కాంగ్రెస్‌ ప్రచార సభ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ప్రచార సభ

Published Mon, Apr 8 2024 12:45 AM

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి, 
ఎమ్మెల్యే కాంగ్రెస్‌ ప్రముఖులు   - Sakshi

బళ్లారి అర్బన్‌: అన్ని అర్హతులున్న వ్యక్తి బళ్లారి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి తుకారాం అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీ.నాగేంద్ర తెలిపారు. ఆదివారం నగరంలోని కమ్మ భనవంలో జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. తుకారాం ఎన్నో విషయాల పట్ల అవగాహన ఉన్న వారని అలాంటి వ్యక్తి బళ్లారి తరపున పార్లమెంట్‌లో ఉంటే ప్రజలకు మంచి రోజులు వచ్చినట్లే అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎప్పటికి పూర్తి స్థాయి బలం సాధించలేదు. ఆపరేషన్‌ కమలం ద్వారానే అడ్డదారిలో అధికారంలోకి వచ్చారన్నారు. కాంగ్రెస్‌ 25 అంశాల ఎన్నికల ప్రణాళికను వివరించారు. గ్యారెంటీల గురించి ఎద్దేవా చేసే ప్రధానికి ఈ గ్యారెంటీ పథకాల ద్వారానే ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎంసీ అధ్యక్షుడు కట్టెమని నాగేంద్ర, ఎల్‌.మారెణ్ణ, రాజేశ్వరి, సుబ్బారాయుడు, తరగు నాగరాజ్‌, టి.గాదిలింగనగౌడ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement