వనపర్తి: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వరిధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్.. సన్నాలకే ఇస్తామని మాట మార్చితే.. ఊరుకునేది లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ అన్నారు. గురువారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ విషయంపై స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది రైతులు దొడ్డు రకం వరి సాగు చేస్తారని.. కొద్దిపాటి సన్నాలు సాగుచేసే రైతులకే బోనస్ ఇచ్చి చేతులు దులుపుకొనేందుకు కాంగ్రెస్ పాలకులు కొత్తరాగం ఎత్తుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే రైతులకు రుణ మాఫీ, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేయకుండా రైతులను గోస పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజకొంటామని, వరికి రూ.500, మక్కలకు రూ.330, చెరుకుకు రూ.850, పప్పుధాన్యాలకు రూ.300 నుంచి రూ.500 వరకు, పసుపు, మిర్చికి రూ.800 బోనస్ ఇస్తామని, రైతుల ఓట్లు దండుకుని గెద్దెనెక్కిన తర్వాత కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులతో కలిసి నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు నాగన్న యాదవ్, బండారు కృష్ణ, నాయకులు ఆవుల రమేష్, మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
మాటమార్చితే.. సహించం
Published Fri, May 17 2024 5:50 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
బిగుస్తున్న ‘గొర్రెల’ ఉచ్చు
అంబుజా చేతికి పెన్నా సిమెంట్
అయితే పేదలందరినీ పక్క రాష్ట్రాలకు తరలిద్దాం సార్!
Ishaa Vinod Chopra: నీకు నువ్వే సాయం చేసుకో
T20 World Cup 2024: రాకాసి బౌన్సర్.. తృటిలో తప్పిన అపాయం
సౌదీ అరేబియా నిర్ణయం.. డాలర్ ఆధిపత్యానికి ఎసరు!
టీడీపీ సీనియర్లకు షాకిచ్చిన చంద్రబాబు
మాకిచ్చే గౌరవం ఇదేనా?
సినిమాను మించిన ట్విస్ట్లు.. దర్శన్ కేసులో విస్తుపోయే నిజాలు!
Disha Patani: వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కల్కి 2898 ఏడీ హీరోయిన్ (ఫోటోలు)
తప్పక చదవండి
- విశాఖ విమల విద్యాలయం మూసివేత
- మరింత చేరువగా గ్రీన్ ఎనర్జీ
- రక్తం కాదు..ప్రాణం ఇచ్చినట్టే!
- పచారీ కొట్లకు 10 మినిట్స్ సవాల్
- వొడాఫోన్లో నోకియా, ఎరిక్సన్ వెండార్లకు 166 కోట్ల షేర్లు
- 15 వేల అంగన్వాడీ కేంద్రాల్లో ఇంగ్లిష్ మీడియం
- టీడీపీ దాడులకు భయపడొద్దు: వైవీ సుబ్బారెడ్డి
- కల్కి: ఆ విజువల్ నా వీడియోలో నుంచే కాపీ కొట్టారు.. ఇది న్యాయమేనా?
- TG: గోవధ జరగకుండా చూడండి.. హైకోర్టు ఆదేశాలు
- లోకేష్ను బుట్టలో వేసుకునే ప్లాన్.. మొత్తానికే మోసం!
Advertisement