మస్కాపూర్‌ కేజీబీవీ విద్యార్థినికి అస్వస్థత | Sakshi
Sakshi News home page

మస్కాపూర్‌ కేజీబీవీ విద్యార్థినికి అస్వస్థత

Published Mon, Apr 8 2024 1:10 AM

నిర్మల్‌లో విద్యార్థినిని పరామర్శిస్తున్న నవీన్‌  - Sakshi

ఖానాపూర్‌: మండలంలోని మస్కాపూర్‌ కేజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతున్న గుండేటి మౌనిక స్వల్ప అస్వస్థతకు గురైంది. షుగర్‌ లెవెల్స్‌ దాటడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను నిర్మల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మౌనికను ఈ నెల 5న ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు రాగా కేజీబీవీ సిబ్బంది అనుమతించలేదు. ఆమె అనారోగ్యంగా ఉండడంతో పెంబి మండలం రాయదారి గ్రామంలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. శనివారం అంబులెన్స్‌లో తీసుకువెళ్లి నిర్మల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. తమ కూతురు అనారోగ్యానికి గురైనా కేజీబీవీ సిబ్బంది పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయమై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నవీన్‌, విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని నవీన్‌ పరామర్శించారు.

Advertisement
Advertisement