హుబ్లీ: తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారకులవుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటన హుబ్లీలో జరిగింది. ద్విచక్ర వాహనం నడపడానికి నిర్ణీత వయసు, లైసెన్స్ ఉండాలి. అవన్నీ ఏమీ లేకుండానే నగరంలోని గోకుల్ రోడ్డు సిల్వర్టౌన్ లేఔట్లో ఓ స్కూల్ బాలుడు తన బైక్పై నలుగురు స్నేహితులను కూర్చోబెట్టుకుని ప్రమాదకరంగా వాహనం నడిపాడు. వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియో వైరల్ కావడంతో హుబ్లీ ట్రాఫిక్ పోలీసులు స్పందించి చర్యలు తీసుకున్నారు. సదరు బైక్ యజమానిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
1/2
బైక్పై ఐదుగురు చిన్నారులు, బైక్ను సీజ్ చేసిన దృశ్యం,