన సంస్థలకు ఏప్రిల్ 12న విధులను కేటాయిస్తారు. గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోలో పర్యవేక్షణపరమైన అవకతవకలను పరిశీలించిన మీదట తదుపరి బంగారం రుణాలు ఇవ్వరాదంటూ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ను ఆర్బీఐ ఆదేశించింది. అలాగే ఐపీవోలకు బిడ్ చేసే కస్టమర్లకు నిధులు సమకూర్చే విషయంలో అవకతవకలకు గాను జేఎంఎఫ్పీపైనా ఆంక్షలు విధించింది. -
పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. స్థిరమైన వృద్ధికి అవకాశం
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. దీన్ని 4 శాతం దిగువకు తీసుకురావాడానికి ప్రయత్నిస్తున్నట్లు, అయితే ఇందుకు ఆహార ధరలే అడ్డంకిగా మారుతున్నట్లు మార్చి బులెటిన్ ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’లో ఆర్బీఐ ఇటీవల తెలిపింది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత డిసెంబరు నుంచి తగ్గుతూ వస్తూ, గత నెలలో 5.09 శాతంగా నమోదైంది. ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా, రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు చేరేందుకు ఆహార ధరల ఒత్తిళ్లే అడ్డంకిగా మారుతున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబత్ర పాత్రా నేతృత్వంలోని బృందం తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోందని, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వృద్ధి మందగించడం, రాబోయే కాలంలో పరిస్థితుల్ని సూచిస్తున్నాయని వివరించింది. మన దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వాస్తవిక జీడీపీ వృద్ధి 6 త్రైమాసికాల గరిష్ఠ స్థాయికి చేరుకుందని బులెటిన్ వివరించింది. పరోక్ష పన్నులు పటిష్ఠంగా వసూలు కావడం, తక్కువ సబ్సిడీలు వృద్ధి ఊపందుకునేందుకు దోహదం చేశాయని బృందం వెల్లడించింది. నిర్మాణాత్మక గిరాకీ, ఆరోగ్యకర కార్పొరేట్ గణాంకాలు, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు వృద్ధి ముందుకు సాగడానికి సాయపడతాయని వ్యాసం పేర్కొంది. ఇదీ చదవండి: 1 శాతం కుబేరుల దగ్గరే 40 శాతం సంపద దేశం ఏటా 8%, అంతకంటే ఎక్కువ వృద్ధిని స్థిరంగా కొనసాగించే అవకాశం ఉందని ఆర్బీఐ బులెటిన్ వెల్లడించింది. 2021-24 మధ్య దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి సగటున 8% పైనే నమోదైందని పేర్కొంది. కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) అదుపులోనే ఉందని, విదేశీ మారకపు నిల్వలు బాగున్నాయని, వరుసగా మూడో ఏడాది కూడా ఆర్థిక ఏకీకరణ కొనసాగుతోందని తెలిపింది. వచ్చే కొన్ని దశాబ్దాలకు ఈ అనుకూల అంశాలను అవకాశాలు, బలాలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
‘గొప్పలు చెప్పి సరిపెట్టొద్దు.. అదో విచిత్ర అలవాటు’
భారతదేశం తన జీడీపీ వృద్ధిని ఇతర దేశాలతో పోల్చకూడదని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య అన్నారు. అలా గొప్పలు చెప్పి సరిపెట్టే బదులుగా ఉద్యోగాలను సృష్టించేందుకు దృష్టి సారించాలని తెలిపారు. భారతదేశంలో చాలా మందికి ఒక విచిత్రమైన అలవాటు ఉందన్నారు. మన వృద్ధి రేటును ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చడం కంటే, కొత్త కార్మిక శ్రామికశక్తి కోసం ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు. యూట్యూబ్లోని ది గ్లోబల్ ఇండియన్స్కు చెందిన పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడారు. ఇదీ చదవండి: భారీగా పెరిగిన ఫిర్యాదులు! సమస్య పరిష్కారం కావాలంటే.. ‘భారత్ తన జీడీపీ వృద్ధి రేటును ఇతర దేశాలతో పోల్చుకుని, మిన్నగా ఉందంటూ సంబరపడటం సరికాదు. వాస్తవానికి మన దేశంలో ఉపాధి కల్పనకు అవసరమైన వృద్ధి సాధనపై దృష్టినిలపాలి. జాబ్స్ మార్కెట్లో ప్రవేశిస్తున్నవారికి ఉద్యోగాల సృష్టి కోసం అవసరమైన వృద్ధి రేటుపై ఆలోచించాలి. కానీ మిగతా ప్రపంచంతో పోల్చుకుని ఉపయోగం లేదు. భారత్ తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి’ అని హితవు పలికారు. -
షరతులు నచ్చితేనే రుణం..
ఎన్నో అవసరాలకు రుణాలు తీసుకోవడం నేడు సర్వ సాధారణంగా మారింది. డిజిటైజేషన్ కారణంగా కోరుకున్నంత రుణం నిమిషాల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాకు జమ అవుతోంది. అవసరంలో ఉన్న వారు రుణం వస్తే చాలన్నట్టు, మిగిలిన ముఖ్యమైన విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనివల్ల తర్వాతి కాలంలో పడే భారాన్ని చూసి ఆందోళన చెందే పరిస్థితి. షరతులు, నియమ, నిబంధనలు, ఫీజుల గురించి తెలుసుకోకుండానే రుణ ఒప్పందంపై నిస్సంకోచంగా సంతకాలు చేయకూడదు. రుణానికి సంబంధించి కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్/ముఖ్య విషయాల సమాహారం)ను తప్పకుండా చదవాలి. దాన్ని అర్థం చేసుకున్న తర్వాతే బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీతో అంగీకారానికి రావాలి. కేఎఫ్ఎస్ను రుణ గ్రహీతలకు తప్పకుండా అందజేయాలంటూ ఆర్బీఐ తన నియంత్రణ పరిధిలోని అన్ని ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఒక విధంగా రుణ గ్రహీతకు రుణంపై కళ్లు తెరిపించేదే కేఎఫ్ఎస్. కేఎఫ్ఎస్తో రుణ గ్రహీత నిర్ణయం సులభంగా మారుతుంది. ఒక బ్యాంక్ ఇస్తున్న రుణ ఆఫర్తో పోలిస్తే మరో బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ రుణ ఆఫర్లో ఏది మెరుగైనదో తేల్చుకోవచ్చు. కేఎఫ్ఎస్ అందించకపోయినా, ఒకవేళ కేఎఫ్ఎస్లో వైరుధ్యాలు ఉన్నా వాటిని రుణదాత దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఫిర్యాదును 30 రోజుల్లో పరిష్కరించకపోతే, పరిష్కారం సహేతుకంగా లేకపోతే ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను సంప్రదించొచ్చు. ఒకవేళ డిజిటల్ రుణం అయితే దానికి కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని ఉంటుంది. ఆ కాలంలో రుణ గ్రహీత తనకు మంజూరైన రుణాన్ని వెనక్కి తిప్పికొట్టొచ్చు. దీనికి ఎలాంటి పెనాలీ్టలు పడవని గార్గ్ వివరించారు. కేఎఫ్ఎస్ అంటే..? 2023 నవంబర్ 15న ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ ఎన్బీఎఫ్సీ బజాజ్ ఫైనాన్స్కు చెందిన ‘ఈకామ్’, ‘ఇన్స్టా ఈఎంఐ కార్డ్’ రుణ ఉత్పత్తులను తక్షణం నిలిపివేయాలని కోరింది. కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్)ను రుణ గ్రహీతలకు బజాజ్ ఫైనాన్స్ అందించకపోవడంతో ఆర్బీఐ ఈ చర్యలకు దిగింది. కేఎఫ్ఎస్ అన్నది ఒక డాక్యుమెంట్ (పత్రం). ఇందులో రుణానికి సంబంధించి కీలక సమాచారం అంతా ఉంటుంది. నిజానికి రుణ ఒప్పందంలో (లోన్ అగ్రిమెంట్) అన్ని వివరాలు ఉన్నప్పటికీ, అందులోని పదజాలం అర్థం చేసుకోవడం అందరికీ సులభం కాదు. కీలక వివరాలన్నింటినీ సులభంగా అర్థమయ్యేలా కేఎఫ్ఎస్ చెబుతుంది. అందుకే దీన్ని కీలక సమాచార పత్రంగా చెబుతారు. రుణంపై వడ్డీ రేటు ఎంత, షరతులు, ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలు, నిర్ణీత కాలం కంటే ముందే సంబంధింత రుణాన్ని తీర్చివేస్తే విధించే చార్జీలు, రుణ వాయిదా చెల్లింపుల్లో ఆలస్యం అయితే పడే పెనాల్టీ చార్జీలు.. ఇలా రుణానికి సంబంధించి సమగ్ర వివరాలు అందులో వెల్లడించడం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల బాధ్యత. సమస్యల పరిష్కార యంత్రాంగాన్ని కూడా అందులో తెలియజేయాలి. కేఎఫ్ఎస్ పారదర్శకతను తీసుకొస్తుంది. కీలక వివరాలన్నీ ఉండడంతో, రుణ గ్రహీత అన్నీ తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలు కలుగుతుంది. అందుకే దీన్ని రుణదాతలు అందరికీ అందించాలంటూ ఆర్బీఐ ఆదేశాలు తీసుకొచ్చింది. ‘‘కేఎఫ్ఎస్ అంటే రుణానికి సంబంధించి అస్థిపంజరం వంటిది. రుణం తీసుకునే వ్యక్తి అన్ని కీళ్లను తెలుసుకోవాలి, వంపులు, కదలికలను తెలుసుకోవాలి’’అని సింఘానియా అండ్ కో పార్ట్నర్ రాజీవ్ శర్మ వివరించారు. డిజిటల్ రుణాలకు సంబంధించి కేఎఫ్ఎస్ మరింత కీలకం. ఎందుకంటే రుణ ప్రక్రియలో ఒకటికి మించిన పారీ్టలు భాగస్వాములై ఉంటాయి. ఏమి చూడాలి..? రుణ కాల వ్యవధి, రుణానికి సంబంధించి నెలవారీ చెల్లించాల్సిన మొత్తం (ఈఎంఐ) గురించి కేఎఫ్ఎస్లో స్పష్టంగా ఉంటుంది. రుణానికి అనుబంధంగా ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలని బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ కోరుతోందా? అన్నది కేఎఫ్ఎస్లో పరిశీలించుకోవాలని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి సూచించారు. ముఖ్యంగా రుణానికి సంబంధించి చెబుతున్న వడ్డీ రేటు వార్షికమేనా? అన్నది చూడాలి. రుణం చెల్లించకపోతే ఎదురయ్యే పరిణామాలు గురించి, అన్ని రకాల చార్జీల గురించి తెలుసుకోవాలి. రుణ గ్రహీత కోరితే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కేఎఫ్ఎస్ కాపీ, రుణ డాక్యుమెంట్లను ఈమెయిల్కు పంపిస్తాయని పరిజిత్ గార్గ్ చెబుతున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా రుణం తీసుకుంటున్నట్టు అయితే, రుణ వివరాల పేజీ నుంచే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని శర్మ సూచించారు. నెట్బ్యాంకింగ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆదిల్ శెట్టి తెలిపారు. పారదర్శకత కోసం.. ‘‘చారిత్రకంగా చూస్తే రుణ వ్యయాల విషయంలో పారదర్శకత ఉండేది కాదు. వడ్డీ రేటునే ప్రముఖంగా ప్రకటనల్లో పేర్కొనడం కనిపించేది. తక్కువ వడ్డీ రేటుకు వస్తుందని రుణం తీసుకున్న తర్వాతే.. వివిధ రకాల ఫీజుల భారం తెలిసొచ్చేది. పారదర్శకత లేకపోవడం వల్ల వారు వివిధ రుణ ఉత్పత్తులను పోల్చుకుని, వాస్తవ రుణ వ్యయాల గురించి అర్థం చేసుకోలేకపోయేవారు’’అని మై మనీమంత్ర ఎండీ రాజ్ ఖోస్లా పేర్కొన్నారు. అన్ని రకాల చార్జీల గురించి కేఎఫ్ఎస్లో పేర్కొనడం పారదర్శకత, వినియోగదారు అనుకూల రుణ వాతావరణానికి దారితీస్తుందన్నారు. ‘‘ఇప్పటికైతే రుణాలపై వడ్డీ రేటు, ఇతర ఫీజులు, చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ చార్జీలు తదితరమైనవి ఉండేవి. కేఎఫ్ఎస్ను అన్ని రకాల రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలకు విస్తరించాం. రుణాల పంపిణీలో పారదర్శకత పెంపు, కస్టమర్లు తగిన నిర్ణయం తీసుకునేందుకు ఇది వీలు కలి్పస్తుంది’’అని ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. వడ్డీ రేటు వేరు, ఏపీఆర్ వేరు ఈ రెండింటి మధ్య ఉన్న బేధాన్ని రుణ గ్రహీతలు అర్థం చేసుకోవాలి. యాన్యువల్ పర్సంటేజ్ రేట్ (ఏపీఆర్) అంటే అన్ని చార్జీలు కలిపినది. ఉదాహరణకు రూ.లక్ష రుణాన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) నుంచి 36 నెలల కాలానికి 18 శాతం రేటుపై తీసుకున్నారని అనుకుందాం. అంటే నెలవారీ ఈఎంఐ రూ.1,500 అనుకుంటాం. కానీ కాదు. ఈ రుణం ఏపీఆర్ 20.16 శాతం అవుతుంది. అంటే చెల్లించాల్సిన ఈఎంఐ రూ.1,680 అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, ఆరంభంలో విధించే పలు చార్జీలు అన్నీ కలసి ఈ స్థాయికి చేరింది. రుణంపై నికర వడ్డీ రేటుకు అన్ని రకాల చార్జీలు కలిపి ఏపీఆర్ ఎంత అన్నది కేఎఫ్ఎస్లో పేర్కొనాలన్నది ఆర్బీఐ ఆదేశం. అయితే, రుణ వాయిదా ఆలస్యంగా చెల్లిస్తే విధించే ఆలస్యపు రుసుము, కంటింజెంట్ చార్జీలు ఇందులో భాగంగా ఉండవని బ్యాంక్ బజార్ ఆదిల్ శెట్టి తెలిపారు. ఈఎంఐ బౌన్స్ చార్జీలు, రుణాన్ని ముందస్తుగా చెల్లించేట్టు అయితే విధించే చార్జీలు కూడా ఏపీఆర్లో కలసి ఉండవు. ఇవి తెలుసుకున్న తర్వాతే.. ► చెల్లింపుల సామర్థ్యం: ఎంత రుణం కావాలన్న స్పష్టత ఒక్కటీ ఉంటే సరిపోదు. తీసుకునే ఆ రుణానికి నెలవారీ ఎంత మేర చెల్లించగలరు? అన్నది చాలా కీలకమైన అంశం అవుతుంది. దీని ఆధారంగానే కాల వ్యవధిని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. తక్కువ కాలవ్యవధిని ఎంపిక చేసుకుంటే ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం ఎంపిక చేసుకుంటే ఈఎంఐ తగ్గుతుంది. దీనివల్ల చెల్లించాల్సిన వడ్డీ మొత్తం కూడా పెరుగుతుంది. బ్యాంకుల మధ్య వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు తదితర చార్జీలను పోల్చుకున్న తర్వాతే ఏ బ్యాంక్ నుంచి తీసుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. ఎందుకంటే 0.5% వ్యత్యాసమున్నా 4–5 ఏళ్ల చెల్లింపుల్లో చెప్పుకోతగ్గంత తేడా వస్తుంది. తమ ఆదా యంలో అన్ని రుణాలకు చేసే చెల్లింపులు 40% మించకుండా చూసుకోవాలి. ► ఆదాయంలో అప్పుల రేషియో: బ్యాంక్లు రుణం ఇచ్చే ముందు రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు, ఆదాయంలో అప్పుల రేషియోని చూస్తాయి. ఆదాయంలో అప్పులకు చేసే చెల్లింపులు 43 శాతం మించి ఉంటే అప్పుడు చెల్లింపుల్లో రిస్క్ ఉన్నట్టు అవి భావించొచ్చు. దాంతో రుణ దరఖాస్తు తిరస్కరణ లేదంటే అధిక వడ్డీ రేటును విధించొచ్చు. ► క్రెడిట్ స్కోర్: 750 అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే దాన్ని ఉత్తమమైనదిగా పరిగణిస్తాయి బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు. అంతేకాదు రుణం సులభంగా, వేగంగా లభిస్తుంది. డిమాండ్ చేసి వడ్డీ రేటులో కొంత తగ్గింపు ప్రయోజనాన్ని సైతం పొందొచ్చు. ► ముందస్తు చెల్లింపులు: రుణాన్ని నిర్ణీత కాలానికి ముందే లేదంటే నెలవారీ వీలున్నప్పుడల్లా అదనపు చెల్లింపులు చేసుకుంటూ వెళితే త్వరగా తీరిపోతుంది. దీనివల్ల వడ్డీ రూపంలో చెప్పుకోతగ్గంత ఆదా చేసుకోవచ్చు. కాకపోతే చాలా సంస్థలు మందుస్తు రుణ చెల్లింపులపై 2–4 శాతం చార్జీ విధిస్తుంటాయి. ఈ తరహా చార్జీ అమలు చేయని సంస్థ నుంచి తీసుకోవడం అనుకూలం. మెరుగైన అవగాహన ‘‘కస్టమర్లలో అవగాహన పెంచేందుకు ఇదొక అవకాశం. రుణానికి సంబంధించి అన్ని ముఖ్యమైన వివరాలను తెలియజేయడం వల్ల రుణగ్రహీత అనుభవం మెరుగ్గా ఉంటుంది. ఎంఎస్ఎంఈ రుణ గ్రహీతలు మెరుగైన నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుంది’ ’అని గోద్రేజ్ క్యాపిటల్ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు. వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణాలు, డిజిటల్ రుణాలకే లోగడ కేఎఫ్ఎస్ తప్పనిసరి. ఇకపై అన్ని రిటైల్ రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాలకు ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ‘‘రుణాలపై అసలు వ్యయాలు ఎంత మేర ఉన్నాయనేది రుణ గ్రహీతలకు దీనివల్ల తెలుస్తుంది. చెప్పకుండా విధించే చార్జీలకు కళ్లెం వేస్తుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం రుణ గ్రహీతల్లో రుణ ఎకోసిస్టమ్ పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది.’’అని ఫైనాన్సింగ్ ప్లాట్ఫామ్ ‘వెలాసిటీ’ వ్యవస్థాపకుడు, సీఈవో అభిరూప్ మేధేకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కేఎఫ్ఎస్ రిటైల్ రుణ గ్రహీతలకు మేలు చేస్తుంది. కార్పొరేట్ సంస్థలకు కేఎఫ్ఎస్తో ప్రత్యేకంగా అవసరం ఉండదు. ఎందుకంటే ఆయా సంస్థల వద్ద ఆర్థిక, న్యాయ నిపుణులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కనుక బ్యాంకుల ఒప్పంద పత్రాలను అవి సమగ్రంగా సమీక్షించుకోగలవు. కానీ, చిన్న సంస్థలు, వ్యక్తులకు ఇది కష్టమైన పనే అవుతుంది. వ్యక్తులు అయితే బ్యాంక్ మార్కెటింగ్ సిబ్బంది చెప్పిందే నమ్మాల్సిన పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే కేఎఫ్ఎస్ను వ్యక్తులు, ఎంఎఎస్ఎంఈ రుణాలకు ఆర్బీఐ తప్పనిసరి చేసింది. -
ఆర్బీఐ ఉద్గమ్ పోర్టల్లోకి 30 బ్యాంకులు
ముంబై: వివిధ బ్యాంకుల్లో ఉండిపోయిన తమ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు/ఖాతాల వివరాలను కస్టమర్లు తెలుసుకునేందుకు ఉద్దేశించిన ఉద్గమ్ పోర్టల్లో 30 బ్యాంకులు భాగస్వాములైనట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మొత్తం అన్క్లెయిమ్డ్ డిపాజిట్లలో వీటి వాటా 90 శాతంగా ఉంటుందని (విలువపరంగా) పేర్కొంది. క్లెయిమ్ చేయని తమ డిపాజిట్లు/ఖాతాల వివరాలను తెలుసుకునేందుకు యూజరు ముందుగా తన పేరు, మొబైల్ నంబరుతో ఉద్గమ్ (యూడీజీఏఎం– అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్) పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ బ్యాంకుల్లో తమ పేర్లతో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు, ఖాతాలను సెర్చ్ చేసుకునేందుకు, సెటిల్మెంట్ ప్రక్రియ వివరాలను తెలుసుకునేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. సెటిల్మెంట్ కోసం ఆయా బ్యాంకులను సందర్శించాల్సి ఉంటుంది. 2023 మార్చి ఆఖరు నాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణం రూ. 42,270 కోట్లుగా ఉంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఎన్నికల ప్రచారం ఎంత కష్టమో తెలిసింది: కంగనా రనౌత్
టెక్నో క్యామాన్ 30ప్రో 5జీ, క్యామాన్ 30 ప్రీమియర్ 5జీ విడుదల.. ధర ఎంతంటే?
లోక్సభ ఎలక్షన్స్.. రతన్ టాటా సందేశం
‘సాక్షి’కి టీ 20 వరల్డ్కప్ ట్రోఫీ
ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
భర్తతో విడిపోతే ప్రపంచం అంతమైపోయినట్లా! సానియా మరో పెళ్లి చేసుకోవాలి!
సీఎస్కేతో ఆర్సీబీ కీలక పోరు.. తుది జట్లు ఇవే
రేపు బీజేపీ ఆఫీసుకు వస్తా... కేజ్రీవాల్ ఓపెన్ ఛాలెంజ్
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా: '3 ఇడియట్స్' సీన్తో..
రాయ్బరేలీలో పోటీ చేయకపోడంపై ప్రియాంక తొలి స్పందన
తప్పక చదవండి
- ‘సాక్షి’కి టీ 20 వరల్డ్కప్ ట్రోఫీ
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement