-
T20 WC: కోహ్లి, హార్దిక్ వద్దు.. ఊహించని ఆటగాడికి ఛాన్స్!
ఐపీఎల్-2024 ఫీవర్ ముగియగానే పొట్టి ప్రపంచకప్ రూపంలో క్రికెట్ ప్రేమికులకు మరో మెగా సమరం కనువిందు చేయనుంది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి టీ20 వరల్డ్కప్-2024 టోర్నీ ఆరంభం కానుంది.ఇక హాట్ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా జూన్ 5న ఐర్లాండ్తో మ్యాచ్తో ఈ ఐసీసీ ఈవెంట్లో ప్రయాణం ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ప్రపంచకప్లో తలపడే భారత జట్టు గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు.విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యాకు నోఈ క్రమంలో రోహిత్ శర్మకు జోడీగా విరాట్ కోహ్లి టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన ఎంపికతో ముందుకు వచ్చాడు.తన జట్టులో రన్మెషీన్ విరాట్ కోహ్లికి చోటివ్వకపోగా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బదులు ఊహించని పేరును తెరమీదకు తెచ్చాడు. కాగా ఆర్సీబీ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 9 ఇన్నింగ్స్లో కలిపి 430 పరుగులు సాధించాడు.అత్యధిక పరుగుల వీరుడి జాబితాలో టాప్లో కొనసాగుతూ.. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ తన వద్ద పెట్టుకున్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా, ఆల్రౌండర్గా విఫలమవుతున్నా టీమిండియా వైస్ కెప్టెన్ హోదాలో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.ఊహించని ఆటగాళ్లకు చోటుఇక పాండ్యాతో ఇప్పటికే శివం దూబే పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ ఎంపిక చేసుకున్న జట్టులో కోహ్లితో పాటు హార్దిక్ పాండ్యా, శివం దూబేలకు చోటు దక్కలేదు. అంతేకాదు అనూహ్యంగా హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యాను మంజ్రేకర్ ఎంపిక చేసుకున్నాడు.అదే విధంగా లక్నో యువ సంచలనం, స్పీడ్గన్ మయాంక్ యాదవ్కు కూడా తన జట్టులో స్థానం కల్పించాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్య వహిస్తున్న లెఫ్టార్మ్ స్పిన్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా.. ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లో 58 పరుగులు చేశాడు. అదే విధంగా.. 8 మ్యాచ్లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు.టీ20 ప్రపంచకప్-2024కు సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్న భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, కృనాల్ పాండ్యా.చదవండి: T20 WC 2024: దాదాపు 900 రన్స్ చేశా.. నాకు చోటు ఇవ్వకపోతే: గిల్ కామెంట్స్ వైరల్ -
అవకాశాల్లేవు.. వరల్డ్కప్ జట్టులో మాత్రం అతడికి చోటివ్వండి!
ఐపీఎల్-2023.. ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లతో జట్టును గెలిపించిన ఘనత.. ఆడిన 14 మ్యాచ్లలో కలిపి 474 పరుగులతో సత్తా చాటి ‘నయా ఫినిషర్’గా బిరుదు.. అదే ఏడాది ఆగష్టులో టీమిండియా తరఫున అరంగేట్రం.. ఇప్పటికే ఆటగాడు ఎవరో అర్థమైపోయి ఉంటుంది కదా.. అవును.. రింకూ సింగ్. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున గతేడాది దంచికొట్టిన ఈ యూపీ లెఫ్టాండ్ బ్యాటర్.. సిక్సర్ల కింగ్గా పేరొందాడు. అదే జోష్లో టీమిండియా తలుపుతట్టి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 15 టీ20లు, రెండు వన్డేలు ఆడిన రింకూ ఆయా ఫార్మాట్లలో వరుసగా 356, 55 పరుగులు సాధించాడు. దేశవాళీ క్రికెట్లోనూ రాణించాడు. అయితే.. ఐపీఎల్-2024లో మాత్రం అతడికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి రింకూ 83 పరుగులు చేశాడు. రెండుసార్లు అజేయంగా నిలిచాడు. అయితే.. అతడి స్ట్రైక్రేటు(162.75) మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు కాబట్టి.. సెలక్టర్లు రింకూ సింగ్ పేరును మర్చిపోరనే అనుకుంటున్నా. ఈ టోర్నీ తర్వాత అతడు నేరుగా టీమిండియాలో అడుగుపెట్టగల సత్తా కలిగిన వాడు. నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకోవడం చూస్తున్నాం. టీమిండియా కీలక సభ్యుల్లో అతడూ ఒకడు. కొంతమంది స్టార్ల కంటే కూడా అద్భుతంగా ఆడగలిగినవాడు’’ అంటూ సంజయ్ మంజ్రేకర్.. టీ20 ప్రపంచకప్-2024 ఆడే భారత జట్టులో రింకూ సింగ్కు తప్పక చోటు కల్పించాలని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. కాగా మే 26న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ముగియనుండగా.. జూన్ 1 నుంచి వరల్డ్కప్ సమరం మొదలుకానుంది. పొట్టి ఫార్మాట్లో సాగే ఈవెంట్కు వెస్టిండీస్- అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 5న ఐర్లాండ్తో మ్యాచ్తో టీమిండియా ఈ ఐసీసీ టోర్నీలో తమ ప్రయాణం ఆరంభించనుంది. చదవండి: హార్దిక్ను పట్టించుకోని ఆకాశ్.. రోహిత్ మాట విని అలా! వైరల్ వీడియో var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీమిండియాకు మరో ఆణిముత్యం దొరికేశాడు.. వన్డేల్లో కూడా ఎంట్రీ పక్కా?
సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టుతో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తన తొలి మ్యాచ్లో అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్లో 62 పరుగులు చేసిన ఈ ముంబైకర్.. రెండో ఇన్నింగ్స్లో సైతం 68 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఓవరాల్గా రెండో ఇన్నింగ్స్లు 130 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటకీ దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాడు. ఇక అరంగేట్రంలోనే అకట్టుకున్న సర్ఫరాజ్పై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టుకు సరైన మిడిలార్డర్ బ్యాటర్ దొరికేశాడని మంజ్రేకర్ కొనియాడాడు. "సర్ఫరాజ్ తన తొలి మ్యాచ్లోనే సంచలన ప్రదర్శన కనబరిచాడు. నా వరకు అయితే భారత్కు మరో అద్భుతమైన మిడిలార్డర్ బ్యాటర్ దొరికాడని అనుకుంటున్నాను. టెస్టుల్లోనే కాదు వన్డేల్లో కూడా సర్ఫరాజ్ మంచి ఎంపికనే. వైట్బాల్ ఫార్మాట్లో కూడా మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చి అద్బుతాలు సృష్టిస్తాడని భావిస్తున్నానని" ఎక్స్లో మంజ్రేకర్ రాసుకొచ్చాడు. కాగా సర్ఫరాజ్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో దుమ్మురేపి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 46 మ్యాచ్లు ఆడిన ఈ ముంబై ఆటగాడు 70.91 సగటుతో 4042 పరుగులు చేశాడు. చదవండి: ధోని కెప్టెన్సీలో అరంగేట్రం.. రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఓపెనర్! I think India have found a very good 50 overs middle order batter option, to bat in the middle stages, with 5 fielders inside the circle, it’s Sarfraz Khan. — Sanjay Manjrekar (@sanjaymanjrekar) February 18, 2024 -
అది గతం.. ఇప్పుడు రోహిత్ మునుపటిలా లేడు: మంజ్రేకర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత రెండేళ్లలో హిట్మ్యాన్ అత్యుత్తమ టెస్టు బ్యాటర్గా ఎదిగాడని కొనియాడాడు. లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్లో సమర్థవంతంగా ఆడలేడన్న అపవాదును చెరిపివేసుకున్నాడని ప్రశంసించాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్తో హిట్మ్యాన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవలేదన్న అపఖ్యాతిని పోగొట్టడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్లో రోహిత్ శర్మ బాగా ఆడలేడు అనేది గతం. గత రెండు మూడేళ్లలో అతడు తన బలహీనతలను అధిగమించాడు. మిచెల్ స్టార్క్, షాహిన్ ఆఫ్రిది బౌలింగ్లో అద్భుతంగా ఆడాడు. ప్రస్తుతం తను అత్యుత్తమ టెస్టు ప్లేయర్గా కనిపిస్తున్నాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా ఆడాడు. టెస్టు ఓపెనర్గా రాణిస్తూ ఇంగ్లండ్ గడ్డ మీద సెంచరీ చేయడంతో పాటు టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. గంటల కొద్దీ క్రీజులో నిలబడి ఓపికగా ఆడాడు. ఇక ముందు లెఫ్టార్మ్ పేసర్లను అతడు విజయవంతంగా ఎదుర్కోవడం మనం చూస్తాం’’ అని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో రోహిత్ శర్మ తప్పక రాణిస్తాడని సంజయ్ మంజ్రేకర్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా డిసెంబరు 26న సౌతాఫ్రికా- భారత్ మధ్య తొలి టెస్టు మొదలుకానుంది. చదవండి: పెళ్లిళ్లు అక్కడే నిశ్చయమవుతాయంటారు: చహల్ భావోద్వేగం -
ఐపీఎల్ వేలంలో అతడు హాట్కేక్.. కెప్టెన్ చేసినా నో సర్ఫ్రైజ్
ఐపీఎల్-2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కోసం పోటీపడే జట్లను భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు కమ్మిన్స్ కోసం పోటీ పడనున్నట్లు మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. కాగా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్-2023కు దూరంగా ఉన్న కమ్మిన్స్.. ఐపీఎల్-2024 వేలంలో మాత్రం తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో అద్భుతమైన ఫామ్లో ఉన్న కమ్మిన్స్పై కాసుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. "ప్యాట్ కమ్మిన్స్కు పిచ్ పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేసే సత్తా ఉంది. అతడొక ఎక్స్ ఫ్యాక్టర్. ప్రస్తుతం కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు మంచి నాయకులు కోసం వెతుకుతున్నాయి. వేలంలో అతడిని దక్కించుకోనుందుకు సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్కు మార్క్రమ్, పంజాబ్ కింగ్స్కు ధావన్ కెప్టెన్లగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కెప్టెన్గా కమ్మిన్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్, ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీలు తమ జట్టు పగ్గాలు అప్పగించిన ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదని" స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు . కాగా కమ్మిన్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్ను కమ్మిన్స్ సారథ్యంలోని ఆసీస్ సొంతం చేసుకుంది. అదే విధంగా ఐపీఎల్లో కూడా కమ్మిన్స్కు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో 42 మ్యాచ్లు ఆడిన కమ్మిన్స్ 379 పరుగులతో పాటు 45 వికెట్లు సాధించాడు. చదవండి: అతడొక అద్భుతం.. పాక్ క్రికెట్లో లెజెండ్ అవుతాడు: గంభీర్ -
WC 2024: శ్రేయస్ను వన్డౌన్లో ఆడించాలి.. గిల్, జైశ్వాల్కు మరో ఛాన్స్!
South Africa vs India, 3rd T20I: సౌతాఫ్రికాతో టీమిండియా మూడో టీ20 నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక సూచనలు చేశాడు. తుది జట్టు కుర్పు ఎలా ఉండాలన్న అంశంపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. టీ20 వరల్డ్కప్-2024 టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను టాపార్డర్కు ప్రమోట్ చేయాలని సూచించాడు. వన్డౌన్లో అయ్యర్ను ఆడిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. మంగళవారం ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ జరిగింది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన ఈ టీ20కి అనారోగ్య కారణాల దృష్ట్యా రుతురాజ్ గైక్వాడ్ దూరం కాగా.. స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ అతడి స్థానంలో ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్కు సైతం మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వడంతో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదే విధంగా ఈ మ్యాచ్తో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్లు కూడా రీఎంట్రీ ఇచ్చారు. అయితే, ఈ మ్యాచ్లో మెరుగైన స్కోరు సాధించినప్పటికీ టీమిండియాకు ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ రీజా హెండ్రిక్స్, కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ అద్భుత ప్రదర్శనతో తమ జట్టుకు విజయం అందించారు. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య గురువారం నాటి ఆఖరి టీ20 సిరీస్ విజేతను నిర్ణయించడంలో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఈఎస్ఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్ను నంబర్ 3 బ్యాటర్గా చూడాలని కోరుకుంటున్నా. ప్రస్తుత మ్యాచ్లో తిలక్ వర్మ వన్డౌన్లో వచ్చి బాగానే ఆడాడు. కానీ దీర్ఘకాలంలో అతడు నిలకడగా ఆడతాడా లేదా అన్నదే ప్రశ్న. కాబట్టి శ్రేయస్ అయ్యర్ను టాపార్డర్కు ప్రమోట్ చేస్తే ఐసీసీ టోర్నీ నాటికి పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది. రెండో టీ20లో శుబ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్ డకౌట్ కావడం ప్రభావం చూపింది. అయినప్పటికీ వాళ్లు మరో మ్యాచ్ కచ్చితంగా ఆడగలరు. మేనేజ్మెంట్ వాళ్లకు అవకాశం ఇస్తుందనే భావిస్తున్నా. అయితే, సిరీస్ విజేతను తేల్చే మ్యాచ్ కావడంతో మూడో టీ20లో రుతురాజ్ గైక్వాడ్ను ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని పేర్కొన్నాడు. ఇక వరల్డ్కప్ నాటికి రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే హార్దిక్ పాండ్యాకే సారథిగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సంజయ్ మంజ్రేకర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా గత ఏడాది కాలంగా రోహిత్ అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండగా పాండ్యా చేతికి టీ20 పగ్గాలు వచ్చాయి. అయితే, వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా గాయపడిన పాండ్యా కోలుకోకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. -
WC 2023: అతడిని రిటైర్ కాకుండా చూడాలని పిటిషన్ వేస్తా: భారత మాజీ బ్యాటర్
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ మూడు సెంచరీలు బాదాడు. ఆరంభ మ్యాచ్లో శ్రీలంకపై శతక్కొట్టిన డికాక్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్లోనూ 109 పరుగులు సాధించాడు. ఇలా మెగా టోర్నీ మొదట్లో వరుస సెంచరీలతో ఆకట్టుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాతి రెండు మ్యాచ్లలో విఫలమయ్యాడు. అయితే, బంగ్లాదేశ్తో మంగళవారం నాటి మ్యాచ్లో మాత్రం మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు డికాక్. ముంబైలోని వాంఖడే మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అద్భుతమైన షాట్లతో అలరిస్తూ ప్రేక్షకులకు టీ20 మాదిరి వినోదం అందించాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ఈ క్రమంలో పలు రికార్డులు నమోదు చేసిన డికాక్.. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా శరీరం సహకరించకపోవడం.. ఇకపై లీగ్ మ్యాచ్లపై ఎక్కువగా దృష్టి సారించే క్రమంలో వన్డే క్రికెట్కు వీడ్కోలు పలుకనున్నట్లు క్వింటన్ డికాక్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత రిటైర్ అవ్వబోతున్నట్లు.. టోర్నీ ఆరంభానికి ముందే డికాక్ తెలియజేశాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా క్వింటన్ డికాక్ అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడి బ్యాటింగ్ సూపర్. తన అద్భుతమైన నైపుణ్యాలతో అదరగొట్టాడు. నేనైతే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఓ పిటిషన్ సమర్పించాలనుకుంటున్నా. వరల్డ్కప్ టోర్నీ ముగిసిన తర్వాత డికాక్ రిటైర్ అవకుండా చూడాలని హామీ ఇమ్మని కోరతా. ఎందుకంటే.. అతడు రిటైర్ అయిపోతే.. 50 ఓవర్ల క్రికెట్లో ఇలాంటి మజాను మనకు ఎవరు అందిస్తారు?’’ అంటూ కామెంటేటర్ మంజ్రేకర్ సౌతాఫ్రికా బ్యాటర్ను ఆకాశానికెత్తాడు. ఇందుకు స్పందించిన మరో కామెంటేటర్, సౌతాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ సైతం.. ‘‘అవును.. తను వయసులో ఇంకా చిన్నవాడే. అంతేకాదు.. కెరీర్లో ఇప్పుడు అత్యుత్తమ దశలో ఉన్నాడు. కానీ ప్రపంచ క్రికెట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో డికాక్తో పాటు చాలా మంది ఆటగాళ్లు వన్డే ఫార్మాట్కు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా నువ్వు పిటిషన్ వేస్తానంటే నేను కూడా దానిపై తప్పకుండా సంతకం చేస్తా’’ అని సంజయ్ మంజ్రేకర్తో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. ముంబై మ్యాచ్లో సౌతాఫ్రికా జట్టు బంగ్లాదేశ్ను 149 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
Asia Cup: పాకిస్తాన్తో మ్యాచ్.. తిలక్ వర్మ అరంగేట్రం ఫిక్స్!
Asia Cup 2023- India Vs Pakistan: ఆసియా కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్లో యువ సంచలనం తిలక్ వర్మకు తుదిజట్టులో చోటివ్వాలని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఈ లెఫ్టాండ్ బ్యాటర్ను ఆడిస్తే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా వెస్టిండీస్ పర్యటన సందర్భంగా హైదారాబాదీ స్టార్ తిలక్ వర్మ టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. టాప్ స్కోరర్.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో మొత్తంగా 173 పరుగులతో టీమిండియా టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించిన తిలక్ వర్మ.. ఒక్క వన్డే కూడా ఆడకుండానే ఏకంగా ఆసియా కప్ వంటి మెగా ఈవెంట్ జట్టులో స్థానం సంపాదించాడు. అందుకే తిలక్కు స్థానం మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో లెఫ్టాండర్గా రాణించడం.. మిగతా వాళ్లతో పోలిస్తే తిలక్కు ఉన్న అదనపు అర్హతగా మారింది. ఈ నేపథ్యంలో అతడిని ఈ వన్డే టోర్నీకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా తెలిపాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక వేదికగా సెప్టెంబరు 2న పాకిస్తాన్తో ఈ ఈవెంట్లో రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో పల్లెకెలె మ్యాచ్లో తిలక్ వర్మను తప్పక ఆడించాలంటూ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. లెఫ్టాండర్గా తిలక్.. జట్టుకు ప్రయోజనకరం పాక్తో మ్యాచ్కు తన తుదిజట్టును ఎంచుకున్న సందర్భంగా.. ‘‘ నా జట్టులో ముగ్గురు సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీకి చోటిస్తాను. నాలుగో సీమర్గా హార్దిక్ పాండ్యా ఉంటాడు. ఇక స్పిన్నర్లుగా జడేజా, కుల్దీప్ ఉండనే ఉన్నారు. నా ఓపెనర్లుగా శుబ్మన్ గిల్, రోహిత్ శర్మలకు అవకాశమిస్తాను. నంబర్ 3లో విరాట్ కోహ్లి. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ను తీసుకుంటాను.ఇక మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ లేదంటే తిలక్ వర్మలో ఒకరు. అయితే, వీరిద్దరిలో టీమిండియా మొదటి ప్రాధాన్యం తిలక్ వర్మకే ఉండాలంటాను. ఎందుకంటే.. టాప్-7 బ్యాటర్లలో హార్దిక్ పాండ్యాను కలుపుకొని అందరూ కుడిచేతి వాటం గల బ్యాటర్లే. అదే ప్రధాన సమస్య కాబట్టి లెఫ్టాండర్ అయిన తిలక్ వర్మను మిడిలార్డర్లో ఆడించాలి. అయితే, అతడిని ఏ స్థానంలో రప్పించాలి అనేదే టీమిండియాకు ఇప్పుడున్న సమస్య’’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో చర్చలో సంజయ్ మంజ్రేకర్ జట్టు కూర్పుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా శ్రేయస్ అయ్యర్ ఇటీవలే గాయం నుంచి పూర్తిగా కోలుకుని పునరాగమనం చేయనున్నాడు. అయితే, అతడు వంద శాతం ఫిట్గా ఉన్నాడని చెప్పినప్పటికీ మ్యాచ్ సమయానికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. కాబట్టి తిలక్ అరంగేట్రం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోయారు. కానీ, కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్గా లేడు కాబట్టి లెఫ్టాండర్ ఇషాన్ కిషన్ వికెట్ కీపర్గా వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఒకవేళ అయ్యర్ ఉంటే.. తిలక్కు మొండిచేయి ఎదురుకావచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఆసియా కప్-2023లో పాకిస్తాన్తో మ్యాచ్కు సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్న జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/ తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. చదవండి: యో- యో టెస్టులో పాసయ్యాను.. ఫొటో షేర్ చేసిన కోహ్లి! స్కోరెంతంటే.. -
అతడికి టెస్టుల్లో అవకాశం ఇవ్వండి.. మార్క్వుడ్ మాదిరే: మాజీ క్రికెటర్
India tour of West Indies, 2023: కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ గతేడాది జూన్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువ పేసర్.. క్యాష్ రిచ్ లీగ్లో అద్భుత ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. చిరుతలాంటి వేగంతో బంతులు సంధిస్తూ తనదైన శైలిలో రాణిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఐర్లాండ్తో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఉమ్రాన్.. న్యూజిలాండ్తో మ్యాచ్ ద్వారా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ప్రదర్శనతో సతమతమవుతున్నాడు. ఐపీఎల్-2023లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 8 మ్యాచ్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. విండీస్తో టీ20 సిరీస్లో అయినప్పటికీ వెస్టిండీస్ టీ20 సిరీస్ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్కు చోటు దక్కడం విశేషం. అయితే, అర్ష్దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్లతో కూడిన పేస్ దళంలో భాగమైన ఈ కశ్మీరీ స్పీడ్స్టర్కు తుదిజట్టులో అవకాశం వస్తుందో లేదో చూడాలి!! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణిస్తున్న ఉమ్రాన్ను టెస్టు జట్టుకు ఎప్పుడు ఎంపిక చేస్తారని సెలక్టర్లను ప్రశ్నించాడు. ఉమ్రాన్ను ఇంగ్లండ్ పేసర్ మార్క్వుడ్తో పోల్చిన మంజ్రేకర్.. టెస్టుల్లో అతడికి అవకాశం ఇస్తే చెలరేగిపోతాడని జోస్యం చెప్పాడు. ఎక్స్ ఫ్యాక్టర్ కాగలడు ఈ మేరకు.. ‘‘టెస్టు క్రికెట్ జట్టుకు ఉమ్రాన్ను తప్పకుండా ఎంపిక చేయాలి. మార్క్వుడ్ గంటకు 90 మైళ్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయగల సమర్థుడు. టెయిలెండర్లను ఎక్కువ సేపు క్రీజులో నిలవనివ్వడు. అదే అతడి స్పెషాలిటీ. ఉమ్రాన్ మాలిక్ విషయంలో పునరాలోచన చేయాలి. మార్క్వుడ్ మాదిరే వేగంతో బౌలింగ్ చేయగలడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడికి అవకాశాలు ఇవ్వడం బాగానే ఉంది. అయితే, టెస్టుల్లోనూ ఆడిస్తే వైవిధ్యమైన పేస్తో టీమిండియా బౌలింగ్ విభాగంలో అతడు ఎక్స్ ఫ్యాక్టర్గా మారే అవకాశం ఉంది’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. జూలై 12 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ఆరంభమైంది. తొలి మ్యాచ్ తొలిరోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. ఇక ఆగష్టు 13నాటి ఐదో టీ20తో ఈ టూర్ ముగియనుంది. చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే -
డబుల్ సెంచరీ సాధించినా నో ఛాన్స్! రాహుల్ వచ్చేంతవరకు అతడే బెటర్
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్లు కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరూ లేని లోటు భారత జట్టులో స్పష్టంగా కన్పిస్తోంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందుతున్న వీరిద్దరూ.. ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్తో తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే వన్డే ప్రపంచకప్కు పంత్, రాహుల్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ను బ్యాకప్ వికెట్ కీపర్గా ఎంపిక చేయాలని భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ప్రపంచకప్కు ముందు భారత్ ఆడనున్న అన్నీ పరిమిత ఓవర్ల సిరీస్లో కిషన్కు అవకాశం ఇవ్వాలని అతడు సూచించాడు. కాగా కిషన్ ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా బ్యాకప్ వికెట్ కీపర్గా ఉన్నాడు. త్వరలో వెస్టిండీస్తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లలో వికెట్ కీపర్గా కిషన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇటీవలే జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపికైనప్పటికి తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. అతడి స్థానంలో శ్రీకర్ భరత్కు జట్టు మెనెజ్మెంట్ అవకాశం ఇచ్చింది. కానీ భరత్ మాత్రం తీవ్ర నిరాశ పరిచాడు. ఈ నేపథ్యంలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. "ఇషాన్ కిషన్ అద్భుతమైన లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్. అతడికి ఓపెనర్గా వచ్చి విధ్వంసం సృష్టించే సత్తా ఉంది. అదే విధంగా లోయార్డర్లో కూడా ఆడగలడు. అటువంటి ఆటగాడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. పాపం కిషన్.. డబుల్ సెంచరీ సాధించిన తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. మిగితా ఆటగాళ్లు ఫిట్నెస్ సాధించేంతవరకు రెగ్యూలర్గా కిషన్తో ముందుకుపోవాలి. రాహుల్ సాధరణంగా వన్డేల్లో ఐదు లేదా ఆరో స్ధానంలో బ్యాటింగ్కు వస్తాడు. కిషన్ను కూడా ఆ స్ధానంలో బ్యాటింగ్కు పంపాలి. రాహుల్ ఫిట్నెస్ సాధించేంతవరకు ఇషాన్ కిషన్ మంచి ఎంపిక అని" తన యూట్యూబ్ ఛానల్లో సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: డబ్ల్యూటీసీ గాయాన్ని మళ్లీ రేపిన అశ్విన్! ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్, ద్రవిడ్పై విసుర్లు! -
#SKY: టీ20 మాస్టర్క్లాస్ చూశాను! నా కళ్ల ముందే.... వారెవ్వా!
IPL 2023- Suryakumar Yadav: ముంబై ఇండియన్స్ బ్యాటర్, టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల జల్లు కురిపించాడు. వాంఖడే స్టేడియంలో మాస్టర్క్లాస్ టీ20 సెంచరీ తనకు కనులవిందు చేసిందని పేర్కొన్నాడు. అద్భుత ఇన్నింగ్స్ చూసిన ఆ సమయంలో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యానని తెలిపాడు. కాగా ఐపీఎల్-2023 ఆరంభంలో సూర్యకుమార్ యాదవ్ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. అయితే, ఆ తర్వాత బ్యాట్ ఝులిపించిన సూర్య కీలక మ్యాచ్లలో ముంబై ఇండియన్స్కు విజయాలు అందించాడు. తొలి సెంచరీ ఇక లీగ్ దశలో మే 12న వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో సూర్య ఆడిన ఇన్నింగ్స్ అన్నింటిలోకి హైలైట్గా నిలిచింది. 49 బంతుల్లో 103 పరుగులతో అజేయంగా నిలిచిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.. ఐపీఎల్లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్లో ముంబై 27 పరుగుల తేడాతో గుజరాత్పై గెలుపొందగా.. సూర్య ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్. టీ20 మాస్టర్క్లాస్ చూశాను ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వాంఖడే మైదానంలో నా కళ్ల ముందు సూర్యకుమార్ బాదిన ఆ సెంచరీ అద్భుతం. టీ20 మాస్టర్క్లాస్ చూశాను. టీ20 భవిష్యత్ ఆశాకిరణం కనిపించింది. ఆరోజు సూర్య ఇన్నింగ్స్ అమోఘం. అసలు ఇది నిజంగా జరిగిందా లేదా అనే సందేహంలో ఉండిపోయా. ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయా’’ అంటూ మంజ్రేకర్.. సూర్యను ఆకాశానికెత్తాడు. కాగా ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్.. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా టోర్నీ నుంచి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. ఇక రిజర్వ్డే (మే 29) నాటి ఫైనల్లో గుజరాత్ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి చాంపియన్గా అవతరించింది. అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 సీజన్లో సూర్య 16 ఇన్నింగ్స్లలో కలిపి 605 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్థ శతకాలు , ఒక సెంచరీ ఉంది. అత్యధిక స్కోరు 103 నాటౌట్. చదవండి: SL Vs AFG: లంకతో వన్డే సిరీస్.. అఫ్గనిస్తాన్కు ఊహించని షాక్! ఆనందంలో సీఎస్కే ఆల్రౌండర్.. సర్ జడేజాకు థాంక్స్! పోస్ట్ వైరల్ A 💯 that wowed teammates, fans and opponents alike 🤩 Take a bow #SuryakumarYadav 👏#MIvGT #IPLonJioCinema | @surya_14kumar pic.twitter.com/kwUuMfTGKz — JioCinema (@JioCinema) May 12, 2023 -
గిల్ను ఆపాలంటే అదొక్కటే మార్గం.. లేదంటే కష్టమే!
ఐపీఎల్-2023 ఫైనల్కు అంతా సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో చెన్నైసూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలడనున్నాయి. ఈ మ్యాచ్లో అందరి దృష్టి గుజరాత్ ఓపెనర్ శుబ్మన్ గిల్పైనే ఉంది. టోర్నీ ఆసాంతం దుమ్మురేపిన గిల్.. కీలకమైన ఫైనల్లో ఎలా రాణిస్తాడో అందరూ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక తుదిపోరుకు ముందు చెన్నై సూపర్ కింగ్స్కు భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కొన్ని విలువైన సూచనలు చేశాడు. ఫామ్లో ఉన్న శుబ్మన్ గిల్ను ఎదుర్కోవడానికి తమ ఇద్దరు స్పిన్నర్లలో ఒకరిని ముందుగానే ఉపయోగించుకోవాలని మంజ్రేకర్ సలహా ఇచ్చాడు. "ధోని తమ బౌలింగ్ ఎటాక్ను ఎలాగో పేసర్ దీపక్ చాహర్తో ప్రారంభిస్తాడు. అతడు బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తాడు కాబట్టి వికెట్లు సాధించే ఛాన్స్ ఉంటుంది. అయితే గిల్ ఫాస్ట్బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటాడు. కానీ స్పిన్నర్లను ఆడడంలో కాస్త ఇబ్బంది పడతాడు. కాబట్టి చెన్నై కొంచెం ముందుగా వారి స్పిన్నర్లను తీసుకువస్తే బాగుంటుంది. అంతే తప్ప దేశ్పాండే బౌలింగ్ను గిల్ ఈజీగా మెనెజ్చేయగలడు. కాబట్టి తీక్షణ వంటి మణికట్టు స్పిన్నర్లు బౌలింగ్ చేస్తే గిల్ వికెట్ సాధించవచ్చు. ఆతర్వాత జడేజా తన పని తను చేసుకుపోతాడు" అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. చదవండి: Shubman Gill: గావస్కర్, సచిన్, కోహ్లితో ఇప్పుడే పోలికలు వద్దు.. వచ్చే సీజన్లోనూ: టీమిండియా దిగ్గజం -
రూ. 13 కోట్లు పెట్టారు కదా! ఇలాగే ఉంటది.. కానీ పాపం: భారత మాజీ క్రికెటర్
IPL 2023- SRH- Harry Brook: ‘‘ఐపీఎల్ వేలం జరిగిన ప్రతిసారి నా దృష్టి విదేశీ ఆటగాళ్లపై కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లిష్ ప్లేయర్లు.. వారికి లభించే మొత్తాలను గమనిస్తూ ఉంటా. అందుకు తగ్గట్లే వాళ్లు ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని ఆశిస్తా. కానీ, వారి విషయంలో నా అంచనాలు చాలా వరకు తలకిందులు అయ్యాయి. ఉపఖండ పిచ్లపై.. ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో.. భారీ ప్రైస్ ట్యాగ్ల నేపథ్యంలో నెలకొన్న అంచనాలు అందుకోవడం అంత తేలికేమీ కాదు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో అతికొద్ది మంది మాత్రమే ఐపీఎల్లో ఒత్తిడి అధిగమించి తమను తాము నిరూపించుకున్నారు. అయితే, ఆస్ట్రేలియన్లు, వెస్టిండీస్, సౌతాఫ్రికా క్రికెటర్ల పరిస్థితి ఇందుకు భిన్నం. వారు ఇక్కడి పరిస్థితులు, ఐపీఎల్ ఫార్మాట్ను సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నారు. కానీ ఇంగ్లిష్ ఆటగాళ్లు మాత్రం ఇంకా వారిలా అదరగొట్టలేకపోతున్నారు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. కోట్లు కుమ్మరించారు ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి నేపథ్యంలో మంజ్రేకర్ ఈ మేరకు స్టార్ స్టోర్స్ షోలో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. హైదరాబాద్ ఫ్రాంఛైజీ కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవే బ్రూక్ను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి బ్రూక్ త్వరలోనే తనదైన శైలిలో చెలరేగాలని ఆశిస్తున్నట్లు మంజ్రేకర్ పేర్కొన్నాడు. ‘‘హ్యారీ బ్రూక్ ఫామ్లోకి వస్తాడనే అనుకుంటున్నా? అయితే అది ఎప్పుడంటే మాత్రం కచ్చితంగా చెప్పలేను. ఇందుకు మరో రెండు మ్యాచ్లు లేదంటే మూడు మ్యాచ్ల సమయం పట్టొచ్చు. తన బలమేంటో తెలుసుకుని.. తన నైపుణ్యాలు ప్రదర్శించగలుగుతాడు. ప్రస్తుతం అతడిపై అధిక ధర పలికిన ప్లేయర్ అనే ట్యాగ్.. చుట్టూ జనాల అంచనాలు.. భారత పిచ్లపై బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో తెలియని అనుభవలేమి ఒత్తిడిని పెంచుతున్నాయి. వీటిని అధిగమిస్తే బ్రూక్ తప్పకుండా రాణించగలడు’’ అంటూ మంజ్రేకర్ హ్యారీ బ్రూక్కు అండగా నిలబడ్డాడు. 13 కోట్ల రూపాయలు పలికిన పవర్ హిట్టర్.. ఐపీఎల్లో ఇలా 24 ఏళ్ల బ్రూక్ బిగ్ హిట్టర్గా పేరొందాడు. గతేడాది 6 టెస్టులు ఆడి ఏకంగా నాలుగు సెంచరీలు సాధించాడు. అరంగేట్రంలోనే శతకం బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 20 టీ20లు ఆడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 372 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్- 2023 మినీ వేలంలో సన్రైజర్స్ అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి ఏకంగా 13.25 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఈ సన్రైజర్స్ బ్యాటర్ పూర్తిగా విఫలమయ్యాడు. రాజస్తాన్, లక్నోలతో మ్యాచ్లలో కలిపి 16 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతుండగా మంజ్రేకర్ ఈ మేరకు అండగా నిలవడం గమనార్హం. చదవండి: సీఎస్కేతో మ్యాచ్.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీ! ఎయిడెన్ అన్న, బ్రూక్ వల్లే ఇదంతా! సాకులు వెతుక్కోవద్దన్న లారా.. బ్యాటర్లపై ఫైర్! ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు -
Ind Vs Aus: నా దృష్టిలో నిజమైన హీరో జడేజా! నువ్వేనా ఈ మాట అన్నది?
‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో చాలా కాలం తర్వాత టీమిండియా.. బౌలింగ్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. మిచెల్ మార్ష్ అద్భుత బ్యాటింగ్ చూసి.. ఆస్ట్రేలియా కచ్చితంగా 350 పరుగుల మార్కు దాటుతుందని అనుకున్నాం. కానీ.. టీమిండియా బౌలర్లు వారిని కట్టడి చేశారు. షమీ, సిరాజ్ వికెట్లు తీశారు. అయితే... నా దృష్టిలో మాత్రం నిజమైన హీరో రవీంద్ర జడేజా’’..... ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా విజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టుకు పేసర్ మహ్మద్ సిరాజ్.. 5 పరుగులకే ఓపెనర్ ట్రావిస్ హెడ్ను పెవిలియన్కు పంపి శుభారంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ మార్ష్ ఆ సంతోషాన్ని ఎక్కువ సేపు నిలువనీయలేదు.. 10 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు. అతడి దూకుడు చూస్తే ఆసీస్ భారీ స్కోరు చేయడం ఖాయమనిపించింది. కీలక సమయంలో రాణించి కానీ.. భారత పేసర్లు సిరాజ్, షమీ కలిసి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. షమీ ఆరు ఓవర్ల బౌలింగ్లో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 5.4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఒకటి, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ఒక వికెట్ దక్కాయి. ప్రమాదకరంగా మారి జట్టును భారీ స్కోరు దిశగా నడిపిస్తున్న మార్ష్ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. అంతేకాదు గ్లెన్ మాక్స్వెల్ రూపంలో మరో కీలక బ్యాటర్ను పెవిలియన్కు పంపాడు. మొత్తంగా 9 ఓవర్ల బౌలింగ్లో 46 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ఆల్రౌండర్ జడ్డూ.. ఈ క్రమంలో ముంబై మ్యాచ్లో 35.4 ఓవర్లలోనే ఆస్ట్రేలియా కథ ముగిసింది. 188 పరుగులకే ఆసీస్ ఆలౌట్ అయింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన హార్దిక్ సేన ఆరంభంలో తడబడినా.. కేఎల్ రాహుల్(75), రవీంద్ర జడేజా(45) అద్భుత అజేయ ఇన్నింగ్స్తో విజయం అందించారు. ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకుని, లబుషేన్ను అవుట్ చేయడంలో సంచలన క్యాచ్తో మెరిసిన జడేజాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. దటీజ్ జడేజా.. నిజమైన హీరో ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ జడేజాను ప్రశంసిస్తూ పైవిధంగా స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐదు నెలల తర్వాత టెస్టుతో పునరాగమనం చేశాడు. తొలి రెండు టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఇప్పుడు వన్డేలో కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. బ్యాటింగ్ బౌలింగ్ మాత్రమే కాదు అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో జట్టును గెలిపిస్తున్నాడు. గాయం నుంచి కోలుకుని సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చి ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వడం చాలా కొన్ని సందర్భాల్లోనే జరుగుతుంది. జట్టుకు ప్రధాన బలంగా మారాడు’’ అంటూ జడ్డూను మంజ్రేకర్ ఆకాశానికెత్తాడు. అప్పుడలా.. ఇప్పుడిలా.. గతంలో మంజ్రేకర్ జడేజాను ఉద్దేశించి అరకొర ఆటగాడు అంటూ తక్కువ చేసిన మాట్లాడగా.. అదే రేంజ్లో జడ్డూ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్-2022 టీ20 టోర్నీ సందర్భంగా పాకిస్తాన్తో మ్యాచ్లో జడేజా అద్భుత ప్రదర్శన నేపథ్యంలో మంజ్రేకర్ మాటలు కలిపాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి రవీంద్ర జడేజాను మంజ్రేకర్ ప్రశంసించడం నెట్టింట వైరల్గా మారింది. ‘మంజ్రేకర్ నువ్వేనా ఈ మాట అంటున్నది! నిజమేనా.. నమ్మలేకపోతున్నాం’ అంటూ జడ్డూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: KL Rahul: రాహుల్ అద్భుత ఇన్నింగ్స్.. కారణమిదే అంటున్న ఫ్యాన్స్! కోహ్లి కూడా.. NZ VS SL 2nd Test: డబుల్ సెంచరీలు బాదిన కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ #TeamIndia go 1⃣-0⃣ up in the series! 👏 👏 An unbeaten 1⃣0⃣8⃣-run partnership between @klrahul & @imjadeja as India sealed a 5⃣-wicket win over Australia in the first #INDvAUS ODI 👍 👍 Scorecard ▶️ https://t.co/BAvv2E8K6h @mastercardindia pic.twitter.com/hq0WsRbOoC — BCCI (@BCCI) March 17, 2023 Innings Break!#TeamIndia bowlers put up a fine show here at the Wankhede Stadium as Australia are all out for 188 runs in 35.4 overs. Three wickets apiece for Shami and Siraj. Scorecard - https://t.co/8mvcwAvYkJ #INDvAUS @mastercardindia pic.twitter.com/S1HkPEPyGl — BCCI (@BCCI) March 17, 2023 -
విమర్శలు వచ్చాయని 70, 80ల నాటి పిచ్ తయారు చేస్తారా?
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అహ్మదాబాద్ పిచ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన నాలుగో టెస్టు పిచ్ పూర్తిగా బ్యాటింగ్ ట్రాక్లా కనిపిస్తుంది. తొలిరోజు ఆటలో టీమిండియా బౌలర్లు నానాకష్టాలు పడి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 104 పరుగులు నాటౌట్ సెంచరీతో కదం తొక్కగా.. కామెరాన్ గ్రీన్ 49 పరుగులు క్రీజులో ఉన్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన సంజయ్ మంజ్రేకర్ పిచ్పై ఆసక్తికరంగా స్పందించాడు. ''అహ్మదాబాద్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా కనిపిస్తుంది. మూడు సెషన్లు కలిపి టీమిండియా బౌలర్లు నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. తొలి మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియడంపై విమర్శలు రావడంతో బయపడిన క్యురేటర్లు మరీ ఇలా 70, 80ల కాలం నాటి పిచ్లను తయారు చేస్తారనుకోలేదు. బ్యాటింగ్కు అనుకూలంగా జీవం లేని పిచ్పై షమీ తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. జడేజా పర్వాలేదనిపించినా.. అక్షర్, అశ్విన్లు మాత్రం వికెట్లు పడగొట్టలేకపోయారు. అయితే రెండోరోజు ఆటలో పిచ్లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందేమో.'' అని పేర్కొన్నాడు. మంజ్రేకర్ వ్యాఖ్యలపై మరో కామెంటేటర్ మాథ్యూ హెడెన్ స్పందిస్తూ.. టెస్టు క్రికెట్ మ్యాచ్కు ఇది సరైన పిచ్లా అనిపిస్తుంది. తొలిరోజే అన్ని జరగాలంటే కుదరదు. రానున్న రోజుల్లో పిచ్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. టీమిండియా స్పిన్ త్రయం వికెట్లు తీయలేకపోయినప్పటికి తమ ఇంపాక్ట్ను చూపించారు. జడేజాతో పాటు అశ్విన్, అక్షర్ పటేల్లు తమ స్పిన్తో రెండో రోజు ఆసీస్ను తిప్పేస్తారేమో.'' అంటూ తెలిపాడు. -
WC 2023: ప్రపంచకప్ జట్టులో శార్దూల్కు చోటు ఖాయం! అంతలేదు..
India vs New Zealand- Shardul Thakur: ‘‘శార్దూల్.. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. లోపాలు సవరించుకుంటూ పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగుతూనే ఉంటాడు. తను బంతిని పెద్దగా స్వింగ్ చేయలేడని మనం భావించినప్పుడల్లా మనల్ని ఆశ్చర్యపరుస్తూ వికెట్లు తీస్తూనే ఉంటాడు. తను ప్రతిసారి గంటకు 140కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయకపోవచ్చు. కానీ.. అతడు నంబర్ 1గా ఎదుగుతాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. భారత పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. రాణించిన శార్దూల్ ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో ముగిసిన వన్డే సిరీస్లో శార్దూల్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. హైదరాబాద్లో జరిగిన మొదటి వన్డేలో 7.2 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చిన రెండు వికెట్లు తీసిన అతడు.. 3 పరుగులు చేయగలిగాడు. రాయ్పూర్ వన్డేలో 6 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆఖరిదైన ఇండోర్ మ్యాచ్లో 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 25 పరుగులతో సత్తా చాటిన శార్దూల్.. 6 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చోటు ఖాయం ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్ పాయింట్ సందర్భంగా.. వన్డే ప్రపంచకప్ జట్టు గురించి ప్రస్తావనకు రాగా ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కివీస్తో ఫైనల్ వన్డేలో శార్దూల్ ప్రదర్శనపై స్పందిస్తూ.. వరల్డ్కప్ జట్టులో ఫాస్ట్బౌలర్ల విభాగంలో అతడికి కచ్చితంగా చోటు దక్కుతుందని అంచనా వేశాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగల శార్దూల్ మిగతా వాళ్లకంటే ఓ అడుగు ముందే ఉంటాడని చెప్పుకొచ్చాడు. అంతలేదన్న మంజ్రేకర్ అయితే, మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం ఇర్ఫాన్ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ప్రపంచకప్ జట్టులో శార్దూల్కు స్థానం దక్కుతుందని తాను భావించడం లేదన్నాడు. ‘‘మెగా టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. తనూ పేస్ ఆల్రౌండరే. కాబట్టి శార్దూల్కు చోటు కష్టమే. పేసర్ల విభాగంలోనూ అతడు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: ICC T20 World Cup: ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా.. కివీస్తో పోరుకు సై IPL: ఆల్టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! కానీ.. -
Ind Vs NZ: అతడి కోసం కోహ్లి త్యాగం చేయాలి! అప్పుడే ఆ ఇద్దరు..
Shubman Gill Vs Ishan Kishan: శుబ్మన్ గిల్.. ఇషాన్ కిషన్.. ఈ ఇద్దరు యువ బ్యాటర్లు టీమిండియా ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతున్నారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఐదో స్థానానికి డిమోట్ అయిన తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా వీరిలో ఒకరికి అవకాశం రావడం తథ్యం. అయితే, ఇషాన్ కంటే గిల్వైపే యాజమాన్యం మొగ్గుచూపుతోంది. శ్రీలంకతో స్వదేశంలో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లోనూ ఈ విషయం మరోసారి నిరూపితమైంది. రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో టీ20 సిరీస్లో గిల్- ఇషాన్ ఓపెనర్లుగా వచ్చారు. ఇక వన్డే సిరీస్లో మాత్రం హిట్మ్యాన్కు జోడీగా శుబ్మన్ గిల్ వచ్చాడు. ఇషాన్ను పక్కన పెట్టి తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. శుబ్మన్ గిల్ అద్భుత ప్రదర్శన లంకతో మూడు వన్డేల్లో వరుసగా 70, 21, 116 పరుగులు చేశాడు గిల్. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో స్వదేశంలో ఉప్పల్ వేదికగా మొదలుకానున్న వన్డే సిరీస్లోనూ ఇషాన్ కిషన్కు మొండిచేయి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ప్రపంచకప్-2023 నాటికి బ్యాకప్ ఓపెనర్లను సిద్ధం చేసే క్రమంలో ఇద్దరికీ ఛాన్స్ వస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఇందుకు పరిష్కారం తాను చెబుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్, ఇషాన్ ఇద్దరికీ వన్డేల్లో ఆడే అవకాశం రావాలంటే రన్మెషీన్ విరాట్ కోహ్లి తన మూడో స్థానాన్ని త్యాగం చేయాలని విజ్ఞప్తి చేశాడు. బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ ఎవరో ఒకరికే.. కాబట్టి ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షో గ్లేమ్ ప్లాన్ చర్చలో భాగంగా సంజయ్ మాట్లాడుతూ.. ‘‘ఇది నిజంగా క్లిష్టతరమైన ప్రశ్నే! యువ బ్యాటర్లలో ఒకరికి ఓపెనర్గా చోటు ఇస్తే మరొకరికి భంగపాటు తప్పదు. అయితే, ఈ సమస్యను పరిష్కరించే కిటుకు ఒకటి చెప్తాను. అప్పుడు రాయుడు కోసం శుబ్మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. కాబట్టి విరాట్ కోహ్లి తన మూడో స్థానాన్ని త్యాగం చేసి నాలుగో స్థానంలో ఆడితే బాగుంటుంది. గతంలో.. చాలా ఏళ్ల క్రితం శ్రీలంకతో సిరీస్లో అంబటి రాయుడు కోసం కోహ్లి ఈ పని చేశాడు. ఇప్పుడు కూడా అలాగే ఆలోచిస్తే.. ఇషాన్ కిషన్కు మార్గం సుగమమవుతుంది. ఇషాన్ వస్తే.. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ ఓపెనర్గా వస్తే లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ కాంబినేషన్ కుదురుతుంది’’ అని తన అభిప్రాయం పంచుకున్నాడు. రోహిత్- ఇషాన్ ఓపెనర్లుగా వస్తే.. గిల్ వన్డౌన్లో.. కోహ్లి నాలుగో స్థానంలో రావాలని సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. కాగా బంగ్లాదేశ్తో నిర్ణయాత్మక మూడో వన్డేల్లో ఇషాన్ ద్విశతకం బాది పలు రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. చదవండి: Suryakumar Yadav: జూనియర్ ఎన్టీఆర్తో సూర్య, దేవిషా..! బ్రదర్ అంటూ ట్వీట్.. ఫొటో వైరల్ న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. కీలక ఆటగాడు ఔట్ -
'సచిన్ సాధించిన ఆ రికార్డును కోహ్లి సాధించలేడు'
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. గతేడాది జరిగిన ఆసియాకప్లో తొలి టీ20 సెంచరీతో చెలరేగిన విరాట్.. అనంతరం టీ20 ప్రపంచకప్, బంగ్లాదేశ్ సిరీస్లలో సత్తా చాటాడు. తాజగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించిన కోహ్లి.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ 100 సెంచరీల రికార్డును కూడా కింగ్ కోహ్లి బ్రేక్ చేస్తాడు అని పలువురు భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు విరాట్ కెరీర్లో 73 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. కాగా వన్డేల్లో 45, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒక సెంచరీ ఉంది. కాగా వన్డేల్లో సచిన్(49) సెంచరీల రికార్డుకు కోహ్లి కేవలం 4 సెంచరీల దూరంలో మాత్రమే ఉన్నాడు. రాబోయే రోజుల్లో సచిన్ వన్డేల రికార్డును విరాట్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. అయితే టెస్టుల్లో సచిన్ సెంచరీల రికార్డును కోహ్లి బ్రేక్ చేయలేడని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. "టెస్టుల్లో సచిన్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం కోహ్లికి కఠిన సవాలు వంటిది. వన్డేల్లో విరాట్ ఆల్టైమ్ గ్రేట్. అదే విధంగా టెస్టుల్లో కూడా విరాట్ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే టెస్టుల్లో సచిన్ 51 సెంచరీలు సాధించాడు. టెస్టు క్రికెట్లో అన్ని సెంచరీలు చేయడం అంతసులభం కాదు. కాబట్టి విరాట్కు ఇది అసలైన ఛాలెంజ్. కోహ్లి తన అద్భుత ఫామ్ను కొనసాగించి సచిన్ రికార్డును బ్రేక్ చేయాలని ఆశిస్తున్నాను" అని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్ షోలో పేర్కొన్నారు. చదవండి: IND vs SL: వన్డేల్లో శ్రీలంక అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
రంజీల్లో పృథ్వీ షా చరిత్ర.. అరుదైన రికార్డు! ఎవరికీ అందనంత ఎత్తులో!
Prithvi Shaw Triple Century- Rare Record: ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా గురించి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ముంబై బ్యాటర్ తన అభిమాన ఆటగాడని.. అతడే తన రికార్డును బద్దలు కొట్టడం సంతోషంగా ఉందన్నాడు. రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో భాగంగా అసోంతో మ్యాచ్లో పృథ్వీ షా అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆటలో భాగంగా ఈ ముంబైకర్ ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 379 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కొద్దిలో క్వాడ్రపుల్ సెంచరీ మిస్ అయినా.. కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. రంజీల్లో సరికొత్త చరిత్ర ఈ క్రమంలో రంజీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. బాంబే ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ను అధిగమించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానానికి దూసుకువచ్చాడు. అరుదైన ఘనత సాధించి తన సమకాలీన క్రికెటర్లకు అందనంత ఎత్తుకు ఎదిగాడు 23 ఏళ్ల ఈ టీమిండియా ఓపెనర్. ఈ నేపథ్యంలో పృథ్వీని అభినందిస్తూ.. సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. ‘‘377 పరుగులతో నేను సృష్టించిన రికార్డును.. నేను అభిమానించే ఆటగాడు బద్దలు కొట్టడం చూసి థ్రిల్ అయ్యాను. వెల్డన్ పృథ్వీ!’’ అని ఈ యువ ఆటగాడిని ప్రశంసించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు 1. బీబీ నింబాల్కర్ (మహారాష్ట్ర) – 443 నాటౌట్ (vs) సౌరాష్ట్ర (1948-49) 2. పృథ్వీ షా (ముంబై) – 379 (vs) అసోం (2022-23) 3. సంజయ్ మంజ్రేకర్ (బాంబే) – 377 (vs)హైదరాబాద్ (1990-91) 4. ఎంవీ శ్రీధర్ (హైదరాబాద్) – 366 (vs) ఆంధ్ర (1993-94) 5. విజయ్ మర్చంట్ (బాంబే) – 359 నాటౌట్(vs) మహారాష్ట్ర (1943-44) చదవండి: Ind Vs SL: ఇలాంటి ఆటగాడిని చూడలేదు.. ఆ ప్రేమ నిజం! కోహ్లి ప్రశంసల జల్లు IPL 2023-Rishabh Pant: పంత్ లేని లోటు ఎవరూ తీర్చలేరు.. అయితే: గంగూలీ కీలక వ్యాఖ్యలు Champion player 💪 Too good @PrithviShaw 💯💯💯 👏 pic.twitter.com/5wZ29EasNb — Shreyas Iyer (@ShreyasIyer15) January 11, 2023 Thrilled that my record of 377 was beaten by a batter I adore! Well done Prithvi! 👏🏼👏🏼👏🏼 — Sanjay Manjrekar (@sanjaymanjrekar) January 11, 2023 -
టీమిండియా యువ ఓపెనర్ విధ్వంసం.. 400 మిస్! రికార్డులు బద్దలు
Assam vs Mumbai- Prithvi Shaw Triple Century: రంజీ ట్రోఫీ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర పృథ్వీ షా దుమ్ములేపుతున్నాడు. ఈ ముంబై ఆటగాడు అసోంతో మ్యాచ్లో ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మలిచాడు. గువహటి వేదికగా మంగళవారం మొదలైన టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి ఈ యువ బ్యాటర్ 240 పరుగులు సాధించాడు. క్వాడ్రపుల్ సెంచరీ మిస్ ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా త్రిశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 379 పరుగుల వద్ద రియాన్ పరాగ్ బౌలింగ్లో పృథ్వీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో క్వాడ్రపుల్ సెంచరీ మిస్సయ్యాడు. కాగా ఈ తొలి ఇన్నింగ్స్లో మొత్తంగా 383 బంతులు ఎదుర్కొన్న 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో ఈ మేరకు భారీగా పరుగులు రాబట్టాడు. దిగ్గజాల రికార్డులు బద్దలు తద్వారా ట్రిపుల్ సెంచరీ వీరుడు 23 ఏళ్ల పృథ్వీ షా.. టీమిండియా దిగ్గజాల పేరిట ఉన్న పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ముంబై తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్గా ఘనత సాధించాడు. గతంలో సంజయ్ మంజ్రేకర్ 377 పరుగులతో ముంబై టాప్ బ్యాటర్గా ఉండగా.. 32 ఏళ్ల తర్వాత యువ ఓపెనర్ పృథ్వీ షా అతడిని అధిగమించాడు. అదే విధంగా.. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (ముంబై తరఫున రంజీల్లో 340 పరుగులు)ను కూడా దాటేశాడు. కాగా గత కొన్నాళ్లుగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న పృథ్వీ షా ఈ అద్భుత ఇన్నింగ్స్తో మరోసారి సెలక్టర్లకు సవాల్ విసిరాడు. చదవండి: Kohli-Pandya: పాండ్యాపై గుడ్లురిమిన కోహ్లి! సెంచరీ మిస్ అయ్యేవాడే! వీడియో వైరల్ IPL 2023: పంత్ లేని లోటు ఎవరూ తీర్చలేరు.. అయితే: గంగూలీ కీలక వ్యాఖ్యలు -
Ind Vs Ban: రెండో టెస్టులో గిల్పై ‘వేటు పడటం’ ఖాయం! వాళ్లున్నారు కదా!
India tour of Bangladesh, 2022: ‘‘ఈ అబ్బాయి సెంచరీ చేశాడు. మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఒకవేళ రోహిత్ శర్మ ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చాడనుకోండి.. కేఎల్ రాహుల్- రోహిత్ల జోడీకే ఓపెనర్లుగా మొదటి ప్రాధాన్యం. కచ్చితంగా రోహిత్నే ఆడిస్తారు. ఎందుకంటే తను కెప్టెన్ కదా! ఇక కేఎల్ రాహుల్ పరుగులు రాబట్టకపోయినా వాళ్లు అతడిని పక్కన పెట్టే అవకాశమే లేదు. కాబట్టి శుబ్మన్ గిల్ను బెంచ్కే పరిమితం చేయకతప్పదు. నాకు తెలిసి.. గతంలో అజింక్య రహానే విషయంలో కూడా ఓసారి ఇలాగే జరిగింది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. కాగా బంగ్లాదేశ్ టూర్ నేపథ్యంలో గాయపడ్డ భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదో మొదటి టెస్టులో యువ బ్యాటర్ శుబ్మన్ గిల్కు ఓపెనర్గా అవకాశం దక్కింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో 20 పరుగులు మాత్రమే చేయగలిగిన గిల్.. రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగాడు. 152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 110 పరుగులు సాధించాడు. తద్వారా జట్టు భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ వస్తే.. గిల్ కచ్చితంగా బెంచ్ మీదే అయితే, రెండో టెస్టు నాటికి రోహిత్ అందుబాటులోకి రానున్నాడన్న వార్తల నేపథ్యంలో జట్టులో గిల్ స్థానం ప్రశ్నార్థకమైంది. ఓపెనర్గా కెప్టెన్ బరిలోకి దిగడం ఖాయం.. దీనితో పాటుగా మిడిలార్డర్లో పుజారా, కోహ్లి, పంత్, శ్రేయస్ అయ్యర్ తదితరులు ఉన్న నేపథ్యంలో తుది జట్టులో గిల్కు చోటు దక్కే అవకాశం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సంజయ్ మంజ్రేకర్ సోనీ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రోహిత్ జట్టులోకి వస్తే గిల్ను తప్పించడం ఖాయమని అంచనా వేశాడు. బంగ్లాదేశ్లో టీమిండియా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది కాబట్టి గిల్పై వేటువేయక తప్పదని అభిప్రాయపడ్డాడు. అదనపు బ్యాటింగ్ ఆప్షన్లుగా అక్షర్ పటేల్, అశ్విన్ ఉండటం కూడా గిల్ అవకాశాలపై ప్రభావం చూపుతుందని చెప్పుకొచ్చాడు. కాగా డిసెంబరు 22 నుంచి బంగ్లాదేశ్- టీమిండియా మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Mbappe- Messi: మెస్సీ విజయానికి అర్హుడే! కానీ నువ్వు ఓటమికి అర్హుడివి కాదు! గర్వపడేలా చేశావు.. FIFA WC 2022: విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్మనీ, అవార్డులు, ఇతర విశేషాలు -
అలాంటి వాళ్లకు స్థానం ఉండదు.. మయాంక్ కోసం పోటీ ఖాయం: భారత మాజీ క్రికెటర్
IPL 2023 Mini Auction- Mayank Agarwal: ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో మయాంక్ అగర్వాల్ను విడుదల చేసింది పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ. గత సీజన్లో తమ కెప్టెన్గా వ్యవహరించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్కు గుడ్ బై చెప్పింది. అతడి స్థానంలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ క్రమంలో పంజాబ్ రిటెన్షన్ జాబితాలోలేని మయాంక్ వేలంలోకి రానున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మయాంక్ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడటం ఖాయమని అభిప్రాయపడ్డాడు. సంజయ్ మంజ్రేకర్(PC: Sanjay Manjrekar Twitter) మయాంక్ కోసం పోటీ ఎందుకంటే అందుకు గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘ఓ సీజన్లో చెత్తగా ఆడామంటే.. కచ్చితంగా వారి కోసం వెచ్చించిన డబ్బు గురించి యాజమాన్యం ఆలోచించడం సహజమే! మిగత వాళ్లతో పోలిస్తే మయాంక్ అగర్వాల్ విషయం కాస్త భిన్నం. అతడిని వదులుకోవడం ద్వారా వచ్చిన డబ్బులో కొంతమొత్తం చెల్లించి అతడిని మళ్లీ కొనుగోలు చేయవచ్చు. లేదంటే వేరే ఆప్షన్ల వైపు చూడొచ్చు. నిజానికి మయాంక్ అగర్వాల్ మంచి ఆటగాడు. ఆటలో మంచి వాళ్లకు స్థానం ఉండదు ఎంత మంచి వాడంటే.. కెప్టెన్గా ఉన్నపుడు తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. నిజానికి గత సీజన్లలో కేఎల్ రాహుల్తో కలిసి ఓపెనర్గా వచ్చి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, కెప్టెన్ అయిన తర్వాత టాపార్డర్లో ఉన్నా కొన్నిసార్లు తన ఓపెనర్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో పరుగులు చేయలేకపోయాడు. నిజానికి తనకు మరో ఏడాది పాటు అవకాశం ఇవ్వాల్సింది. అయితే ఆటలో మంచి వాళ్లకు స్థానం ఉండదు. తన విషయంలో చాలా బాధగా ఉంది. ఏదేమైనా.. సరైన ఓపెనర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంఛైజీలు మయాంక్ కోసం పోటీ పడటం ఖాయం. 150, 160 స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేయగల.. స్పిన్, పేస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగల ఓపెనింగ్ బ్యాటర్ను కొనడానికి ఆసక్తి చూపిస్తాయి’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ సారథిగా వ్యవహరించిన మయాంక్.. 13 ఇన్నింగ్స్ ఆడి 196 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, కెప్టెన్గా పద్నాలుగింట ఏడు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో జట్టును ఆరో స్థానంలో నిలిపాడు. చదవండి: IPL 2023: ఫ్రాంచైజీలు అవమానకర రీతిలో వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..! Kane Williamson: నన్ను రిలీజ్ చేస్తారని ముందే తెలుసు.. అయినా హైదరాబాద్తో: కేన్ మామ భావోద్వేగం IPL 2023 Retention: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మంజ్రేకర్ ఫొటో షేర్ చేస్తూ జడేజా ట్వీట్.. రిప్లైతో మనసు గెలిచేశాడు!
Ravindra Jadeja- Sanjay Manjrekar: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ను ఉద్దేశించి.. ‘‘నా ప్రియమైన మిత్రుడిని స్క్రీన్ మీద చూస్తున్నా’’ అంటూ జడ్డూ మంజ్రేకర్ ఫొటో షేర్ చేశాడు. కాగా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి దూరమైన ఈ ఆల్రౌండర్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా మంజ్రేకర్ మాట్లాడుతున్న దృశ్యాన్ని పంచుకున్న జడ్డూ అతడిని డియర్ ఫ్రెండ్ అని సంభోదించాడు. ప్రియ మిత్రులుగా మారారా?! ఇక ఇందుకు స్పందనగా.. ‘‘హహా.. నువ్వు త్వరగా మైదానంలో అడుగుపెడితే చూడాలని నీ ఈ ప్రియమిత్రుడు ఎదురుచూస్తున్నాడు’’ అంటూ మంజ్రేకర్ బదులిచ్చాడు. ట్విటర్లో వీరిద్దరి సంభాషణ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘‘వామ్మో.. ఒకప్పటి ‘శత్రువులు’ ఇప్పుడు మిత్రులుగా మారిపోయారా!? నీ రిప్లైతో జడ్డూ మనసు గెలిచేసుకున్నావన్న మాట’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. అప్పుడేమో అలా.. వన్డే వరల్డ్కప్-2019 సెమీ ఫైనల్ సందర్భంగా మంజ్రేకర్.. జడేజాను ఉద్దేశించి అరకొర ఆటగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు స్పందించిన జడ్డూ.. ‘‘నా కెరీర్లో ఇప్పటి వరకు నీకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడాను. ఇంకా ఆడతాను’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్వార్ నడిచింది. అయితే, ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో పాకిస్తాన్తో తొలి మ్యాచ్లో జడేజా అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో.. అతడితో మాట్లాడేందుకు మంజ్రేకర్ వచ్చాడు. మంజ్రేకర్ను చూసి జడ్డూ నవ్వగా.. జడ్డూ నాతో మాట్లాడం ఇష్టమేనా అని ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా మాట్లాడుతా అంటూ జడేజా నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి కూడా! తాజాగా జడేజా ట్వీట్తో మరోసారి వీరిద్దరు వార్తల్లోకి వచ్చారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ టోర్నీ జరుగుతున్న సమయంలో గాయపడిన జడేజా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. మరోవైపు.. పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా వెన్నునొప్పి తిరగబెట్టడంతో టీ20 ప్రపంచకప్-2022 ఆడే అవకాశాలు లేకుండా పోయాయి. ఇలా ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే. చదవండి: T20 WC 2022 Prize Money: ప్రైజ్మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎంత లభిస్తుందంటే! Ha ha… and your dear friend looking forward to seeing you on the field soon :) https://t.co/eMpZyZYsYU — Sanjay Manjrekar (@sanjaymanjrekar) September 30, 2022 -
Ind Vs Eng: ప్రస్తుతం అతడిని ఎదుర్కోగల బౌలర్ ప్రపంచంలోనే లేడు! అంతలా..
Ind Vs Eng T20 Series: టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అద్భుత షాట్లతో విరుచుకుపడే సూర్యను కట్టడి చేయగల బౌలర్ ప్రస్తుతం ఎవరూ లేరంటూ కొనియాడాడు. అతడికి ఎలా బౌలింగ్ చేయాలో తెలియక చాలా మంది తలలు పట్టుకుంటున్నారని పేర్కొన్నాడు. కాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది మార్చిలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. ఇంగ్లండ్తో టీ20 ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ను స్సిర్తో మొదలు పెట్టి 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి సత్తా చాటాడు. క్యాష్ రిచ్ లీగ్లోనూ ముంబై ఇండియన్స్లో కీలక బ్యాటర్గా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఒకటీ రెండూ మినహా వచ్చిన అవకాశాలన్నీ దాదాపుగా సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో మూడో టీ20లో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో 55 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 117 పరుగులు సాధించి పొట్టి ఫార్మాట్లో తొలి శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన మొదటి బ్యాటర్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ స్పోర్ట్స్18తో ముచ్చటిస్తూ సూర్యకుమార్పై ప్రశంసలు కురిపించాడు. ‘‘సూర్య సెంచరీ ఓ మధుర జ్ఞాపకం. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి స్ట్రైక్ రేటు(212.73). క్లాసిక్ ఇన్నింగ్స్. ప్రస్తుతం తన బ్యాటింగ్కు ఎదుర్కోగల సమర్థవంతమైన బౌలర్ ఎవరూ లేరని చెప్పొచ్చు’’ అని పేర్కొన్నాడు. ఇక సూర్యకు స్టాండింగ్ ఓవియేషన్ లభించడంపై స్పందిస్తూ.. ‘‘సెంచరీ తర్వాత ప్రేక్షకులు నిలబడి చప్పట్లతో అతడిని అభినందించారు. నిజానికి కేవలం టీమిండియా అభిమానులు మాత్రమే కాదు.. ఇంగ్లండ్ జట్టు మద్దతుదారులు సైతం అతడిని కొనియాడారు. ఈ మ్యాచ్లో సూర్య ఇన్నింగ్స్ కారణంగా తాము ఓడినా సరే పర్వాలేదన్నట్లుగా ఒక ఆటగాడికి దక్కాల్సిన గౌరవాన్ని ఇచ్చారు’’ అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. చదవండి: Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్ను కాదని అర్ష్దీప్ సింగ్కు ఛాన్స్! ఇంకా.. An innings worth millions - whole crowd gave a standing ovation to Suryakumar Yadav. pic.twitter.com/gj2ZzhyS76 — Mufaddal Vohra (@mufaddal_vohra) July 10, 2022 -
జడేజాకు కష్టమే.. త్యాగాల గోల తప్పదు; అభిమానుల ఆగ్రహం
టి20 ప్రపంచకప్ 2022కు మరో నాలుగు నెలల సమయం ఉంది. అయితే అప్పటివరకు పటిష్టమైన జట్టును రూపొందించాలంటే ఈ గ్యాప్లో టీమిండియా ఆడనున్న సిరీస్లు కీలకమనే చెప్పొచ్చు. సౌతాఫ్రికాతో సిరీస్తో ఇప్పటికే టి20 ప్రపంచకప్ సన్నాహకాలు మొదలైనట్లేనని చెప్పొచ్చు. ఆ సిరీస్లో ఇషాన్ కిషన్, దినేశ్ కార్తిక్, భువనేశ్వర్ కుమార్లు సూపర్గా రాణించి పొట్టి ప్రపంచకప్కు తమనే ఎంపిక చేయాల్సిందేనంటూ పరోక్షంగా సంకేతాలు పంపారు. తాజాగా ఏకకాలంలో అటు ఐర్లాండ్.. ఇటు ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా బిజీ కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర సంజయ్ మంజ్రేకర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానున్న టి20 ప్రపంచకప్ కోసం జడేజా స్థానంలో అక్షర్ పటేల్ను ఎంపిక చేస్తే బాగుంటుందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. '' ఒక విషయం క్లియర్ అయింది. కార్తిక్ 6 లేదా ఏడో స్థానంలో వచ్చి ఫినిషర్గా అదరగొట్టడం గ్యారంటీ. అయితే ఇదే జడేజాను చిక్కుల్లో పడేలా చేసింది. టాప్ నాలుగు స్థానాలు ఇప్పటికే ఖరారయిన నేపథ్యంలో ఐదు, ఆరు, ఏడు స్థానాలు కీలకంగా మారాయి. దినేశ్ కార్తిక్ కంటే ముందు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కు వస్తున్నాడు. మధ్యలో రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. ఈ ముగ్గురికి తుది జట్టులో చోటు ఉంటే జడేజా ఉండడం కష్టమవుతుంది. అందుకే జడేజా స్థానంలో అక్షర్ పటేల్ను తీసుకోవడం ఉత్తమం. అయితే జడేజా స్థానాన్ని నేను తప్పుబట్టడం లేదు. అతను ఎంత మంచి ఆల్రౌండర్ అనేది అందరికి తెలిసిందే. కానీ టి20 ప్రపంచకప్లో పర్ఫెక్ట్ జట్టును ఎంపిక చేయాలంటే ఈ త్యాగాల గోల తప్పేలా లేదు'' అంటూ కామెంట్ చేశాడు. అయితే మంజ్రేకర్ జడేజాను పక్కనబెట్టాలని చేసిన ప్రతిపాదనను అభిమానులు తిరస్కరించారు. ఈ తరం ఆల్రౌండర్లలో గొప్ప పేరు పొందిన జడేజాను పక్కడబెడితే టీమిండియా తగిన మూల్యం చెల్లించుకున్నట్లే అని కామెంట్స్ చేశారు. ఇక జడేజా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో నాయకత్వ బాధ్యతలు అందుకున్న జాడేజా జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. దీంతో కెప్టెన్సీ నుంచి మధ్యలోనే వైదొలిగిన జడ్డూ తిరిగి ధోనికి బాధ్యతలు అప్పజెప్పాడు. సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన జడ్డూ 116 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లోనూ 5 వికెట్లు తీసి నిరాశపరిచాడు. ఆ తర్వాత గాయం కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలిగిన జడేజా ఎన్సీఏలో ఫిట్నెస్ సాధించి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడు. చదవండి: కోపం వస్తే మాములుగా ఉండదు.. మరోసారి నిరూపితం
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement