-
దక్షిణాదిపై యస్ బ్యాంక్ మరింత దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ దక్షిణాదిలో కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోను శాఖలను విస్తరిస్తోంది. ప్రస్తుతం 25గా ఉన్న బ్రాంచీల సంఖ్యను మార్చి ఆఖరు నాటికి 29కి పెంచుకోనున్నట్లు, తదుపరి మరో రెండు కొత్త శాఖలను ప్రారంభించనున్నట్లు బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా తమకు 1,200 పైచిలుకు శాఖలు ఉండగా.. దక్షిణాదిలో 216 ఉన్నాయన్నారు. మైక్రోఫైనాన్స్ విభాగంలోకి ప్రవేశించడంపైనా కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కుదిరితే ఏదైనా సూక్ష్మ రుణాల సంస్థను కొనుగోలు చేస్తామని లేదా సొంతంగానైనా కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. పేటీఎం పరిణామాలపై స్పందిస్తూ దానికి సంబంధించి నాలుగు బ్యాంకులకు వచ్చే వ్యాపారంలో తమకు పాతిక శాతం వాటా రాగలదని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విభాగంపైనా (ఎంఎస్ఎంఈ) దృష్టి పెడుతున్నామన్నారు. ప్రస్తుతం తమ పోర్ట్ఫోలియోలో దీని వాటా 30 శాతంగా ఉండగా వచ్చే రెండు, మూడేళ్లలో 35 శాతం వరకు పెంచుకోనున్నట్లు ప్రశాంత్ కుమార్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లలో 18 శాతం, రుణాల్లో 15 శాతం వరకు వృద్ధిని అంచనా వేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ మార్కెట్పై స్పందిస్తూ డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 16.6 శాతం వృద్ధి చెంది రూ. 8,887 కోట్లకు చేరాయని, స్థూల రుణాలు 24 శాతం వృద్ధితో రూ. 11,157 కోట్లకు పెరిగాయని ప్రశాంత్ కుమార్ చెప్పారు. కొత్త కాసా (కరెంట్ అకౌంటు, సేవింగ్స్ అకౌంటు) అకౌంట్లు 14 శాతం వృద్ధి చెందాయన్నారు. దక్షిణాదిలో తమ కాసా డిపాజిట్లలో నగరానికి 14 శాతం వాటా ఉందని పేర్కొన్నారు. -
యస్ బ్యాంక్కు భారీ పెనాల్టీ
ప్రైవేట్ రంగానికి చెందిన యస్ బ్యాంక్ తమిళనాడు వస్తు సేవల పన్ను (GST) విభాగం భారీ పెనాల్టీ విధించింది. జీఎస్టీ సంబంధిత సమస్యల కారణంగా తమిళనాడు జీఎస్టీ విభాగం నుంచి రూ.3 కోట్ల పన్ను నోటీసును యస్ బ్యాంక్ సోమవారం అందుకుంది. యస్ బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. తమిళనాడు జీఎస్టీ డిపార్ట్మెంట్ రూ. 3,01,50,149 జరిమానా విధించింది. అయితే దీని వల్ల బ్యాంక్ ఆర్థిక లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని, దీనిపై న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. ఇదీ చదవండి: వామ్మో.. కొత్త ఏడాదిలో బంగారం కొనగలమా? కలవరపెడుతున్న అంచనాలు! కాగా యస్ బ్యాంక్ గతంలోనూ జీఎస్టీ నోటీసులు అందుకుంది. గతేడాది డిసెంబర్లో బిహార్ జీఎస్టీ డిపార్ట్మెంట్ వరుసగా రూ. 20,000, రూ. 1,38,584 చొప్పున రెండు వేర్వేరు పన్ను నోటీసులను జారీ చేసింది. -
యస్ బ్యాంక్ రాణా కపూర్కు సెబీ నోటీసు.. రూ. 2.22 కోట్లు కట్టాలి
న్యూఢిల్లీ: ఏటీ–1 బాండ్ల తప్పుడు విక్రయాల కేసుకు సంబంధించి రూ. 2.22 కోట్లు కట్టాలంటూ యస్ బ్యాంక్ మాజీ ఎండీ రాణా కపూర్కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా చెల్లించని పక్షంలో అరెస్ట్ ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే అసెట్స్, బ్యాంక్ ఖాతాలను కూడా అటాచ్ చేస్తామని స్పష్టం చేసింది. ఏటీ–1 బాండ్లలో ఉండే రిస్క్ల గురించి చెప్పకుండా వాటిని అమాయక ఇన్వెస్టర్లకు యస్ బ్యాంక్ సిబ్బంది అంటగట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి 2022 సెపె్టంబర్లో రాణా కపూర్కు సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. -
ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ!
సాక్షి,ముంబై: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)విచారణకు హాజరైనారు. ఈడీ కార్యాలయానికి సోమవారం ఉదయం చేరుకోవడం చర్చనీయాంతంగా నిలిచింది. అయితే ఏ కేసుకు సంబంధించి అంబానీని పిలిచారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఫెమా ఉల్లంఘన కేసులో అంబానీనీ విచారించినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, 1999 (ఫెమా) కింద అనిల్ అంబానీ ఈడీ ముందు హాజరైనట్టు తెలుస్తోంది. కాగా 2020లో మనీలాండరింగ్ కేసులో ఎస్ బ్యాంకు అధికారులను, అనిల్ అంబానీని అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో యెస్ బ్యాంక్స్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్, తదితరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు రూ. 12,800 కోట్ల రుణాలు పొందాయి. రిలయన్స్తోపాటు, పాటు చాలా కంపెనీలు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో మొండి బకాయిలుగా మారిపోయాయి. ఈ కేసులో విచారణలో భాగంగా ఈడీ గతంలో అంబానీకి సమన్లు జారీ చేసి విచారించింది. -
రైట్ కాదు.. ఫ్లైట్! లోగో మార్చిన యస్ బ్యాంక్
ముంబై: కస్టమర్లకు చేరువయ్యే దిశగా ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ మార్కెటింగ్పై మరింతగా దృష్టి పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ప్రకటనలపై 30 శాతం అధికంగా వెచ్చించనున్నట్లు సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నిపుణ్ కౌశల్ తెలిపారు. జూన్ 20 నుంచి ప్రారంభించే ప్రచార కార్యక్రమాలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు వరకు కొనసాగనున్నట్లు ఆయన వివరించారు. తమ రిటైల్ కార్యకలాపాలు కీలక స్థాయికి చేరుకున్నాయని, ఇక నుంచి లాభదాయకత పెరగగలదని చెప్పారు. యస్ బ్యాంక్ కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా కౌశల్ ఈ విషయాలు తెలిపారు. స్వల్ప మార్పులతో యస్ బ్యాంక్ తమ కొత్త లోగోను ఆవిష్కరించింది. బ్యాంక్ ప్రస్తుత ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ టిక్ స్థానంలో పైకెగిరే పక్షిని తలపించేలా మార్పులు చేశారు. ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్పై డిస్కౌంట్.. ప్రభుత్వ బంకుల్లో కన్నా తక్కువ ధర
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తోడేళ్ళను తరిమే రోజు!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement