-
DRDO: స్వదేశీ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
భువనేశ్వర్(ఒడిశా): దేశీయంగా అభివృద్ధి చేసిన ఇండిజినస్ టెక్నాలజీ క్రూయిజ్ మిస్సైల్(ఐటీసీఎం)ను గురువారం ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇందులో ఉపవ్యవస్థలను అంచనాల మేరకు పనిచేశాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తెలిపింది. క్షిపణి ప్రయాణ మార్గంలో ఏర్పాటు చేసిన రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్, టెలిమెట్రీ వంటి సెన్సార్ల ద్వారా పనితీరును అంచనా వేసినట్లు పేర్కొంది. దీంతోపాటు, వాయుసేనకు చెందిన ఎస్యూ–30 ఎంకే–ఐ విమానం ద్వారా కూడా క్షిపణి ప్రయాణం తీరును అంచనా వేసినట్లు డీఆర్డీవో వివరించింది. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని భారతీయ నావికా దళం ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ– డీఆర్డీఓ దేశీయంగా రూపొందించిన ఈ క్షిపణి షిప్ లాంచ్డ్ వెర్షన్ను అరేబియా సముద్రంలో పరీక్షించినట్లు సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. భారత్–రష్యా సంయుక్త భాగస్వామ్య బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జలాంతర్గాములు, విమానాలు, ఓడలతోపాటు నేలపై నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేస్తోంది. బ్రహ్మోస్ క్షిపణులు ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో ప్రయాణించగలవు. వీటిని భారత్ ఎగుమతి కూడా చేస్తోంది. ఇందుకు సంబంధించి గత ఏడాది ఫిలిప్పీన్స్తో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి యాంటీ షిప్ వెర్షన్ను గత ఏడాది ఏప్రిల్లో భారత్ విజయవంతంగా ప్రయోగించింది. -
తీరానికి రాజయోగం
క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు దేశంలోనే రెండోది గుల్లలమోద-లైట్హౌస్ మడ అటవీ ప్రాంతం ఎంపిక? నాగాయలంక : బంగాళాఖాతం సరిహద్దు తీరప్రాంతమైన నాగాయలంక మండలానికి రాజయోగం పట్టనుందనే వార్తలొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే క్షిపణి ప్రయోగ కేంద్ర మే ఇందుకు కారణంగా తెలుస్తుంది. రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) ఆధ్వర్యంలో దేశంలోనే రెండో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని రూ. 1000 కోట్లతో నాగాయలంక సాగర తీరం గుల్లలమోద-లైట్హౌస్ మడ అటవీ ప్రాంతంలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అటవీశాఖ, పర్యావరణ అనుమతుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 3వ తేదీన డీఆర్డీవో ఉన్నతాధికారులు, అటవీ శాఖ ప్రిన్సిపల్ సీసీఎఫ్ (చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) జోసఫ్, వైల్డ్ లైఫ్ సీసీఎస్ శ్రీధర్ గుల్లలమోద-లైట్హౌస్ ప్రాంతాల్లో పర్యటించి నిశితంగా అధ్యయనం చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో (గత ఏడాది చివరిలో) ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి కేంద్ర రక్షణ మంత్రి శాస్త్రి సలహాదారుడు పద్మశ్రీ అవినాష్ చందర్ ఈ అంశాన్ని ధ్రువీకరించారు. నాగాయలంక తీరప్రాంతంలో మిస్సైల్ లాంచింగ్ సెంటర్ను ఏర్పాటుచేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అప్పట్లో వెల్లడించారు. ఆయన ప్రకటన చేసిన నెల రోజుల్లోనే డీఆర్డీవో, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడ పర్యటించారు. దరిమిలా డీఆర్డీవోతోపాటు పలువురు రక్షణ రంగ నిపుణులు దేశంలోని ఇతర ప్రాంతాలు పరిశీలించిన మీదట నాగాయలంక తీరప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. గుల్లలమోద ప్రాంతంలో ఒక వైపు మాత్రమే భూమి ఉంది. తూర్పు-దక్షిణ భాగాల్లో బంగాళాఖాతం, పడమరవైపు కృష్ణానది ఉంటాయి. ఓడిశాలోని బాలాసోర్ వీలర్ ఐలాండ్ క్షిపణి ప్రయోగకేంద్రం మాదిరిగానే నాగాయలంకలోని గుల్లలమోద తీర భౌగోళిక స్వరూపం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చిన మీదట రక్షణ పరంగా అన్ని విధాలుగా అనుకూలమైనదిగా భావించారని తెలుస్తుంది. మహర్దశ పడుతుందా? ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో మిస్సైల్ లాంచింగ్ సెంటర్ నాగాయలంక తీరంలో ఖాయమని భావిస్తుండటంతో ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఈ మండలమే కాకుండా జిల్లా రూపురేఖలే మారిపోతాయని అంచనా వేస్తున్నారు. 40 ఎకరాల్లో అధికారులు, సిబ్బంది కోసం నిర్మించే ప్రత్యేక క్వార్టర్స్, 40కి.మీ పరిధిలో రహదారుల సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రత్యక్ష, పరోక్షంగా పాతికవేల మంది వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రక్షణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement