నిలిచిన కుస్తీ పోటీలు | Sakshi
Sakshi News home page

నిలిచిన కుస్తీ పోటీలు

Published Fri, Apr 19 2024 1:30 AM

పోటీలో తలపడుతున్న మల్లయోధులు - Sakshi

భైంసారూరల్‌: మండలంలోని కామోల్‌ గ్రామంలో గురువారం నిర్వహించిన కుస్తీ పోటీలు నిలిచిపోయాయి. ఏటా శ్రీరామ నవమి సందర్భంగా కుస్తీపోటీలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు మల్లయోధులను పిలిపించి శ్రీరామ నవమి మరుసటి రోజు పోటీలు నిర్వహిస్తారు. గురువారం కూడా పోటీలకు ఏర్పాట్లు చేశారు. పోటీలు జరుగుతున్న సమయంలో కొంత మంది అక్కడి వచ్చి పెద్దలకు దూషించారు. గొడవ జరిగే వాతావరణం కనిపించడంతో కుస్తీపోటీలను నిలిపివేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మల్లయోధులు వారిని చూసేందుకు వచ్చిన ఉత్సాహికులు నిరాశపడ్డారు.

Advertisement
Advertisement