సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్‌ ఇదే.. | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్‌ ఇదే..

Published Mon, Apr 29 2024 9:57 PM

CM Jagan Campaign Schedule in three constituencies in 30th april

సాక్షి,  గుంటూరు:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 30వ తేదీన(మంగళవారం) మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొంటారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం జగన్‌ రేపు(మంగళవారం) పాల్గొనే ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 

మంగళవారం ఉదయం 10 గంటలకు  ఒంగోలు పార్లమెంట్ పరుధిలో  కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు  నియోజకవర్గంలో మైదుకూరు 4 రోడ్ల జంక్షన్‌లో జరిగే సభలో పాల్గొంటారు. 

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో  జరిగే  ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగిస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement