-
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
హవేళిఘణాపూర్(మెదక్): కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద ప్రజలు కన్న కలలను సాకారం చేసే దిశగా పని చేస్తుందని కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బూర్గుపల్లిలో స్థానిక ఎమ్మెల్యే రోహిత్తో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మెదక్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉందని, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్ని రంగాల్లో వివక్షకు గురైందన్నారు. తనను గెలిపిస్తే మెదక్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పార్టీ నాయకులు మహేందర్రెడ్డి, వెంకన్న, పరుశురామ్, పద్మారావు, హఫీజుద్దీన్ పాల్గొన్నారు. బైక్ ర్యాలీలో అపశృతి, ముగ్గురికి గాయాలు హవేళిఘణాపూర్ నుంచి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన యువకులు బైక్ ర్యాలీగా బయల్దేరారు. ఇదే సమయంలో ఎల్లారెడ్డి వైపు నుంచి బీహార్ రాష్ట్రంకు చెందిన ఇద్దరు కూలీలు బైక్పై వస్తూ శాలిపేట మలుపు ర్యాలీకి ఎదురుగా వచ్చారు. తొగిటకు చెందిన భరత్ బైక్ను ఢీకొట్టగా ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మెదక్ ఆస్పత్రికి తరలించారు.కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు -
బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు
ఎమ్మార్పీఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రత్నయ్య మెదక్జోన్: బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని, మత రాజకీయాలు చేస్తూ మనుషుల మధ్య చిచ్చుపెట్టే ఆ పార్టీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రత్నయ్య అన్నారు. సోమవారం ఆయన మెదక్లో విలేకరుల సమావేశశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో 400 సీట్లు తమకు వస్తాయని చెప్పుకుంటున్నారని, అదే జరిగితే రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తారన్నారన్నారు. మోదీ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తే ఏబీసీడీ వర్గీకరణ జరుగుతుందని, మంద కృష్ణమాదిగ తన స్వార్థం కోసం ఎస్సీలను మోసం చేసే కుట్ర చేస్తున్నారని రత్నయ్య ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నిమ్మలగారి గంగయ్య, నాయకులు భిక్షపతి, దాస్, జగన్, ఎండీ ఖాజీం తదితరులు ఉన్నారు. దేవుళ్ల మీద ప్రమాణం ఓట్లు దండుకోవడానికే.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కొమురవెల్లి(సిద్దిపేట): సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ప్రమాణం చేసేది ఓట్లు దండుకోవడానికే అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలోని కిష్టంపేట, గౌరయపల్లి, మర్రిముచ్చాల, లెనిన్నగర్, రాంసాగర్, కొమురవెల్లి, రసులాబాద్, అయినాపూర్, తపాస్పల్లి, గురువన్నపేట, పోసాన్పల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశంకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయని కాంగ్రెస్ను విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ తలారి కీర్తన, జెడ్పీటీసీ సిద్ధప్ప, వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గదరాజు చందు, కొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
మా పార్టీతోనే సంక్షేమం సాధ్యం
నారాయణఖేడ్: అభివృద్ధితోపాటు అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని ఆ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ అన్నారు. ఖేడ్లోని ఆయన నివాసంలో సోమవారం నాగల్గిద్ద మండలం షాపూర్, మోర్గీ, మనూరు మండలం తిమ్మాపూర్, కంగ్జి మండలం, ముకుంద్ తండాలకు చెందిన దాదాపు 250 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు శంకరయ్యస్వామి, కంగ్జి మాజీ జెడ్పీటీసీ సర్ధార్, తదితరులు పాల్గొన్నారు. హామీలన్నీ అమలు జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ శెట్కార్ అన్నారు. సోమవారం మండలంలోని రంజోల్ గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన మాజీ సర్పంచ్ బాబు, బీఆర్ఎస్ నాయకులు బాబా, నర్సింహా, గుండ్రెడ్డి, చంద్రన్న, యూనూస్, నిజాం, సర్దార్, మస్తాన్, యూసూఫ్లను కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి ఎ.చంద్రశేఖర్, పార్టీ యువజన నియోజకవర్గం ఇన్చార్జి కె.నరేశ్ గౌడ్, పార్టీ నాయకులు వైజ్యనాథ్, ఖలీల్, మన్సూర్, షబ్బీర్, రవీందర్రెడ్డి, రాజు, శశి, మజార్, షౌకత్ పాల్గొన్నారు.కాంగ్రెస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ -
మంజీరాలో మునిగి బాలుడు మృతి
కొల్చారం(నర్సాపూర్): మంజీరా నీటి మడుగులో మునిగి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామానికి చెందిన కొండి భూమేశ్–యశోదకు ఇద్దరు కుమారులు. భూమేశ్ కుటుంబం ఖాళీ సీసాలు ఏరుతూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉద యం ఇంటి నుంచి ఖాళీ సీసాలు ఏరేందుకు భూమేశ్ భార్య, కుమారులతో ఏడుపాయల వనదుర్గాదేవి సన్నిధికి వచ్చారు. సీసాలు ఏరుతూ మధ్యాహ్నం సమయంలో ఎండ ఉక్కపోతగా ఉండడంతో నలుగురు కలిసి పోతంశెట్టిపల్లి గ్రామ శివారులోని మంజీరా నది మడుగులోకి దిగి స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు కొండి దుర్గేశ్ (16) స్నానం చేస్తూ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కిష్టాపూర్ నుంచి గజ ఈతగాళ్లని రప్పించి దుర్గేశ్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి, మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎండ ఉపశమనం కోసం స్నానానికి వెళ్లిన కుటుంబం ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత -
ధార్మికార్య వీరగల్లు విగ్రహం లభ్యం
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో గుర్తింపు బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని దేవక్కపల్లిలో సోమవారం కొత్త తెలంగాణ బృందం యువ పరిశోధక సభ్యుడు శ్రీనివాస్ పర్యటించి ధార్మికకార్య వీరగల్లు విగ్రహం గుర్తించారు. వీరగల్లులో ప్రత్యేక వర్గానికి చెందిన వాడు ధార్మిక వీరగల్లుడని తెలిపారు. దేవక్కపల్లిలో గతంలో లభించిన శాసనం శక సంవత్సరం 993 విరోధికృత్ ఆషాఢ మాసం సూర్య గ్రహణం సందర్భంగా అనగా క్రీస్తు శకం 1071 జూన్ 30న దానం చేయుట గురించి చెక్కబడిందని వివరించారు. ఈ వీరుడి పేరున దానాలు చేసినట్లు భావించవచ్చన్నారు. వీరగల్లు వీరుడి ఆహార్య శైలి, నడినెత్తిన కొప్పు, ఎడమ చేతిలో లింగం కనిపిస్తుంది. మూడు అంతస్తులతో కనిపిస్తున్న కల్యాణి చాణిక్యుల కాలం నాటిదని తెలిపారు. యువతి అదృశ్యం న్యాల్కల్(జహీరాబాద్): యువతి అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని చినిగెపల్లిలో చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్ఐ రామానాయుడు కథనం మేరకు.. గ్రామానికి చెందిన నర్సప్ప కుమార్తె కొటారి భాగ్య(28) గత నెల 30న కుటుంబ సభ్యులతో కలసి రాత్రి నిద్రించింది. కొద్దిసేపటికే రాత్రి 2 గంటల ప్రాంతంలో ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు ఆమె ఒంటిపై ఎరుపు రంగు పంజాబీ డ్రెస్ ఉందన్నారు. తెలుగు, కన్నడ భాష మాట్లాడుతుందన్నారు. ఈ విషయంలో అదే గ్రామానికి చెందిన యువకుడిపై అనుమానం ఉన్నట్లు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. వివాహిత.. చేగుంట(తూప్రాన్): వివాహిత అదృశ్యమైన ఘటన మండలంలోని అనంతసాగర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాలరాజు కథనం మేరకు.. గ్రామానికి చెందిన కోటగిరి నీలమణి(26)కి పాప, బాబు ఉన్నారు. ఈమె ఏప్రిల్ 28న తన పుట్టింటికి వెళుతున్నట్లు చెప్పి వెల్దూర్తి మండలం రామాయిపల్లి గ్రామానికి వెళ్లింది. ఈ నెల 4న అనంతసాగర్కు వస్తున్నట్లు రామాయిపల్లి నుంచి బయలు దేరి అనంతసాగర్కు రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement