-
అమెరికా : ఆ ఇద్దరు తప్పు చేశారా? చేతివాటమా?
ఎరక్కపోయి అమెరికాలో ఇరుక్కుపోయారు ఇద్దరు అమ్మాయిలు. తెలిసో తెలియకో ఓ షాపింగ్ మాల్కు వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఇబ్బందుల్లో పడ్డారు. న్యూజెర్సీలో చదువుకుంటున్న వీరిద్దరు హోబెకన్ ఏరియాలోని షాప్రైట్ అనే సూపర్ మార్కెట్కు వెళ్లారు. ఈ మాల్లో కొంతసేపు షాపింగ్ చేసిన వీరిద్దరు బిల్లింగ్ చేసి బయటికొచ్చారు. అయితే వీరు అన్ని వస్తువులకు కాకుండా.. ఉద్దేశపూర్వకంగా కొన్ని వస్తువులకు మాత్రమే బిల్లు చెల్లించినట్టు పోలీసులు అభియోగం మోపి కేసు పెట్టి అరెస్ట్ చేశారు. -
న్యూ జెర్సీలో ఆటా బిజినెస్ సెమినార్, కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్
న్యూ జెర్సీ లో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా బిజినెస్ సెమినార్ మరియు కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. న్యూ జెర్సీ న్యూయార్క్ టీం సాయంతో.. అట్లాంటాలో జరుగనున్న 18th ఆటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా స్పాన్సర్షిప్ ప్రతిజ్ఞలను సేకరించారు. ఆట అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ఎలెక్ట్ జయంత్ చర్ల , పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, ఫిలడెల్ఫియా ట్రస్టీ రాజ్ కక్కెర్ల తదితరులు పాల్గొని ప్రసంగించారు. ATA న్యూజెర్సీ , న్యూయార్క్ టీం - కార్ప్రేట్ చైర్ హరీష్ బథిని, కో చైర్ ప్రదీప్ కట్టా మరియు ఫైనాన్స్ కమిటీ చైర్ శ్రీకాంత్ గుడిపాటి , కో చైర్ శ్రీకాంత్ తుమ్మలతో పాటు రీజనల్ కోరినేటర్లు సంతోష్ కోరం , ధనరాజ్, రీజినల్ డైరెక్టర్ విలాస్ రెడ్డి జంబుల, మహిళల రీజినల్ కో-ఆర్డినేటర్ గీతా గంగుల, తదితరుల సహాయంతో బిజినెస్ సెమినార్ మరియు నిధుల సేకరణను విజయవంతంగా నిర్వహించారు. అట్లాంటాలో జరిగిన ఆటా (ATA) కాన్ఫరెన్స్ కోసం 636k పైగా 175 కార్పొరేట్ స్పాన్సర్షిప్ ప్రతిజ్ఞలను సేకరించినట్లు సభ్యులు తెలిపారు. అలాగే న్యూజెర్సీ & న్యూయార్క్ బృందం అట్లాంటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా దాతల ప్రతిజ్ఞలను సేకరించిందని పేర్కొన్నారు. అట్లాంటాలో జూన్ 7 నుండి 9 వరకు జరిగే ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వహకులు పిలుపునిచ్చారు. -
న్యూజెర్సీలో యాత్ర 2 మూవీ పబ్లిక్ టాక్
-
న్యూజెర్సీలో దుమ్మురేపుతున్న యాత్ర 2 మూవీ
-
న్యూజెర్సీలో అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ సంబరాలు
-
US: న్యూ జెర్సీలో మంచు తుఫాను బీభత్సం
న్యూజెర్సీ: అమెరికాలో దట్టమైన మంచు తుఫాను కురుస్తోంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన న్యూజెర్సీలో మంచు తుఫాను విశ్వరూపం చూపుతోంది. వింటర్ స్టార్మ్ కారణంగా హైవేలపై అడుగుల కొద్దీ మంచు పేరుకుపోయింది. రోడ్డపై గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడం వల్ల కార్లు నడవలేని పరిస్థితి ఏర్పడింది. వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై సుమారు 2 నుంచి 6 అంగుళాల మధ్య మంచు కమ్మేసినట్లు స్థానికులు చెబుతున్నారు. Winter Wonderland! ❄️#OceanCity #NewJersey #SnowDay #Beach #MancoPizza #MissingHome 📸 OffShore Drones pic.twitter.com/dUyzOhxcLT — Shannon 🎄❄️🌴✨💫 (@shanrobinson7) January 20, 2024 #snow #snowday #newjersey@News12NJ @njdotcom https://t.co/J3nQYoca35 — José Eduardo 🇵🇪👊🏼 (@JoseEdu87) January 19, 2024 న్యూజెర్సీతో పాటు దేశంలోని చాలా నగరాల్లో కరెంటు సరఫరా ఆగిపోయి ఆ ప్రాంతాలన్నీ చీకటిమయమైపోయాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు సైతం రాలేని పరిస్థితి నెలకొంది. #Driving the snowy roads of central #NewJersey tonight . Icy conditions as temps dip a real concern #takeitslow #snow #roads #fridaycommute pic.twitter.com/9HaqfXfulI — Checkey Beckford (@Checkey4NY) January 20, 2024 #Driving the snowy roads of central #NewJersey tonight . Icy conditions as temps dip a real concern #takeitslow #snow #roads #fridaycommute pic.twitter.com/9HaqfXfulI — Checkey Beckford (@Checkey4NY) January 20, 2024 #winterishere #snow #southjersey #newjersey pic.twitter.com/dVRy95fpFk — Amanda Fitzpatrick (@WatchAmandaTV) January 19, 2024 మంచు తుఫాన్ కారణంగా విమానాలు, రైళ్లు, ఇతర రవాణా సర్వీసులను రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో 4 నుంచి 12 అంగుళాల మధ్య మంచు కురిసే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. భారీ మంచు తుఫాన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇదీచదవండి.. జనవరి 22 రామ్ మందిర్డేగా గుర్తించిన కెనడా మునిసిపాలిటీలు -
న్యూజెర్సీ, సాయిదత్త పీఠంలో దీపావళి వేడుకలు
-
న్యూజెర్సీ, ఎడిసన్ లో బతుకమ్మ వేడుకలు
-
దీపావళి వేడుకలు.. అమెరికాలో స్కూళ్లకు సెలవు
అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కోసం అమెరికాలోని భారతీయులు భారీ వేడుకలను ప్లాన్ చేశారు. అమెరికా ప్రభుత్వం దీపావళిని పండుగగా గుర్తించి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్లో దీపావళి ఫెస్టివల్ గ్రాండ్గా జరిగింది. పాపాయిని పార్క్లో ఎడిసన్ మేయర్ సామ్ జోషి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఈ వేడకల్లో పాల్గొన్నారు. తెలుగు వైభవాన్ని ఘనంగా చాటుతూ ఈ వేడుకలు నిర్వహించారు. తెలుగు పాట,ఆట కనువిందు చేశాయి. తెలుగు సంస్క్రృతి, సంప్రదాయాలకు ఈ వేడుకలు అద్దం పట్టాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి తీసుకువచ్చారు. ఇక వేదికపై బతుకమ్మలను పెట్టి ఆడపడుచులు ఆడి పాడారు. పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇక పలువురు కళాకారులు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేలా ప్రదర్శనలు నిర్వహించారు. జే సీన్ స్ఫెషల్ మ్యూజికల్ ఫెర్మామెన్స్.. అహుతులను అలరించింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్టాల్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. షాపింగ్ స్టాల్స్, ఫుడ్ అండ్ రిటైల్ వెండర్స్ స్టాల్స్, కిడ్స్ జోన్, ఫైర్ వర్క్, Raffles బహుమతులు, విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొనటం ఒక అద్భుతమైన అనుభవం అంటూ ప్రవాసులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న ఎడిసన్ మేయర్ సామ్ జోషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
న్యూజెర్సీలో బతుకమ్మ, దసరా సంబరాలు
-
న్యూజెర్సీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి
అక్షరధామ్ నుండి ప్రవాసాంద్రులకు పిలుపు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ స్పర్శ్ హస్పైస్ హైదరాబాద్లో చేపడుతున్న కార్యక్రమాలకు అమెరికాలోని స్పర్శ్ విభాగం మద్ధతుగా నిలిచింది. అమెరికా న్యూజెర్సీలోని రాబిన్స్విల్లేలో ఇటీవల నిర్మించిన అక్షర్ ధామ్ మందిరం వేదికగా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి అంటూ ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చింది. స్పర్శ్ హస్పైస్ కార్యక్రమాలేంటీ? స్పర్శ్ హస్పైస్ ఒక స్వచ్ఛంధ సంస్థ. హైదరాబాద్ కేంద్రంగా రోగులకు ఉచిత సేవలందిస్తోంది. ముఖ్యంగా చాలా కాలం పాటు వైద్య సేవలు అవసరమయ్యే అభాగ్యులకు (Long term care) స్పర్శ్ అండగా నిలుస్తోంది. మంచానికే పరిమితమైపోయి, దీర్ఘకాలం మెడికల్ కేర్ కోరుకునే వారికి ఇది అండగా నిలుస్తోంది. దీంతో పాటు కొందరు వృద్ధులు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడమో, లేక కుటుంబం, దగ్గరి వారి నుంచి మద్ధతు లేకపోవడమో, లేక చికిత్స లేదనుకున్న సమయంలో తీవ్ర ఆందోళనకు గురైపోతున్నారు. క్యాన్సర్, న్యూరో, గుండె పోటు లేక ఇతర తీవ్రమైన వ్యాధుల బారిన పడిన వారు ఇందులో ఉంటున్నారు. ఇలాంటి వారందరికి స్పర్శ్ అండగా నిలుస్తోంది. స్పర్శ్ హస్పైస్లో ఎలాంటి సౌకర్యాలున్నాయి? స్పర్శ్లో ఆరు హోం కేర్ వ్యాన్లు ఉన్నాయి. వీటిలో అన్ని రకాల సౌకర్యాలున్నాయి. అలాగే ఔట్ పేషేంట్ సర్వీసులతో పాటు ఇన్ పేషేంట్ సౌకర్యాలున్నాయి. దీర్ఘకాలం చికిత్స అందించే సౌకర్యాలు, నొప్పి నివారణ మార్గాలు, ఔషద చికిత్సతో పాటు మేమున్నామంటూ అండగా నిలిచే సామాజిక మద్ధతు స్పర్శ్లో ఉంది. దీని వల్ల రోగులకు పూర్తి భరోసా కలగడంతో పాటు త్వరగా స్వస్థత లభిస్తోంది. అమెరికా అక్షర్ధామ్ కార్యక్రమమేంటీ? న్యూజెర్సీ రాబిన్స్విల్లె 112 మెయిన్ స్ట్రీట్లో ఏర్పాటయిన BAPS స్వామి నారాయణ్ మందిర్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఇటీవల నిర్మించిన అక్షర్ధామ్ మందిరం అత్యంత ఆకర్షణీయంగా ఉండడంతో పాటు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్పర్శ్ చేస్తోన్న సామాజిక కార్యక్రమాలకు అక్షర్ధామ్ తన వంతు మద్ధతు ప్రకటించింది. అక్షర్ధామ్ ట్రస్టీలయిన డాక్టర్ సుబ్రహ్మణ్యం, లక్స్ గోపిశెట్టి ఈ సందర్భంగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి అంటూ పిలుపునిచ్చారు. విజిట్ అక్షర్ధామ్ అక్షర్ధామ్ ఆలయంలో అక్టోబర్ 22, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇక్కడికి వచ్చే వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి అక్షర్ధామ్ ఆలయ మందిరమంతా చూపిస్తారు. అనంతరం స్వామి వారి ప్రసాదాన్ని, మధ్యాహ్న భోజనాన్ని అతిథ్యంలో భాగంగా అందజేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను స్పర్శ్ హస్పైస్కు అందిస్తారు. -
న్యూజెర్సీ సాయిదత్త పీఠంలో అద్భుత ప్రవచనం
-
అమెరికాలో ఎన్నారై కుటుంబం దారుణ హత్య?!
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు హత్యకు గురయ్యారు. తేజ్ ప్రతాప్ సింగ్(43), సొనాల్ పరిహార్(42), వారి పదేళ్ల కొడుకు ఆయుష్, ఆరేళ్ల కూతురు ఆరీలు ప్లెయిన్స్బోరోలోని వారి సొంతింట్లోనే విగతజీవులై రక్తపు మడుగులో కనిపించారని పోలీసులు తెలిపారు. ఐటీ నిపుణులుగా పనిచేస్తున్న సింగ్ దంపతులు 2018లో సొంతింటిని కొనుక్కున్నారని బంధువులు తెలిపారు. ఈ నెల 4న సాయంత్రం తమ ఫోన్కాల్కు సింగ్ దంపతులు స్పందించడం లేదంటూ వారి బంధువొకరు అధికారులను అలర్ట్ చేశారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా విషయం బయటపడింది. బుధవారం రాత్రి వారు హత్యకు గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తేజ్ ప్రతాప్ సింగ్ సొంతూరు యూపీలోని జలౌన్ అని తెలిసింది. కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని ప్లెయిన్స్బోరో పోలీసులు తెలిపారు. -
న్యూజెర్సీలోని ఎడిసన్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం వేడుకలు
-
Swaminarayan Akshardham: భారత్ వెలుపల అతిపెద్ద దేవాలయం
రాబిన్స్విల్లె: భారత్ వెలుపల నిర్మితమైన ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో అక్టోబర్ 8వ తేదీన ప్రారంభం కానుంది. న్యూజెర్సీ రాష్ట్రంలోని రాబిన్స్విల్లె పట్టణంలో బీఏపీఎస్ స్వామినారాయణ్ అక్షర్ధామ్గా పిలుచుకునే ఈ గుడి రూపుదిద్దుకుంది. అమెరికా వ్యాప్తంగా తరలివచ్చిన 12 వేల మంది కార్యకర్తలు ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. 183 ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణానికి 2011 నుంచి 2023 వరకు సుమారు 12 ఏళ్లు పట్టింది. సుమారు 10 వేల విగ్రహాలను ఇందులో వాడారు. కంబోడియాలోని 12వ శతాబ్ధం నాటి అంగ్కోర్ వాట్ హిందూ ఆలయం తర్వాత బహుశా ఇదే అతిపెద్దదని అంటున్నారు. ఆలయాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు తరలివస్తున్నారు. -
న్యూజెర్సీలో తెలంగాణ ఉద్యమ నేత కడియం రాజుకు ఘనంగా నివాళులు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ డాక్టర్ కడియం రాజు గారి శ్రద్ధాంజలి సభ అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలో ఏబీవీపీ పూర్వ కార్యకర్తల మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు, ఏబీవీపీ పూర్వ విద్యార్థులు విలాస్ జంబుల, అమర్ జునూతుల, సంతోష్ మైకా, రాజేష్ రెడ్డి, సమరసింహా రెడ్డి బొక్క, కిరణ్, మధుసుధన్ రెడ్డి, ప్రదీప్ కట్ట, సుధీర్ గుత్తికొండ , సురేష్ సోమిశెట్టి, ప్రీతం , ప్రేమ్ కాట్రగడ్డ, పూర్వ కార్యకర్తలు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, స్వర్గీయ డా కడియం రాజన్న ఆత్మీయ మిత్రులు పెద్ద ఎత్తున హాజరై కడియం రాజన్న గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. బండి సంజయ్ కూడా గతంలో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పని చేశారు. ఉస్మానియా పూర్వ విద్యార్థి, అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ నాయకుడు ,తన ఉద్యమాల ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలిచిన జాతీయ స్థాయి లీడర్, కడియం రాజు మాకు (విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ తుమ్మల ) సహచరుడు కావడం మా పూర్వ జన్మ సుకృతం. విలాస్ రెడ్డి జంబుల అనే వ్యక్తి ఈ రోజు అమెరికాలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు అంటే దానికి కారణం మనం అందరం ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా దిక్సూచి కడియం రాజు అని సగర్వంగా చెబుతాను. ఒక సిద్ధాంతం కోసం , తనని నమ్ముకున్న వారి కోసం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టైనా పోరాడే యోధుడితో కలిసి చదివే అవకాశం వచ్చినందుకు, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. దేశ భక్తి , సేవాభావం ,ఉద్యమస్ఫూర్తి ,నాయకత్వ లక్షణాలు, పోరాడేతత్వం ఇవన్నీ కలగలిపిన ఆదర్శ వ్యక్తి కడియం రాజు. అసలు ఎవరు ఈ "రారాజు", అయన గురించి, ప్రజలను చైతన్య పరిచిన అయన విధానాలు గురించి, ఒక్క మాటలో చెప్పాలంటే అయన ప్రయాణం గురించి మా మాటల్లో.....,కాదు కాదు ,మాలాగా అభిమానించే ఎంతోమంది కోసం ఆయన ప్రయాణం గురించి వారి మాటల్లో దేశాన్ని ప్రేమించే జాతీయ భావాలు కలిగిన విద్యార్థి.. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన ఉద్యమ నేత.. సమాజాన్ని ప్రేమించే నవతరం నాయకుడు.. ఎంతో భవిష్యత్ ఉన్న ఆ డైనమిక్ లీడర్ను విధి కాటేసింది.. సమాజం చిన్నబోయేలా ఒక నాయకుడిని కోల్పోయింది.. ప్రజల కోసం ఆయన చేసిన ఉద్యమాలను ఆయన ఆదర్శ వ్యక్తిత్వం గుర్తు తెచ్చుకుని తల్లడిల్లుతున్నారు ఎంతో మంది.. ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ చరిత్రలో 108 రోజుల జైలు జీవితం గడిపి, అన్న, బాబాయ్, మామగా విద్యార్థులచే ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా యూనివర్సిటీ దిక్సూచి డాక్టర్ కడియం రాజు ఇటీవల మార్చి 20న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన నల్లగొండ జిల్లాలోని కొత్తగూడెం గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. తన పాఠశాల విద్య కొండ్రపోల్ గ్రామంలో, ఇంటర్ నాగార్జున జూనియర్ కళాశాల, మిర్యాలగూడ కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తిచేశారు. పేదరికం వెక్కిరిస్తున్నా ఆ తర్వాత ఎంఏ హిస్టరీ విభాగంలో ఎంఫిల్, పీహెచ్డీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేశారు. ఆయనకు ఇంటర్ నుంచే దేశభక్తి, జాతీయ భావాలు కలిగిన విద్యార్థిగా ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ డిగ్రీలో కళాశాల ఎబీవీపీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2002 సంవత్సరం నుండి ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ సైద్ధాంతిక పోరులో ముందుండి క్రియాశీలకంగా పనిచేశారు. ఏబీవీపీ చేపట్టిన ఎన్నో విద్యారంగ సమస్యలపై ముందుండి పోరాడి, ఎన్నో లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి 108 రోజులు జైలు పాలయ్యారు. కుట్రలను, అవినీతిని సహించని వ్యక్తిత్వం ఆయనది. ఏబీవీపీ చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ భూముల పరిరక్షణ ఉద్యమంలో ముందుండి, అనేక ఆక్రమణ భూముల విషయంలో కోర్టులలో కేసులు వేశారు, నిరుద్యోగం, విద్యారంగ సమస్యలు మెస్ బిల్లులు, స్కాలర్షిప్పులు, మౌలిక వసతులు, నూతన హాస్టళ్ల నిర్మాణం కోసం పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఏబీవీపీలో డాక్టర్ కడియం రాజు తన సుదీర్ఘ ప్రయాణంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంచార్జ్గా, సిటీ సెక్రెటరీగా, స్టేట్ సెక్రెటరీగా, నేషనల్ సెక్రెటరీగా, సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నేతృత్వం వహించారు. అలాగే జాతీయ ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల విద్యా నియంత్రణ కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో సైతం ఏబీవీపీ చేపట్టిన అనేక ఉద్యమాలను ముందుండి నడిపించారు. ఏబీవీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన లక్ష మందితో ‘తెలంగాణ రణభేరి’లో సుష్మాస్వరాజ్ ఆహ్వానించిన సభకు సభాధ్యక్షత వహించారు. అలాగే ఏబీవీపీ తెలంగాణ సాధనకై మహా పాదయాత్రలో కోదాడ నుండి హైదరాబాద్ వరకు నేతృత్వం వహించారు. నా రక్తం- నా తెలంగాణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరాహార దీక్షలు... ఇలా తెలంగాణ సాధనలో అనేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పోరాడారు. జాతీయ భావాలు కలిగిన దేశభక్తుడిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన డాక్టర్ కడియం రాజు మరణం విద్యార్థి లోకానికి, దేశానికి తీరని లోటు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల కోసం ఆయన చేసిన ఉద్యమాలను ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం, మరెంతో మందికి స్పూర్తి. (చదవండి: అమెరికాలో తెలుగు భాషకున్న స్థానం అంత ఇంత కాదు!: డా ప్రసాద్ తోటకూర) -
ఐటీ అమెరికా నిర్వహించిన ఆత్మీయ సదస్సులో బండి సంజయ్!
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అగ్రరాజ్యంలోని పలు నగరాల్లో నిర్వహిస్తున్న ఆత్మీయ సదస్సుల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఎడిసన్లో ఐటీ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్లో పాల్గొని, ప్రసంగించారు. ఐటీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు బండి సంజయ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. మోదీ పాలనలో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలను సంజయ్ కోరారు. ఇక అమెరికాలోని పలు నగరాల్లో జరుగుతున్న ఆత్మీయ సమావేశాల పట్ల బండి సంజయ్ స్సందించారు. ఈ సమావేశాలకు హాజరుకావటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: అమెరికాలో తెలుగు భాషకున్న స్థానం అంత ఇంత కాదు!: డా ప్రసాద్ తోటకూర) -
న్యూజెర్సీలో సామూహిక వరలక్ష్మి కుంకుమార్చన
-
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! అమెరికా బతుకమ్మ ఉయ్యాలో!!
‘‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ... ఏమేమి కాయొప్పునే గౌరమ్మ! తంగేడు పువ్వులో... తంగేడు కాయలో... ఆట చిలుకలు రెండు... పాట చిలుకలు రెండు...’’ ‘‘చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన...’’ ‘‘ఇలా ఒకటా... రెండా... లెక్కలేనన్ని బతుకమ్మ పాటలు మా నాలుకల మీద నాట్యమాడుతుంటాయి. గ్రామాల్లో గడిచిన బాల్యం జీవితాన్ని నేర్పుతుంది. తెలంగాణ గ్రామాల్లో బాల్యం బతుకమ్మ పాటల రూపంలో సమాజంలో జీవించడాన్ని నేర్పుతుంది. నిరక్షరాస్యులు కూడా ఈ పాటలను లయబద్ధంగా పాడతారు. బతుకమ్మ పాటల సాహిత్యం వాళ్ల నాలుకల మీద ఒదిగిపోయింది. తమకు తెలిసిన చిన్న చిన్న పదాలతో జీవితాన్ని అల్లేశారు గ్రామీణ మహిళలు. మా నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్. మా అమ్మమ్మ గారి ఊరు జగిత్యాల జిల్లా, వెలుగుమాట్ల. నా చదువు పుట్టపర్తిలో, సెలవులు అమ్మమ్మ ఊరిలో. దసరా సెలవులు వస్తున్నాయంటే సంతోషం అంతా ఇంతా కాదు. దేశమంతా దేవీ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటే మేము బతుకమ్మ వేడుకలు చేసుకుంటాం. గౌరమ్మ అందరి మనసుల్లో కొలువుంటుంది, మాట, పాట, ఆట అన్నీ గౌరమ్మ కోసమే అన్నట్లు ఉంటుందీ వేడుక. ఇంత గొప్ప వేడుకకు దూరమయ్యానని అమెరికా వెళ్లిన తర్వాత కానీ తెలియలేదు. అందుకే అమెరికాలో బతుకమ్మను పేర్చాను’’ అన్నారు దీప్తి మామిడి... కాదు, కాదు, బతుకమ్మ దీప్తి. ‘‘నేను 2007లో యూఎస్కి వెళ్లాను. న్యూజెర్సీలో ఉండేవాళ్లం. పెళ్లయి, ఒక బిడ్డకు తల్లిని. భర్త, పాప, ప్రొఫెషన్తో రోజులు బిజీగా గడిచిపోయేవి. డబ్బు కూడా బాగా కనిపించేది. కొద్ది నెలల్లోనే... ఏదో మిస్సవుతున్నామనే బెంగ మొదలైంది. వ్యాక్యూమ్ ఏమిటనేది స్పష్టంగా తెలియలేదు, కానీ బాల్యం, సెలవుల్లో బతుకమ్మ వేడుక మరీ మరీ గుర్తుకు వస్తుండేది. బతుకమ్మ కోసం ఇండియాకి రావడం కుదరకపోతే నేనున్న చోటే బతుకమ్మ వేడుక చేసుకోవచ్చు కదా! అనిపించింది. అలా అక్కడున్న తెలుగువాళ్లను ఆహ్వానించి బతుకమ్మ వేడుక చేశాను. మొదటి ఏడాది పదిహేను మందికి లోపే... పదేళ్లు దాటేసరికి ఆ నంబరు ఐదారు వందలకు చేరింది. అందరికీ భోజనాలు మా ఇంట్లోనే. ఏటా ఒక పెళ్లి చేసినట్లు ఉండేది. ఇండియా నుంచి తెలంగాణ పిండివంటలను తెప్పించుకోవడం, ఆ రోజు వండుకోవాల్సినవన్నీ మా ఇంట్లోనే వండడం, ఆ వంటల కోసం దినుసులను సేకరించడం, స్నేహితులందరినీ ఆహ్వానించడం, పూలు తెచ్చుకుని ఒక్కొక్కటీ పేర్చడం... ఇలా ప్రతి ఘట్టాన్నీ ఎంజాయ్ చేసేదాన్ని. ‘ఏటా అంతంత ఖర్చు ఎందుకు’ అని స్నేహితులు అనేవాళ్లే కానీ మా వారు ఒక్కసారి కూడా అడగలేదు. నా సంతోషం కోసం చేసుకుంటున్న ఖర్చు అని అర్థం చేసుకునేవారు. ఎప్పుడూ అన్నం ఉంటుంది! యూఎస్లో మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడూ అన్నం, కూరలుండేవి. మా కన్సల్టెన్సీకి వచ్చిన వాళ్లు, ముఖ్యంగా బ్యాచిలర్స్ కోసం ఈ ఏర్పాటు. మేము యూఎస్లో అడుగుపెట్టిన కొన్నాళ్లకే రెసిషన్ వచ్చింది. అప్పుడు పడిన ఇబ్బందులు నాకిప్పటికీ గుర్తే. అందుకే యూఎస్కి వచ్చిన కుర్రాళ్లు మన తెలుగింటి రుచులతో భోజనం చేస్తారు కదా! అనుకునేదాన్ని. షడ్రసోపేతమైన భోజనం అని కాదు కానీ కనీసం పప్పుచారయినా ఉండేది. ఈ అలవాటుకు బీజం పడింది కూడా అమ్మమ్మ దగ్గరే. అమ్మమ్మ పెద్ద పాత్రలో అంబలి చేయించి ఇంటి ముందు పెట్టేది. చాలామంది పొలం పనులకు వెళ్తూ దారిలో మా ఇంటి ముందాగి అంబలి తాగి, ఆవకాయ ముక్క చప్పరించుకుంటూ వెళ్లేవాళ్లు. ఆకలి తీర్చడంలో, అవసరమైన వాళ్లకు సహాయం చేయడంలో ఉండే సంతృప్తి మరి దేనిలోనూ ఉండదు. మా డ్రైవర్ ఇతర పనివాళ్ల పిల్లల చదువు కోసం ఫీజులు కట్టినప్పుడు మరొకరి జీవితానికి మనవంతు సహాయం చేస్తున్నామనే భావన సంతృప్తినిస్తుంది. అవకాశం లేనప్పుడు ఎలాగూ చేయలేం, వెసులుబాటు ఉన్నప్పుడయినా చేసి తీరాలి. మన ఎదుగుదల కోసం సమాజం నుంచి మనం తీసుకుంటాం, మనం ఎదిగిన తరవాత మరొకరి ఎదుగుదల కోసం ఆపన్న హస్తాన్ని అందించి తీరాలనేది పుట్టపర్తి స్కూల్ నేర్పించిన వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. మా అమ్మ ఫ్రెండ్ లీలా ఆంటీ కూడా బతుకమ్మ పండుగను బాగా చేసేవారు. ఆమె ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్. గునుగుపూలు వాటర్బాడీస్ని శుద్ధి చేస్తాయని చెప్తూ ఈ పండుగ వెనుక ఉన్న పర్యావరణ పరిరక్షణను వివరించేవారు. ఇవన్నీ మైండ్లో ఒక్కటొక్కటిగా అల్లుకుంటూ ఇలా దండ కూర్చుకున్నాయి. బతుకమ్మ దీప్తినయ్యాను! యూఎస్ జీవితం నాకు చాలా నేర్పించిందనే చెప్పాలి. అక్కడ అన్నీ ఉంటాయి కానీ ఏదో లేదనే వెలితి. రొటీన్ లైఫ్ని జాయ్ఫుల్గా మలుచుకోవడానికి నాకు బతుకమ్మ ఒక దారి చూపించింది. అప్పట్లో యూఎస్ ఇంతగా ఇండియనైజ్ కాలేదు. ఇప్పుడైతే న్యూజెర్సీ, డాలస్తోపాటు కొన్ని నగరాలు పూర్తిగా భారతీయలవే అన్నట్లు, తెలుగువాళ్ల ఊళ్లే అన్నట్లయిపోయాయి. మన పండుగలు ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. నేను మొదలుపెట్టడంతో నేను బతుకమ్మ దీప్తినయ్యాను. ‘దీప్తి మామిడి’గా అమెరికాలో అడుగుపెట్టాను. మూడేళ్ల కిందట తిరిగి వచ్చేటప్పటికి నా పేరు ‘బతుకమ్మ దీప్తి’గా మారింది. బతుకమ్మ పాటకు మ్యూజిక్ మొదలైతే చాలు... ఒళ్లు పులకించిపోతుంది. పూనకం వచ్చినట్లే ఉంటుంది. మీతో మాట్లాడుతున్నా సరే... బతుకమ్మ ఫీల్ వచ్చేస్తుంది. చూడండి గూజ్బంప్స్ వచ్చేశాయి’’ అని చేతులను చూపించారు బతుకమ్మ దీప్తి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
న్యూజెర్సీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
అమెరికాలోని న్యూజెర్సీలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇండియా డే పరేడ్ నిర్వహించారు. ఓక్ ట్రీ రోడ్ లోని ఎడిసన్ టు ఇసేలిన్ ఏరియాలో ఇండియా డే పరేడ్ వైభవంగా కొనసాగింది. ఈ వేడుకలకు గ్రాండ్ మార్షల్గా ప్రముఖ నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హాజరయ్యారు. తమన్నా ఇటువంటి పరేడ్ కార్యక్రమంలో పాల్గొనడం తొలిసారి కావడం విశేషం. ఇక న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై.. శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా పరేడ్ డే కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని ప్రవాస భారతీయులంతా న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్ కు చేరుకున్నారు. మువ్వన్నెల జెండాను చేతబూని వందేమాతరం, భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు. పలువురు చిన్నారులు భారతమాత వేషాధరణలో.. స్వాత్రంత్య యోధుల గెటప్పులలో ఆకట్టుకున్నారు. ఒకరికొకరు స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పరేడ్ లో భాగంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు శకటాలను ప్రదర్శించారు. భారీ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఇక న్యూజెర్సీ ప్రాంతం మినీ ఇండియాగా మారిందా అనేలా అక్కడి వాతావరణం కనిపించింది. న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్ లో జరిగిన ఇండియా డే పరేడ్ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులతో పాటు ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: -
సురేఖవాణి కూతురు బర్త్డే.. పబ్లో డ్యాన్స్ చేస్తూ!
నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన ఆమె ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో నటించకపోయినప్పటికీ అభిమానులతో టచ్లోనే ఉంటోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అలరిస్తూ ఫ్యాన్స్తో టచ్లోనే ఉంటుంది. విదేశాల్లో ఎక్కడికెళ్లినా కూడా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తూ ఉంటోంది. (ఇది చదవండి: అనాథలా రేకుల షెడ్డులో దుర్భర జీవితం గడిపిన స్టార్ హీరోయిన్!) ఇకపోతే సురేఖవాణి, తన కూతురు సుప్రీత కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టిపొట్టి బట్టలతో గ్లామర్ ఫోటోలను తరచూ షేర్ చేస్తుంటారు. పార్టీలు, పబ్స్, వెకేషన్స్కు అంటూ తల్లీ,కూతుళ్లు కలిసే తిరుగుతూ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు. ఇటీవలే అమెరికాలో ఈ తల్లీకూతుళ్లు సందడి చేసిన సంగతి తెలిసిందే. న్యూజెర్సీ వీధుల్లో సుప్రిత, సురేఖా వాణి హల్ చల్ చేశారు. తాజాగా తన కూతురు సుప్రిత బర్త్ డే సందర్భంగా సురేఖ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. న్యూజెర్సీలోని వీధుల్లో తండ్రితో సుప్రిత ఉన్న ఫోటోను ఓ బిల్డింగ్పై ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. ఇక ఆ ఫోటోను చూసిన సుప్రిత తీవ్ర భావోద్వేగానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియోను సురేఖా వాణి తన ఇన్స్టాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: హాలీవుడ్ స్టార్స్కి తెలుగు నేర్పిన ఆలియా!) అంతే కాకుండా సుప్రిత తన బర్త్ డే సందర్భంగా పబ్బులో ఫ్రెండ్స్తో కలిసిసెలెబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె తన ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్సులు చేస్తూ హంగామా చేసింది. మొత్తానికి సుప్రిత బర్త్ డే వేడుకల్లో పబ్బులో సందడి చేస్తూ ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలను సుప్రిత తన ఇన్స్టా స్టోరీస్లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) -
అమెరికా అధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మరో భారతీయుడు
వాషింగ్టన్: 2024లో జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా మరో భారతీయుడు ఎంట్రీ ఇచ్చారు. ఇండో అమెరికన్ ఇంజినీర్ అయిన హిర్ష్ వర్ధన్ సింగ్(38) ఈ మేరకు మూడు నిముషాల నిడివి ఉన్న ఒక వీడియో సందేశం ద్వారా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. హిర్ష్ వర్ధన్ సింగ్ కంటే ముందు రిపబ్లికన్ పార్టీ తరపున సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హాలీ(51), మిలియనీర్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(37) అమెరికా అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా హిర్ష్ వర్ధన్ సింగ్ ఈ రేసులో నిలిచిన మూడో భారతీయ సంతతి వారిగా నిలిచారు. వీడియో సందేశంలో సింగ్ మాట్లాడుతూ.. నేను జీవితకాలం రిపబ్లికన్ గా ఉంటానని, న్యూ జెర్సీ రిపబ్లికన్ పార్టీ కన్జర్వేటివ్ విభాగాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిన మొట్టమొదటి అమెరికన్ ను నేనేనన్నారు.. గత కొన్నేళ్లుగా వచ్చిన మార్పులను యధాస్థితికి తీసుకొచ్చి అమెరికా విలువలను కాపాడేందుకు బలమైన నాయకత్వం అవసరముందన్నారు. నాది స్వచ్ఛమైన రక్తం.. కోవిడ్ సమయంలో కూడా ఎటువంటి వ్యాక్సినేషన్ల జోలికి వెళ్ళలేదని.. అందుకే నేను రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష రేసులో నిలవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ మేరకు గురువారమే ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ లో తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు హిర్ష్ వర్ధన్ సింగ్. హిర్ష్ వర్ధన్ సింగ్ గతంలో న్యూజెర్సీ తరపున 2017,2021లో గవర్నర్ గాను, 2018లో హౌస్ సీటు కోసం, 2020లో సెనేటర్ గాను ప్రయత్నించారు. కానీ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో కూడా గవర్నర్ గా క్యాంపెయిన్ చేస్తూ డోనాల్డ్ ట్రంప్ తో పోటీపడ్డారు. కానీ నామినేషన్లలో మూడో స్థానంలో నిలిచారు. మొత్తంగా రిపబ్లికన్ పార్టీ తరపున ఈసారి ముగ్గురు భారత సంతతి వారు అధ్యక్ష పదవి కోసం నామినేషన్లలో పోటీ పడుతున్నారు. ఇదే పార్టీ తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో డోనాల్డ్ ట్రంప్ మొదటి వరుసలో ఉన్నారు. కానీ ఆయనపై నేర అభియోగాలున్న నేపథ్యంలో తర్వాతి వరుస వారిని అదృష్టం వరించినా వరించొచ్చు. అధ్యక్షుడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జులై 15-18 వరకు మిల్వాకీ, విస్కాన్సిన్ లో రిపబ్లికన్లు సమావేశం కానున్నారు. I'm entering the race for President.https://t.co/OEHCSYOdvK pic.twitter.com/RyxW4sKMSW — Hirsh Vardhan Singh (@HirshSingh) July 27, 2023 ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు -
జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్.. ఇంతలా మారిపోయిందేంటి?
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా మీకు గుర్తుందా?. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో అంకిత, భూమిక హీరోయిన్లుగా నటించారు. కేరళలో నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా టాలీవుడ్ బ్లాక్బస్టర్గా లిస్ట్లో చేరింది. అయితే కొన్ని చిత్రంలో తన అందమైన కళ్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది హీరోయిన్ అంకిత. 'చీమ చీమ చీమ చీమ' అంటూ సాగే సాంగ్లో ఎన్టీఆర్తో కలిసి డ్యాన్స్తో అదరగొట్టింది. (ఇది చదవండి: 'వాటిని కూడా తీసుకోవాల్సిందే'.. తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) సింహాద్రి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న భామ.. ఆ తర్వాత చేసిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. విజయేంద్రవర్మ, లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మీ ఐ లవ్ యూ, రారాజు, మనసు మాట వినదు లాంటి చిత్రాల్లోనూ కనిపించింది. అయితే కొద్ది సినిమాలకే పరిమితమైన అంకిత 2016లో విశాల్ జగతాప్ అనే వ్యక్తిని పెళ్లాడింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటించిన అంకిత ఇప్పుడేం చేస్తోంది? ఎలా ఉందో తెలుసుకుందాం. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన అంకిత ప్రస్తుతం అమెరికాలో న్యూ జెర్సీలో స్థిరపడింది. దాదాపు అర ఎకరం స్థలంలో నిర్మించుకున్న అందమైన ఇంట్లో నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు సంతానం కాగా.. అంకిత భర్త విశాల్ అమెరికాలోని సిటీ బ్యాంక్ లో పని చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!) -
WTC Final: కొత్త జెర్సీలో మెరిసిపోతున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన
వ్యక్తి దుర్మరణం
కొనసాగిన ఈ – కంటెంట్ జనరేషన్పై శిక్షణ
‘నన్నయ’ వర్సిటీ అభివృద్ధికి ‘న్యూయోమ్’ సహకారం
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భూతదయకు ప్రా‘ధాన్యం’
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి
అబ్బుర పర్చిన డాగ్ షో
సమ్మర్లో చదివేద్దాం
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తప్పక చదవండి
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- చివరి బెర్త్ ఎవరిదో?
- బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
Advertisement