-
జూరాలకు 2,451 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి స్వల్పంగా ఇన్ఫ్లోలు వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. స్థానికంగా వర్షాలు కురవడంతో పాటు, ప్రాజెక్టు ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి గురువారం జూరాల ప్రాజెక్టుకు 2,451 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.907 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ప్రాజెక్టు నుంచి 125 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. -
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఓటుహక్కు వినియోగంపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సామాజిక మధ్యమాల ద్వారా కొత్త ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారం చేపట్టారు. ఎన్నికల విధుల్లో ఉండి ఓటుకు దూరమయ్యే వారు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు మరిన్ని వర్గాలకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు. వైద్యులు, మెడికల్ సిబ్బంది, జర్నలిస్టులు, ఇతర ఎమర్జెన్సీ విభాగాల వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందించారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ఆవాసాలు, చెంచు గూడెల్లోని ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగం కోసం అదనంగా 113 పోలింగ్ ఉపకేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రధానంగా చెంచుపెంటల్లోనూ తాత్కాలిక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల్లో చెంచులు, గిరిజనులు, వృద్ధులు భాగస్వామ్యమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా గత లోక్సభ ఎన్నికలకన్నా ఈసారి ఓటింగ్ పెంచడంలో ఎన్నికల యంత్రాగం సఫలీకృతమైంది. -
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
● నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 264 పోలింగ్ కేంద్రాల్లో 2,36,094 మంది ఓటర్లు ఉండగా.. 1,60,394 మంది ఓటేశారు. 75,700 మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో 67.94 శాతం పోలింగ్ నమోదైంది. ● అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో 339 పోలింగ్ కేంద్రాల్లో 2,47,729 మంది ఓటర్లు ఉండగా.. 1,61,301 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇంకా 86,428 మంది ఓటుకు దూరంగా ఉండిపోవడంతో 65.11 శాతంగా నమోదైంది. ● కల్వకుర్తి అసెంబ్లీ పరిఽధిలో 271 పోలింగ్ కేంద్రాల్లో 2,44,405 మంది ఓటర్లు ఉండగా.. 1,77,226 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 67,179 మంది ఓట్లకు దూరంగా ఉన్నారు. 72.51శాతం మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ● కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 282 పోలింగ్ కేంద్రాల్లో 2,39,463 మంది ఓటర్లుండగా.. 1,55,917 మంది ఓటింగ్ వేశారు. 83,546 మంది ఓటింగ్లో పాల్గొనలేదు. దీంతో ఇక్కడ 65.11శాతం నమోదైంది. ● వనపర్తిలో 307 పోలింగ్ కేంద్రాల్లో 2,73,863 మంది ఓటర్లుకు గాను 1,82,552 ఓట్లు పోల్ అయ్యాయి. 91,311 మంది పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయారు. 66.66శాతం నమైదెంది. ● అలంపూర్లో 291 పోలింగ్ కేంద్రాల్లో 2,40,063 మంది ఓటర్లకు గాను 1,77,780 మంది తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోగా.. 62,283 మంది ఓటుకు దూరంగా ఉండిపోయారు. దీంతో అక్కడ 74.06శాతం నమోదైంది. ● గద్వాల నియోజకవర్గ పరిధిలో 303 పోలింగ్ కేంద్రాల్లో 2,56,637 మంది ఓటర్లకు 1,92,300 మంది ఓటు వేశారు. ఇంకా 64,337 మంది ఓట్లు వేయలేదు. 74.93 శాతం నమోదు కావడంతో పార్లమెంట్ పరిధిలో భారీగా ఓటింగ్ శాతం తగ్గింది. ● మధ్య వయస్కులు, వృద్ధుల కంటే యువతే తక్కువగా ఓటింగ్లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది. అంతే కాక గ్రామీణ, గిరిజన తండాల్లో ఓటర్లు అధికంగా పాల్గొన్నప్పటికీ పట్టణాల్లో తగ్గింది. పట్టణ ఓటర్లలో చాలా మంది ఓటేసేందకు ఇష్టపడలేదు. దీంతో పట్టణ ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు గెలుపుపై ప్రభావం చూపనుంది. తగ్గిన పోలింగ్ ఏ అభ్యర్థి విజయావకాశాలను దెబ్బతీస్తుందనే అసక్తి నెలకొంది. -
మాటమార్చితే.. సహించం
వనపర్తి: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వరిధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్.. సన్నాలకే ఇస్తామని మాట మార్చితే.. ఊరుకునేది లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ అన్నారు. గురువారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ విషయంపై స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది రైతులు దొడ్డు రకం వరి సాగు చేస్తారని.. కొద్దిపాటి సన్నాలు సాగుచేసే రైతులకే బోనస్ ఇచ్చి చేతులు దులుపుకొనేందుకు కాంగ్రెస్ పాలకులు కొత్తరాగం ఎత్తుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే రైతులకు రుణ మాఫీ, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేయకుండా రైతులను గోస పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజకొంటామని, వరికి రూ.500, మక్కలకు రూ.330, చెరుకుకు రూ.850, పప్పుధాన్యాలకు రూ.300 నుంచి రూ.500 వరకు, పసుపు, మిర్చికి రూ.800 బోనస్ ఇస్తామని, రైతుల ఓట్లు దండుకుని గెద్దెనెక్కిన తర్వాత కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులతో కలిసి నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు నాగన్న యాదవ్, బండారు కృష్ణ, నాయకులు ఆవుల రమేష్, మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో గురువారం డిగ్రీ 2, 6వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 49 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం జరిగిన రెండో సెమిస్టర్ పరీక్షకు 11,848 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 11,227 మంది హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం జరిగిన ఆరో సెమిస్టర్ పరీక్షకు 11,448 మందికిగాను 11,108 మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, కొండనాగులలో ఇద్దరు, నాగర్కర్నూల్లో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టిస్కు పాల్పడుతూ అధికారులకు పట్టుబడగా.. డిబార్ చేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజ్కుమార్ తెలిపారు. -
విద్యార్థులకు కలెక్టర్ అభినందన
వనపర్తి: షెడ్యూల్డు కులాల వసతిగృహాల్లో ఉంటూ.. పది, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గురువారం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అభినందించారు. ఫలితాలు వెల్లడైన సమయంలో పార్లమెంట్ ఎన్నికల ఒత్తిడిలో విద్యార్థులను ప్రోత్సహించలేకపోయానని భావించిన కలెక్టర్, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకించి పిలిపించుకుని తన ఛాంబర్లో అభినందించారు. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కొనసాగించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులతో పాటు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి నుషిత, సిబ్బంది పాల్గొన్నారు. స్కాలర్షిప్కు దరఖాస్తుల స్వీకరణ వనపర్తిటౌన్: గిరిజన వ్యవహారాల మంత్రి శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ అభ్యర్థుల నుంచి నేషనల్ ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎం. శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి స్కాలర్షిప్ పొందాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మాస్టర్స్, పీహెచ్డీ రీసెర్చ్ ప్రోగ్రాం కోసం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ అందిస్తుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 31వ, తేదీలోగా overseas.triba l.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సరైన అవగాహనతోనే డెంగీ నివారణ వనపర్తి: సరైన అవగాహన ఉంటేనే డెంగీ నివారణ సాధ్యమవుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జయచంద్రమోహన్ అన్నారు. గురువారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. డెంగీని పారదోలేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, నివాస పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు లేకుండా చూసుకోవాలన్నారు. కూలర్లు వాడే వారు ఎప్పటికప్పుడు అందులో నీటిని మారుస్తూ.. శుభ్రపరుచుకోవాలని చెప్పారు. పగటి పూట కుట్టే దోమలతోనే డెంగీ వచ్చే అవకాశం ఉంటుందని, జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. ఎవరికై నా జ్వరం వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఓటుకు దూరం
5,30,783 మంది..సాక్షి, నాగర్కర్నూల్/అచ్చంపేట: ప్రజాస్వామ్యానికి ఓటే ఆక్సిజన్.. సమర్థవంతమైన పాలకులను ఎన్నుకోవడంలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటింది. ఎంతటి మహామహులనైనా, ఎంతటి రాజకీయ అనుభవం కలవారైనా.. ప్రజలకు నచ్చకుంటే వారి తిరస్కారానికి గురికాక తప్పదు. అంతటి విలువైన ఓటు హక్కును చాలా మంది ఓటర్లు పలు కారణాలతో వినియోగించుకోలేకపోతున్నారు. కేవలం ఐదు నెలల కిందటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా.. లోక్సభ ఎన్నికల నాటికి సుమారు పదిశాతం మేర ఓటింగ్ తగ్గడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలకన్నా ఈ ఎన్నికల్లో ఓటువేయని వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సర్పంచ్, స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్న ఓటర్లు, లోక్సభ ఎన్నికల్లో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఎన్నికల సంఘం చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, ఓటుహక్కు వినియోగం కోసం ప్రత్యేక ఏర్పాట్లతో గత లోక్సభ ఎన్నికలకన్నా ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. ● నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 69.46 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇంకా 30.54 శాతం మంది ఓటింగ్కు దూరంగా ఉన్నట్లు సోమవారం జరిగిన పోలింగ్ ద్వారా స్పష్టమైంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు 11శాతం మేర పోలింగ్ తగ్గింది. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 2,057 పోలింగ్ కేంద్రాల్లో 17,38,254 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సోమవారం జరిగిన పోలింగ్లో 12,07,471 మంది ఓటింగ్లో పాల్గొనగా.. ఇందులో 6,13,085(70శాతం) మంది పురుఘులు, 5,94,367(68.06శాతం) మంది మహిళలు, 19 మంది ఇతరులు ఉన్నారు. మిగతా 5,30,783 మంది ఓటర్లు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోలేకపోయారు. నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో పోలైన ఓట్ల శాతం ఇలా.. నియోజకవర్గం 2018 2019 2023 2024 అసెంబ్లీ లోక్సభ అసెంబ్లీ లోక్సభ నాగర్కర్నూల్ 75.62 61.78 78.66 67.94 అచ్చంపేట 74.96 58.92 80.03 65.11 కల్వకుర్తి 84.05 66.60 83.26 72.51 కొల్లాపూర్ 70.15 56.16 81.42 65.11 వనపర్తి 80.83 60.91 77.72 66.66 అలంపూర్ 72.16 66.98 82.80 74.06 గద్వాల 71.95 66.30 83.12 74.93 చేరుకోని లక్ష్యం.. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో 70 నుంచి 80శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. వెనువెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతం తగ్గింది. పోలింగ్ 75 నుంచి 80 శాతం నమోదవుతుందని అధికార యంత్రాంగం అంచనా వేసినా లక్ష్యాన్ని చేరుకోలేదు. మొత్తం ఓటర్లు 17,38,254, ఓటేసింది 12,07,471 మంది ఐదు నెలల వ్యవధిలోనే అనాసక్తి 2023 అసెంబ్లీ ఎన్నిలతో పోలిస్తే 11 శాతానికి పైగా తగ్గిన పోలింగ్ -
దాహం తీరినట్లే..!
నీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలుప్రభుత్వం చొరవతోనే.. రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే ఎగువన ఉన్న కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ డ్యాం నుంచి 1.9 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేసింది. వేసవిలో ప్రజలకు పూర్తిస్థాయిలో నీటి ఇబ్బందులు కలుగకుండా జూరాలలో నీటి నిల్వను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం జూన్ చివరి నాటికి తాగునీటి సరఫరాకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. – జగన్మోహన్, ఈఈ అమరచింత: ఉమ్మడి పాలమూర్ జిల్లా వ్యాప్తంగా తాగునీటిని అందిస్తున్న జూరాల ప్రాజెక్టు జలాశయం రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యాం నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. దీంతో స్పందించిన కర్ణాటక ప్రభుత్వం అడిగిన రెండు టీఎంసీల నీటిని ఇవ్వలేమని, ప్రస్తుతానికి 1.9 టీఎంసీల నీటిని విడుదల చేసింది. దీంతో ఐదు రోజుల నుంచి నెమ్మదిగా జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న నీటితో రోజురోజుకు ఇన్ఫ్లో పెరిగిపోతుండటంతో ఇక వేసవిలో తాగునీటి కష్టాలు గట్టెక్కినట్లేనని అధికారులు తెలియజేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు తాగునీటితో పాటు సాగు, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని అందించే ప్రాజెక్టుగా పేరుగాంచింది. కాని వరదలు వచ్చినప్పుడు అత్యధికంగా నీటిని నిల్వ ఉంచుకోలేని పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో కేవలం 11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచుకుని, మిగిలిన నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితులు దాపురించాయి. జూరాలపై ఆధారపడిన తాగునీటి పథకాలు.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటిని అందించేందుకు శ్రీకారం చుట్టారు. రామన్పాడ్ రిజర్వాయర్తో పాటు జూరాల ప్రాజెక్టుతో మొత్తంగా 17 తాగునీటి పథకాలకు నిత్యం నీటిని అందిస్తున్నారు. ఆత్మకూర్, అమరచింత, వనపర్తి, నాగర్కర్నూల్, అచ్చంపేట, దేవరకద్ర, మహబూబ్నగర్, షాద్నగర్కు తాగునీటిని అందించే పథకాలను వీటిపై ఏర్పాటు చేశారు. ప్రజల దాహార్తిని దృష్టిలో ఉంచుకున్న అధికారులు జూరాల నుంచి ఆయకట్టుకు కేవలం వారబంది ద్వారా పంటల సాగుకు నీటిని అందిస్తున్నారు. గతేడాది వర్షాలు అనుకున్న విధంగా కురవకపోవడంతో యాసంగిలో జూరాల ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయినా తాగునీటిని వేసవి పూర్తినాటికి అందిచలేమని గ్రహించిన ప్రాజెక్టు అధికారులు, విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఎగువన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు తాగునీటి అవసరాలకు నీటిని నారాయణపూర్ డ్యాం ద్వారా విడుదల చేసింది. సమస్య పరిష్కారానికి.. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన తాగునీటి పథకాలకు వేసవి కాలం పూర్తయ్యే నాటికి నీటిని అందించాలనే ఉద్దేశంతో సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమస్యను నివేదించాం. తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరగా.. 1.9 టీఎంసీల నీటిని విడుదల చేసింది. – వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మక్తల్ ప్రభుత్వం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కర్ణాటక నారాయణపూర్ నుంచి జూరాలకు 1.9 టీఎంసీల నీటి విడుదల జూరాలకు కొనసాగుతున్న ఇన్ఫ్లో -
ప్రణాళిక ఏదీ..?
మూడేళ్లుగా అంచనాలు లేకుండానే పంటల సాగు ● విత్తన రాయితీ ఎత్తివేయడంతో ప్రణాళికలు తయారు చేయని వ్యవసాయశాఖ ● ప్రభుత్వం మారినా.. దృష్టి సారించని వైనం ● విత్తనాలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వ విత్తన సంస్థలు ● ఎక్కువ శాతం మిగిలిపోవడంతో వేలంలో తక్కువ ధరకు విక్రయాలు రాష్ట్రస్థాయిలో కొనసాగుతోంది.. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయడంతో పాటు పంటల సాగులో సమతుల్యతకు సాగు ప్రణాళికలు దోహదపడేది. ప్రస్తుతం ప్రణాళికలు వ్యవసాయశాఖ ప్రధాన కార్యాలయంలోనే చేస్తున్నారు. మెట్ట పంటల సాగు తగ్గడానికి ప్రధాన కారణం సాగునీటి లభ్యత పెరగడం. తక్కువ శ్రమతో సాగయ్యే పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. – చంద్రశేఖర్, ఇన్చార్జ్ డీఏఓ, వనపర్తి వనపర్తి: దశాబ్దాలుగా కొనసాగుతున్న సాగు ప్రణాళికలకు వ్యవసాయశాఖ చెల్లుచీటి ఇచ్చేసింది. గత ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేసిన నాటి నుంచి విత్తన రాయితీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇదే అదునుగా భావించిన వ్యవసాయశాఖ జిల్లాల వారీగా ఏటా వానాకాలం, యాసంగి సీజన్లో తయారు చేయాల్సిన సాగు ప్రణాళిక (పంటల వారీగా సాగుచేసే అంచనా వివరాలు)కు నీళ్లొదిలింది. దీంతో జిల్లాకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నా.. వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వరంగ విత్తనాభివృద్ధి సంస్థలు గతేడాది వానాకాలం, యాసంగి సీజన్లో సాగైన పంటల ఆధారంగా విత్తనాలు సిద్ధం చేయడం.. ఎక్కువ శాతం మిగిలిపోవడంతో వేలంలో తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతోపాటు ఆర్కేవీవై లాంటి రైతులకు వ్యవసాయ సామగ్రి ఇచ్చే పథకానికి రైతుబంధు పథకం అమలుతో చెక్ పడినట్లయింది. ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ పథకం నిధులు సైతం ఆగిపోయినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఆర్నెల్లు గడుస్తున్నా.. ఈ విషయంపై పాలకులు దృష్టి సారించకపోవడంతో ప్రస్తుత వానాకాలం సీజన్లోనూ సాగు ప్రణాళిక తయారు చేయలేదని వ్యవసాయ అధికారుల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో నాలుగేళ్లుగా వానాకాలం సీజన్లో వరి, పత్తి, కంది పంటలు మాత్రమే ఎక్కువగా సాగు చేస్తున్నారు. గతేడాది 2.39 లక్షల ఎకరాలు.. గతేడాది వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 2.39 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు వ్యవసాయశాఖ ఇదివరకే గణాంకాలు వెల్లడించింది. ఇందులో వరి 1.83 లక్షలు, మొక్కజొన్న 12,077, జొన్న 1,455, పత్తి 20,989, కంది 6,190, ఆముదం 8,87, చెరుకు 1,347 ఎకరాలు సాగు చేయగా.. మిగిలిన విస్తీర్ణంలో వేరే రకాల పంటలు వేసినట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. ఏటా తగ్గుతున్న మెట్ట పంటలు.. జిల్లాలో ప్రతి ఏటా మెట్టపంటల సాగు విస్తీర్ణం తగ్గుతోంది. నూనె, పప్పుగింజల పంటల సాగు తగ్గడం, వాటి స్థానంలో వరి సాగు పెరుగుతుండటం గమనార్హం. అన్ని రకాల పంటల సాగుపై ఏటా రైతులకు అవగాహన కల్పించే రైతు చైతన్య సదస్సులు సైతం నిర్వహించకపోవటం గమనార్హం. -
పీయూ భవనాల పనుల్లో వేగం పెంచాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో చేపట్టిన భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ఐడబ్ల్యూఐడీసీ డైరెక్టర్, సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ మల్లయ్యభట్టు ఆదేశించారు. బుధవారం పీయూలో జిల్లా ఈడబ్ల్యూఐడీసీ, విద్యాశాఖ, పీయూ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. పీయూలో చేపట్టిన భవనాల నిర్మాణ పనుల్లో జాప్యం జరగడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. అగ్రిమెంట్ ప్రకారం భవనాలను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తిచేయాల్సిందేనని తెలిపారు. భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులకు ఎటువంటి ఇబ్బందులు లేవని.. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. యూనివర్సిటీ అధికారులు న్యాక్ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారని.. త్వరలో అందుకు సంబంధించిన ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో భవనాల పనులను పూర్తిచేసి, పీయూ అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. ప్రతిపాదనలపై సమీక్ష చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని.. నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు తప్పవని అన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని టీటీగుట్ట పాఠశాలలో చేపట్టిన ‘మనబస్తీ – మనబడి’ పనులను పరిశీలించారు. మూత్రశాలలు, తరగతి గదుల నిర్మాణంతో పాటు గతంలో కాంట్రాక్టర్లు నిర్మించకుండా వదిలేసిన వాటిని కలెక్టర్ అనుమతితో అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమంలోకి మార్చాలని డీఈఓ రవీందర్కు సూచించారు. ● పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు నిధుల విషయంలో సహకారం అందిస్తున్నామని.. సకాలంలో భవనాలు పూర్తి కాకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ పరంగానూ ఇబ్బందులు వస్తున్నాయన్నారు. భవనాల పనులను సకాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో చీఫ్ ఇంజినీర్ అనిల్, రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి, ఏఎంఓ శ్రీనివాస్, సీఎంఓ బాలుయాదవ్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఐడబ్ల్యూఐడీసీ, సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ మల్లయ్యభట్టు -
దోస్త్ అడ్మిషన్లు షురూ..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: 2024–25 విద్యా సంవత్సరం ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకుగాను ప్రభుత్వం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (దోస్త్) ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతోంది. ఈ మేరకు ఈనెల 6 నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తుదారులు మొదటి దశ వెబ్ ఆప్షన్ ఇచ్చేందుకు ఈ నెల 20 నుంచి జూన్ 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 92 డిగ్రీ కళాశాలలు ఉండగా.. 31,090 సీట్ల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దరఖాస్తుల అనంతరం మొదటి దశ సీట్ల అలాట్మెంట్ జూన్ 6వ తేదీన చేపట్టనున్నారు. దరఖాస్తు చేసుకునే క్రమంలో విద్యార్థుల సందేహాలను తీర్చేందుకుగాను మహబూబ్నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 29 వరకు దరఖాస్తుకు గడువు పలు ప్రభుత్వ కళాశాలల్లో కొత్త కోర్సులకు అవకాశమిచ్చిన ప్రభుత్వం ఎంవీఎస్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు పీయూ పరిధిలో 92 కళాశాలలు.. 31,090 సీట్ల భర్తీకి అనుమతి జాగ్రత్తలు పాటించాలి.. దోస్త్ అడ్మిషన్ తీసుకునే క్రమంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మీసేవ కేంద్రాల నిర్వాహకులపై పూర్తిగా ఆధారపడవద్దు. ఆప్షన్ ఇచ్చుకునే కళాశాల, కోర్సుల విషయంలో అవగాహన ఉండాలి. విద్యార్థి తన ఫోన్ నంబర్ను మాత్రమే ఎంటర్చేసే విధంగా చూసుకోవాలి. కొత్త కోర్సులను ఉపాధి ఆధారితంగా ఉండేవిధంగా ప్రభుత్వం రూపొందించింది. – మధుసూదన్రెడ్డి, రిజిస్ట్రార్, పాలమూరు యూనివర్సిటీ -
No Headline
కొల్లాపూర్: కృష్ణానదిలో మత్స్యసంపద దోపిడీకి గురవుతోంది. నదిలో నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో నిషేధిత అలవి వలలతో చేప పిల్లలను పట్టే మత్స్యకారులు రంగంలోకి దిగారు. నదిలో యథేచ్ఛగా అలవి వలలతో అక్రమ వేట సాగిస్తూ మత్స్యసంపదను లూటీ చేస్తున్నారు. బీచుపల్లిదిగువ నుంచి చిన్నంబావి, పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. ఈసారి నదిలో నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో వ్యాపారులు నిషేధిత అలవి వలలతో వేట ప్రారంభించారు. అందుకోసం చిన్నంబావి మండల పరిధిలో ఒకచోట, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి సమీప ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. అలవి వలల కారణంగా నదిలో చేపలు పెరగడం లేదని.. తమ జీవనోపాధి దెబ్బతింటోందని సంప్రదాయ మత్స్యకారులు వాపోతున్నారు. సరిహద్దులు మారుతూ చేపల వేట.. తెలంగాణ, ఏపీ సరిహద్దుల గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. నదికి ఓవైపు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి, మరోవైపు ఏపీ పరిధిలోకి వస్తుంది. దీన్ని వ్యాపారులు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. తెలంగాణ అధికారులు దాడులకు వచ్చినప్పుడు ఏపీ వైపు.. అక్కడి అధికారులు దాడులకు వచ్చినప్పుడు తెలంగాణ వైపు తమ గుడారాలను మార్చేస్తున్నారు. ఉదయం ఓవైపు, సాయంత్రం మరోవైపు వలలను లాగుతున్నారు. -
కొలతల ప్రకారం పనులు చేయాలి
పాన్గల్: కొలతల ప్రకారం పనులు చేస్తే కూలి గిట్టుబాటు అవుతుందని ఏపీడీ సయ్యద్ సుల్తాన్ అన్నారు. బుధవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో కొనసాగుతున్న ఉపాధి పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూలీల హాజరు, పని ప్రదేశంలో వసతులు, కూలి చెల్లింపు తదితర వివరాలను కూలీలను అడిగి తెలుసుకున్నారు. కూలీల సంఖ్య పెంచాలని, రైతులకు ఉపయోగపడే పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 7 వరకు పనులకు వచ్చి మధ్యాహ్నం 12 లోపు ముగించాలని సూచించారు. అలాగే నర్సరీల్లోని మొక్కలు ఎండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధిగా రోజు నీటిని అందించాలన్నారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు తండాలోని నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఆయన వెంట టీఏ సునీత, పంచాయతీ కార్యదర్శి నర్మద, ఫీల్ట్ అసిస్టెంట్ సోమ్లా ఉన్నారు. ఉల్లి క్వింటా రూ. 2,600 దేవరకద్ర: కొన్ని రోజుల కిందటి వరకు రూ. వెయ్యి నుంచి రూ. 1,500 వరకు ఉన్న ఉల్లి ధరలు.. రెండు వారాల నుంచి ౖపైపెకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం దిగుబడులు తగ్గి, సీజన్ ముగుస్తున్న క్రమంలో ఉల్లి ధరలు రెండింతలు పెరిగాయి. దేవరకద్ర మార్కెట్లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లి వ్యాపారం జోరుగా సాగింది. వ్యాపారులు వేలం లేకుండానే నేరుగా కొనుగోలుచేశారు. క్వింటా ఉల్లి గరిష్టంగా రూ. 2,600, కనిష్టంగా రూ. 2,200 ధర పలికింది. తూకం చేసిన ఉల్లిని అప్పటికప్పుడు 45 కేజీల బస్తాల్లో నింపి, రూ. 1,300 నుంచి రూ. 1,100 వరకు విక్రయాలు సాగించారు. ఇక చిన్నపేడు ఉల్లి బస్తాలను రూ. 600 నుంచి రూ. 500 వరకు విక్రయించారు. కాగా, కొందరు రైతులు ట్రాక్టర్లపై ఉల్లి బస్తాలను పెట్టుకొని అమ్ముకున్నారు. నాణ్యమైన ఉల్లి బస్తా ధర రూ. 1,300 నుంచి రూ. 1,100 వరకు అమ్మకాలు సాగించారు. రూ. 2,319 పలికిన సోనామసూరి ధాన్యం దేవరకద్ర మార్కెట్లో జరిగిన టెండర్లలో సోనామసూరి ధాన్యం క్వింటాకు గరిష్టంగా రూ. 2,319, కనిష్టంగా రూ. 2,062 ధర పలికింది. మార్కెట్కు 300 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
సాయుధ బలగాల పనితీరు భేష్
వనపర్తి: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో కేంద్ర సాయుధ బలగాలు చక్కటి పనితీరు కనబర్చాయని ఎస్పీ రక్షిత కె.మూర్తి కొనియాడారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కేంద్ర బలగాల అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేసి మాట్లాడారు. స్థానిక పోలీసులతో కేంద్ర బలగాలు సమన్వయంతో పనిచేయడంతో జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు పూర్తి చేశామన్నారు. బందోబస్తు విధులు నిర్వహించిన ఐటీబీపీ, ఇంటలిజెన్స్ అధికారులు, సిబ్బంది రాముకుమార్, చంద్రకాంట బిస్వాస్, స్వామిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమములో ఏఆర్ ఏఎస్పీ వీరారెడ్డి, ఏఆర్ సీఐ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రక్షిత కె.మూర్తి -
నేటినుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పీయూ పరిధిలో 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయగా.. 2వ సెమిస్టర్లో 25,575 మంది, 4వ సెమిస్టర్లో 16,902 మంది, 6వ సెమిస్టర్లో 13,751 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేయడంతో పాటు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటుచేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాజ్కుమార్ తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్లో హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని.. నిర్ణీత సమయంలో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. -
కొత్త కోర్సులు...
పీయూ పరిధిలో సుమారు 31 వేల సీట్ల భర్తీకి ప్రతి సంవత్సరం ప్రభుత్వం అనుమతి ఇస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. గత సంవత్సరం 50 శాతం కూడా సీట్లు భర్తీ కాలేదు. ఈక్రమంలో సీట్ల భర్తీని పెంచేందుకుగాను ప్రభుత్వం వృత్తి ఆధారిత కోర్సులను తీసుకువచ్చింది. అందులో భాగంగా మహబూబ్నగర్ ఎంవీఎస్, ఎన్టీఆర్ కళాశాలలతో పాటు జడ్చర్లలోని బీఆర్ఆర్ కళాశాలల్లో కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీఏ (హెచ్ఈపీ) స్పెషల్ కోర్సులో జర్నలిజం, అంతర్జాతీయ రాజకీయాలు, పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సిలబస్లో మార్పులు తెచ్చారు. ఇక బీఎస్సీలో ఫార్మారంగంలో సేల్స్, మార్కెటింగ్లో సులభంగా ఉద్యోగాలు పొందేవిధంగా కొత్త కోర్సు ఉంది. బీకాం విభాగంలో ఫైనాన్స్ కోర్సు తీసుకువచ్చారు. బీబీఏలో రీటేయిల్ ఆపరేషన్ వంటి కోర్సులు ఉన్నాయి. వీటిలో వారానికి మూడు రోజుల పాటు విద్యాబోధన, మూడు రోజులు ఇంటర్న్షిప్ ఉండనుంది. -
అలివిని అరికట్టాలి..
సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్లాది సంఖ్యలో చేపపిల్లలను నదిలో వదిలిపెడుతుంది. ఆరు నెలలు తిరగకముందే అలవి వలలతో చేపలన్నింటిని పట్టడం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు ఎదురవుతాయి. అలవిని అరికట్టాలని అధికారులను కోరుతున్నాం. మత్స్యకారులు అప్రమత్తమై అలవిని అడ్డుకోవాలి. – వాకిటి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు, మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం తనిఖీలు చేపడతాం.. కృష్ణా పరివాహక తీరం వెంట అలవి వలల వినియోగం కొనసాగుతున్న విషయం తెలియదు. స్థానిక అధికారులతో తనిఖీలు చేయిస్తాం. అలవి వినియోగం చట్టరీత్యా నేరం. అలవి వలల వినియోగం ఎక్కడైనా జరిగితే సమాచారం ఇవ్వండి. అలవి వలలతో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – రహమాన్, మత్స్యశాఖ ఏడీ ● -
అందరికీ తెలిసినా ...
కృష్ణానదిలో నిషేధిత అలవి వలలతో చేపల వేట ప్రతి ఏడాది కొనసాగుతోంది. నదీతీర ప్రాంతాల్లోని కొందరు మత్స్యకారులు చేపలు పట్టే ప్రాంతాలను (పట్లు) అలవి వ్యాపారులకు రూ.లక్షలకు అమ్ముకుంటారు. ఆ ప్రాంతంలోనే అలవి వలలు విసిరి చేపలు పడుతుంటారు. అలవి వలలు విసిరేందుకుగాను వైజాగ్ నుంచి మత్స్యకారులను పిలిపిస్తారు. తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజాప్రతినిధులు, మండల అధికారులకు ఈ విషయం తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కాగా, గతంలో మంచాలకట్ట, జటప్రోల్ గ్రామాలకు చెందిన సంప్రదాయ మత్స్యకారులు అలవి వలల వినియోగంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. మత్స్యశాఖ అధికారులు స్పందించి అలవి వేటగాళ్లపై కేసులు నమోదు చేశారు. అడపాదడపా ఇటువంటి కేసులు మినహాయిస్తే.. అలివి వలల వినియోగంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
సీఎం వ్యూహం ఫలించేనా..!
ముఖ్యనేతల పనితీరుపైనా.. ‘పాలమూరు’ లోక్సభ ఫలితాలపై ఉత్కంఠ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరులోని రెండు పార్లమెంట్ స్థానాల్లో నువ్వా..నేనా అన్నట్లు సాగిన ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు పోస్టుమార్టం మొదలుపెట్టాయి. గెలుపుపై బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్నా.. పోలింగ్ సరళి బెంబేలెత్తిస్తోంది. క్రాస్ ఓటింగ్తో పాటు సైలెంట్ ఓటింగ్ కొనసాగిన క్రమంలో ఇది ఎవరికి మేలు చేస్తుంది.. ఎవరికి నష్టం చేస్తుందనే దానిపై ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. ప్రధానంగా మహబూబ్నగర్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్, బీజేపీ మధ్య సైలెంట్గా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేఫథ్యంలో ఎన్నికల ఫలితం ఏ విధంగా ఉంటుందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ తన వేగులను నేరుగా రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. క్రాస్ ఓటింగ్పై వారి నుంచి క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించడమే కాకుండా.. అనుకూల, ప్రతికూల అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. క్రాస్ ఓటింగ్పై క్షేత్రస్థాయిలో ఆరా.. సీఎం రేవంత్ సొంత ఇలాకా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావడంతో ఇక్కడ కాంగ్రెస్ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా 11 పర్యాయాలు స్వయంగా పర్యటించారు. ఇందులో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి మద్దతుగా పదిసార్లు వచ్చారు. ఇంటగెలిచి రచ్చ గెలవాలని... మీ బిడ్డను ఆశీర్వదించాలని.. పాలమూరు సమగ్రాభివృద్ధికి నేనే బాధ్యత తీసుకుంటానని సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించడంతో పాటు కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఎందుకివ్వలేదని, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండగా.. వారినుద్దేశించి చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పోలింగ్ తీరుతెన్నులపై నానారకాల అనుమానాలు వ్యక్తం కావడంతో ఏం జరిగిందనే దానిపై క్షేత్రస్థాయిలో పరిశీలన బాధ్యతలను తన వేగులకు అప్పగించినట్లు తెలుస్తోంది. హస్తం అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా 11 సార్లు పర్యటించిన రేవంత్ సెంటిమెంట్తో పాటు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు పోలింగ్ సరళిపై పార్టీలో భిన్నాభిప్రాయాలతో నిశిత పరిశీలన క్రాస్ ఓటింగ్పై వేగుల ద్వారా సమాచార సేకరణ అసెంబ్లీ సెగ్మెంట్లలో మండలాలు, గ్రామాలు, బూత్ల వారీగా లెక్కలు అనుకూల, ప్రతికూల అంశాలపై ఆరా.. నియోజకవర్గ ముఖ్యనేతల పని తీరుపైనా.. బూత్ ఇన్చార్జీల బెంబేలు.. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ల వారీగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ప్రతి బూత్కు ఒక ఇన్చార్జీని నియమించారు. బూత్ పరిధిలో ప్రచారం తీరుతెన్నులతో పాటు రోజురోజుకూ చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించి పార్టీలోని ముఖ్యుల దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. ప్రస్తుతం బూత్ల వారీగా వేగులు ఆరా తీస్తున్న క్రమంలో బూత్ ఇన్చార్జీలు బెంబేలెత్తుతున్నారు. అంతుచిక్కని ఓటరు నాడీతో ఏం చెప్పాలనే దానిపై వారిలో ఆందోళన నెలకొంది. ఏదేమైనా తమదే గెలుపు అని బీజేపీ, కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదేరోజు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఆ తర్వాత జిల్లాలో రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొడంగల్ నియోజకవర్గంలో 50వేల మెజార్టీ ఇవ్వాలని సభావేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన రేవంత్రెడ్డి.. ఆ నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో పోలింగ్కు నాలుగైదు రోజుల ముందు హైదరాబాద్లో సమావేశమై అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. అయితే పోలింగ్ అనంతరం కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి, దౌల్తాబాద్తో పాటు ఇతర నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో సైలెంట్గా క్రాస్ ఓటింగ్ సాగినట్లు ప్రచారం చోటుచేసుకుంది. దీనిపై పార్టీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మండలాలు, గ్రామాలు, బూత్ల వారీగా నిశితంగా పరిశీలించి ఎక్కడెక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది? అక్కడ కాంగ్రెస్ నాయకులు ఎందుకు పసిగట్టలేకపోయారు? వారు ప్రజల మధ్య తిరిగారా..లేదా? వంటి వివరాలతో సమగ్ర నివేదిక అందజేయాలని వేగులను ఆదేశించినట్లు సమాచారం. అనుకూల, ప్రతికూల అంశాలతో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ముఖ్య నేతల పనితీరుపైనా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసినట్లు వినికిడి. ఈ బాధ్యతను తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఒకరికి అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఘనంగా మహర్షి భగీరథ జయంతి
వనపర్తి: మహర్షి భగీరథ జయంతిని మంగళవారం జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సగర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మర్రికుంట సమీపంలోని మహర్షి భగీరథ విగ్రహానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగీరథుడు పట్టుదలతో తపస్సు చేసి దివి నుంచి భువికి గంగను రప్పించారని గుర్తుచేసుకున్నారు. పట్టుదలకు మారుపేరు.. మహర్షి భగీరథుడు పట్టుదలకు మారుపేరుగా చెప్పుకోవచ్చని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం నాగవరం చౌరస్తాలో ఉన్న భగీరథుడి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు. పితృదేవతల కోరిక మేరకు గంగను భూమిపైకి రప్పించేందుకు తపస్సు చేసినట్లు వివరించారు. -
వనపర్తి వాసికి అరుదైన గౌరవం
● కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఆహ్వానం వనపర్తిటౌన్: జిల్లాకేంద్రానికి చెందిన ఉప్పుగంటి రాఘవేందర్కు ఈ నెలలో ఫ్రాన్స్లో జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. తాను ఎడిటింగ్ చేసిన ‘ఇన్రీట్రీట్’ అనే 1.15 గంటల చిత్రం ఫెస్టివల్లో ప్రదర్శించడానికి ఎంపిక కావడంతో ఈ మేరకు నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. ఫిల్మ్ ఫెస్టివల్లో 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రదర్శించబడుతున్న చిత్రంగా ఇన్రీట్రీట్ నిలవనుంది. రాఘవేందర్ పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ ఇండియాలో పీజీ డిప్లొమా పూర్తిచేశారు. అదే కళాశాలలో చదివిన మైసమ్అలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. రాఘవేందర్ ఎడిటింగ్ చేశాడు. నాలుగు నెల ల కిందట ఆన్లైన్ వేదికగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఏప్రిల్ 15న అనుమతి లభించిందని.. ఈ నెల 20న చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా రాఘవేందర్ను పట్టణంలోని సాహితీవేత్తలు, ప్రజాసంఘాల నాయకులు అభినందించారు. స్ట్రాంగ్రూముల్లో ఈవీఎంలు భద్రం నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ లోక్సభ స్థానానికి సోమవారం నిర్వహించిన ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలను మంగళవారం జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్రూములకు తరలించారు. ఈసందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ.. పార్లమెంట్ నియోజకవర్గంలోని నాగర్కర్నూల్, కల్వకురి, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్, గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలను ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రుచేష్ జైవన్షీ, పలువురు అభ్యర్థుల సమక్షంలో సీల్వేసి స్ట్రాంగ్రూముల్లో భద్రపర్చినట్లు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూముల వద్ద సీఆర్పీఎఫ్, పోలీసు సిబ్బందితో మూడంచెల భద్రత నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అభ్యర్థులతో ఎన్నికల అధికారులు సమావేశమై పోలింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పలు పోలింగ్ కేంద్రాల పీఓ డైరీ, 17సీ 17 ఫార్మేట్లను జనరల్ అబ్జర్వర్ పరిశీలించి, ఓటింగ్ వివరాలను వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియ జరిగిన విధానంపై అభ్యర్థులు సంతృప్తిని వ్యక్తంచేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, కె.సీతారామారావుతో పాటు గద్వాల, వనపర్తి జిల్లాల అదనపు కలెక్టర్లు, ఏఆర్ఓలు ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రస్తుత 2024– 25 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల వారు వివిధ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి పాండు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు
వనపర్తి: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీని ఎదుర్కోలేక బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మకై ్క క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డాయని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక నందిహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సోమవారం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన కొన్ని గంటలకే బూత్లలో బీఆర్ఎస్ ఏజెంట్లు కనిపించలేదని.. నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటింగ్ పర్సెంటేజీ తగ్గించేందుకు బీఆర్ఎస్ నాయకులు తెగబడ్డారన్నారు. మొన్నటి వరకు బీజేపీపై ఆరోపణలు చేసిన నియోజకవర్గ బీఆర్ఎస్ నేత ఆస్తులు కాపాడుకునేందుకు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ఈ ఎన్నికల్లో బలి పశువును చేశారన్నారు. అలాగే కొందరు సొంత పార్టీ నాయకులు కూడా ద్రోహం చేశారని.. పార్టీ పరిశీలకులు ఆధారాలతో సేకరించారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కలుసుకోలేని సుమారు 50 వేల మందిని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కలిసి కృతజ్ఞతలు తెలుపడంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపించేందుకు ప్రచారం చేశామన్నారు. తమతో పాటు మిత్రపక్షాలు సైతం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్పార్టీకి ఊహకందని తీర్పు ఇవ్వనున్నారని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిపై దృష్టి సారిస్తా.. ఎన్నికల హడావుడి ముగిసింది.. ఇక నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించి పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతామని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బి–ఫారం ఇచ్చేది తానేనని.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో పుర చైర్మన్ పుట్టపాగ మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, నాయకులు చీర్ల చందర్, బాషానాయక్, సాయిచరణ్రెడ్డి, రహీం, వహీద్, నాయకులు కృష్ణ, ఉమ్మాల రాములు, సత్యశీలారెడ్డి, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. సొంత పార్టీలోనూ ప్రతిపక్ష ధోరణి చూశాం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి -
బస్టాండ్లు కిటకిట
పస్పులకు చేరిన కృష్ణమ్మ స్టేషన్ మహబూబ్నగర్: పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలు తిరుగు ప్రయాణంతో మంగళవారం ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడాయి. బస్టాండ్లోని ఏ స్టాప్ వద్ద చూసినా ప్రయాణికులు భారీ సంఖ్యలో కనిపించారు. ముఖ్యంగా మహబూబ్నగర్ ఆర్టీసీ బస్టాండ్లో ప్లాట్ఫాంలన్నీ ప్రయాణికులతో సందడిగా మారాయి. తాండూరు, పరిగి, వననర్తి, నారాయణపేట, మద్దూరు, మక్తల్, నాగర్కర్నూల్ తదితర రూట్లలో బస్సులు ప్రయాణికులతో నిండుగా వెళ్లాయి. హైదరాబాద్ రూట్లో.. మహబూబ్నగర్ బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సొంత గ్రామాల్లో ఓట్లు వేసిన చాలామంది ప్రజలు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో హైదరాబాద్కు వెళ్లే సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణికులు పోటీపడి ఎక్కారు. హైదరాబాద్ రూట్లో ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి ప్రత్యేకంగా సిటీలోని పలు డిపోల నుంచి బస్సులను తెప్పించారు. రాజేంద్రనగర్, ఫలక్నుమా, ఫరూఖ్నగర్, మిథాని డిపోల నుంచి 60 బస్సుల ద్వారా మహబూబ్నగర్ బస్టాండ్ నుంచి హైదరాబాద్ రూట్లో నడిపారు. ఇతర ప్రధాన బస్టాండ్ల నుంచి కూడా హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య అధికంగా కనిపించింది. ● తిరుగు ప్రయాణంతో ఆర్టీసీ బస్టాండ్లలో రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆర్ఎం వి.శ్రీదేవి మహబూబ్నగర్ బస్టాండ్లోని పలు స్టాప్లను పరిశీలించారు. ఉద్యోగులకు సలహాలు, సూచనలు ఇస్తూ.. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేయించారు. ఆమె వెంట డిపో మేనేజర్ సుజాత, ఇతర అధికారులు ఉన్నారు. కృష్ణానదిలో నీటిమట్టం తగ్గడంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ డ్యాం నుంచి నీటిని వదిలింది. మంగళవారం ఉదయం నీరు మండలంలోని పస్పుల ఘాట్కు చేరింది. రాత్రి వరకు జూరాల జలాశయానికి చేరుకుంటుందని అధికారులు వివరించారు. కుర్మగడ్డకు వెళ్లేందుకు కృష్ణానదిలో వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. కృష్ణానదిలో ప్రవాహం కనిపిస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. – మక్తల్ తిరుగు ముఖం పట్టిన ప్రయాణికులు రద్దీగా మారిన బస్టాండ్లు హైదరాబాద్ మార్గంలో బస్సులు ఫుల్ పర్యవేక్షించిన ఆర్ఎం, ఇతర అధికారులు -
పర్యాటకం.. పట్టింపేది?
జూరాల ప్రాజెక్టు వద్ద నీడ కరువు ● చంద్రగఢ్ కోటను గుర్తించేదెన్నడో.. ● పర్యాటకులకు తప్పని అవస్థలు అమరచింత: ఉమ్మడి జిల్లాకే తలమానికమైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగం ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కృష్ణా పుష్కరాల సమయంలో ప్రాజెక్టు దిగువ భాగంలో నిర్మించిన పుష్కర ఘాట్లు నాణ్యత లేక వరద ప్రవాహానికి కొట్టుకుపోయి బండరాళ్లు తేలాయి. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులు కాసేపు సేద తీరడానికి వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రాజెక్టు రహదారిలో అమరచింత మండలంలో ఉన్న చారిత్రక కట్టడం చంద్రగఢ్ కోటను సైతం పాలకులు విస్మరిస్తున్నారని మండల ప్రజలు అంటున్నారు. కుడి కాల్వ వైపు ఆహ్లాదం.. జూరాల ప్రాజెక్టు కుడికాల్వ వైపు పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో కాల్వ ఉండటం, ప్రాజెక్టు ప్రధాన కార్యాలయాలు సైతం అటువైపే ఉండటంతో ఆ ప్రాంతంలో పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి చొరవతో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఎడారిని తలపిస్తున్న ఎడమ కాల్వ విభాగం.. ఎడమకాల్వ విభాగంలో ఆయకట్టుతో పాటు దిగువన విశాలమైన ప్రదేశం, ఇటువైపే రుచికరమైన చేప వంటకాలు లభిస్తుండటంతో సందర్శకులు అధికంగా ఇటువైపే వస్తుంటారు. చెట్ల నీడ సైతం లేకపోవడంతో ఎడారిని తలపిస్తుంది. పర్యాటకులు పిల్లాపాపలతో కాసేపు సరదాగా గడపడానికి వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. చారిత్రక చంద్రగఢ్ కోట.. గుప్తుల కాలంలో చంద్రగుప్తుడు తన రాజ్య విస్తరణతో పాటు పాలన, రక్షణ కోసం కృష్ణానది సమీపంలో తన భార్య చంద్రమతి పేరుతో కోట నిర్మించారు. శత్రువులను దూరం నుంచి పసిగట్టి మట్టుబెట్టేందుకు కోట పైభాగంలో ఫిరంగులు పేల్చడానికి వీలుగా కోట నిర్మాణం చేపట్టారు. ఆధ్యాత్మికత కోసం శివాలయం, రాతి కోనేరులు నిర్మిచారు. ఈ కోనేరుల్లో మండు వేసవిలో సైతం నీరు ఉండటం విశేషం. ప్రస్తుతం నిర్వహణ కొరవడి కోటలోని పలు గోడలు, నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వసతులు కల్పించాలి.. జూరాల ప్రాజెక్టు వద్ద వసతులు లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతులతో పాటు బోటింగ్ ఏర్పాటు చేయాలి. – రాజు, మస్తీపురం ప్రతిపాదనలు పంపాం.. జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగంలో పార్కుల ఏర్పాటుకు గతంలో అధికారులకు నివేదికలు సమర్పించాం. వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించేందుకు మారోమారు ప్రతిపాదనలు పంపుతాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగం -
‘పోల్’మార్టం..!
వివరాలు 8లో uలోక్సభ ఎన్నికల సరళిపై ప్రధాన పార్టీల అభ్యర్థుల మల్లగుల్లాలు ● గత ఎన్నికలతో పోలిస్తేమహబూబ్నగర్లో 7.12 శాతం,నాగర్కర్నూల్లో 7.23 శాతం పెరిగిన ఓటింగ్ ● ముఖ్య అనుచరులతో కలిసిబూత్ల వారీగా మంతనాలు ● క్రాస్ ఓటింగ్, సైలెంట్ ఓటింగ్పై క్షేత్రస్థాయిలో ఆరా ● గెలుపోటములపై ఎవరి లెక్కలు వారివే.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్ల శాతాన్ని బట్టి ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పోలింగ్ బూత్ల వారీగా ఓటింగ్ సరళిని పరిశీలించి తమకు వచ్చిన ఓట్ల శాతం ఎంత అనేది అంచనా వేసుకుంటున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 72.43 శాతం ఓటింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి 7.12 శాతం మేర ఓటింగ్ శాతం పెరిగింది. ఇది ఏ పార్టీకి నష్టం వాటిల్లనుంది, ఏ పార్టీకి ఎవరికి లాభం చేకూరనుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టనుండటం, ఇందుకు దాదాపు మూడు వారాల సమయం ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. జడ్చర్లలో అత్యధికం.. మహబూబ్నగర్లో అత్యల్పం.. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిని పరిశీలిస్తే జడ్చర్ల నియోజకవర్గంలోనే అత్యధికంగా 77.92 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత షాద్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 77.40 శాతం ఓటింగ్ జరిగింది. అత్యల్పంగా మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 66.27 శాతం పోలింగ్ నమోదైంది. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 16,82,470 మంది ఓటర్లలో 8,32,256 మంది పురుషులు, 8,50,172 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే 17,916 మంది ఎక్కువగా ఉన్నారు. అయితే ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళల పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. 6,12,924 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకోగా 73.65 శాతం పోలింగ్ నమోదైంది. అయితే 71.24 శాతంతో మహిళా ఓటర్లు 6,05,647 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 2,44,525 మంది మహిళా ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. గతానికి మించి భారీగా పెరిగిన ఓటింగ్.. గత లోక్సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెరిగి, పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా తగ్గుతూ వస్తోంది. అయితే ఈసారి మాత్రం గత పార్లమెంట్ ఎన్నికల కంటే 7.12 శాతం అధికంగా పోలింగ్ నమోదైంది. 2004 లోక్సభ ఎన్నికల్లో 63.46 శాతం, 2009లో 67.68 శాతం, 2014లో 72.94 శాతం పోలింగ్ నమోదైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 65.31 శాతం పోలింగ్ కాగా, తాజాగా 72.43 శాతం ఓటింగ్ నమోదైంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- Paris Olympics 2024: ఒలింపిక్స్కు తెలంగాణ అమ్మాయి
- బదిలీల తర్వాతే హింస!
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Advertisement