-
బర్త్డే స్పెషల్.. చిన్నారులతో ఫుట్ బాల్ ఆడిన సచిన్! వీడియో వైరల్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం (ఏప్రిల్ 24) తన 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సచిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, ఓజా వంటి మాజీ క్రికెటర్లు సచిన్కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఐసీసీ, బీసీసీఐ కూడా సచిన్కు ఎక్స్ వేదిగా స్పెషల్ విషెస్ తెలియజేసింది. కాగా సచిన్ తన బర్త్డే సెలబ్రేషన్స్ను సతీమణి అంజలితో కలిసి ‘సచిన్ టెండ్కూల్కర్ ఫౌండేషన్’లో జరపునకున్నాడు. చాలా సమయం పాటు అక్కడ ఉన్న చిన్నారులతో సచిన్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన బర్త్డే సెలబ్రేషన్స్కు సంబంధించిన విషయాలను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు."ఈసారి నా బర్త్డే సెలబ్రేషన్స్ భిన్నంగా చేసుకోవడం చాల సంతోషంగా ఉంది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ సాయంతో ఎదుగుతున్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. వారితో ఫుట్బాల్ ఆడటం, నా స్టోరీలను పంచుకోవడం ఎంతో అనుభూతిని ఇచ్చింది. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వీరే ఫస్ట్ అనుకుంటాను. ఈ మూమెంట్ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని" తన బర్త్డే వేడుకల సంబంధించిన వీడియో క్లిప్ను సచిన్ ఎక్స్లో షేర్ చేశాడు. Happy birthday paaji! 🎉 From smashing bowlers on the field to smashing life goals, you're the reason I learned to aim higher in life (and sometimes on the field too 🤪) Here's wishing you loads of love, good health and happiness always 🤗❤️@sachin_rt #HappyBirthdaySachin pic.twitter.com/t6qFKgKJmZ— Yuvraj Singh (@YUVSTRONG12) April 24, 2024 -
క్రికెట్ గాడ్ సచిన్కు అత్యంత అపురూపమైన 13 నాణేల గురించి తెలుసా?
క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ను 24 ఏండ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలి క్రికెట్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. చిన్నతనంలోనే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి లెజెండ్గా ఎదిగిన సచిన్ రమేశ్ టెండూల్కర్ పుట్టినరోజు ( ఏప్రిల్, 24) ఈ రోజు. ఈ సందర్భంగా ఒక విషయం ఫ్యాన్స్ మధ్య ఆసక్తికరంగా మారింది.ఒక ఇంటర్వ్యూలో మీరు సొంతంచేసుకున్న దాంట్లో దేన్ని మీరు ఉన్నతంగా భావిస్తారు అని అడిగినపుడు సచిన్ సమాధానం తెలుస్తే క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోవాల్సిందే. మహ్మద్ అలీ సంతకం చేసిన బాక్సింగ్ గ్లోవ్స్, డైర్ స్ట్రెయిట్స్ మార్క్ నాప్ఫ్లెర్ సంతకం చేసిన గిటార్, సర్ డాన్ బ్రాడ్మాన్ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ వీటిల్లో ఏది అపురూపంగా అనిపిస్తుంది అని అడిగినపుడు "నా కోచ్ అచ్రేకర్ సార్ నుండి పొందిన 13 నాణేలు నాకు చాలా ముఖ్యమైన జ్ఞాపకాలు’’ అని సమాధాన మిచ్చాడట సచిన్. ఇంతకీ ఆ నాణేల కథ ఏంటి అంటే.‘క్రికెట్ దేవుడు'గా అవతరించిన సచిన్ టెండూల్కర్ ప్రయాణంలో ఎత్తుపల్లాలుకూడా ఉన్నాయి. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రాటుదేలేలా కీలక పాత్ర పోషించిన గురువు రమాకాంత్ అచ్రేకర్. శివాజీ పార్క్ జింఖానా మైదానంలోట్రైనింగ్ సెషన్లో కోచ్ అచ్రేకర్ అద్భుతమైన శిక్షణలో సచిన్ రాటు దేలాడు. ఆయన శిక్షణలో ఉన్నప్పుడు సచిన్ అలసిపోయినట్లు అనిపించినప్పుడల్లా అచ్రేకర్ ఒక ట్రిక్ వాడేవారట. క్రికెట్ స్టంప్ పైన ఒక రూపాయి నాణెం ఉంచేవారట. ఆ నాణెం గెలవాలంటే సచిన్ టెండూల్కర్ను అవుట్ చేయమని బౌలర్లను సవాలు చేశాడు. బౌలర్లు అతనిని అవుట్ చేయడంలో విఫలమైతే, అచ్రేకర్ సచిన్కు నాణెం ఇచ్చేవాడు. అలాగే ఆ నాణెం దక్కించు కోవాలంటే.. అవుట్ కాకుండా ఆడాలని సచిన్కు సవాల్ విసిరే వారట. అలా అటు బౌలర్లకూ ఇటు తనకూ ఇద్దరికీ ప్రేరణగా నిలిచేదనీ, ఇది భవిష్యత్తులో తన ఆటకు చాలా ఉపయోగపడిందని ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు సచిన్.'ద్రోణాచార్య' లేకపోతే నేను లేను2023, జనవరిలో సచిన్ టెండూల్కర్ ఎక్స్ ద్వారా కోచ్ అచ్రేకర్కి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన్ని 'ద్రోణాచార్య' అభివర్ణించాడు. తనను ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎలా మార్చాడో కూడా పంచుకున్నాడు. ‘‘టెక్నిక్, క్రమశిక్షణ, ముఖ్యంగా ఆటను గౌరవించడం నేర్పించారాయన. నేను ప్రతిరోజూ ఆయన గురించే ఆలోచిస్తాను. ఈ రోజు, ఆయన వర్ధంతి సందర్భంగా, నా జీవితంలోని ద్రోణాచార్యుడికి వందనం చేస్తున్నాను. ఆయన లేకపోతే. క్రికెటర్గా నేను లేను’’ అంటూ ఎమోషనల్ అయ్యాడు సచిన్.He taught me technique, discipline and most importantly, to respect the game.I think of him every day. Today, on his death anniversary, I salute the Dronacharya of my life. Without him, I wouldn’t have been the same cricketer. pic.twitter.com/JQ8uijHD9Y— Sachin Tendulkar (@sachin_rt) January 2, 2023కాగా సచిన్ టెండూల్కర్కు తొలుత టెన్నిస్పై ఆసక్తి ఉండేది. లెజెండరీ టెన్నిస్ ఆటగాడు జాన్ మెకెన్రోకి పెద్ద ఫ్యాన్ కూడా అయితే, తరువాతి కాలంలో సచిన్ సోదరుడు, అజిత్ టెండూల్కర్ అతనిని క్రికెట్కు పరిచయం చేయడంతో క్రికెట్పై మక్కువ పెంచుకున్నాడు. దీంతో అజిత్ ప్రఖ్యాత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ వద్దకు సచిన్ను తీసుకెళ్లాడు. సచిన్ ఆటతీరు చేసిన అచ్రేకర్ అకాడమీకి ఎంపిక చేశాడు. లేదంటే క్రికెట్ ప్రపంచం, ఒక లెజెండ్ను మిస్ అయ్యేదేమో! -
మోదీపై పోటీకి సచిన్కు కాంగ్రెస్ ఆఫర్?
ఈరోజు (ఏప్రిల్ 24) క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బర్త్డే. ఈయనకు రాజకీయాలతోనూ అనుబంధం ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో సచిన్తో ముడిపడిన ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. యూపీలోని వారణాసి స్థానం నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగిన సందర్భంలో కాంగ్రెస్ ఈ స్థానం నుంచి అత్యంత ఆదరణ కలిగిన సెలబ్రిటీని రంగంలోకి దించాలని భావించింది. అయితే నాడు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇంతకీ నాటి ఎన్నికల్లో ఏం జరిగింది?మీడియా దగ్గరున్న వివరాల ప్రకారం 2014 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ వారణాసి అభ్యర్థిగా ఎవరిని నిలపాలనే దానిపై లోతుగా అధ్యయనం చేసింది. ఇందుకోసం పలు దఫాలుగా అనేక సమావేశాలు నిర్వహించింది. ఎంతగా ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్..మోదీకి దీటైన అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ను సంప్రదించింది. అయితే సచిన్.. మోదీపై పోటీ చేసేందుకు నిరాకరించారు. సచిన్ అప్పటికే రాజ్యసభకు నామినేటెడ్ సభ్యునిగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ శుక్లా తమ పార్టీ తరపున వారణాసి నుండి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సచిన్ను కోరారు. అయితే సచిన్ తాను నాటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ ఆనాటి లోక్సభ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే అజయ్రాజ్ను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీపై పోటీకి నిలిపింది. 2004 లోక్సభ ఎన్నికల్లో వారణాసిలో కాంగ్రెస్ విజయం సాధించింది. నాడు కాంగ్రెస్కు చెందిన రాజేష్ కుమార్ మిశ్రా రెండు లక్షల ఓట్లతో గెలిచి, పార్లమెంటుకు చేరుకున్నారు. అయితే 2009లో వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థి మురళీ మనోహర్ జోషి గెలుపొందారు. నాడు కాంగ్రెస్ అభ్యర్థి మిశ్రా నాలుగో స్థానానికి పడిపోయారు. ఆ సమయంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ మూడో స్థానంలో నిలిచారు. -
ముంబై విజయంలో అదే హైలైట్.. సచిన్ ట్వీట్ వైరల్
ఐపీఎల్-2024లో హ్యాట్రిక్ పరాజయాల అనంతరం ముంబై ఇండియన్స్ కోలుకున్న తీరుపై ఆ జట్టు మెంటార్ సచిన్ టెండుల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్లో సమిష్టి రాణించి గెలుపొందిన తీరు అమోఘమని కొనియాడాడు. ఆర్సీబీతో మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా సంచలన ప్రదర్శన కనబరిచాడన్న సచిన్.. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడైన షాట్లతో విరుచుకుపడ్డారని ప్రశంసించాడు. ఇక గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బాల్ను హిట్ చేస్తున్న తీరు చూసి ముచ్చటేసిందని ఈ టీమిండియా దిగ్గజం ‘స్కై’ని ఆకాశానికెత్తాడు. 𝘼 𝙎𝙆𝙔 𝙛𝙪𝙡𝙡 𝙤𝙛 s̶t̶a̶r̶s̶ 𝙨𝙞𝙭𝙚𝙨 🤩#MIvRCB #TATAIPL #IPLonJioCinema #IPLinMarathi pic.twitter.com/WUlm5lJPzL — JioCinema (@JioCinema) April 11, 2024 అదే విధంగా ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా సిక్సర్ బాది మ్యాచ్ను ముగించడం కన్నుల పండుగ చేసిందని సచిన్ టెండుల్కర్ ముంబై ఇండియన్స్ సారథిపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు.. ‘‘వరుస ఓటముల తర్వాత.. వరుసగా రెండు విజయాలు.. జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ పవర్ ప్లేలో ఏమాత్రం భయపడకుండా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి గొప్ప ఆరంభం అందించారు. ఇక సూర్యకుమార్ యాదవ్ గాయం తర్వాత తిరిగి వచ్చి ఈ విధంగా హిట్టింగ్ చేయడం సంతోషాన్నిచ్చింది. హార్దిక్ పాండ్యా మ్యాచ్ను ఫినిష్ చేసిన తీరు అన్నిటికంటే మరింత గొప్పగా అనిపించింది’’ అని సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేయగా సోషల్ మీడియలో వైరల్గా మారింది. కాగా వాంఖడే ఆర్సీబీతో మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ప్రధాన పేసర్,‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ బుమ్రా(5/21) ఐదు వికెట్లతో చెలరేగగా.. గెరాల్డ్ కోయెట్జీ, ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అయితే, మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలించిన నేపథ్యంలో.. పరిస్థితులకు తగ్గట్లుగా ముంబై బ్యాటర్లు బ్యాట్ ఝులిపించారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ 34 బంతుల్లోనే 69, రోహిత్ శర్మ 24 బంతుల్లో 38 పరుగులతో దంచికొట్టారు. ఇక వన్డౌన్లో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ పవరేంటో చూపించాడు. కేవలం 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపాడు. ఇక హార్దిక్ పాండ్యా కేవలం ఆరు బంతుల్లోనే 21 పరుగులతో అదరగొట్టాడు. స్ట్రైక్రేటు 350గా నమోదు చేసిన ఈ ఆల్రౌండర్ సిక్స్ బాది ముంబైని విజయతీరాలకు చేర్చాడు. తిలక్ వర్మ 10 బంతుల్లో 16 రన్స్ చేసి పాండ్యాతో కలిసి ఆఖరి వరకు అజేయంగా ఉన్నాడు. A @Jaspritbumrah93 special with the ball backed 🆙 by a power packed batting performance help @mipaltan win ✌ in ✌ 💙 Scorecard ▶️ https://t.co/Xzvt86cbvi#TATAIPL | #MIvRCB pic.twitter.com/ro7TeupAQj — IndianPremierLeague (@IPL) April 11, 2024 ఫలితంగా 15.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి ముంబై లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఐపీఎల్-2024లో ముంబైకి ఇది రెండో గెలుపు. తొలి మూడు మ్యాచ్లలో ఓడిన పాండ్యా సేన.. ఢిల్లీ క్యాపిటల్స్పై విజయంతో బోణీ కొట్టిన విషయం తెలిసిందే. చదవండి: Jasprit Bumrah: కెనడా క్రికెట్ జట్టులో చేరాలనుకున్న బుమ్రా.. సంచలన విషయం వెల్లడి 𝗜𝗡 comes Hardik Pandya, and 𝗢𝗨𝗧 goes the ball 💫#MIvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/ufHR4tyY2u — JioCinema (@JioCinema) April 11, 2024 Two wins on the trot now for @mipaltan after a tricky start to the tournament. @Jaspritbumrah93 was sensational, once again proving why he's the best in the business. @ImRo45 and @ishankishan51's fearless batting during the powerplay overs effectively reduced the required run… pic.twitter.com/khxtvuEVAJ — Sachin Tendulkar (@sachin_rt) April 11, 2024 -
సచిన్ షాట్ను కాపీ కొట్టిన శుబ్మన్ గిల్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా బుధవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో 44 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 2 సిక్స్లతో 72 పరుగులు చేశాడు. అయితే గిల్ తన ఇన్నింగ్స్లో కొట్టిన ఓ షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్గా నిలిచాడు. గిల్ తన షాట్తో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను గుర్తు చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్లో నాలుగో బంతిని శుబ్మన్ అద్భుతమైన ఆన్-డ్రైవ్ షాట్ ఆడి సిక్స్గా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్ వాట్ఏ షాట్ అంటూ కామెట్లు చేస్తున్నారు. కాగా 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సచిన్ ఈ తరహా షాట్లతో అభిమానులతో అలరించాడు. అనాటి మ్యాచ్లో సచిన్ విధ్వంసం సృష్టించాడు. సచిన్ 131 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో ఏకంగా 143 పరుగులు చేశాడు. pic.twitter.com/a5MwVJaChL — Sitaraman (@Sitaraman112971) April 10, 2024
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement