రామసముద్రం : రామసముద్రం పంచాయతీ కేంద్రమైన ఎగువ హరిజనవాడలో శుక్రవారం టీడీపీకి చెందిన యువకులు వైఎస్సార్సీపీలోకి చేరారు. మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహమ్మద్ అధ్యక్షతన 30 మందికి పైగా యువకులు మాజీ కన్వీనర్ భాస్కర్గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన యువకులకు నిస్సార్ అహమ్మద్ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. మరోసారి వైఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుసుమకుమారి, జెడ్పిటిసి రామచంద్రారెడ్డి, నాయకులు ప్రకాష్, దర్శన్, సుదర్శన్, బాబు, ప్రభాకర్, తపాల మస్తాన్, షంషీర్, కృష్ణప్ప, మస్తాన్, ఉదయ్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.
80 మంది వైఎస్ఆర్సీపీలో చేరిక
పుల్లంపేట : పుల్లంపేట మండలం, కొమ్మనవారిపల్లి పంచాయతీలోని అగ్రహారానికి చెందిన 80 మంది టీడీపీ నాయకులు శుక్రవారం రైల్వేకోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డిల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు నచ్చి వైఎస్సార్ సీపీలో చేరడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వంలో తమ గ్రామానికి రోడ్డు వచ్చినందుకు జగనన్నకు రుణపడి ఉంటామని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో చేరిక
కలకడ : మండలంలోని కదిరాయచెర్వు పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ గోగుల శ్రీనివాసయాదవ్ తన అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరారు. శుక్రవారం మండల ప్రత్యేక ఆహ్వానితులు జీవీ కిషోర్ ఆధ్వర్యంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వారికి వైఎస్సార్సీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ శేఖర్యాదవ్, పీలేరు నియోజకవర్గ సోషియల్ మీడయా కోకన్వీనర్ చిరంజీవి యాదవ్, సచివాలయ కన్వీనర్ పుల్లయ్యగౌడ్, రమణయాదవ్, పవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.