-
వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్.. డేటింగ్ చేసి తప్పు చేశా: హీరో
ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో చెప్పలేం. తెలియకుండానే కొందరు ప్రేమలో పడిపోతారు. కానీ కొందరే చివరివరకు ఆ ప్రేమను నిలుపుకుంటారు. చాలామటుకు ప్రేమలు మధ్యలోనే పుటుక్కుమంటాయి. ఇది సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా గతంలో ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ దేనికీ శుభం కార్డు పడలేదు. లవ్ ఆజ్ కల్ 2 సినిమా షూటింగ్ సమయంలో సారా అలీ ఖాన్తో, దోస్తానా 2 మూవీ చిత్రీకరణ టైంలో జాన్వీ కపూర్తో ప్రేమలో ఉన్నట్లు టాక్ నడిచింది. ఇద్దరమ్మాయిలతో డేటింగ్ దోస్తానా 2 షూటింగ్ మొదలుపెట్టిన కొంతకాలానికే ఆ మూవీ అటకెక్కింది. అప్పుడే వీరి ప్రేమ కూడా ముగిసిపోయింది. తాజాగా నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్.. తన పాత లవ్ కహానీల గురించి ప్రస్తావించాడు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్తో డేటింగ్ చేసినందుకు ఏమైనా గిల్టీగా ఫీలవుతున్నారా? అన్న ప్రశ్నకు అవునని బదులిస్తూనే.. ఒకవేళ నాతో బ్రేకప్ అయిన తర్వాత వాళ్లు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యుంటే..? ఏదేమైనా అందుకు గిల్టీగానే ఫీలవుతున్నాను అన్నాడు. కనిపిస్తే అదే అడుగుతా మాజీ ప్రేయసి కనిపిస్తే ఫస్ట్ ఏం మాట్లాడతావు? అని హోస్ట్ ప్రశ్నించగా.. ప్రస్తుతం నీ లైఫ్ ఎలా ఉంది? అని ఆరా తీస్తాను అని చెప్పుకొచ్చాడు. కాగా సారా అలీఖాన్, జాన్వీ కపూర్.. ఇద్దరూ క్లోజ్ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే! కార్తీక్ విషయానికి వస్తే.. ప్రస్తుతం చాందు చాంపియన్ సినిమా చేస్తున్నాడు. అలాగే భూల్ భులయ్యా 3, ఆషిఖి 3 చిత్రాలు అతడి చేతిలో ఉన్నాయి. చదవండి: నటి భర్తకు గుండెపోటు.. క్షమాపణలు చెప్తూ పోస్ట్! -
యాచకులకు ఫుడ్ పంచిన హీరోయిన్.. ప్లీజ్ అలా చేయొద్దంటూ..
హీరోయిన్ అవ్వాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. అందం ఉండాలి. అయితే ఒకప్పుడు బొద్దుగా ఉన్నవారు హీరోయిన్లుగా నిలదొక్కుకున్నారు. కానీ ఈ తరంలో మాత్రం బొద్దుగా ఉంటే ఎక్కువకాలం ఇండస్ట్రీలో కంటిన్యూ చేయలేరు. ఇంకో ఛాయిస్ లేనట్లు సన్నబడి తీరాల్సిందే! అలా సారా అలీ ఖాన్ సైతం తన బరువు తగ్గించుకుని సన్నబడింది. హీరోయిన్గా సినిమాలు చేస్తోంది. దేవుడి దర్శనం అనంతరం.. ఈ మధ్య 'మర్డర్ ముబారక్', 'ఏ వాతా మేరే వాతా' అనే ఓటీటీ ప్రాజెక్టులతో వెబ్ ఆడియన్స్ను అలరించింది. శనివారం నాడు ఆమె ముంబై.. జుహులోని శనీశ్వరుడి ఆలయానికి వెళ్లింది. దేవుడిని దర్శించుకున్న అనంతరం బయట ఉన్న యాచకులకు స్వీట్లు పంచింది. భిక్షాటన చేస్తున్న అందరికీ స్వీటు బాక్సులు పంచుతుండటంగా అక్కడ ఉన్న మీడియావాళ్లు ఆమెను ఫోటోలు, వీడియోల్లో బంధించేందుకు ప్రయత్నించారు. మీరు మారరు దీంతో విసిగెత్తిన బ్యూటీ.. ప్లీజ్, ఆపేయండి. మిమ్మల్ని బతిమాలి, బతిమాలి నేను అలిసిపోతున్నాను, కానీ మీరు మారడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేసింది. స్వీట్లు పంచిన అనంతరం అక్కడినుంచి విసురుగా కారెక్కి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ప్రస్తుతం సారా అలీ ఖాన్ 'మెట్రో ఇన్ డినో' అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ప్రియుడితో తొలిసారి విహారయాత్రకు వెళ్లిన బ్యూటీ -
Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో
సినిమాలు పాత కథలను తవ్వి పోస్తున్నాయి. చరిత్ర గతిని వెండి తెర మీద పునఃసృష్టిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో ఘట్టాలు. ఎందరో త్యాగమూర్తులు. కాని పురుషుల బయోపిక్లు వచ్చినట్టుగా స్త్రీలవి రాలేదు. తాజాగా విడుదలైన ‘అయ్ వతన్ మేరే వతన్’ సినిమా నాటి వీర వనిత ఉషా మెహతా జీవితాన్ని చూపింది. బ్రిటిష్కు వ్యతిరేకంగా సీక్రెట్ రేడియో నడిపిన ఉషా మెహతా ఎవరు? ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో కాలింగ్ ఆన్ 42.34 మీటర్స్ సమ్వేర్ ఇన్ ఇండియా’... ఈ అనౌన్స్మెంట్ బ్రిటిష్ వారిని గడగడలాడించింది. మునికాళ్ల మీద పరిగెత్తిచ్చింది. ఒక బుల్లి రహస్య రేడియో స్టేషన్ని, దాని నిర్వాహకులను అరెస్ట్ చేయడానికి పిచ్చెక్కినట్టు తిరిగేలా చేసింది. మూడు నెలల పాటు బ్రిటిష్వారిని ముప్పుతిప్పలు పెట్టిన ఆ రేడియో నిర్వాహకురాలి పేరు ఉషా మెహతా. గాంధీ పిలుపు విని... ఉషా మెహతా గుజరాత్లోని సూరత్ సమీపంలో ఉన్న సారస్ అనే ఊళ్లో 1920లో జన్మించింది. ఐదేళ్ల వయసులో గాంధీజీని అహ్మదాబాద్లో చూసింది. 8 ఏళ్ల వయసులో వాళ్ల ఊరి దగ్గర గాంధీజీ చరఖా కార్యక్రమం నిర్వహిస్తే ఉషా పాల్గొని కొద్దిసేపు చరఖా తిప్పింది. బాల్యంలోనే గాంధీజీ మీద గొప్ప భక్తి పెంచుకున్న ఉషా 12 ఏళ్ల వయసులో తండ్రి వృత్తిరీత్యా బొంబాయికి మారడంతో తన దేశభక్తిని చాటుకునే అవకాశం పొందింది. డూ ఆర్ డై 1942 ఆగస్టు 8న బొంబాయిలో గాంధీజీ క్విట్ ఇండియా పిలుపునిచ్చారు. ‘డూ ఆర్ డై’ లేదా ‘కరో యా మరో’ నినాదాలు మిన్నంటాయి. ‘ఇక భారత ప్రజలు నాయకుల కోసం ఎదురు చూడొద్దు. ప్రజలే నాయకులు’ అని గాంధీజీ పిలుపునిచ్చారు. 22 ఏళ్ల ఉషా మెహతా తన స్నేహితులైన విఠల్ దాస్ ఖాకడ్, చంద్రకాంత్ ఝావేరీ, బాబూభాయ్ ఠక్కర్లతో కలిసి ఆ మీటింగ్కు వెళ్లింది. ఉత్తేజితురాలైంది. అప్పటికే స్వతంత్రోద్యమ వార్తల మీద బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉద్యమం ఉధృతం కావాలంటే రేడియో మాధ్యమం ద్వారా వార్తలు అందించాల్సిన అవసరం ఉందని ఉషా మెహతా తన స్నేహితులతో చెప్పింది. దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలని పిలుపునిచ్చింది. రహస్య కాంగ్రెస్ రేడియో బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జిగా పని చేస్తున్న తండ్రి నివారించినా వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఉషా బొంబాయిలో షికాగో రేడియో ట్రాన్స్మిషన్ను చూస్తున్న మరో మిత్రుడు మోత్వాని సహాయంతో సొంత ట్రాన్స్మిటర్ను సంపాదించింది. మిత్రులతో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని రేడియో స్టేషన్గా మలిచింది. ఆగస్టు 27, 1942న మొదటి చరిత్రాత్మక ప్రసారాన్ని సొంత గొంతుతో చేసింది. ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో 42.34 మీటర్స్ సమ్వేర్ ఇన్ ఇండియా’... అంటూ స్వాతంత్రోద్యమ వార్తలు వినిపించింది. ఆ క్షణం నుంచి ఆ రహస్య రేడియో కోసం బ్రిటిష్ అధికారులు, పోలీసులు కంటి మీద కునుకు లేకుండా వెతకసాగారు. ప్రసారాలు బొంబాయి నుంచే నిర్వహిస్తున్నా దేశంలో ఎక్కడి నుంచి అవుతున్నాయో తెలియక గింజుకున్నారు. మూడు నెలలు రహస్య రేడియో ప్రసారాలు మూడు నెలలు సాగాయి. కాని పరికరాలు సమకూర్చిన మోత్వాని లొంగిపోయి రేడియో స్టేషన్ చిరునామా చెప్పేశాడు. నవంబర్ 12, 1942న పోలీసులు దాడి చేసి ఉషా మెహతాను అరెస్ట్ చేశారు. ఆరు నెలల పాటు ఆమెను ఇంటరాగేట్ చేశారు. 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉషా ఏ మాత్రం జంకలేదు. 1946 నాటి మధ్యంతర ప్రభుత్వ హయాంలో మురార్జీ దేశాయ్ హోమ్ మినస్టర్గా ఉండగా ఆమె విడుదల జరిగింది. కాని జైలు జీవితం ఆమె ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసింది. బయటకు వచ్చాక ఆమె చదువు కొనసాగించి ముంబై యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి 1980లో రిటైర్ అయ్యింది. గాంధీజీ భావజాలాన్ని ప్రచారం చేస్తూ 2000 సంవత్సరంలో తుది శ్వాస విడిచింది. ఉషా మెహతా జీవితం ఆధారంగా నిర్మించిన బయోపిక్ ‘అయ్ వతన్ మేరే వతన్’ అమేజాన్లో మార్చి 21న విడుదలైంది. -
చీర సౌందర్యాలు, అందాల ఐశ్వర్యాలు (ఫోటోలు)
-
అందం ఉంటే సరిపోదు.. ఈ బ్యూటీలా దమ్ముండాలి
స్టేజీపై అందరిముందు హుందాగా, అందంగా నడవాలంటే టాలెంట్, ఒంపుసొంపులు ఉంటే సరిపోదు. ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే ఆ నడక అందం రెట్టింపు అవుతుంది. ముంబైలో జరిగిన లాక్మె ఫ్యాషన్ వీక్లో హీరోయిన్ సారా అలీ ఖాన్ ఎంతో దర్జాగా ర్యాంప్ వాక్ చేసింది. ఈ ఈవెంట్లో సిల్వర్ కలర్ లెహంగా ధరించిన సారా తన ఒంపుసొంపులతో హొయలొలికించింది. ఆమె కళ్లలోనే ఆత్మవిశ్వాసం కొట్టొచ్చేలా కనిపిస్తోంది. కవర్ చేయలేదు అంతేనా.. తన నడుముపై ఉన్న మచ్చను మేకప్తో కప్పిపుచ్చే ప్రయత్నం చేయలేదు. దాన్నలాగే వదిలేసింది. తన ర్యాంప్ వాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'కాలిన మచ్చను కవర్ చేయడానికి ప్రయత్నించలేదు చూడు, అక్కడే నచ్చేసింది.. మనం ఎలా ఉన్నా సరే మనల్ని మనం ప్రేమించుకోవాలని చాటిచెప్తోంది. నీ నిజాయితీ, గొప్పతనేమ నిన్ను మరింత బ్యూటిఫుల్గా మలుస్తోంది' అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వేడినీళ్లు ఒంటిపై పడటంతో అలా మచ్చలు ఏర్పడినట్లు తెలుస్తోంది. సారా ప్రస్తుతం ఆ మూవీలో.. సారా ప్రస్తుతం 'ఏ వాటన్ మేరే వాటన్' అనే సినిమాలో నటిస్తోంది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో సారాతో పాటు సచిన్ కేడేకర్, అభయ్ వర్మ, స్పర్ష శ్రీవాత్సవ్, అలెక్స్ ఓ నీల్, ఆనంద్ తివారి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ మార్చి 21 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: నల్లగా ఉన్నానని హేళన.. ఇంట్లోవాళ్లు ఆరేళ్లు మాట్లాడలేదు..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement