ఎంపీటీసీల సమస్యలను పరిష్కరించాలి | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీల సమస్యలను పరిష్కరించాలి

Published Tue, Mar 28 2017 3:05 AM

ఎంపీటీసీల సమస్యలను పరిష్కరించాలి

మండలి ప్రత్యేక ప్రస్తావనల్లో ఎమ్మెల్సీ పొంగులేటి
సాక్షి, హైదరాబాద్‌:  ఎంపీటీసీల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావనల సందర్భంగా ఎంపీటీసీల సమస్యలను ఆయన ప్రస్తావిం చారు. రాజ్యాంగం కల్పించిన 29 అధికారాలను బదలాయించి, ఎస్‌ఎఫ్‌సీ నుంచి నిధులను మంజూరు చేయాలని కోరారు.

మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌ జిల్లాలోని వేయి స్తంభాల గుడి మరమ్మత్తు పనులు వెంటనే పూర్తిచేసేలా ప్రభుత్వం ఆదేశాలివ్వాలన్నారు. విపక్షనేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. కామారెడ్డిలోని డైరీ కోర్సులు నిర్వహిస్తున్న డిగ్రీ కళా శాలను పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కాలేజీగా అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు.

Advertisement
Advertisement