-
రక్షణలో ‘ఆత్మనిర్భరత’ దిశగా బీడీఎల్
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక సీకర్ ఫెసిలిటీ సెంటర్(ఎస్ఎఫ్సీ)లో ఆకాశ్ క్షిపణి కోసం ఉత్పత్తి చేసిన తొలి రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) సీకర్ను డీఆర్డీవోకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) అప్పగించింది. భూమి మీది నుంచి గాలిలోకి, గాలి లో నుంచి గాలిలోకి మిస్సైల్స్ను ప్రయోగించినప్పుడు లక్ష్య సాధన కోసం ఉపయోగించే క్లిష్టమైన టెక్నాలజీ కలిగిన ఇంటెన్సివ్ సబ్ సిస్టమ్నే సీకర్గా పేర్కొంటారు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను డిఫె న్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) రీసెర్చ్ సెంటర్ ఇమారత్లో రూపొందించగా, బీడీఎల్ కంచన్బాగ్ యూనిట్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్సీలో ఉత్పత్తి చేశారు. కంచన్బాగ్ యూనిట్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో బీడీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ. మాధవరావు తొలిæ ఆర్ఎఫ్ సీకర్ను డీఆర్డీఓ చైర్మ న్, కార్యదర్శి డాక్టర్ సమీర్ వి కామత్కు అందజేశారు. దేశ రక్షణ సామర్థ్యాలలో ముందడుగు ఈ సందర్భంగా కామత్ మాట్లాడుతూ బీడీఎల్లో సీకర్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడం వల్ల ఆర్ఎఫ్ సీకర్ ఉత్పత్తి రంగంలో భారత్ స్వయం ప్రతిపత్తిని సాధించి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో దోహదపడుతుందన్నారు. బీడీఎల్ సీఎండీ మాధవరావు మాట్లాడుతూ ఈ విజయం దేశ రక్షణ సామర్థ్యాలలో ముందడుగని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త యు.రాజాబాబు, డీఆర్డీఎల్ శాస్త్రవేత్త, డైరెక్టర్ జి.ఎ. శ్రీనివాసమూర్తి, ఆర్సీఐ డైరెక్టర్ అనింద్య బిశ్వాస్, ఎఎస్ఎల్ డైరెక్టర్ బి.వి.పాపారావు, బీడీఎల్ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసులు, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వెన్నం ఉపేందర్, బీడీఎల్ భానూర్ యూనిట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.ఆర్.ప్ర«దాన్ (రిటైర్డ్), బీడీఎల్ ఈడీ (కంచన్బాగ్) పీవీ రాజా రామ్, బీడీఎల్ జీఎం ఎం. శ్రీధర్రావు పాల్గొన్నారు. -
నిధుల కోసం నిరీక్షణ... మూణ్నెళ్లుగా జమకాని ఎస్ఎఫ్సీ ఫండ్
సుభాష్నగర్ : గ్రామ పంచాయతీల్లో నిధుల కటకట నెలకొంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 కోట్ల వరకు పెండింగ్లో ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్ఎఫ్సీ, ఆర్థిక సంఘం నిధులు మరో రూ.30 కోట్లు జమ కావాల్సి ఉంది. ఇటీవల పంచాయతీరాజ్శాఖ మంత్రి కూడా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలకు రూ.1150 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రకటించిన నాటి నుంచి సర్పంచులు నిధుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఒక్కో నెల పంచాయతీ కార్మికులు, సిబ్బంది జీతాలను కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అప్పులు తెచ్చి అరకొర వేతనాలు చెల్లిస్తున్నారు. వేతనాలకూ ఇబ్బందులు జిల్లావ్యాప్తంగా 530 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ప్రతినెలా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీ ఖాతాల్లో నిధులు జమయ్యేవి. ఈ నిధులతోనే పంచాయతీలో అభివృద్ధి పనులతోపాటు సిబ్బంది, కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లులు, ఇతరత్ర ఖర్చులు చెల్లించేవారు. ఇప్పటికే అన్ని జీపీల్లో అప్పులు తెచ్చి పనులు కొనసాగిస్తున్నారు. ఒక్కో నెల వేతనాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచులు వాపోతున్నారు. తప్పని ఎదురుచూపులు ఎస్ఎఫ్సీ, ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయని రోజుల తరబడి సర్పంచులు, కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్పంచులు అప్పులు తెచ్చి కార్మికులు, సిబ్బంది జీతాలు చెల్లిస్తున్నారు. పంచాయతీల్లో చిన్న చిన్న పనులకు కూడా డబ్బులను సర్దుబాటు చేస్తున్నారు. అలాగే గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సైతం బిల్లుల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే చాలా పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. జీపీ ఖాతాల్లో జమ అయిన నిధులకు కూడా ఫ్రీజింగ్ చేయడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రెజరీలో ఒక్క చెక్కు కూడా పాస్ కావడం లేదని వాపోతున్నారు. అభివృద్ధి పనుల బిల్లులు సహా పంచాయతీలకు మొత్తం రూ.100 కోట్లకుపైగా రావాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. పది రోజుల్లో జమయ్యే అవకాశం గ్రామపంచాయతీలకు పది రోజుల్లో నిధులు విడుదల య్యే అవకాశముంది. ఆర్థిక సంఘంతోపాటు, ఎస్ఎఫ్సీ నిధులు కూడా జమ కానున్నాయి. ప్రభుత్వం నుంచి ఈ మేరకు సమాచారం అందింది. సర్పంచులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్న మాట వాస్తవమే. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – జయసుధ, జిల్లాపంచాయతీ అధికారి రూ.45 కోట్ల బకాయిలు.. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధుల కోసం సర్పంచ్, ఉపసర్పంచ్ జాయింట్ ఖాతాతో డిజిటల్ టోకెన్ ప్రక్రియను 13 నెలల క్రితమే పూర్తిచేసింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.15కోట్ల వరకు రావాల్సి ఉంది. అలాగే ఎస్ఎఫ్సీ మూడు నెలలుగా జమ చేయడం లేదు. గతేడాదికి సంబంధించి పూర్తిగా విడుదల చేసినా.. ఈ సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి విదిల్చలేదు. గతేడాది, ఈయేడాదికి సంబంధించి ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నుంచి మొత్తం రూ.45కోట్ల వరకు జమ కావాల్సి ఉంది. -
నాగ్పూర్ టూ విజయవాడ: ఎకనమిక్ కారిడార్కు లైన్క్లియర్
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న తొలి ఎకనమిక్ కారిడార్కు పూర్తిగా లైన్ క్లియర్ అయింది. నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు నిర్మించే ఈ కారిడార్ తెలంగాణ – ఏపీ మధ్య 306 కి.మీ మేర కొనసాగనుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం రూ.10 వేల కోట్ల ని«ధులకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ ఆదీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ (ఎస్ఎఫ్సీ) పచ్చజెండా ఊపింది. ఈ రోడ్డును తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే తొలి ఆరు ప్యాకేజీలకు మార్గం సుగమం కావటంతో టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తికాగా, చివరి మూడు ప్యాకేజీలకు తాజాగా ఎస్ఎఫ్సీ ఓకే చెప్పి నిధులు మంజూరు చేసింది. దీంతో తెలంగాణ (మంచిర్యాల) నుంచి విజయవాడకు పూర్తిగా కొత్త (గ్రీన్ఫీల్డ్) యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రెండున్నరేళ్లలో ఈ జాతీ య రహదారి రెడీ అవుతుందని జాతీయ రహదారు ల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పేర్కొంటోంది. మహారాష్ట్ర–తెలంగాణ–ఆంధ్ర: ఓవైపు పర్యావ రణ అభ్యంతరాలు, మరోవైపు భూసేకరణపై ప్రజల నిరసనలు, అలైన్మెంట్ మార్చాలంటూ రాజకీయ నేతల ఒత్తిళ్లు.. వెరసి ఈ ఎకనమిక్ కారిడార్పై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. వాటన్నింటినీ తోసిపుచ్చుతూ ఇప్పుడు ఎన్హెచ్ఏఐ రోడ్డు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ కొత్త జాతీయ రహదారి మూడు రాష్ట్రాల మీదుగా సాగనుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో మొదలై తెలంగాణలోని ఆసిఫాబాద్–మంచిర్యాల–వరంగల్–ఖమ్మంల మీదుగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వరకు కొనసాగుతుంది. నాగ్పూర్ నుంచి తెలంగాణలోని ఆసిఫాబాద్ మీదుగా మంచిర్యాల వరకు ఇప్పటికే ఉన్న రోడ్డును నాలుగు వరసలకు విస్తరిస్తున్నారు. ఇక్కడివరకు పాత రోడ్డు (బ్రౌన్ఫీల్డ్ హైవే) కొత్తగా మారుతుందన్నమాట. మంచిర్యాల నుంచి కొత్తగా భూసేకరణ జరిపి పూర్తి కొత్త రోడ్డుగా నిర్మిస్తారు. 45 మీటర్ల వెడల్పుతో నాలుగు వరసలుగా ఈ రోడ్డు నిర్మితమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా విజయవాడకు ఉన్న రోడ్డు పైనే ఎక్కువ వాహనాలు వెళ్తున్నాయి. దీంతో ఈ రోడ్డు బాగా రద్దీగా మారింది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త రోడ్డు అందుబాటులోకి రానున్నందున.. నాగ్పూర్ నుంచి వచే ట్రాఫిక్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల వాహనాలు దీని మీదుగానే ముందుకు సాగేందుకు వీలవుతుంది. ఈ కొత్త జాతీయ రహదారి కోసం 1,550 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇదీ ప్యాకేజీల స్వరూపం ప్యాకేజీ 1,2,3 మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 108.406 కి. మీ నిడివి. వ్యయం రూ.3,440.94 కోట్లు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు పనులు దక్కాయి. అనుసంధానమయ్యే ప్రధాన పట్టణాలు.. మంచిర్యాల, మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, వరంగల్, పర్కాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర. ప్యాకేజీ 4, 5, 6 వరంగల్ నుంచి ఖమ్మం వరకు 108.24 కి.మీ నిడివి. వ్యయం రూ.3,397.01 కోట్లు. ప్రస్తుతం టెక్నికల్ బిడ్ మదింపు జరుగుతోంది. అనుసంధానమయ్యే ముఖ్య పట్టణాలు.. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఊరుగొండ, గీసుగొండ, మచ్చాపూర్, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం. ప్యాకేజీ 7, 8, 9 ఖమ్మం నుంచి విజయవాడ వరకు 89.42 కి.మీ నిడివి. వ్యయం రూ.3,007 కోట్లు. స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ తాజాగా ఈ ప్యాకేజీకే నిధులు మంజూరు చేసింది. ఇక టెండర్లు పిలవాల్సి ఉంది. అనుసంధానమయ్యే ముఖ్య పట్టణాలు.. సిరిపురం, తునికిపాడు, ఆత్కూరు, రెమిడిచెర్ల, దుగ్గిరాలపాడు, జక్కంపూడి. -
ఎంపీటీసీల సమస్యలను పరిష్కరించాలి
మండలి ప్రత్యేక ప్రస్తావనల్లో ఎమ్మెల్సీ పొంగులేటి సాక్షి, హైదరాబాద్: ఎంపీటీసీల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావనల సందర్భంగా ఎంపీటీసీల సమస్యలను ఆయన ప్రస్తావిం చారు. రాజ్యాంగం కల్పించిన 29 అధికారాలను బదలాయించి, ఎస్ఎఫ్సీ నుంచి నిధులను మంజూరు చేయాలని కోరారు. మండలిలో ప్రభుత్వ చీఫ్విప్ పాతూరి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి మరమ్మత్తు పనులు వెంటనే పూర్తిచేసేలా ప్రభుత్వం ఆదేశాలివ్వాలన్నారు. విపక్షనేత షబ్బీర్అలీ మాట్లాడుతూ.. కామారెడ్డిలోని డైరీ కోర్సులు నిర్వహిస్తున్న డిగ్రీ కళా శాలను పోస్ట్గ్రాడ్యుయేషన్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలన్నారు. -
ఎస్ఎఫ్సీ ఎందుకు ఏర్పాటు చేయలేదు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని (ఎస్ఎఫ్సీ) ఏర్పాటు చేయకపోవడంపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రభుత్వ వివరణ కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఎఫ్సీని ఏర్పాటు చేయక పోవడాన్ని సవా లు చేస్తూ హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి గతవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు విని పిస్తూ, రాజ్యాంగంలోని అధికరణ 243(ఐ) ప్రకారం ప్రతి రాష్ట్రం కూడా ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం తప్పని సరని పేర్కొన్నారు. ఎస్ఎఫ్సీ ఏర్పాటుకు 2015లో జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి వరకు దానిని కార్యరూపంలోకి తీసుకురాలేదని వివరించారు.
Pagination
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
Advertisement