Sakshi News home page

శుభారంభం పలికిన స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ

Published Mon, Feb 19 2024 9:22 AM

Today Stock Market Updates By Sakshi Money Mantra 19 Feb 2024

వారాంతంలో లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లో.. ఈ రోజు (సోమవారం) ఉదయం కూడా శుభారంభం పలికాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 105.17 పాయింట్ల లాభంతో 72531.81 వద్ద, నిఫ్టీ 42.50 పాయింట్ల లాభంతో 22083.20 వద్ద కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బంధన్ బ్యాంక్, బయోకాన్ లిమిటెడ్ వంటి సంస్థలు చేరాయి.

నష్టాలను చవి చూసిన కంపెనీల జాబితాలో విప్రో, టీసీఎస్, లార్సెన్ & టుబ్రో, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ మొదలైనవి ఉన్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

What’s your opinion

Advertisement