-
Akash Anand: మేనల్లుడికి షాకిచ్చిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత వివాదం బహిర్గతమయ్యింది. పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను రెండు కీలక పదవుల నుంచి తొలగించారు. గతంలో ఆమె ఆకాష్ ఆనంద్ను తన వారసునిగా, జాతీయ సమన్వయకర్తగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆకాష్ విషయంలో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆకాష్ ఆనంద్ బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై విమర్శలు గుప్పించేటప్పుడు ఉపయోగించిన పదాలు మాయావతికి ఆగ్రహం తెప్పించాయి. ఇటీవల సీతాపూర్లో జరిగిన బహిరంగ సభలో ఆకాష్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ల ప్రభుత్వం అని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయని, అయితే ఇది బుల్డోజర్ల ప్రభుత్వం కాదని, ఉగ్రవాదుల ప్రభుత్వమంటూ ఆకాష్ ఆనంద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం దేశ ప్రజలను బానిసలుగా మార్చిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని టెర్రరిస్టుగా అభివర్ణించినందుకు సీతాపూర్లో ఆకాష్ ఆనంద్పై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనితోపాటు ఇటీవల ఆకాష్ ఆనంద్ ఒక సభలో బహుజన సమాజ్ నుండి ఓట్లు కోరుతున్న వారిని బూట్లతో కొట్టి తరమాలని వ్యాఖ్యానించారు. మరో ప్రకటనలో రామ మందిరాన్ని సందర్శించకూడదని తమ పార్టీ నిర్ణయించుకున్నదంటూ ప్రకటించారు. ఆకాష్ చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీ ఆయన ఎన్నికల ర్యాలీని రద్దు చేసింది.బహిరంగ సభల్లో ప్రసంగించేటప్పుడు ఉపయోగించే భాషపై నియంత్రణ ఉండాలని ఆకాష్ ఆనంద్ను మాయావతి గత నెలలోనే హెచ్చరించారు. అయితే ఆయన దీనిని పట్టించుకోలేదు. ఈ దరిమిలా ఆకాష్ ఆనంద్ ప్రసంగాలపై మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె తన సోషల్ మీడియాలో ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు అందిస్తూ ‘పార్టీలో శ్రమిస్తున్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఆకాష్ ఆనంద్ను తన వారసునిగా, నేషనల్ కోఆర్డినేటర్గా ప్రకటించాం. అయితే ఆయన పార్టీ చేపట్టిన ఉద్యమంలో పరిపక్వత సాధించే వరకు, అతనిని ఈ రెండు బాధ్యతల నుంచి తప్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు, పార్టీ ప్రయోజనాలతో పాటు ఉద్యమం కోసం బీఎస్పీ నాయకత్వం ఎటువంటి త్యాగానికైనా వెనకాడబోదని పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. బీఎస్పీ ఒక పార్టీ మాత్రమే కాదు.. అంబేద్కర్ ఆత్మగౌరవానికి ప్రతీక. సామాజిక మార్పు కోసం చేపడుతున్న ఉదమ్యమని మాయావతి పేర్కొన్నారు. -
నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే
-
'కోపం' ఇంత ప్రమాదకరమైనదా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు!
"తన కోపమే తనకు శత్రవుతన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌతన సంతోషమె స్వర్గముతన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ"! అన్న పద్యం చిన్నప్పుడు నేర్చుకున్నాం. చాలామంది దీన్ని పాటించలేరు. కోపం శక్తి అలాంటిది. మెరుపుదాడిలా వచ్చేస్తుంది. అయితే ఈ కోపం వల్ల శత్రవులు పెరుగుతారు అని తెలుసుకున్నాం గానీ ఇది ఆరోగ్యానికి కూడా అత్యంత ప్రమాదకరమైనదే అట. కోపం కారణంగా శత్రుత్వం ఏర్పడి మనఃశాంతి కరువయ్యి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని విన్నాం గానీ. కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ కోపం గుండెపోటు, స్ట్రోక్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని గుర్తించారు. అంతేగాదు ఆ పరిశోధనల్లో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..అమెరికన్ హార్ట్ అసోసీయేషన్ జర్నల్లో ఈ పరిశోధన గురించి ప్రచురితమయ్యింది. శాస్త్రవేత్తలు కేవలం కొన్ని నిమిషాల కోపం ఆరోగ్యానికి చేటని, అది రక్తనాళాల పనితీరుని మార్చగలదని గుర్తించారు. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్లు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని వెల్లడించారు. కోపం తీవ్రతపై గుండెపోటు ప్రమాదం ఆధారపడి ఉందని పరిశోధనలో వెల్లడయ్యిందన్నారు. కొద్దిపాటి కోపం హృదయ ఆరోగ్యాన్ని దారుణంగా దిగజారుస్తాయని అన్నారు. అందుకోసం కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, న్యూయార్క్లోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీ తదితర పరిశోధక బృందం సుమారు 280 మంది ఆరోగ్యవంతమైన పెద్దలపై అధ్యయనం నిర్వహించారు. వారిని నాలుగు గ్రూప్లుగా విభజించారు. ఒక సముహాన్ని విచారం, ఆందోళన, కోపానికి గురయ్యే సంఘటనలకు గురి చేశారు. ఆ సముహం ఎనిమిది నిమిషాల వరకు ఈ స్థితిని ఫేస్ చేశారు. అలాగే వారందర్నీ కోపాన్ని కంట్రోల్ చేసుకునేలా ఒకటి నుంచి 100 అంకెలు లెక్కపెట్టమన్నారు. అయితే వారిలో కొందరు మాత్రం తీవ్ర కోపానికి గురయ్యి బ్యాలెన్స్ తప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయా వ్యక్తుల రక్త నమునాలను పరిశీలించగా..కోపాన్ని నియంత్రించుకున్న వారికంటే..కోపానికి గురయ్యిన వారిలో రక్తనాళాలు విస్తరించే సామర్థ్యం గణనీయంగా తగ్గడం గుర్తించారు పరిశోధకులు. అందులోనూ అప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ తీవ్ర కోపం కారణంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన ఈజీగా పడుతున్నట్లు కూడా గుర్తించారు. ఈ భావోద్వేగాలు కార్డియోవాస్కులర్ ఫిజియాలజీని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పరిశోధనలో నిర్థారించారు. ఈ అధ్యయనం మానవుని మానసిక స్థితి, హృదయ ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందన్నారు పరిశోధకులు. అంతేగాదు ఈ పరిశోధన గుండె ఆరోగ్యం భావోద్వేగాలు, ఒత్తిడిని నిర్వహించడంపైనే ఆధారపడి ఉంటుందనేది హైలెట్ చేసిందని పరిశోధకులు తెలిపారు. (చదవండి: ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
"బయటికి పో..!" బండారు పై బాబు ఫైర్
-
బాబుపై భగ్గుమన్న శ్రీకాకుళం టీడీపీ
సాక్షి, శ్రీకాకుళం: తెలుగు దేశం పార్టీ మూడో జాబితా ఆ పార్టీలో చిచ్చును రాజేస్తోంది. చాలా చోట ఆశావహులకు మొండి చేయి ఇస్తూ.. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం ప్రదర్శించారు. దీంతో అధినేత తీరుపై అసహనం ప్రదర్శిస్తున్నారు కార్యకర్తలు. ఈ క్రమంలో శ్రీకాకుళం టికెట్ను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి కాకుండా.. గోండు శంకర్కు టికెట్ కేటాయించడంపై ఆమె వర్గీయులు రగిలిపోయారు. చంద్రబాబు ఫొటోను పగలకొట్టి.. చించిపారేసి కాళ్ల కింద పడి తొక్కారు. పార్టీ జెండాల్ని, మేనిఫెస్టోను తగలబెట్టి బాబు, పార్టీ వ్యతిరేక నినాదాలు చేశారు. చంద్రబాబు తీరుపై గుండ లక్ష్మీదేవి అనుచరులు రగిలిపోతూ.. మంటలు రాజేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ అధిష్టానం నిర్ణయం పై లక్ష్మీదేవి అసంతృప్తితో రగిలపోతున్నారు. అనుచరులతో చర్చలు జరిపిన అనంతరం.. తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని గుండ లక్ష్మీదేవి ప్రకటించారు. -
జనసేనలో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి
-
కార్యదర్శిపై మంత్రి పొన్నం ఆగ్రహం! ఎంపీడీవోకు ఆదేశాలు
కరీంనగర్: ప్రజాపాలన దరఖాస్తును చించేసిన పంచాయతీ కార్యదర్శిపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. చిగురుమామిడికి చేరుకున్న మంత్రి సర్దార్సర్వాయిపాపన్న, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసినివాళులు అర్పించారు. మండలంలోని 17 గ్రామాల ముఖ్య కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. బొమ్మనపల్లి గ్రామ ముఖ్యకార్యకర్తల సమావేశంలో అల్లెపు కనకయ్య తన ఆవేదనను మంత్రికి చెప్పుకున్నాడు. ప్రజాపాలనలో రెండుసార్లు దరఖాస్తు చేసుకోగా జీపీ కార్యదర్శి రమణారెడ్డి దరఖాస్తు చించేశాడని, బొమ్మనపల్లి గ్రామం కాదని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్నాడని చెప్పాడు. మంత్రి వెంటనే జీపీ కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. దరఖాస్తును ఎందుకు చించావని, ప్రజలకు సేవచేయాల్సిందిపోయి ఇలాంటి పనులేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే సస్పెండ్ చేస్తామని, కనకయ్య ఇంటికెళ్లి దరఖాస్తు స్వీకరించాలని ఆదేశించారు. అంతటితో ఆగకుండా మండలపరిషత్ అభివృద్ధి అధికారి ఎం. నర్సయ్యకు ఫోన్ చేసి తక్షణమే పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. ప్రజలకు మేమే సేవకులమైనప్పుడు, ఉద్యోగులు కూడా సేవకులే అని అన్నారు. గ్రామాల్లో తప్పనిసరి పర్యటిస్తానని, అత్యవసరాలు తన దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, జెడ్పీఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవీందర్, అధికార ప్రతినిధులు దాసరి ప్రవీణ్కుమార్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిసంఖ్యలో హాజరయ్యారు. ఇవి చదవండి: గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు -
అరుణాచల్ హైవే ప్రాజెక్టు ఏమిటి? చైనా మండిపాటు ఎందుకు?
భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో చైనా అనునిత్యం చొరబాటు ప్రయత్నాలను చేస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలోనే అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే పనులను భారత్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సరిహద్దు ప్రాంతాలకు సైన్యం చేరుకోవడం మరింత సులభతరం కానుంది. అప్పుడు సైన్యం ఎల్ఏసీకి చేరుకోవడానికి అధిక సమయం పట్టదు. 1748 కి.మీ పొడవైన నేషనల్ హైవే-913ని పూర్తి చేయడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టనుంది. ఈ ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తికానుంది. ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయ సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని అన్ని గ్రామాలను ఆల్-వెదర్ రోడ్ల ద్వారా అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. 2016లో భారత్ ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించిన తర్వాత చైనా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్ ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించకూడదని చైనా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే చైనా అభ్యంతరాన్ని భారత్ పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టులో భాగంగా హున్లీ- హ్యూలియాంగ్ మధ్య దాదాపు 121 కిలోమీటర్ల పొడవున హైవే నిర్మించనున్నారు. అదే సమయంలో హున్లీ- ఇతున్ మధ్య 17 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక వంతెన, టుటిన్ నుండి జిడో వరకు 13 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మిస్తున్నారు. అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే భూటాన్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ నుంచి ప్రారంభమై భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగర్లో ముగుస్తుంది. ఈ హైవే సిద్ధమైన తర్వాత తవాంగ్ సమీపంలోని బోమ్డిలా నుండి మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగరానికి అనుసంధానం ఏర్పడుతుంది. అన్ని వాతావరణాల్లోనూ ఉపయుక్తమయ్యేలా ఈ రహదారిని నిర్మిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాలకు ఈ రహదారితో అనుసంధానం ఏర్పడుతుంది. ఈ హైవే నిర్మాణం కోసం అనేక సొరంగాలు కూడా నిర్మించనున్నారు. ఈ హైవే భూటాన్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ నుంచి ప్రారంభమై, భారత్-మయన్మార్ సరిహద్దులోని విజయనగర్ వద్ద ముగుస్తుంది. ఈ రహదారి భారతదేశం-టిబెట్-చైనా, మయన్మార్ సరిహద్దులకు దగ్గరగా వెళుతుంది. -
గొంతు పెంచి కోర్టును భయపెట్టలేరు: ఓ లాయర్పై సీజేఐ ఆగ్రహం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా గట్టిగా అరుస్తూ మాట్లాడిన ఓ న్యాయవాదిపై బుధవారం జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు పెంచి కోర్టును ఎవరూ భయపెట్టలేరని హెచ్చరించారు. న్యాయస్థానంలో అనుచితంగా ప్రవర్తించడం తగదని తేల్చిచెప్పారు. ‘‘నువ్వు లాయర్గా సాధారణంగా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తుంటావు? బిగ్గరగా అరుస్తూ మాట్లాడి మమ్మల్ని భయపెట్టడం నీవల్ల కాదు. నా 23 ఏళ్ల న్యాయవాద వృత్తిలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో మాట్లాడే పద్ధతి ఇదేనా? న్యాయమూర్తుల ముందు ఎప్పుడూ ఇలాగే అరుస్తావా? నేను మరో ఏడాది లోగా పదవీ విరమణ చేయబోతున్నా. కోర్టులో లాయర్లు ఇష్టానుసారంగా మాట్లాడడం చూడాలని నేను కోరుకోవడం లేదు. నీ గొంతు తగ్గించు’’ అని సదరు లాయర్కు తేలి్చచెప్పారు. దీంతో ఆ లాయర్ వెనక్కి తగ్గారు. సుప్రీంకోర్టు నుంచి, జస్టిస్ చంద్రచూడ్ నుంచి క్షమాపణ కోరారు. -
ఔను..! నిజంగానే కలెక్టర్కు కోపమొచ్చింది!
ఆదిలాబాద్: కలెక్టర్కు కోపమొచ్చింది.. ఎప్పుడు శాంతంగా, సరదాగా కన్పించే రాహుల్రాజ్ తొలిసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రజావాణి అర్జీలు పెండింగ్లో ఉంచిన అధికారులను తీవ్రంగా మందలించిన కలెక్టర్, పది, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. తన అనుమతి లేకుండా అధికారులేవరూ సెలవులో వెళ్లవద్దని ఆదేశించిన కలెక్టర్ ప్రజావాణిని లైట్గా తీసుకుంటే సహించబోనని కాస్త గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు. అర్జీదారులు వచ్చిన రాకపోయినా ప్రతి జిల్లా స్థాయి అధికారి ఉదయం 10.30 గంటలకు సోమవారం జరిగే ప్రజావాణికి విధిగా రావాలని లేకుంటే కుదరని తెల్చిచెప్పారు. ఈ నెల 21 న హైదరాబాద్లో జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష ఉన్నందున జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలను సంక్షిప్త సమాచారంతో మంగళవారం సాయంత్రంలోగా అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హాజరు శాతం పెంచడంతో పాటు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం గుండె పోటుతో మరణించిన భీంపూర్ తహసీల్దార్ నారాయణ మృతికి సంతాప సూచకంగా అధికారులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇవి చదవండి: ‘గృహలక్ష్మి’ దరఖాస్తులు పరిశీలించొద్దు! -
అర్ష్దీప్పై కోపంతో ఊగిపోయిన సూర్య..
-
ఈ వీడియో చూస్తే.. గాడిద అంటూ ఎవరినీ నిందించరు!
చాలామంది కోపంలో ఎదుటి వ్యక్తిని గాడిదతో పోలుస్తూ నిందిస్తుంటారు. అయితే తాజాగా వైరల్గా మారిన ఒక వీడియోలో గాడిద తన తెలివి తేటలను అద్భుతంగా ప్రదర్శించింది. ఈ ఫన్నీ వీడియోను చూసిన వారంతా ఆ గాడిదను మెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ఇన్నాళ్లూ గాడిద పేరుతో అప్పుడప్పుడూ ఇతరులను నిందిస్తూ వచ్చామని, తెలియక పొరపాటు చేశామని లెంపలేసుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా తమ కళ్లనే తాము నమ్మలేకపోతున్నామని అంటున్నారు. మరికొందరు ఈ గాడిద.. కథల్లో చెప్పినట్లు నక్క కన్నా తెలివైనదని అంటున్నారు. ఈ గాడిద కష్టించేందుకు బదులు తన తెలివిని ఉపయోగించి, తాను చేయాల్సిన పనిని మరింత సులభతరం చేసుకుంది. Work smarter.. 😅 pic.twitter.com/fFanLbhCO1 — Buitengebieden (@buitengebieden) December 10, 2023 ఈ వీడియోకు ఇప్పటివరకూ 80 లక్షలకు పైగా వీక్షణలు దక్కాయి. వేలమంది ఈ వీడియోను లైక్ చేశారు. ఇంతకీ ఈ వీడియోలో ఏమున్నదనే విషయానికొస్తే.. కొన్ని గాడిదలు వాటికి ఎదురుగా అడ్డుగా ఉన్న కర్రను దాటి వెళుతున్నాయి. అయితే వాటిలో ఒక గాడిదకు అలా కర్రను దాటి అవతలి వైపునకు వెళ్లాలని అనిపించలేదు. కొసేపు ఆలోచించాక దానికి ఒక ఉపాయం తోచింది. వెంటనే అది అడ్డుగా ఉన్న కర్రను తన నోటితో సులువుగా తొలగించి, యమ దర్జాగా, హాయిగా మందుకు కదిలింది. ఈ వీడియోను చూసినవారంతా గాడిద తెలివితేటలకు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది కూడా చదవండి: రైలులో యువతిపై అకృత్యం.. బాత్రూమ్లో నిందితుని పట్టివేత! మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
బాబుది బురద రాజకీయం
-
‘పచ్చ దొంగల ముఠా ఊళ్ళ మీద పడుతోంది జాగ్రత్త’
తాడేపల్లి: పచ్చ దొంగల ముఠా పట్టపగలు ఇళ్లలోకి చొరబడుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అంతర్జాతీయ దొంగల ముఠాలకు ఆ పార్టీ ఏ మాత్రం తీసిపోదని టీడీపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు సజ్జల. పచ్చ దొంగల ముఠాతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు 'పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీద పడుతోంది. ఇళ్లల్లోకి చొరబడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మోసం చేయడంలో కొత్త టెక్నిక్స్ టీడీపీకి బాగా తెలుసు. చంద్రబాబుకు అమలు చేయాలనే ఉద్దేశం లేని హామీలు ఇచ్చారు. హామీల అమలు ఎక్కడని ప్రశ్నిస్తారని వెబ్సైట్ నుంచి తొలగించారు. ఓటర్ ఐడీకార్డు తీసుకుని ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. రాత పూర్వకంగా ఇచ్చేదే మేనిఫెస్టో.. మరి దీనిని ఏమంటారు. 5 కోట్ల మంది ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తూ నిలువు దోపిడీకి ప్రయత్నాలు చేస్తున్నారు.' అని దుయ్యబట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే.. అంతర్జాతీయ దొంగల ముఠాకు తీసిపోని టీడీపీ నాలుగైదు దశాబ్ధాల క్రితం ఒక రకమైన మోసాలు జరిగితే..జనరేషన్ పెరిగి, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆ మోసాలు రూపు మారాయి. టెక్నాలజీని ఉపయోగించి నిలువు దోపిడీ చేయడం, ప్రలోభపెట్టడం, ఎన్ని చట్టాలున్నా వాటిని ఏదో రకంగా ఉల్లంఘించడం రోజూ చూస్తూనే ఉన్నాం. అలాంటి మోసాలు ఎల్లలు దాటి విదేశాల నుంచి కూడా మోసాలు జరుగుతున్నాయి. విదేశీ లాటరీ కోట్లు తగిలింది..బ్యాంకు ఎకౌంట్ ఓపెన్ చేయాలంటూ మోసాలు చేసేవారు ఒకరైతే.. రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ అంతర్జాతీయ దొంగల ముఠాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఒంటిమీద బట్టలతో సహా నిలువు దోపిడీ చేయగల కెపాసిటీ ఉన్న దొంగల పార్టీగా టీడీపీ తయారైంది. దాని వల్ల జరిగే ఘోరం, దారుణం ఊహలకు అందదు. అలాంటి లక్షణాలున్న రాజకీయ పార్టీగా తెలుగుదేశానికి ప్రజలను మోసం చేయడం ఎలాగూ అలవాటే. కానీ మోసం చేయడంలోనూ కొత్త కొత్త టెక్నిక్లను వినియోగించి మళ్లీ ప్రజలను భ్రమల్లో పెట్టేందుకు ఆ పార్టీ తెగబడిన తీరు ఈ మధ్య బయటపడింది. పచ్చ దొంగల ముఠా ఊళ్లమీదొచ్చి పడుతోంది..జాగ్రత్త! పచ్చ దొంగల ముఠా పట్టపగలు ఇళ్లలోకి చొరబడుతోంది జాగ్రత్త! ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించాలి.. టీడీపీ ఫేక్ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని మా సూచన. లక్షలు వచ్చినట్టు కంగ్రాట్స్ చెప్తూ వ్యక్తిగత డేటా చోరీ ఇటీవల రాజంపేటలో రెండు సంఘటనలు జరిగాయి. అసలు టీడీపీ వారి మేనిఫెస్టో ఏంటో కూడా ఇంకా పూర్తిగా తెలియదు.. ఏదో సూపర్ సిక్స్ అన్నారు...దత్తపుత్రుడు చెప్పినవి కలిపి 11 హామీలు అంటున్నారు. 2014లో మోడీ, పవన్ కల్యాణ్ హామీలతో తెచ్చిన మేనిఫెస్టోనే చంద్రబాబు వెబ్ సైట్ నుంచి మాయం చేశాడు. అలాంటిది మేనిఫెస్టోపైనే స్పష్టత లేని నేపథ్యంలో హామీల పేరుతో ఇప్పుడు ఇళ్లల్లోకి చొరబడుతున్నారు. టీడీపీ కార్యకర్తలు.. ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి డేటా తీసుకుని ఒక యాప్లో ఎంటర్ చేస్తున్నారు. ఓటీపీ వస్తే..క్లిక్ చేయమంటున్నారు. దాన్ని క్లిక్ చేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ కార్డు వస్తోంది. దాంట్లో కంగ్రాట్స్ చెప్పి.. 2024 జూన్ నుంచి రూ. 2.40 లక్షలు పొందేందుకు మీరు అర్హత సాధించారు. 2024 జూన్నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమచేయడం ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. అంతటితో ఆగటంలేదు...చంద్రబాబు సంతకం చేసిన ఒక గ్యారెంటీ పత్రాన్ని ఇస్తున్నారు. చంద్రబాబే అధికారంలోకి వచ్చేసినట్లు ప్రతిజ్ఞ చేస్తూ సంతకం చేసి మరీ ఇస్తున్నాడు. దీంట్లో ఓటరు కార్డు నంబరు, మొబైల్నంబర్ తో సహా అన్ని వివరాలు సేకరిస్తున్నారు. మరో ఇంటికి వెళ్లి రూ. 6.90లక్షల వస్తుందని, అర్హత సాధించిందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని చాపకింద నీరులా టీడీపీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఒక వేళ చెప్పింది ఏదన్నా చేసే వారయినా ఇంటికి వెళ్లి చెప్పవచ్చు. చెప్పింది రాతపూర్వకంగా ఇచ్చేదే మేనిఫెస్టో..అధికారంలోకి వస్తే దాన్ని అమలు చేసేదే మేనిఫెస్టో. అలా చేయలేకపోతే ముఖం చూపించలేని పరిస్థితి వస్తుంది. టీడీపీ గతంలో ఇదే మోసం చేసింది. లేని మేనిఫెస్టోతో డేటా చోరీ అసలు అమలు చేసే ఉద్దేశ్యమే లేని చంద్రబాబు ఇలాంటి హామీలు గతంలో ఎన్నో ఇచ్చాడు.ఏ ఒక్కటీ అమలు చేయలేదు. గతంలో ఆయన తన మేనిఫెస్టోనే వెబ్సైట్ నుంచి తీసేయడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు లేని మేనిఫెస్టోను తీసుకుని మళ్లీ ప్రజల వద్దకు వెళ్తున్నాడు. అసలు మేనిఫెస్టో ఇచ్చే అర్హతే చంద్రబాబుకు లేదు. అలాంటిది ఎలాంటి ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తున్నాడు. ఏదో నాలుగైదు పాయింట్లు తీసుకుని ఇంటింటికి వెళ్లి మీకు పథకాలు వచ్చేశాయి...కంగ్రాట్స్ అంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది. వారెంటీ లేని గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తున్న ఇతన్ని ఏ చట్టం ప్రకారం శిక్షించవచ్చో ప్రజలే ఆలోచించాలి. ఇది సైబర్ క్రైంకి కిందకు వస్తుంది...ఓటరు కార్డు కూడా తీసుకుని పౌరుల ప్రైవసీలోకి కూడా ఎంటర్ అవుతున్నాడు. ముఖ్యంగా ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన కిందకు కూడా వస్తుంది. ఓటరు కార్డు తీసుకుని దాని నుంచి ఎన్నికల కమిషన్ రూల్స్ని ఉల్లంఘిస్తున్నాడు. ప్రజలకున్న ప్రాథమిక హక్కుల్లోకి కూడా వెళ్లిపోతున్నాడు. చంద్రబాబు ముఠా 5 కోట్ల మందిని టార్గెట్ చేసింది దీనినిబట్టి చూస్తే.. ఒక అంతర్జాతీయ దొంగల ముఠాకు, చంద్రబాబుకు తేడా ఏమైనా ఉందా? కనీసం వాళ్లన్నా ఒకర్ని టార్గెట్పెట్టుకుని లక్షో,పదిలక్షలో కొట్టేయాలని చూస్తుంటారు. కానీ చంద్రబాబు 5 కోట్ల మందిని మోసం చేస్తున్నాడు. అసలు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే నీకు, లేని అంశాలను తీసుకొచ్చి ఊహల్లో లెక్కలేసి బూటకపు హామీలిస్తున్నాడు. ఇది ఏ చట్టం కిందకు వస్తుందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. పచ్చి అబద్ధాలను తీసుకుని ఇళ్లలోకి వచ్చి ప్రజల రహస్యాలను తస్కరిస్తున్నారు. ఈ డేటాను వారు ఎందుకైనా వాడుకోవచ్చు. బ్లాక్ మెయిల్ చేయవచ్చు..ఇంకేదైనా చేయవచ్చు. ఇంత చేస్తున్న చంద్రబాబు గత చరిత్ర చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. చంద్రబాబు హయాంలో ప్రజలకు చేసిన మంచేమీ లేక ఏకంగా తనకు సరిపడని వైఎస్సార్సీపీ ఓట్లు తీయించడానికి తెగించాడు. అప్పట్లో సేవామిత్ర అనే ఒక యాప్ ను తయారు చేసి ప్రత్యర్థి పార్టీ ఓట్లపై దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు. బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీకి పబ్లిక్ డేటాకు యాక్సెస్ ఇచ్చి, దాని ద్వారా ఐటీ గ్రిడ్స్కి పంపారు. ఆనాడు ఎన్నెన్నో ఉల్లంఘనలు చేశాడు. ఓటరు డేటా అంతా కలెక్ట్ చేశాడు. కుటుంబ ఆర్థిక వివరాల నుంచి మొబైల్ నంబర్, కుల వివరాలు, వృత్తి, విద్యార్హత వివరాలు కూడా ఆనాడు సేకరించారు. ఆనాడు అధికారంలో ఉండి సేవామిత్ర ద్వారా ఇలా అడ్డగోలుగా ఏమేం చేశారనే దానికి ఆధారాలున్నాయి. అన్ని వివరాలు తీసుకుని ఎన్నికల కమిషన్ వారి వద్ద ఉన్న ఫోటోలతో సహా అన్ని వివరాలు సేకరించారు. ఒక వైరస్లా దూరి ప్రజల డేటా అంతా సేకరించి ఆ వివరాలను బూత్ కమిటీలకు పంపించారు. మీరు ఏ పార్టీ అని అడుగుతారు..ఏ పార్టీకి మీరు ప్రిఫరెన్స్ ఇస్తారో, ఓటరు కులం అన్నీ సేకరించారు. ఆనాడు ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్లాడు. పవన్ కల్యాణ్ను ప్రభుత్వ ఓటు చీల్చమని చెప్పాడు. సేవామిత్రలను వ్యతిరేక ఓటును తీసేయండని పంపాడు. అలా 2017కల్లా ఆయన 50 లక్షల ఓట్లు తీసేయించాడు. అప్పట్లో మా నాయకుడు జగన్ గారి నాయకత్వంలో మేం గవర్నర్, సీఈసీని కూడా కలిసి సాక్ష్యాలు చూపించాం. మళ్లీ మేం ప్రాసెస్ చేసి, 30 లక్షల ఓట్లు మళ్లీ తెచ్చుకోగలిగాం కాబట్టి సరిపోయింది. ఒక వేళ చంద్రబాబు కోరుకున్నట్లు ఎలిమినేషన్ జరిగితే ఏం జరిగి ఉండేది..? సాక్షి చదివితే...వెంటనే ఫాం 7 దరఖాస్తు చేసేలా పథకం ప్రకారం కుట్ర చేశారు. అతని ఆలోచనలు ఎంతటి వికృతమైనవో, ఒళ్లంతా నరనరాన అక్రమం, మోసం, వెన్నుపోటు లక్షణం అతనికి ఉన్నాయి. ఏ లక్షణాలైతే మనిషికి ఉండకూడదో అన్నీ ఉన్న వ్యక్తి ఒక రాజకీయ పార్టీని నడిపితే ఆ దౌర్భాగ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం. ఆనాడు ఎలిమినేషన్ చేసిన ఈయన ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావడంతో ఓటర్ల వద్దకు వెళ్లి అబద్ధపు హామీలతో ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమే కాదు..అడ్డంగా ప్రజల్ని మోసం చేసి వాళ్లకు భవిష్యత్తు లేకుండా, మళ్లీ చీకట్లలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మామూలు దొంగతనం, దోపిడీ కంటే మరింత భయంకరమైనది. మాయల పకీరు చేతిలో డేటా.. తస్మాత్ జాగ్రత్త దీంట్లో మరో కోణం కూడా ఉంది. చంద్రబాబు వద్ద ఆనాడు తీసుకున్న డేటా ఉంది. కులపరంగా,పార్టీ ప్రిఫరెన్స్ వారీగా అతని వద్ద డేటా ఉంది. ఇంకా ఏమేం డేటా అతని వద్ద ఉందో తెలియదు. ఇప్పుడు మళ్లీ వెళ్లి ప్రజలను ప్రలోభపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం వ్యక్తిగత గోప్యతను తన చేతిలో పెట్టుకుంటున్నాడు. మాయలపకీరు చేతులోకి డేటా అంతా వెళ్లే డేంజర్ పరిస్థితి ఇది. ఇది చిన్న ప్రమాదం కాదు. మా పార్టీ నుంచి మేం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. అతని ఆలోచనే వంకర..ఎదుటి వారిని మోసగించడంలోనే ఆనందం ఉందనుకునే చంద్రబాబు లాంటి వారితో అప్రమత్తంగా ఉండాలి. నిజంగా తెలియక వీళ్లు చెప్పే వాటికి ప్రజలు భ్రమలోకి వెళితే 2014–19 మధ్యలో ఏం జరిగిందో ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. నిలువుదోపిడీ చేయగల బందిపోటు దొంగే..ఎదుటి వాళ్లను దొంగ.. దొంగ అని అరుస్తున్నాడు. రామోజీరావుకు ఒళ్లంతా పసుపే...ఈనాడు చంద్రబాబు కరపత్రం: చంద్రబాబు సేవలో తరిస్తూ, ఎల్లో మీడియా చేస్తున్న అఘాయిత్యం పట్ల కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వీళ్లు తయారు చేసిన తోలు బొమ్మలు ఏదో ఒక సంస్థ పేరు చెప్పుకుని చేస్తున్న డ్రామాలను కూడా గమనించాలి. ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, విద్యావంతులు, మేధావులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మోసం చేస్తున్నది వాళ్లు..ఉల్టా మా మీద ఆరోపణలు చేస్తున్నారు. లక్షల ఓట్ల తొలగింపు అంటూ ఈనాడు బ్యానర్ వార్తలు రాస్తారు. 5.78 లక్షలు వలసలు వెళ్లిపోయారు అంటూ రాసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...ఆ ఓట్లు షిప్టింగ్ అయ్యాయని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఈ 5.78 లక్షల ఓట్లు ఒక చోట డిలేట్ చేస్తే..వాటిని షిప్టింగ్ ప్రకారం వేరే చోట నమోదు చేశారని ఎన్నికల కమిషన్ చెప్తోంది. ఎవడైనా నిష్పక్షపాతంగా రాసేవాడైతే ఆ విషయాన్ని కూడా రాయాలి కదా..? రామోజీరావు ఒళ్లంతా పసుపే...ఈనాడు చంద్రబాబు కరపత్రం.. దానికి మించి చంద్రబాబుకు ఈనాడు రామోజీరావు రాజగురువు. పచ్చిగా నేను చంద్రబాబును సపోర్ట్ చేస్తున్నాను..అని ఇలాంటివి రాసుకోవాలి. కుప్పం ఓటర్ల జాబితాలో కనికట్లు అంటూ మరో వార్త రాశారు. సత్యనారాయణరెడ్డి, షఫీయుల్లా అనే పేర్లు చెక్ చేయిస్తే అసలు విషయం తెలిసింది. సత్యనారాయణరెడ్డి లేడట..కానీ ఓటర్ల లిస్టులో ఉందని రాశారు. షఫీయుల్లా ఓటు విషయంలోనూ అదే విధంగా రాశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ ఆ ఓటు ఉంది...ఇప్పుడు కూడా అదే ఓటు కంటిన్యూ అవుతోంది. మేం అడుగుతుంది కూడా అలాంటి ఓట్లు తొలగించాలనే. ఇందులో జగన్మోహన్రెడ్డి గారిది కానీ, ప్రభుత్వానికి కానీ ఏం రోల్ ఉంటుంది..? అసలు ఓటర్లకు సంబంధించి ప్రభుత్వం రోల్ ఎందుకుంటుంది..? కానీ చంద్రబాబుకు మాత్రం సంబంధం ఉంటుంది..ఎందుకంటే అడ్డదారుల్లో ఎలా అధికారంలోకి రావాలనే లక్షణం ఉంది కాబట్టి వాస్తవాలు చూపించాం. గత రెండున్నర నెలలుగా రోజూ బ్యానర్ హెడ్డింగ్ లు పెడుతూ.. ఇలా ఓటర్ల మీదే రాస్తున్నారు. దొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లు, అడ్డంగా హత్యలు చేసే హంతకుడే విక్టిమ్ కార్డు ప్లే చేసినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూడా హత్య చేస్తున్నారు. రాజకీయం అంటేనే విలువలు లేవు అన్నట్లు, పైకి మాత్రం ప్రతివతల్లా ఇలా అడ్డగోలు రాతలు రాస్తున్నారు. ఎవరూ లోతుగా విశ్లేషించరులే అని బాబుకు అనుకూలంగా రాసేస్తున్నారు. బతికున్న వారిని కూడా చనిపోయారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు మరో వైపు 50 లక్షలు ఓట్లు తీసేయాలంటూ యాగీ చేస్తున్నారు. బతికి ఉన్న వాళ్లని కూడా చనిపోయారని ఫిర్యాదు చేసి ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. రోజూ మెమెరాండం తీసుకుని ఎన్నికల కమిషన్కు ఇస్తూ పోతున్నారు. ఒక మెషిన్లా తప్పుడు దారుల్లో మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2014–19 మధ్యలో ఓటర్ల విషయంలో జరిగిన దానికంటే ఇప్పుడు మరిన్ని దారుణాలకు పాల్పడుతున్నారు. బరితెగించి చంద్రబాబు ఇస్తున్న హామీలు అమలు చేసేవేమీ కాదు..గతంలో ఏం చేశాడో అందరూ చూశారు. వాళ్లు వస్తే గతంలో ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైందని, 12 సిలిండర్లు ఎక్కడ అని, నిరుద్యోగ భృతి ఎక్కడ అని ప్రశ్నించాలి. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని కొత్త హామీలతో వస్తున్నావు అని ప్రజలు ప్రశ్నించాలి. సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ పేరుతో తప్పుడు కేసులు తప్పుడు ఆలోచనల నుంచి దానికి అవసరమైన పరిస్థితులను కల్పించి...వాటిని సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ వంటి సంస్థలను సృష్టించి ముందుకు వెళ్తారు. నిమ్మగడ్డ రమేష్ లాంటి వారు ఇలాంటి సంస్థలు పెట్టి సుప్రీం కోర్టులో కేసులు వేస్తారు. నేను వాళ్లనే అడుగుతున్నా...మీరు చంద్రబాబు చేస్తున్న దానికి ఏం సమాధానం ఇస్తారు? అప్పట్లో ఇదే సుబ్రహ్మణ్యమే చీఫ్ సెక్రటరీగా కూడా ఉన్నారు. ఆనాడు జరిగింది ఆయనకు తెలియదా? ఈ సంస్థ వాలంటీర్లపై సుప్రీం కోర్టుకు వెళ్లింది. అసలు వాలంటీర్లను ఎవరు దించుతున్నారు..ఎందుకు వస్తారు..? వాలంటీర్ అనే వ్యక్తి వైఎస్సార్సీపీ పాలనలో చివరి మజిలీగా పనిచేస్తున్నారు. వారు ఉద్యోగులు కాదన్న విషయం వారికీ తెలుసు..వారు ఉద్యోగులు కాకపోతే వాళ్లేం చేస్తారు..? రాజకీయంగా వాలంటీర్ ఎవరికైనా మద్దతు పలకవచ్చు..అది అతని స్వేచ్ఛ. జన్మభూమి కమిటీలకున్న అధికారాలు వీళ్లకి లేవు కదా..? వాటిల్లా దోపిడీ ముఠాలను క్రియేట్ చేయలేదు కదా? ఆ సంస్థకు లాయర్ కపిల్ సిబాల్..ఆయన కోట్లలో తీసుకుంటాడు.. ఆ సొమ్ము ఈ సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చింది..? – చంద్రబాబు ఇస్తున్నాడు..ఆడిస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సేవా మిత్రల ద్వారా, నేడు జనం తిరస్కరించాక ఇలాంటి బ్యూరోక్రాట్స్తో కేసులు వేయిస్తున్నాడు. పొద్దున లేచినప్పటి నుంచీ ఆ ఎల్లో పేపర్లలో, ఎల్లో టీవీల్లో చర్చలు పెట్టుకుంటూ వెళ్తారు. ప్రపంచంలోనే డీప్ ఫేక్ చంద్రబాబు నీకు ఈ దౌర్భాగ్యం అవసరమా చంద్రబాబూ..? దీనికంటే లక్షణంగా చేయగలిగింది రాయల్గా చెప్పొచ్చుగా..? జగన్ గారు ఫాలో అవుతున్నది రాజమార్గం..చేయగలిగిందే చెప్పాలి దాన్ని అమలు చేసి మళ్లీ ప్రజల వద్దకు వెళ్లడం మంచి మార్గం కానీ చంద్రబాబు మాత్రం అడ్డదారుల్లో అదిరిపోయే దారేది అని వెతుక్కుంటున్నాడు. – గోడ దూకడం ఎలా అని ఆలోచిస్తాడు నువ్వు వెన్నుపోటు పొడిచి వచ్చినా, 2014–19 మధ్య ప్రజలు నీకు మళ్లీ అవకాశం ఇచ్చారు అప్పుడైనా ప్రజలకు సేవ చేయాల్సింది..కానీ ఆయనకు ఆ లక్షణం లేదు ప్రపంచంలోనే డీప్ ఫేక్ చంద్రబాబునాయుడు. ఇంతకంటే డీప్ ఫేక్ ఏదీ ఉండదు. చేయలేనిది ఏదీ, బలవంతంగా దేనినీ జగన్ గారితో చెప్పించలేరనేది గతంలోనే చూశాం రుణమాఫీ చేయలేని అని ఆనాడు జగన్ గారు స్పష్టంగా చెప్పారు ఎన్నికల ముందు కొంచెమన్నా చేస్తామని చెప్పాలని మా లాంటి వారు చెప్పినా ఆయన ససేమిరా అన్నారు దానివల్ల నేను ప్రతిపక్షంలో కూర్చున్నా పర్లేదు అన్నారు. అదీ జగన్ గారి నిబద్ధత బ్యాంకుల్లో కుదవ పెట్టిన మీ బంగారంతో సహా విడిపిస్తామని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఏం చేశాడో అందరూ చూశారు చంద్రబాబుకు ఉన్న విశ్వసనీయత అక్రమాల్లోనే. అదే ఒరిజినల్ చంద్రబాబు స్కాం సత్యం.. స్కామ్స్టర్ బాబు అనేదే సత్యం..! అరెస్టు కాకముందు ఏ రోగమూ లేని వాడు.. అరెస్ట్ అయిన తర్వాత ప్రపంచంలోని అన్ని రోగాలున్నాయని కోర్టులకు చెప్పారు. మెడికల్ బెయిల్ వచ్చినా సత్యమేవ జయతే అంటారు..నిన్న రెగ్యులర్ బెయిల్ వచ్చినా సత్యం గెలిచింది అంటారు. అందులో స్కాం మాత్రమే సత్యం.. స్కాంస్టర్ బాబు అనేది సత్యం. చివరికి అదే బయటపడుతుంది... సిస్టమ్లోకి వైరస్ వచ్చినట్లు చంద్రబాబు, ఆయన ముఠా కూడా వైరస్లానే వెళ్తున్నారు. ఈ కుట్ర పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి. మీడియా ప్రశ్నలు–సమాధానాలు ఎన్నికల కమిషన్ను మా పార్టీ వారు కూడా కలుస్తారు. ఎక్కడ ఏ పోరాటం చేయాలో ఆ పోరాటాలు చేస్తాం. మా పార్టీ వైపు నుంచే కాకుండా ఇలాంటి దొంగదెబ్బ కొట్టే వారి గురించి అప్రమత్తంగా ఉండమని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మాకుంది. బేసిక్ గేమ్ రూల్స్ ధర్మబద్ధంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మేధావులు, విద్యావంతులపై ఉంది. – వారు అప్రమత్తంగా ఉండి..వారి వాయిస్ను రెయిజ్ చేయాలి. వాలంటీర్లు ఏం డేటా తీసుకుంటున్నారో కనుక్కోమనండి. ఓపెన్గానే వాలంటీర్లు పథకాల అర్హతను తీసుకుంటున్నారు. టీడీపీ వారికి కానీ, ఇంకెవరికైనా రావాల్సిన బెన్ఫిట్స్ ఆగాయా? జగన్ గారు శాచురేషన్ పద్దతిలో ముందుకు వెళ్తుంటే.. ఇక రాకపోవడానికి అవకాశమే లేదు. అన్ని పార్టీల వారికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఎవరికైనా రాలేదంటే తీసుకుని రండి.. ఆ మేసేజ్ చూడగానే అభినందనలు అంటే లాటరీ కాకుండా ఏం గుర్తుకు వస్తుంది? అప్పుడే ఈయన సంతకంతో హామీ పత్రం ఇస్తే దీనిని ఏ తరహా చీటింగ్ అనాలి ఇదీ చదవండి: బాబు బెయిల్ తీర్పులో ఏముంది?.. కొన్ని సందేహాలు.. అనుమానాలు! -
తెలంగాణలో జెండా పీకేసిన టీడీపీ.. కాసాని జ్ఞానేశ్వర్ తాడోపేడో..!
సాక్షి, హైదరాబాద్: జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ.. తెలంగాణలో జెండా పీకేసింది. ఎన్నికల్లో పోటీ చేయలేమంటూ టీడీపీ క్యాడర్కు చంద్రబాబు సంకేతాలు ఇచ్చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ సందర్భంగా తెలంగాణలో పోటీ చేయొద్దంటూ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్కు చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్కు మేలు చేయడం కోసమే తెలంగాణలో పోటీకి దూరమంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్తో కుదిరిన ఒప్పందం మేరకే పోటీకి దూరం అంటూ చర్చ సాగుతోంది. ఇప్పటివరకు హైదరాబాద్ తానే అభివృద్ధి చేశానంటూ చెప్పుకున్న చంద్రబాబు.. తెలంగాణ, హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే ఎందుకు పోటీ చేయడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా, టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ తెలంగాణ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్.. నేడు నారా లోకేశ్తో కాసాని జ్ఞానేశ్వర్ భేటీ కానున్నారు. ఇన్నాళ్లు పార్టీ పోటీ చేస్తుందంటూ మభ్య పెట్టారన్న ఆవేదనలో ఉన్న జ్ఞానేశ్వర్ నారా లోకేష్తో తాడోపేడో తేల్చుకోనున్నట్లు సమాచారం. తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత మారిన పార్టీ స్టాండ్తో తల పట్టుకుంటున్న కాసాని జ్ఞానేశ్వర్.. పార్టీ కోసం బోలెడు ఖర్చు పెట్టాం అంటూ టీడీపీ పెద్దల దగ్గర వాపోయినట్లు తెలిసింది. తెలంగాణలో ఒంటరి పోరు వల్ల కాదని.. పోటీకి దూరంగా ఉండాలని నారా లోకేష్ సూచించడంతో, పోటీ చేయొద్దని ఇప్పుడు నిర్ణయిస్తే తన పరిస్థితి ఏంటని, ఇన్నాళ్లు తాను పడ్డ శ్రమ పెట్టిన ఖర్చు ఫలితం ఏంటని కాసాని ప్రశ్నిస్తున్నారు.. ఏపీ రాజకీయాలకు తెలంగాణను ముడి పెట్టడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తే కనీసం పార్టీకి మనుగడ అయినా ఉంటుందని అంటున్న కాసాని.. ఇంకా కూడా పార్టీ పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకోకపోతే తన దారి తాను చూసుకుంటానని కాసాని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను కాసాని అన్వేషిస్తున్నట్లు సమాచారం. చదవండి: పవన్ కల్యాణ్ రాయబారం సఫలం కాలేదా?! -
ములాఖత్కొచ్చిన సీనియర్లపై బాబుకు కాలిందట.. కారణం ఇదేనట..
రూ. 371 కోట్ల లూటీ జరిగిన స్కిల్ స్కాంలో ఆధారాలతో సహా దొరికిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో 40 రోజులు పూర్తి చేసుకున్నారు. మండలం రోజుల జైలు జీవితంలో ఆయన ఒక కిలో బరువు పెరిగారు. జైలు నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు ములాఖత్లో చంద్రబాబును కలుస్తున్నారు. తాను జైల్లో ఉంటే పార్టీలోని సీనియర్ నేతలు ఏమీ పట్టనట్లు ఉండిపోవడం చంద్రబాబుకు మంట తెప్పిస్తోందని సమాచారం. తన ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా తాను జైలుకెళ్తే తమకేమీ పట్టనట్లు ఉండిపోవడం ఏంటని చంద్రబాబు కుత కుత లాడిపోతున్నట్లు తెలుస్తోంది. స్కిల్ స్కాంలో సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసిన వెంటనే ఆయన్ను విజయవాడ తరలించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే తాను తన కాన్వాయ్లోనే రోడ్డు మార్గంలో వస్తానని చంద్రబాబు అనడంతో సరేలెమ్మని రోడ్డు మార్గంలో తీసుకువచ్చారు. రోడ్డు మార్గంలో తాను వస్తోంటే దారి పొడవునా పార్టీ కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో ప్రజలు రహదారి కిరువైపులా నిలబడి నిరసనలు తెలుపుతారని అది తన అనుకూల మీడియాలో అదే పనిగా చూపిస్తారని చంద్రబాబు అనుకున్నారు. అయితే ఆయన అనుకున్నదేదీ జరగలేదు. జనమే కాదు పార్టీ శ్రేణులూ చంద్రబాబు అరెస్ట్ను పట్టించుకోలేదు. విజయవాడ చేరుకున్న తర్వాత చంద్రబాబును కొన్ని గంటల పాటు విచారించాక ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచారు. బాబుపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించిన ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబును జైల్లో పెడితే రెండు తెలుగు రాష్ట్రాలూ అతలాకుతలం అయిపోతాయని చంద్రబాబు అనుకున్నారు. తమ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిస్తారని జన జీవనాన్ని స్తంభింపజేస్తారని అపుడు తనకు కావల్సినంత మైలేజీ వస్తుందని చంద్రబాబు అనుకున్నారు. అయితే చంద్రబాబు జైలుకెళ్తే బాబుతో నేను అని ఓ చిన్న కార్యక్రమానికి పిలుపు నిచ్చారు అచ్చెన్నాయుడు. దానికి పార్టీ నేతలే సరిగ్గా స్పందించలేదు. దీనిపై అచ్చెన్నాయుడు నొచ్చుకుంటూ పార్టీ శ్రేణులకు లేఖ రాశారు కూడా. జైల్లో రోజూ వివిధ పత్రికలు చదువుతోన్న చంద్రబాబు ఆశ్చర్యపోయారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన తనని అరెస్ట్ చేసినా పార్టీలో సీనియర్లు ఎవరూ వీధుల్లోకి రాకపోవడం.. నిరసన ప్రదర్శనలకు ప్లాన్ చేయకపోవడం.. ఎవరి ఇళ్లల్లో వారు కూల్గా కాలక్షేపం చేయడం గమనించిన చంద్రబాబుకు ఒళ్లు మండుకొచ్చిందని చెబుతున్నారు. ములాఖత్ లో తనను కలవడానికి వచ్చిన యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్లపై చంద్రబాబు జైల్లోనే నిప్పులు చెరిగినట్లు భోగట్టా. మీరంతా ఉండి ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు మండి పడ్డంతో సీనియర్ నేతల్లోనూ అసహనం పెల్లుబికిందని అంటున్నారు. మేం పిలుపు నిచ్చినా జనం నుండి స్పందన లేకపోతే ఏం చేయమంటారు? అని యనమల రామకృష్ణుడు వివరించబోతే నాకేం చెప్పద్దు అక్కడ ఏం జరుగుతోందో నేను ఊహించగలను అని బాబు మండి పడ్డారట. ఈ ములాఖత్ తర్వాత యనమల పూర్తిగా పార్టీ పిలుపు నిచ్చిన ఆందోళనలకు దూరంగా ఉండిపోయారని పార్టీ వర్గాలే అంటున్నాయి. తన కుమారుడు న్యాయవాదులను మానిటర్ చేయడం కోసం ఢిల్లీలో ఉంటే పార్టీలో సీనియర్లు పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారని.. తనను విడుదల చేయించడానికి కానీ.. అరెస్ట్కు నిరసనగా ఆందోళనలను ఉధృతం చేయడానికి కానీ సీనియర్ నేతలెవరూ పూనుకోకపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారని అంటున్నారు. నేతలంతా చేతులెత్తేయడం వల్లనే భువనేశ్వరిని పరామర్శ యాత్ర చేయాల్సిందిగా చంద్రబాబే సూచించారని పార్టీ వర్గాల కథనం. చదవండి: పవన్ కల్యాణ్ కొత్త ప్లాన్.. బీజేపీ లొంగుతుందా? ఏ రోజుకారోజు బెయిల్ వచ్చేస్తుంది అన్న ఆశతోనే చంద్రబాబు గడుపుతున్నారని అంటున్నారు. అయితే అది ఎండమావిలా దూరం జరుగుతూ ఉండడంతో ఆయనలో నైరాశ్యం అలుముకుందని చెబుతున్నారు. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ లేకపోయినా మూడు దశాబ్ధాలుగా ఉన్న స్కిన్ ఎలర్జీ మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు. నిజానికి స్కిన్ ఎలర్జీ కన్నా కూడా పార్టీ నేతలు తనను పూర్తిగా వదిలేయడమే చంద్రబాబుకు ఎక్కువ నొప్పి రాజేస్తున్నట్లు సమాచారం. ఇదే ఆయన్ని ఎక్కువగా బాధిస్తోందట. దీన్ని భరించలేకపోతున్నానని ఆయన ములాఖత్కు వచ్చిన ఓ పార్టీ నేత వద్ద వాపోయినట్లు సమాచారం. -కుర్చీ కింద కృష్ణయ్య -
వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? మహాత్ముని అంతరంగ రహస్యం ఏమిటి?
ఇటీవలి కాలంలో వీధి కుక్కల ఆగడాలకు సంబంధించి తరచూ వార్తలు వస్తున్నాయి. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. వీధికుక్కలకు సంబంధించి నాటి రోజుల్లో మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది 1942వ సంవత్సరం. ప్రతి సోమవారం మౌనవ్రతం పాటించాలని గాంధీజీ నిర్ణయించుకున్నారు. గాంధీ మౌన దీక్ష చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ రోజు కూడా గాంధీ సందర్శకులను కలుసుకునేవారు. ఎదుటివారి మాటలు విని, రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేవారు. ఇదే సమయంలో గాంధీ ఒక అనూహ్యమైన వివాదంలో చిక్కుకున్నారు. సుప్రసిద్ధ అమెరికన్ జర్నలిస్ట్ లూయిస్ ఫిషర్ రాసిన ‘ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ’ పుస్తకం గాంధీజీ జీవితానికి సంబంధించిన అత్యంత విశ్వసనీయ పుస్తకంగా పరిగణిస్తుంటారు. ఈ పుస్తకంలోని 10వ అధ్యాయంలో ఒక ఉదంతం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్లు యజమాని అంబాలాల్ సారాభాయ్ తన మిల్లు ఆవరణలో తిరుగుతున్న 60 వీధికుక్కలను పట్టుకుని చంపాడు. అనంతరం గాంధీజీ దగ్గరకు పరుగున వచ్చి, తన భయాన్ని, బాధను వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ అహ్మదాబాద్లోని జీవ్ దయా సమితికి ఆగ్రహం తెప్పించింది. ఈ సందర్భంగా వారు గాంధీజీకి రాసిన లేఖలో ‘హిందూ మతంలో ఏదైనా ప్రాణిని చంపడాన్ని పాపంగా భావించినప్పుడు, పిచ్చి కుక్కలను చంపడం సరైనదని మీరు ఎలా అనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. దీనికి గాంధీ ఇచ్చిన సమాధానాన్ని ‘యంగ్ ఇండియా’లో ప్రచురించారు. ‘మనలాంటి అసంపూర్ణులు, మందబుద్ధిగలవారికి కుక్కలను చంపడం తప్ప మరో మార్గం లేదు. కొన్నిసార్లు మనని హత్య చేసేందుకు ప్రయత్నించే వ్యక్తిని చంపడమనే అనివార్యమైన విధిని మనం ఎదుర్కొంటాం’ అని గాంధీ పేర్కొన్నారు. ఈ కథనంపై ఆగ్రహంతో పలువురి నుంచి గాంధీకి లేఖలు వెల్లువెత్తాయి. చాలామంది గాంధీని తిట్టడం మొదలుపెట్టారు. అయితే గాంధీ తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నారు. ‘యంగ్ ఇండియా’ రెండవ, మూడవ సంచికల్లోనూ గాంధీ తన అభిప్రాయాన్ని ఇదే రీతిలో తెలిపారు. కొందరు విమర్శకులు గాంధీ హద్దులు దాటిపోయారని ఆరోపించారు. ‘ఒకరి ప్రాణం తీయడం కూడా ఒక్కోసారి మన విధిగా మారుతుందని’ గాంధీ ‘యంగ్ ఇండియా’లో రాశారు. ఒక వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని పరుగెడుతూ, ఎదురుగా వచ్చిన వారిని చంపుతున్నాడనుకోండి. అప్పుడు అతన్ని సజీవంగా పట్టుకునే ధైర్యం ఎవరికీ లేనప్పుడు, ఆ పిచ్చివాడిని యమపురికి పంపించిన వ్యక్తి.. సమాజం అందించే కృతజ్ఞతకు పాత్రుడని గాంధీ పేర్కొన్నారు. కాగా ఈ కుక్కల వివాదం గాంధీని ఏడాదిపాటు చుట్టుముట్టింది. ఇది కూడా చదవండి: ఏ జంతువులు అంతరిక్షాన్ని చూశాయి? తాబేళ్లు, ఈగలు ఏం చేశాయి? -
నా కొడుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు..విజయ్ దేవరకొండ తండ్రి ఆవేదన..
-
వైవాహిక జీవితంపై ప్రశ్న.. స్మృతి ఇరానీ ఫైర్
ఢిల్లీ: స్నేహితురాలి భర్తను వివాహమాడారని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైరయ్యారు. 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే కార్యక్రమంలో భాగంగా అభిమానులు ఆమెను పలు ప్రశ్నలు అడిగారు. తన భర్త జుబిన్ ఇరానీని వివాహమాడిన అంశాన్ని, జుబిన్ ఇరానీ మాజీ భార్య మోనా గురించి కూడా ఆమె స్పందించారు. అయితే.. సామాజిక మాధ్యమాల వేదికగా తరచు ఈ ప్రశ్నలు తనకు ఎదురవుతుంటాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ఈసారి మాత్రం జుబిన్ ఇరానీ, మోనా గురించి మాత్రం స్పష్టంగా మాట్లాడారు. మోనాతో తనకు ఉన్న సంబంధాన్ని కూడా వివరించారు. ఈ సందర్భంగా మోనా ఇరానీ తన చిన్ననాటి స్నేహితురాలు కాదని ప్రజలకు విన్నవించారు. తనకంటే మోనా 13 ఏళ్ల పెద్దదని తెలుపుతూ ఇన్స్టాలో పోస్టు చేశారు. 'మోనా కుటుంబం రాజకీయ నేపథ్యం లేనిది. ఆమెను ఇందులోకి లాగొద్దు. నాతోనే పోరాడండి. నాతోనే వాదించండి. నా గౌరవ మర్యాదలపైనే మాట్లాడండి. కానీ ఒక అమాయక పౌరురాలిని ఇందులోకి లాగకండి. రాజకీయంగా ఏమీ సంబంధం లేని మోనాతో పోరాడకండి. ఆమె గౌరవానికి భంగం వాటిల్లవద్దు.' అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. స్మృతి ఇరానీ జుబిన్ ఇరానీని 2001లో వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు 'జోర్' కూడా ఉన్నాడు. కూతురు 'జోయిష్' ఉంది. జుబిన్కి మోనాతో ఇంతకుముందే వివాహం జరిగింది. వారిరువురికి 'షానెల్లే' పేరుగల కూతురు ఉంది. ఈ కార్యక్రమంలో స్మృతి ఇరానీని తన టీవీ లైఫ్ గురించి కూడా ప్రశ్నించారు. రీల్ లైఫ్ను మిస్ అవుతున్నారా? అని అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. రీల్ లైఫ్ వదిలేసే నాటికి అది చాలా అద్భుతంగా అనిపించింది. కానీ ఎప్పటికీ ఆలాగే ఉంటుందని చెప్పలేమని అన్నారు. కాలం ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి నేర్పిస్తోందని చెప్పారు. ఇదీ చదవండి: ఎడతెరిపిలేని వర్షాలు.. విరిగిన కొండచరియలతో కూలిన గుడి.. 21 మంది మృతి.. -
'పవన్ ఫ్యూచర్కే క్లారిటీ లేదు.. అభిమానులకు ఏం భరోసా ఇస్తారు'
నెల్లూరు: నెల్లూరులో పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే అనిల్ ఫైరయ్యారు. పవన్కి జై కొడుతూ పిల్ల సైనిక్స్ భవిష్యత్ పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ ఫ్యూచర్కే క్లారిటీ లేదు.. మీకు ఆయన ఏం భరోసా ఇస్తారని ప్రశ్నించారు. అభిమానం పేరుతో యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారని పవన్ కళ్యాణ్పై నిప్పులు చెరిగారు. మహిళ శక్తిపై టీడీపీ చేస్తున్న ప్రచారాలపై ఎమ్మెల్యే అనిల్ విమర్శలు గుప్పించారు. మహిళా శక్తి అంటూ తిరిగే టీడీపీ నేతలకు చిత్త శుద్ది లేదని విమర్శించారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం, కత్తితో మహిళపై దాడి చెయ్యడమేనా మహిళా శక్తి అంటే..? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: కేంద్రీయ విద్యాలయంలో వేధింపులు.. లైబ్రేరియన్పై పేరెంట్స్ దాడి -
నన్ను రాజీనామా చేయమనడానికి పవన్ ఎవరు ?
-
Parliament session: నాకు కోపమే రాదు ఎందుకంటే... నా పెళ్లై 45 ఏళ్లయింది!
మణిపూర్ అంశంపై పార్లమెంటు అట్టుడుకుతున్న వేళ రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ తనపైనే జోకులు వేసుకుని సభలో నవ్వులు పూయించారు. దాంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మీకు పదేపదే కోపమెందుకు వస్తుందని విపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ‘సర్. నాకసలు కోపమే రాదు. ఎందుకంటే నా పెళ్లై 45 ఏళ్లయింది’ అంటూ ధన్ఖడ్ చెణుకులు విసరడంతో సభ్యుల నవ్వులతో సభ దద్దరిల్లిపోయింది. ‘‘చిదంబరం (కాంగ్రెస్ సభ్యుడు) చాలా సీనియర్ లాయర్ కూడా. అథారిటీపై కోపం చూపే హక్కు మాకుండదని ఆయనకు బాగా తెలుసు. సభలో మీరే (సభ్యులు) అథారిటీ. మరో విషయం. నా భార్య ఎంపీ కాదు. కనుక ఆమె గురించి నేనిలా సభలో మాట్లాడటం సరికాదు కూడా’’ అంటూ ధన్ఖడ్ మరోసారి అందరినీ నవి్వంచారు. తనకు కోపం వస్తుందన్న వ్యాఖ్యలను సవరించుకోవాల్సిందిగా ఖర్గేను కోరారు. దాంతో ఆయన లేచి, ‘‘మీకు కోపం రాదు. చూపిస్తారంతే. కానీ నిజానికి చాలాసార్లు లోలోపల కోపగించుకుంటారు కూడా’’ అనడంతో అధికార, విపక్ష సభ్యులంతా మరోసారి నవ్వుల్లో మునిగిపోయారు! రెండుసార్లు వాకౌట్ అంతకుముందు, మణిపూర్ అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, తృణమూల్, ఆర్జేడీ, ఆప్, వామపక్షాలు తదితర విపక్షాలు ఉదయం రాజ్యసభ భేటీ కాగానే వాకౌట్ చేశాయి. మధ్యాహ్నం రెండింటికి తిరిగి సమావేశమయ్యాక కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్ తివారీకి చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ అవకాశమిచ్చారు. మణిపూర్ హింసపై, మహిళలపై ఘోర అత్యాచారాలపై చర్చకు అవకాశం కోరుతున్నట్టు ఆయన చెప్పారు. దీనిపై అధికార, విపక్ష సభ్యులతో ఎన్నిసార్లు సమావేశమైనా ఎవరికి వాళ్లే తమదే పై చేయి కావాలని పట్టుదలకు పోవడంతో లాభం లేకపోతోందంటూ చైర్మన్ వాపోయారు. ఆగ్రహించిన విపక్ష సభ్యులు ‘ప్రధాని మోదీ సభకు రావాలి’ అంటూ నినాదాలకు దిగారు. వాటిని పట్టించుకోకుండా ఖనిజాల (సవరణ) బిల్లు ప్రవేశపెట్టేందుకు మంత్రి ప్రహ్లాద్ జోషికి చైర్మన్ అవకాశమిచ్చారు. దాన్ని నిరసిస్తూ విపక్షాలు రెండోసారి వాకౌట్ చేశాయి. -
డోంట్వర్రీ సార్! ఈడీని కొనసాగించొచ్చట కానీ.. డైరెక్టర్నే కొనసాగించొద్దంటున్నారు!
డోంట్వర్రీ సార్! ఈడీని కొనసాగించొచ్చట కానీ.. డైరెక్టర్నే కొనసాగించొద్దంటున్నారు! -
ఇదో పబ్లిక్ న్యూసెన్స్ పిటిషన్..హరిరామ జోగయ్యపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ హరిరామ జోగయ్యపై తెలంగాణ హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రంగా మందలించింది. ఇలాంటి పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసేందుకు యత్నించారంటూ మండిపడింది చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం. సోమవారం పిటిషనర్ హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది వాదనలకు సిద్ధం కాగా.. ఆ వెంటనే బెంచ్ కలుగజేసుకుంది. ‘‘ఇదో పబ్లిక్ న్యూసెన్స్. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముందసలు?. వ్యక్తిగత కక్షతోనే పిల్ దాఖలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ మాజీ ఎంపీ అయ్యి ఉండి మీరు ఇలా వ్యవహరించడం ఆమోద యోగ్యం కాద’’ని తెలిపింది. ‘‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విచారణ త్వరగా పూర్తి చేసేలా చూడాలని పిటిషన్ వేశారు. రాష్ట్రపతి లేఖ రాశాం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం.. అని అంటారా!. ఇది ఏం పద్ధతి?. ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి చెప్పినంత మాత్రాన కింది స్థాయి కోర్టు భయపడి పనిచేయవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓ బాధ్యత గల మాజీ పార్లమెంట్ సభ్యుడైన మీరు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు. మీరు దాఖలు చేసిన పిటిషన్లో అసలు ఎక్కడన్నా ప్రజాసక్తి ఉంది అని మీకైనా అనిపిస్తోందా?. వ్యక్తిగత ద్వేషంతో కోర్టులను ఆశ్రయించి.. మా విలువైన సమయాన్ని వృధా చేయొద్దు. ఈ మధ్య తెలంగాణ గవర్నర్ చెప్పినట్లు ఇలాంటి పబ్లిక్ న్యూసెన్స్ కేసులు ఎక్కువయ్యాయి. కొందరికి ఇలాంటి పిటిషన్లు వేయడమే పరిపాటిగా మారింది. మీరు అడిగారు కదా అని వెంటనే విచారణ చేపట్టలేం అని బెంచ్ పిటిషనర్కు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. సీఎం జగన్పై కేసుల్ని త్వరగతిన విచారణ పూర్తి చేయాలని, 2024 సాధారణ ఎన్నికలకు ముందే తీర్పు వెలువరించాలని, ఆ మేరకు సీబీఐకోర్టుకు ఆదేశించాలని జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. ఈ పిల్ పైఅభ్యంతరం లేవనెత్తిన రిజిస్ట్రీ.. కేసు నంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఫైలింగ్ నంబర్పైనే విచారణ మొదలైంది. రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తిన అంశాల కాపీని పిటిషనర్కు ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణను జూలై 6కు వాయిదా వేసింది ధర్మాసనం. ఇదీ చదవండి: కాపు ఉద్యమకారుడి కుటుంబానికి సీఎం జగన్ బాసట -
నా టిక్కెట్ ఎవడికో ఇవ్వడమేంటి ?
Pagination
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్
Advertisement