-
పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వకండి! కోరుతున్న సాక్షాత్తు కంపెనీ సీఈవో..
పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వొద్దని పలువురు నిపుణులు, వైద్యులు చెప్పడం విన్నాం. కానీ సాక్షాత్తు ఓ స్మార్ట్ ఫోన్ కంపెనీ మాజీ సీఈవోనే తల్లిదండ్రులను పిల్లలకు పోన్లు ఇవ్వొద్దని కోరుతున్నారు. చిన్న వయసులోనే స్మార్ట్ఫోన్లు ఇస్తే అది వారి మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందువల్ల స్మార్ట్ ఫోన్ల విషయలో తల్లిదండ్రులను జాగ్రత్త వహించమని సూచిస్తున్నారు ప్రముఖ షియోమీ ఇండియా కంపెనీ మాజీ సీఈవో కుమార్ జైన్. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతాయో వివరించారు. ఈ మేరకు ఆయన దీనికి సంబంధించి.. యూఎస్కు చెందిన ప్రముఖ లాభప్రేక్షలేని సంస్థ సపియన్ ల్యాబ్ అధ్యయనం చేసిందని చెప్పారు. ఆ ల్యాబ్ నుంచి ఒక స్నేహితుడు అందుకు సంబంధించిన విషయాలను తనతో షేర్ చేసుకున్నట్లు లింక్డ్ఇన్లో వెల్లడించారు. ఆ నివేదికలో.. చిన్నప్పుడే స్మార్ట్ఫోన్లకు అలవాటు పడే చిన్నారులు పెద్దయ్యాక మానసిక ఆరోగ్య రుగ్మతలతో బాధపడే అవకాశం ఉందని పేర్కొన్నట్లు తెలిపారు. ఆ అధ్యయన ప్రకారం పదేళ్ల వయసులో స్మార్ట్ఫోన్లకు అలవాటు పడితే పెద్దయ్యాకు మహళలైతే 60%-70% మంది దాక మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారని, అదే పురుషులైతే 45%-50% మంది దాక ఈ సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదిక వెల్లడించిందని కుమార్ జైన్ వెల్లడించారు. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది కావున దయచేసి వారిని వేరే యాక్టివిటీస్లో నిమగ్నమయ్యేలా చూడండని తల్లిదండ్రులకు విజ్ఞిప్తి చేశారు. అది ఏదైనా అభ్యాసం లేదా వారి అభిరుచికి సంబంధించిన వాటిల్లో ప్రోత్సహిస్తే గనుక మనం వారికి ఆరోగ్యకరమైన సమతుల్య వాతావరణాన్ని అందించగలిగిన వారమవుతాం అని చెప్పారు. చిన్న వయసులోనే ఎక్కువ సమయం స్క్రీన్పై గడిపితే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఏర్పడి పలు దుష్ప్రరిణామాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. బాల్యం చాల విలువైనదని, ఆ సమయాన్ని వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అంశాల్లో కేంద్రీకరించేలా చేసి వారి భవిష్యత్తుకు మంచి పునాదిని ఏర్పరుచుకనేలా ప్రోత్సహించాల్సిన భాద్యత మనమిదే ఉందని చెప్పారు. అదేసమయంలో తాను స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లకి వ్యతిరేకిని కాదని, ఐతే చిన్న పిల్లలను మాత్రం స్మార్ట్ ఫోన్లకు సాధ్యమైనంత దూరంగా ఉంచేలా జాగ్రత్త వహించాలని తల్లిదండ్రులని కోరుతున్నట్లు లింక్డ్ఇన్లో చెప్పుకొచ్చారు. (చదవండి: ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..) -
ఆ విషయంలో షావోమీ రికార్డ్ను బ్రేక్ చేయనున్న ఐఫోన్!
ఖరీదైన ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ( iPhone 15 Pro Max) ఫోన్ను త్వరలో విడుదల చేయనుంది. అయితే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ల ఫ్రంట్ గ్లాస్కు సంబంధించిన వీడియోలు ఇటీవల ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఇందులో స్క్రీన్ బెజెల్ చాలా సన్నగా ఉన్నట్లు తెలుస్తోంది. డిస్ప్లే స్క్రీన్కు చుట్టూ ఫోన్ ఫ్రేమ్కు మధ్య ఉన్న అంచును స్క్రీన్ బెజెల్ అని అంటారు. ఇదీ చదవండి: యాపిల్ దిమ్మతిరిగే టెక్నాలజీ.. మడత ఐఫోన్లు కింద పడినా ఏమీ కావు! ఈ స్క్రీన్ బెజెల్ విషయంలో షావోమీ రికార్డ్ను ఐఫోన్ అధిగమించనుంది. షావోమీ (Xiaomi) 13 స్క్రీన్ బెజెల్ 1.81 ఎంఎం. ఇప్పటివరకూ ఇదే అతి సన్నని బెజెల్. ఇప్పుడు ఈ రికార్డ్ను యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బద్ధలుకొట్టబోతోంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ ఫోన్ బెజెల్ వెడెల్పు 1.55 ఎంఎం ఉంటుందని టిప్స్టర్ ఒకరు ట్విటర్లో షేర్ చేశారు. ఆల్వేస్ ఆన్, ప్రో మోషన్ వంటి డిస్ప్లే ఫీచర్లను యాపిల్.. రాబోయే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లకు పరిమితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే Wi-Fi 6E నెట్వర్క్ ఐఫోన్ 15 ప్రో మోడళ్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుందని పుకారు వచ్చింది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లలో హాప్టిక్ ఫీడ్బ్యాక్తో కూడిన సాలిడ్ స్టేట్ బటన్లు, టైటానియం ఫ్రేమ్, అధిక ర్యామ్ వంటి కొత్త ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది. iPhone 15 Pro Max will break the record of 1.81mm bezel black edge held by Xiaomi 13, and we measure that its cover plate black bezel width is only 1.55 mm.(S22 and S23 ≈1.95mm,iPhone 14 Pro 2.17mm) pic.twitter.com/9TBrVCGSCo — Ice universe (@UniverseIce) March 17, 2023 -
సేల్స్ బీభత్సం!! గతేడాది ఎక్కువగా అమ్ముడైన టాప్-10 స్మార్ట్ఫోన్లు ఇవే!
వరల్డ్ వైడ్ స్మార్ ఫోన్ మార్కెట్లో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ సేల్స్ బీభత్సం సృష్టిస్తున్నాయి. గతేడాది ఎక్కువగా కొనుగోలు చేసిన టాప్-10 స్మార్ట్ ఫోన్లలో ఏడు స్థానాల్ని ఐఫోన్లే సొంతం చేసుకున్నాయి. ప్రముఖ రీసెర్చ్ సంస్థ 'కౌంటర్ పాయింట్' తాజాగా గ్లోబల్ టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ -2021 పేరుతో ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం యాపిల్ బ్రాండ్కు చెందిన 7 ఐఫోన్లను, యాపిల్ తర్వాత శాంసంగ్ ఒక ఫోన్ , షావోమీ రెండు ఫోన్లను ఎక్కువగా కొనుగులు చేసినట్లు రిపోర్ట్లో హైలెట్ చేసింది. ఇక 2021లో ఎక్కువగా అమ్ముడైన టాప్ ఫైవ్ ఐఫోన్లలో ఐఫోన్ 12 ప్రథమ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత 41శాతంతో ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13, ఐఫోన్ 12ప్రో, ఐఫోన్ 11 అమ్మకాలు జరిగాయి. క్యూ4లో ఐఫోన్ 12 కంటే అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఐఫోన్ 12ప్రో మ్యాక్స్, ఐఫోన్13 ఫోన్లు ముందున్నాయి. ఐఫోన్ 12 ప్రో నాల్గవ స్థానంలో ఉండగా..2019లో విడుదలైన ఐఫోన్ 11తర్వాతి స్థానంలో ఉంది.శాంసంగ్, షోవోమీ మాత్రమే టాప్-10 జాబితాలో నిలవగా శాంసంగ్ గెలాక్సీ ఏ12 ఆరోస్థానంలో ఆ తర్వాత షోవోమీ రెడ్మీ 9ఏ ఏడవ స్థానంలో నిలిచింది. యాపిల్కు చెందిన ఐఫోన్ ఎస్ఈ 2020-2021లో అత్యధికంగా అమ్ముడైన పరికరంలో ఎనిమిదో స్థానంలో ఉండగా, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 ఫోన్లు మొత్తం గ్లోబల్ అమ్మకాలలో 19శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2020 విలువలతో పోలిస్తే 3 శాతం పాయింట్లు పెరిగాయి. చదవండి: యాపిల్ ఈవెంట్: టెక్ లవర్స్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కొత్త ప్రొడక్ట్లు!! -
షావోమి ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు షావోమి ఇండియా తన ఉద్యోగులకు తీపికబురు అందించింది. హార్డ్షిప్ బోనస్కింద ఉద్యోగులకు15 రోజుల జీతాన్ని బోనస్ ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంలో ఇబ్బందులను ఎదుర్కొన్న కార్పొరేట్ ఉద్యోగులతోపాటు ఇతరలకు వార్షిక బిజినెస్ బోనస్కు అదనంగా ఈ బోనస్ను అందించనుంది. అలాగే తన ఉద్యోగులందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యులతోపాటు, ఉద్యోగులందరికీ కరోనా వ్యాక్సిన్ ఖర్చులను తామే భరిస్తామని షావోమి ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ తెలిపారు. వీరందరికీ అర్హత ప్రమాణాల ప్రకారం కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ 60వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులను కలిగి ఉంది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ తరువాత దేశీయ డిమాండ్ పెరగడంతో, ఎగుమతులను నిలిపివేయాలని భావిస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. స్థానిక డిమాండ్కే తమ తొలి ప్రాధాన్యమని జైన్ తెలిపారు. డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకంలో భాగంగా తన భాగస్వాములతో కలిసి దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు. కాగా సీఎంఆర్ ఇండియా డేటా ప్రకారం 2020 మూడవ త్రైమాసికంలో భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో టాప్లో ఉంది షావోమి. 27 శాతం మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్గా ఉంది. దేశంలో స్మార్ట్ఫోన్లతో పాటు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, వీఆర్ హెడ్సెట్లు వర్ బ్యాంక్లను షావోమి విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
మ్యూజిక్ బిజినెస్కు అలీబాబా టాటా
న్యూఢిల్లీ: చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ మ్యూజిక్ ప్లాట్ఫామ్ జియామీ మ్యూజిక్ను వచ్చే నెల నుంచీ మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చైనా ఎంటర్టైన్మెంట్ రంగంలో భారీగా ఎదగాలని అలీబాబా తొలుత వేసిన ప్రణాళికలకు దీంతో చెక్ పడవచ్చని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీబో అభిప్రాయపడింది. కార్యకలాపాల సర్దుబాటులో భాగంగా జియామీ మ్యూజిక్ను ఫిబ్రవరి 5 నుంచి నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. 2013లో మ్యూజిక్ యాప్పై అలీబాబా గ్రూప్ మిలియన్లకొద్దీ ఇన్వెస్ట్ చేసింది. తద్వారా చైనీస్ భారీ మ్యూజిక్ మార్కెట్లో ప్రవేశించింది. అయితే ప్రణాళికలు విజయవంతం కాకపోవడంతో వెనకడుగు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చైనా మ్యూజిక్ స్ట్రీమింగ్ మార్కెట్లో జియామీ కేవలం 2 శాతం మార్కెట్ వాటాను మాత్రమే సాధించగలిగింది. వెరసి కుగో, క్యూక్యూ, కువో, నెట్ఈజ్, క్లౌడ్ మ్యూజిక్ తదితర సంస్థల వెనుక నిలిచింది. ఈ వివరాలను బీజింగ్ సంస్థ టాకింగ్ డేటా వెల్లడించింది. కాగా.. గత నెలలో చైనా నియంత్రణ సంస్థలు అలీబాబా గ్రూప్నకు చెందన యాంట్ గ్రూప్పై యాంటీట్రస్ట్ చట్టంకింద దర్యాప్తును చేపట్టిన విషయం విదితమే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యదు! గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement