-
Pawan Kalyan: పక్కలో బల్లెం
పదేళ్లుగా ఆయన వెంట ఉన్నా. జనసేన కోసం ఎంతో కష్టపడ్డా. కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా పని చేశా. పవన్ కల్యాణ్పై నమ్మకం ఉంది. సీటు గ్యారెంటీగా నాకే వస్తుంది.. టికెట్ ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో అప్పటికే రెండుసార్లు పవన్ను కలిసిన తర్వాత కూడా జనసేన నేత పోతిన వెంకట మహేష్ మీడియా ముఖంగా భావోద్వేగంగా మాటలివి. కానీ, చివరకు ఏం మిగిలింది?.. విజయవాడ వెస్ట్ సీటును ఆఖరిగా బీజేపీ ఎగరేసుకుపోయింది. గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాల్లో విజయవాడ వెస్ట్ పరిణామాలు వాడీవేడిగా సాగాయి. అప్పటికే పొత్తు ప్రకటన చేసినా.. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేనలు ఇక్కడి సీటు తమదేనంటూ ప్రకటించుకున్నాయి. టీడీపీ నేతలు జలీల్ఖాన్, బుద్దా వెంకన్నలు ఎవరికివారే ఆత్మీయ సమావేశాలు, ర్యాలీలతో తమ బలప్రదర్శనలు కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే.. ఈలోపే విజయవాడ వెస్ట్ సీటు ఆలోచన వదులుకోవాలని, అది జనసేనకు కేటాయిస్తామని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. మొదటిసారి.. పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లొచ్చనే చర్చా మొదలైంది. దీంతో జలీల్ఖాన్ ఒక అడుగు ముందుకేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిశారు. విజయవాడ వెస్ట్ సీటును తనకు వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ టైంలో ‘చూద్దాం’ అని పవన్ జలీల్ఖాన్తో చెప్పారనే విషయం బయటకు పొక్కింది. దీంతో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కాస్త ఆందోళనకు లోనయ్యారు. వెంటనే పవన్ కల్యాణ్ను కలిశారు. పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. పవన్ ఇచ్చిన భరోసాతో సీటు కచ్చితంగా తనకే వస్తుందని పాపం పోతిన మహేష్ భావించారు. రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని బహిరంగంగా ప్రకటించుకున్నారు కూడా. కానీ, టీడీపీ బదులు బీజేపీ రూపంలో టికెట్ గండాన్ని.. చంద్రబాబు తెర వెనుక జరిపిన కుట్రల్ని ఆయన పసిగట్టలేకపోయారు. రెండోసారి.. కానీ ఇంతలో టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా పొత్తు కూడాయి. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది. ఆ సమయంలోనే విజయవాడ వెస్ట్పై బీజేపీ నేతలు కన్నేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్ట్ సీటు తమకే కావాలని బీజేపీ పట్టింది. దీంతో పోటీ కోసం అంతా సిద్ధం చేసుకున్న మహేష్.. ఆగ్రహానికి లోనయ్యారు. మళ్లీ పవన్ కల్యాణ్ను కలిశారు. టికెట్పై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని.. కంగారు పడొద్దంటూ పవన్ మరోసారి అభయం ఇవ్వడంతో మహేష్ మెత్తబడ్డారు. కానీ, అప్పటికే వెస్ట్ సీటుపై నిర్ణయం జరిగిపోయింది!. బీజేపీ నేత వ్యాఖ్యలతో కన్ఫర్మ్ విజయవాడ వెస్ట్ సీటు తమదే అని ప్రకటిస్తూ.. గత గురువారం నాడు బీజేపీ విజయవాడ వెస్ట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ.. వెస్ట్ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై ఇప్పటికే చర్చలు ముగిశాయని వెల్లడించారు. పార్టీ డిసైడ్ అయిపోయిందని.. అభ్యర్థి ఎవరనేదే తేలాల్సి ఉందని ప్రకటన చేశారు. దీంతో.. మహేష్ మళ్లీ ఆందోళనకు దిగారు. అయినా నమ్మకమే! ఈసారి ఏకంగా.. తన కార్యాలయంలోనే మహేష్ ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో.. ‘‘పార్టీకి విధేయుడిగా, పదేళ్లు నాకు నమ్మకస్తుడిగా ఉన్న నీకు.. విజయవాడ వెస్ట్ సీటు ఖాయం అని పవన్ కల్యాణ్ మాటిచ్చారు. తాజా సమావేశంలోనూ ఆయన అదే మాట అన్నారు. ఆయన తన మాట నిలబెట్టుకుంటారని నమ్ముతున్నా. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా వైఎస్సార్సీపీతో పోటీ పడలేరు. ఒకవేళ ఇక్కడి సీటు బీజేపీకే వెళ్తే.. అది కచ్ఛితంగా వైఎస్సార్సీపీకి అనుకూలిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ పవన్ మాట నిలబెట్టుకోలేకపోతే? అనే ప్రశ్నకు.. ఒకవేళ బీజేపీ సుజనా చౌదరికే గనుక టికెట్ ఇస్తే రెబల్గా పోటీ చేస్తా.. అదీ పవన్ ఫొటోతోనే అని. తమ సత్తా చూపించుకునేందుకు కొత్త తరం నేతలకు కూడా అవకాశాలు దక్కాలి కదా అని వ్యాఖ్యానించారు. కానీ.. మూడోసారీ.. చివరకు విజయవాడ వెస్ట్లో జన సైనికుల ఆశలు అడియాశలయ్యాయి. బీజేపీ జాబితాలో టికెట్ సుజనా చౌదరికే వెళ్లింది. అయినా విజయవాడ వెస్ట్ సీటుపై పోతిన వెంకట మహేష్ పట్టువీడడం లేదు. జనసేనకు ఇవ్వాల్సిందేనంటూ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థుల ప్రకటనకు రెండ్రోజుల ముందు మూడోసారి మహేష్ను పిలిపించుకున్న పవన్.. బుజ్జగింపులకు దిగారు. అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామంటూ ఆశ పెడుతున్నారు. కానీ, మహేష్ ససేమీరా అంటున్నారు. ఇక.. ఈ విషయం తెలిసి పవన్ పై మండిపడుతున్న విజయవాడ వెస్ట్ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ వల్ల నిజంగా కాలేదా? కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం అని చెబుతున్న మహేష్కు.. పవన్ మాత్రం అన్యాయం చేశారు. అయితే.. టీడీపీ-బీజేపీల బలవంతపు పొత్తు కోసం విశ్వప్రయత్నం చేసిన పవన్.. మధ్యలో పొత్తులు, సీట్ల పంపకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం మధ్యవర్తిత్వం వహించడం వల్ల చాలా కోల్పోవాల్సి వచ్చిందని, పొత్తుల కోసం చాలా త్యాగాలు చేశామని చెప్పుకొచ్చారు. మరి అంతగా బాధపడిపోయిన పవన్.. పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్లకు కాకుండా జంప్జిలానీలకు ఒకట్రెండు సీట్లు ఇచ్చిన పవన్.. విజయవాడ వెస్ట్ సీటు విషయంలో బీజేపీని ఒప్పించలేకపోయారా?.. నమ్మకంగా ఉన్న మహేష్కు టికెట్ ఇప్పించలేకపోయారా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు జనసైనికులిప్పుడు. సీటు మహేష్కేనంటూ నమ్మించి మోసం చేశారని.. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం చేస్తూ వెన్నుపోటులో చంద్రబాబునే మించిపోయారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబు పాచికేనా? విజయవాడ వెస్ట్ టికెట్ విషయంలో పంతం నెగ్గించుకున్న బీజేపీ.. అభ్యర్థి విషయంలో మాత్రం ‘రాజీ’ పడిందా?. వక్కల గడ్డ భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బొబ్బురి శ్రీరాంలాంటి వాళ్లు పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లు.. నమ్మకస్తులు ఉన్నా.. సుజనా చౌదరికే టికెట్ ఎందుకు ఇచ్చారు? పేర్ల పరిశీలనలో ఏం జరిగింది?.. అని బీజేపీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఎంపీ సీట్ల విషయంలో చక్రం తిప్పిన చంద్రబాబే.. బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు సుజనా చౌదరికే విజయవాడ వెస్ట్ నియోజక వర్గం టికెట్ దక్కేలా చేశారనే టాక్ బలంగా వినిపిస్తోందిప్పుడు. -
జనసేన నేతకు షాకిచ్చిన పవన్.. జనసైనికులు ఫైర్!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి కారణంగా మూడు పార్టీల కార్యకర్తలకు నేతలు షాకిలిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ క్రీడలో బీజేపీ, జనసేన పావులుగా మారడంతో నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో తమ కోసమే పనిచేసే నాయకులకు టికెట్ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు ఫైరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ పశ్చిమలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. కూటమి పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తున్నట్టు జనసేన పవన్ కల్యాణ్ తేల్చి చెప్పడంతో పార్టీ కార్యకర్తలు ఖంగుతున్నారు. ఇక్కడ జనసేన నాయకుడు, పార్టీ ఇన్ఛార్జ్ పోతిన మహేష్కు సీటు వస్తుందని జనసైనికులు ఆశించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసుకున్నారు. ఇక, తాజాగా పవన్ ప్రకటనతో వీరంతా షాకయ్యారు. కాగా, సీటు మహేష్కు ఇవ్వకపోవడంతో పవన్ తీరుపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ తమను నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, అన్ని డివిజన్ల ఇన్ఛార్జ్లు, కార్యకర్తలతో మహేష్ సమావేశమయ్యారు. పోతినకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమ జనసేన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు.. పవన్ మోసం తట్టుకోలేని మహేష్.. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు జనసైనికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ టికెట్ జనసేనకే కేటాయించాలి. పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టాను. ఇబ్బందులు పడ్డాను.. కేసులు కూడా పెట్టారు. విజయవాడలో జనసేన పార్టీ నిలబడింది అంటే అది నావల్లే. పవన్ పోటీచేసే స్థానంలో టీడీపీ కార్యకర్తలు నానా గోల చేశారు. పిఠాపురంలో అంత డ్యామేజ్ జరిగితే ఒక్క టీడీపీ నేత అయినా స్పందించారా?. ఇదేనా పొత్తు ధర్మం. పొత్తు ధర్మం పాటిస్తేనే ఓట్ల బదిలీ జరుగుతుంది. మన పార్టీ నాయకుడు బాగోకపోతే మనం బాగుంటామా?. పవన్కు అవమానం జరిగితే ఒక్క జనసేన నాయకుడైనా స్పందించారా?. విజయవాడలో కేడర్ భవిష్యత్ ఉండాలంటే జనసేనకు సీటు కేటాయించాలి. చివరగా చెబుతున్నా.. నేను జనసేన నుంచే పోటీ చేస్తున్నాను. -
చంద్రబాబుకు సొంత పార్టీలో తలనొప్పులు
ఏ పార్టీ కనిపిస్తే ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీలో తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. గెలిచేది లేకపోయినా..టిక్కెట్ కోసం మాత్రం పోటీ ఎక్కువవుతోంది. ఈ మధ్యలో జనసేన నేతలు సీన్లోకి ఎంటరై పొత్తులో భాగంగా ఈ సీటు మాదే అంటున్నారు. ఇప్పుడు బెజవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏం చేయాలో తెలియక చంద్రబాబు తల పట్టుకుంటున్నారని టాక్. ఆఖరు నిమిషం వరకు టిక్కెట్ల విషయం తేల్చే అలవాటు చంద్రబాబుకు లేదని అందరికీ తెలుసు. అందుకే బెజవాడ వెస్ట్ తమ్ముళ్ళు చివరి వరకు మేము ఆగలేమని..వెంటనే తేల్చాలని పార్టీ అధినేతను డిమాండ్ చేస్తున్నారని సమాచారం. టీడీపీ ఆవిర్భవించాక 1983లో ఒకే ఒక్కసారి ఇక్కడ పచ్చ జెండా ఎగిరింది. ఈ నలభై ఏళ్ళ కాలంలో మళ్ళీ అక్కడ టీడీపీ జెండా ఎగిరింది లేదు. కాని ఈసారి ఎలాగైనా గెలవాల్సిందే అని చంద్రబాబు అక్కడి నేతలకు హుకుం జారీ చేశారట. ఇప్పుడు బుద్ధా వెంకన్న, జలీల్ఖాన్లు టిక్కెట్ కోసం పట్టుబడుతున్నారు. తమ మనసులో మాట అప్పుడప్పుడు అధిష్టానానికి వినిపించే ప్రయత్నం చేసిన బుద్ధా వెంకన్న , జలీల్ ఖాన్ ఇప్పుడు టిక్కెట్ కోసం నేరుగా పంచాయతీ పెట్టేస్తున్నారట. తాజాగా బుద్ధా వెంకన్న వెస్ట్ నియోజకవర్గంలో తనకు ఉన్న బలం చంద్రబాబుకు తెలియచేసేందుకు ఓ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ టీడీపీ టిక్కెట్ కోసం తాను పెట్టుకున్న అప్లికేషన్ ను ర్యాలీగా వెళ్లి బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఉంచి మరీ పూజలు చేయించాడట. తెలుగుదేశం పార్టీ, అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై ఈగ వాలకుండా చూసుకుంటున్న తనకే టిక్కెట్ అడిగే హక్కు ఉందని బుద్ధా వెంకన్న అంటున్నారు. తనకే టిక్కెట్ ఇచ్చి తీరాలంటూ పబ్లిక్గానే తన డిమాండ్ ను చంద్రబాబు ముందు ఉంచారట. ఒకవేళ పొత్తులో భాగంగా వెస్ట్ టిక్కెట్ ఇవ్వడానికి కుదరకపోతే అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని తన డిమాండ్ల చిట్టాను చంద్రబాబుకు వినిపించారట. గతంలో ఒకసారి తనకు టిక్కెట్టివ్వకపోతే ఎక్కడ స్విచ్ వేస్తే.. ఎక్కడ బల్బు వెలుగుతుందో తనకు తెలుసని బెదిరించిన బుద్ధా తాజాగా చేసిన వ్యాఖ్యలు బెజవాడ టీడీపీలో రచ్చకు దారి తీసాయి. ఇదిలా ఉంటే నాకేం తక్కువ అంటూ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టిక్కెట్ రేస్ లోకి దూసుకొచ్చారు. బుద్ధా వెంకన్న ర్యాలీ నిర్వహించాడని తెలియగానే... నేనే లోకల్...నాకే టిక్కెట్టివ్వాలంటూ జలీల్ ఖాన్ పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎవడు పడితే వాడు టిక్కెట్ అంటే కుదరదు...టీడీపీ కూడా పశ్చిమ టిక్కెట్ ను మైనార్టీలకు కేటాయించాలి...ఆ టిక్కెట్ తనకే ఇవ్వాలి అని చంద్రబాబును నిలదీస్తున్నారట. తనకు బెజవాడ వెస్ట్ టిక్కెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానని జలీల్ఖాన్ బెదిరిస్తున్నారట. టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటుగా.. పవన్ కళ్యాణ్ను కూడా అర్థిస్తున్నారట. వెస్ట్ టిక్కెట్ కోసం జనసేన పట్టుపట్టవద్దని తనకే మద్దతుగా నిలవాలని పవన్ను ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారట. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని చంద్రబాబును జలీల్ఖాన్ వార్నింగ్ ఇస్తున్నాడట. ఇలా ఓ వైపు బుద్ధా వెంకన్న...మరోవైపు జలీల్ ఖాన్ టిక్కెట్ కోసం కుస్తీ పడుతుంటే..పశ్చిమ నియోజకవర్గం జనసేన శ్రేణుల్లో కలవరం మొదలైందని టాక్. పొత్తులో భాగంగా పశ్చిమ టిక్కెట్ జనసేనకు వస్తుందని నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పోతిన మహేష్ గంపెడాశతో ఉన్నారు. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు టిక్కెట్ కోసం కొట్లాడుకోవడంతో తనకు దక్కకుండా పోతుందనే ఆందోళన పోతిన మహేష్కు పెరిగిపోతోందట. అందరితోనూ పొత్తులు పెట్టుకుంటూ సంతోషపడుతున్న చంద్రబాబుకు టిక్కెట్ల విషయంలో సొంత పార్టీ నేతలతోనే తలనొప్పులు ఎదురవ్వడంతో దిక్కు తోచడంలేదని చెబుతున్నారు. మరి బెజవాడ వెస్ట్లో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. -
పవన్ను నిలదీసేందుకు సిద్ధం!
ఎన్టీఆర్, సాక్షి: పొత్తు సంగతి ఏమోగానీ జనసేన నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సీట్ల పంపకంపై ఎటూ తేల్చకుండానే.. ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతున్నారు. మరోవైపు జనసేనాని తన పోటీ విషయంలోనే కాదు.. సీట్ల విషయంలోనూ స్పష్టత లేకుండా పోయారు. ఈ పరిణామాల నడుమ.. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుమని పదిహేను స్థానాల్లో కూడా పోటీ చేస్తామో? లేదో? అనే ఆందోళనలో ఉన్నారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డందుకు ఫలితం ఇదేనా అని పవన్ను నిలదీసేందుకు ‘సిద్ధం’ అవుతున్నారు. పొత్తు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని చిత్రమైన పరిణామాలకు ఏపీ కేంద్రంగా మారింది. ఒక పార్టీ అధినేత అయ్యి ఉండి కూడా పోటీ విషయంలో పవన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పొత్తు ధర్మం పాటించలేదని బాబుపై అసంతృప్తి మాత్రమే వ్యక్తం చేస్తూ.. ఆ జట్టును వీడేది లేదంటూ పాత పాటే పాడుతున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలకు పవన్ అపాయింట్మెంట్ ఇస్తుండడం.. తమ టికెట్లకు ఎసరు పెట్టొద్దన్న వాళ్ల(మాగంటి బాబు, వేదవ్యాస్, జలీల్ఖాన్లాంటి వాళ్లు) విజ్ఞప్తులను పరిశీలిస్తానని చెప్తుండడంపై జనసేన నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తమ పోటీకి అనుకూలంగా మొదటి నుంచి భావిస్తున్న సీటు.. విజయవాడ వెస్ట్. అయితే దాని కోసం టీడీపీ నేతలు తన్నుకున్నంత పని చేస్తుండడం.. ఆ పరిణామాలపై చంద్రబాబు మౌనంగా ఉండడం.. వెరసి ఆ సీటు వదులుకోవాల్సి వస్తుందేమో అనే ఆందోళనలో ఉన్నారు. విజయవాడ వెస్ట్కు తెలుగు దేశంలో మామూలు పోటీ లేదు. ఒకవైపు బుద్ధా వెంకన్న ఆ సీటును చంద్రబాబు తనకే ఇస్తారని ఆశతో ఉన్నారు. దుర్గగుడిలో ప్రత్యేక పూజలు బైక్ ర్యాలీతో బలప్రదర్శన నిర్వహించుకున్నారు. అదే సమయంలో మైనారిటీ వర్గాలకే ఆ టికెట్ కేటాయించాలంటూ జలీల్ఖాన్ తెరపైకి వచ్చారు. తమ సామాజిక వర్గం తరఫున తనకే టికెట్ దక్కుతుందని ధీమా ప్రకటించారు. బుద్దాకు కౌంటర్గా ఇవాళ(శుక్రవారం) వన్టౌన్లో బలప్రదర్శన పేరిట ర్యాలీ నిర్వహించారు. ఇక ర్యాలీల పర్వం చూస్తున్న జనసేనలో టెన్షన్ పెరిగిపోతోంది. విజయవాడ వెస్ట్ నుంచి పోతిన వెంకట మహేష్ టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చాలాకాలం నుంచి బరిలో తానే నిలవబోయేదని ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. అయితే తాజా పరిణామాలు ఆయనకు మింగుడుపడడం లేదు. ఈ విషయంపై పవన్ను కలిసి చర్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పోటీ యాత్రలు.. మరోవైపు.. ఇలాగే చూస్తూ ఊరుకుంటే.. విజయవాడ వెస్ట్లోనే కాదు ఇంకా చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురు కావొచ్చని జనసేన నేతలు ఒక అంచనాకి వచ్చారు. జనసేనకు కాస్తో కూస్తో బలం, పేరు ఉన్న చోట్ల కూడా టీడీపీ నేతలు పాదయాత్రలు, బలనిరూపణలు చేసుకుంటూ కొట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో పోటీ యాత్రలకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో జనసేన బొర్రా వెంకట అప్పారావు మహా పాదయాత్రకు సిద్ధం కాగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బలం చూపించుకోవాలని జనసేన తాపత్రయపడుతోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఇకనైనా ఈ అంశంపై సీరియస్గా దృష్టి సారించాలని.. చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకోవాలని.. టీడీపీ నేతల దూకుడుకు కళ్లెం వేయించే దిశగా పవన్పై ఒత్తిడి పెంచేందుకు జనసేన నేతలు ‘సిద్ధం’ అవుతున్నారు. -
టీడీపీలో సీట్ల కోసం ఫీట్లు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కోసం టీడీపీ నేతలు నానాపాట్లు పడుతున్నారు. ఆ పార్టీ ఉనికి కోసం నేతలు ఫీట్లు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆ పార్టీ నేతలు కొందరు పూజలు చేస్తుంటే, మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చనీయాంశమవుతున్నారు. టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన నేతలు కూడా టికెట్ తమకేనంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరూ టికెట్ కోసం పాట్లు పడుతున్నారు. పశ్చిమలో మూడు ముక్కలాట ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో సీటు కోసం టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఆ పార్టీ ఆవిర్భావ సమయంలో తప్ప ఈ నియోజక వర్గంలో టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయబావుటా ఎగరేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నియోజక వర్గ ప్రజల్లో విశేష ఆదరణ పొందాయి. దీంతో పార్టీ నేతలు జోష్లో ఉన్నారు. భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ‘పశ్చిమ’ ఇన్చార్జి ఆసిఫ్, స్థానిక నేతలను కలుపుకొని ప్రభుత్వ, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ దూసుకుపోతున్నారు. టీడీపీలో ఎవరి గోల వారిదే.. పశ్చిమ నియోజక వర్గంలో పార్టీకి బలం లేదని తెలిసినా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్ వద్ద మెప్పు కోసం ఇక్కడ టీడీపీ నాయకులు హడావుడి చేస్తున్నారు. ఎటూ సీటురాదు, వచ్చినా గెలిచే అవకాశం లేదని స్పష్టంగా తెలిసినా పేపరు పులిగా పేరొందిన బుద్దా వెంకన్న తమకు సీటు కేటాయించాలని ర్యాలీ చేసి హడావుడి చేస్తున్నారు. ఇటీవల కొంత మంది ముస్లిం నేతలు, తమ సామాజిక వర్గానికే సీటు కేటాయించాలని హంగామా చేస్తున్నారు. విజయవాడ టికెట్ తనదేనని టీడీపీ నేత జలీల్ఖాన్ ప్రకటించుకున్నారు. ‘అందరు టికెట్టు అడుగుతారుకానీ గెలిచే స్థోమత ఉండాలి. మంచి విలువలు ఉండాలి. నాకు సీటు ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.’ అని జలీల్ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. మరో ముస్లిం మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ తనదే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు జనసేన నేత పోతిన మహేష్ పొత్తులో భాగంగా తమకే టికెట్ కేటాయిస్తారని ధీమాగా నియోజక వర్గంలో తిరుగుతున్నారు. పశ్చిమలో టీడీపీ, జనసేనలో ఎవరికివారే తమదే సీటు అని చెప్పుకొని నాయకులు తిరుగుతుంటే, అరకొరగా ఉన్న పార్టీ నేతలు, క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. సీనియర్ నేతలు కూడా.. టీడీపీలో సీనియర్ నేతలమంటూ గొప్పలు చెప్పుకొనే కొంత మంది, తమ నియోజక వర్గంలో వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తికి తోడు, పట్టుకోల్పోయి, టికెట్ మీద ఆశలు సన్నగిల్లి పూజలు చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఇటీవల కృష్ణా తీరంలో చేసిన పూజలే నిదర్శనం. ఇది టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూజలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. పేరుకు మాత్రం చంద్రబాబును సీఎం చేయడానికి పూజలు చేస్తున్నామని కలరింగ్ ఇస్తున్నా నియోజకవర్గంలో తమకు సీటుతోపాటు, గెలుస్తామనే నమ్మకం లేకనే, పూజలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మచిలీపట్నంలో.. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పూజలు చేయడం దానికి దేవినేని ఉమా సైతం హాజరయ్యారు. ఇటీవల విజయవాడ గురునానక్ కాలనీ సమీపంలో మూడు రోజులపాటు టీడీపీ నేత కేశినేని చిన్ని సైతం యాగం చేశారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన వీరు, చివరి ప్రయత్నంగా పలు కార్యక్రమాలు చేస్తూ గట్టెక్కాలని తాపత్రయ పడుతున్నారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి, నియోజక వర్గంలో తిరుగుతూ కార్యకర్తల్లో ధైర్యం నింపకుండా కాల హరణం చేస్తున్నారని టీడీపీలో కొందరు నేతలు విమర్శిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement