-
పరుగుల పంజా...
37 ఫోర్లు... 42 సిక్సర్లు... ఇరు జట్లు కలిపి ఏకంగా 523 పరుగులు... ఈడెన్ గార్డెన్స్ పరుగుల వరదతో తడిసి ముద్దయింది. ఈ సీజన్ ఐపీఎల్లో భారీ స్కోర్ల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరో మ్యాచ్లో ‘రన్’రంగం కొనసాగింది ... అయితే ఈసారి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే కాకుండా రెండో టీమ్ కూడా అంతే బదులుగా జవాబిచ్చింది. ఫలితంగా టి20 చరిత్రలోనే రికార్డు ఛేదనతో మ్యాచ్ ముగిసింది... పేలవ ఆటతో వెనుకబడి ఒక్క విజయం కోసం తపిస్తున్న పంజాబ్ కింగ్స్ అసాధారణ బ్యాటింగ్తో భారీ లక్ష్యాన్ని ఛేదించడమే పెద్ద విశేషం.సొంతగడ్డపై 261 పరుగులు చేసి కోల్కతా నిశ్చింతగా నిలబడగా... తామూ తగ్గమంటూ రెచ్చిపోయిన కింగ్స్ మరో 8 బంతులు ఉండగానే 262 పరుగులతో ఘన విజయాన్నందుకుంది. వరుస వైఫల్యాల తర్వాత మెరుపు సెంచరీతో చెలరేగిన బెయిర్స్టో, యువ ఆటగాడు శశాంక్ ఈ మ్యాచ్లో పంజాబ్ హీరోలుగా నిలిచారు. కోల్కతా: పంజాబ్ కింగ్స్ ఎట్టకేలకు జూలు విదిల్చింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత అత్యద్భుత ప్రదర్శనతో ఆ జట్టు కీలక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ 8 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్స్లు), సునీల్ నరైన్ (32 బంతుల్లో 71; 9 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించగా, వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం పంజాబ్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు సాధించి గెలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జానీ బెయిర్స్టో (48 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 9 సిక్స్లు), శశాంక్ సింగ్ (28 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్స్లు), ప్రభ్ సిమ్రన్ సింగ్ (20 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్స్లు) అసాధ్యంగా అనిపించిన లక్ష్యాన్ని ఛేదించి చూపించారు. శతక భాగస్వామ్యం... సొంత మైదానంలో కోల్కతా ఇన్నింగ్స్ జోరుగా సాగింది. టోర్నీలో తమ ఫామ్ను కొనసాగిస్తూ ఓపెనర్లు సాల్ట్, నరైన్ మరోసారి మెరుపు వేగంతో జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరి ధాటికి పవర్ప్లే ముగిసేసరికి జట్టు 76 పరుగులు చేసింది.7 ఓవర్లలోపే 3 క్యాచ్లు వదిలేసిన పంజాబ్ ప్రత్యర్థికి సహకరించింది. ఈ క్రమంలో నరైన్ 23 బంతుల్లో, సాల్ట్ 25 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 137/0 కాగా... ఎట్టకేలకు 11వ ఓవర్లో పంజాబ్ తొలి వికెట్ పడగొట్టగలిగింది. ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కూడా నైట్రైడర్స్ జోరు తగ్గలేదు. వెంకటేశ్ దూకుడుగా ఆడగా... రసెల్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్లు), శ్రేయస్ (10 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్లు) కూడా ధాటిని ప్రదర్శించారు. దాంతో 15.2 ఓవర్లలో స్కోరు 200 పరుగులకు చేరింది. చివరి 5 ఓవర్లలో కేకేఆర్ 71 పరుగులు సాధించింది. వీర విధ్వంసం... ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్, బెయిర్స్టో కూడా చెలరేగారు. ప్రభ్సిమ్రన్ ఒకదశలో 10 బంతుల వ్యవధిలో 4 సిక్స్లు, 2 ఫోర్లు బాదాడు. 18 బంతుల్లోనే అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. అనుకూల్ వేసిన ఓవర్లో బెయిర్స్టో వరుసగా 4, 6, 4, 4, 6తో చెలరేగాడు. వీరిద్దరు 36 బంతుల్లో 93 పరుగులు జోడించిన తర్వాత తొలి వికెట్ తీసి కోల్కతా కాస్త ఊరట చెందింది. అయితే 23 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న తర్వాత బెయిర్స్టో మరింత ధాటిగా ఆడాడు. కొద్దిసేపు రోసో (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్లు) అతనికి సహకరించాడు. ఆరు వరుస ఇన్నింగ్స్లలో వైఫల్యాల తర్వాత ఎట్టకేలకు ఈ మ్యాచ్లో 45 బంతుల్లో శతకాన్ని చేరుకున్నాడు. మరోవైపు శశాంక్ ఎక్కడా తగ్గకుండా సిక్సర్లతో విరుచుకు పడ్డాడు.చమీరా ఓవర్లో అతను కొట్టిన 3 సిక్సర్లతో పంజాబ్ విజయానికి చేరువైంది. ఆఖరి 3 ఓవర్లలో 34 పరుగులు కావాల్సి ఉండగా... హర్షిత్ వేసిన 18వ ఓవర్లోనే శశాంక్ 3 సిక్స్లు, ఫోర్ బాదగా 25 పరుగులు రావడంతో పంజాబ్ గెలుపు లాంఛనమే అయింది. బెయిర్స్టో, శశాంక్ మూడో వికెట్కు 37 బంతుల్లోనే అభేద్యంగా 84 పరుగులు జత చేశారు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) స్యామ్ కరన్ 75; నరైన్ (సి) బెయిర్స్టో (బి) చహర్ 71; వెంకటేశ్ అయ్యర్ (రనౌట్) 39; రసెల్ (సి) హర్షల్ (బి) అర్‡్షదీప్ 24; శ్రేయస్ (సి) రబడ (బి) అర్‡్షదీప్ 28; రింకూ సింగ్ (సి) అశుతోష్ (బి) హర్షల్ 5; రమణ్దీప్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 261. వికెట్ల పతనం: 1–138, 2–163, 3–203, 4–246, 5–253, 6–261. బౌలింగ్: స్యామ్ కరన్ 4–0–60–1, అర్‡్షదీప్ 4–0–45–2, హర్షల్ 3–0–48–1, రబడ 3–0–52–0, రాహుల్ చహర్ 4–0–33–1, హర్ప్రీత్ 2–0–21–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రన్ (రనౌట్) 54; బెయిర్స్టో (నాటౌట్) 108; రోసో (సి) శ్రేయస్ (బి) నరైన్ 26; శశాంక్ (నాటౌట్) 68; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో 2 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–93, 2–178. బౌలింగ్: చమీరా 3–0–48–0, హర్షిత్ 4–0–61–0, అనుకూల్ 2–0–36–0, నరైన్ 4–0–24–1, వరుణ్ 3–0–46–0, రసెల్ 2–0–36–0, రమణ్దీప్ 0.4–0–9–0. 262 టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా (259/4; వెస్టిండీస్పై మార్చి 26న, 2023లో) జట్టు పేరిట ఉంది. 42 ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక సిక్స్లు నమోదైన మ్యాచ్గా పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్ గుర్తింపు పొందింది. ఈ సీజన్లోనే సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్లో 38 సిక్స్లు వచ్చాయి. 24 ఐపీఎల్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన జట్టుగా పంజాబ్ కింగ్స్ గుర్తింపు పొందింది. ఈ సీజన్లోనే ఢిల్లీ క్యాపిటల్స్తో, బెంగళూరు జట్లతో జరిగిన మ్యాచ్ల్లో సన్రైజర్స్ 22 సిక్స్లు చొప్పున కొట్టింది.ఐపీఎల్లో నేడుఢిల్లీ X ముంబై (మ. 3:30 నుంచి) లక్నో ్ఠX రాజస్తాన్ (రాత్రి 7:30 నుంచి)స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
100th Test: అశ్విన్, జానీ బెయిర్ స్టో ఎమోషనల్ మూమెంట్స్.. పడిక్కల్ కూడా (ఫొటోలు)
-
‘వంద’కు అటు ఇటు...
ధర్మశాల: టి20ల మెరుపులతో సంప్రదాయ టెస్టు సిరీస్లే కుదించబడుతున్నాయి. 3, 5 టెస్టుల సిరీస్ నుంచి 2, 3 టెస్టుల సిరీస్ లేదంటే అనామక జట్లయితే మొక్కుబడిగా ఏకైక టెస్టుతో ఐదు రోజుల ఆటను కానిచ్చేస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు కూడా ధనాధన్ ఆట మాయలో అసలైన ఫార్మాట్కు మంగళం పాడి లీగ్, పరిమిత ఓవర్ల ఫార్మాట్లతోనే కెరీర్ను కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక క్రికెటర్ 100వ టెస్టు ఆడటం ఆ ఆటగాడికే కాదు... ఇప్పుడు టెస్టు ఫార్మాట్కే మైలురాయిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. మరి ప్రత్యర్థి జట్ల నుంచి చెరొకరు 100వ టెస్టు ఆడటమైతే అనూహ్యం! ఆతిథ్య భారత్ నుంచి దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ బృందం నుంచి బెయిర్స్టోలకు రేపటి నుంచి ఇరు జట్ల మధ్య ధర్మశాలలో జరిగే ఐదో టెస్టు చిరస్మరణీయం కానుంది. ఈ ఇద్దరు 99 మ్యాచ్లాడి టెస్టు క్రికెట్కు అభి‘వంద’నం పలుకేందుకు సిద్ధమయ్యారు. 14వ భారత క్రికెటర్గా... భారత క్రికెట్లోనే విజయవంతమైన సారథులుగా వెలుగొందిన అజహరుద్దీన్ (99), ధోని (90)లు కూడా 100 టెస్టులు ఆడలేకపోయారు. జహీర్ ఖాన్ (92) సైతం ‘వంద’ భాగ్యానికి నోచుకోలేకపోయాడు. కొందరికే సాధ్యమైన ఈ మైలురాయిని అందుకోవడానికి అశ్విన్ సిద్ధమయ్యాడు. ఇటీవలే 500 వికెట్ల క్లబ్లో చేరిన అశ్విన్ ... కుంబ్లే తర్వాత ఈ మైలురాయి అందుకున్న రెండో భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. 2011లో వెస్టిండీస్పై ఢిల్లీ టెస్టులో అరంగేట్రం చేసిన అశ్విన్ 13 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. టెస్టుల్లో టీమిండియా ఘనవిజయాల్లో భాగమైన అశ్విన్ ... ధోని సారథ్యంలో తురుపుముక్కగా రాటుదేలాడు. 99 టెస్టులాడి 507 వికెట్లు పడగొట్టాడు. 35 సార్లు ఐదేసి వికెట్లు, 8 సార్లు 10 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పేశాడు. వందో టెస్టు ఆడుతున్న 14వ భారత ఆటగాడిగా అశ్విన్ ఘనత వహిస్తాడు. 17వ ఇంగ్లండ్ ప్లేయర్ బెయిర్స్టో ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ జానీ బెయిర్స్టో గురించి మనవాళ్లకి, ప్రత్యేకించి హైదరాబాద్ వాసులకి బాగా తెలుసు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్గా వార్నర్తో కలిసి మెరిపించాడు. టెస్టుల్లో నిలకడైన బ్యాటర్. 2012లో వెస్టిండీస్తో అరంగేట్రం చేసిన బెయిర్స్టో 99 టెస్టుల్లో 36.42 సగటుతో 5974 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 26 అర్ధ శతకాలున్నాయి. కీపర్గా 242 క్యాచ్ల్ని పట్టడంతో పాటు 14 స్టంపౌట్లు చేశాడు. వందోటెస్టు ఆడుతున్న స్టార్ వికెట్ కీపర్ ఈ ఘనతకెక్కనున్న 17వ ఇంగ్లండ్ క్రికెటర్. వన్డేల్లో వందో మ్యాచ్ కూడా ధర్మశాలలోనే ఆడిన బెయిర్స్టో ఇప్పుడు అక్కడే మరో 100కు సై అంటున్నాడు. ఇది అతిపెద్ద సంబరం. ఎందుకంటే నా కెరీర్లో ఇది గమ్యాన్ని మించిన పయనం. ఎప్పటికీ ప్రత్యేకం. ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశాను. ఎంతో నేర్చుకున్నాను. 2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ నా కెరీర్కు టర్నింగ్ పాయింట్. నాలుగు టెస్టుల్లో 52.64 సగటుతో 14 వికెట్ల పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్నా. కెరీర్ ఆరంభంలోనే పనైపోయిందనుకున్న ప్రతీసారి నన్ను నేను మార్చుకుంటూ సరికొత్త బౌలింగ్ అస్త్రాలతో ఇక్కడిదాకా ప్రయాణించడం గొప్ప అనుభూతిని ఇస్తోంది. –అశ్విన్ ఇది నాకు భావోద్వేగానికి గురిచేసే మ్యాచ్. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలనే అందరూ కలలు కంటారు. నేనైతే ఆ కలల్ని నిజం చేసుకొని కెరీర్లో వందో ఆటకు రెడీ కావడం చాలా గొప్పగా అనిపిస్తుంది. 8 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన నాకు నా తల్లే సర్వస్వం. అందుకే ఈ ఘనత ఆమెకే అంకితం. –బెయిర్స్టో -
IND vs ENG: ఒక్కరోజులో అంతా ఉల్టా పల్టా! భారత్ అద్భుతం చేయగలదా?
ఇంగ్లండ్ ముందు 378 పరుగుల లక్ష్యం... ఒకదశలో స్కోరు 107/0... ఇంగ్లండ్దే పైచేయిగా అనిపించింది. ఇంతలో బుమ్రా బౌలింగ్, బ్యాటర్ల స్వయంకృతం కలిపి 2 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు... 109/3... భారత్కు పట్టు చిక్కినట్లే కనిపించింది. కానీ రూట్, బెయిర్స్టో అనూహ్యంగా ఎదురు దాడికి దిగారు. నాలుగో ఇన్నింగ్స్లో కూడా బ్యాటింగ్ ఇంత సులువా అన్నట్లుగా పరుగులు సాధిస్తూ దూసుకుపోయారు. వీరిద్దరి 150 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో ఇంగ్లండ్ జట్టు విజయంపై కన్నేసింది. చేతిలో 7 వికెట్లతో చివరి రోజు ఆ జట్టు మరో 119 పరుగులు చేస్తే చాలు... ఇలాంటి స్థితిలో చివరి రోజు భారత్ ఏదైనా అద్భుతం చేయగలదా...ప్రత్యర్థిని కుప్పకూల్చగలదా! బర్మింగ్హామ్: భారత్తో ఐదో టెస్టులో ఇంగ్లండ్ గెలుపు బాటలో పయనిస్తోంది. 378 పరుగులను ఛేదించే క్రమంలో ఆ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 259 పరుగులు చేసింది. జో రూట్ (112 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు), బెయిర్స్టో (87 బంతుల్లో 72 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 125/3తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌటైంది. పంత్ (86 బంతుల్లో 57; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. పంత్ అర్ధసెంచరీ... నాలుగో రోజు ఆటను పుజారా (168 బంతుల్లో 66; 8 ఫోర్లు), పంత్ కొన్ని చక్కటి షాట్లతో ఆరంభించడంతో తొలి 7 ఓవర్లలో 27 పరుగులు వచ్చాయి. అయితే స్టువర్ట్ బ్రాడ్ తన తొలి ఓవర్లోనే పుజారాను అవుట్ చేసి 78 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు. భారత్ ఆధిక్యం 300 పరుగులు దాటిన తర్వాత 76 బంతుల్లో పంత్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అనంతరం ఎనిమిది పరుగుల వ్యవధిలో పంత్, శ్రేయస్ అయ్యర్ (19) అవుట్ కావడంతో భారత్ కాస్త నెమ్మదించింది. రవీంద్ర జడేజా (23) కొద్ది సేపు గట్టిగా నిలబడినా, శార్దుల్ ఠాకూర్ (4) విఫలమయ్యాడు. చివరి వరుస వికెట్లను పెద్దగా ఇబ్బంది పడకుండా వెంటవెంటనే పడగొట్టిన ఇంగ్లండ్ బౌలర్లు భారత్ ఇన్నింగ్స్ను తొందరగా ముగించారు. సోమవారం 36.5 ఓవర్లు ఆడిన టీమిండియా మిగిలిన 7 వికెట్లతో 120 పరుగులు సాధించింది. అదిరే భాగస్వామ్యం... భారీ లక్ష్యఛేదనను ఇంగ్లండ్ ఓపెనర్లు లీస్, క్రాలీ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. భారత బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరు ఆకట్టుకునే షాట్లతో పరుగులు రాబట్టారు. ధాటిగా ఆడిన లీస్ 44 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చూస్తుండగానే భాగస్వామ్యం 100 పరుగులు దాటడంతో భారత బృందంలో ఆందోళన మొదలైంది. అయితే బంతి ఆకారం దెబ్బ తినడంతో మరో బంతిని తీసుకున్న భారత్ అదృష్టం కూడా మారింది. బుమ్రా బంతిని అంచనా వేయడంలో పొరపడిన క్రాలీ క్లీన్బౌల్డయ్యాడు. ఇంగ్లండ్ ఓపెనర్లు 21.4 ఓవర్లలోనే 107 పరుగులు జోడించారు. టీ విరామం తర్వాత భారత్ మళ్లీ ఆధిక్యం ప్రదర్శించింది. తొలి బంతికే పోప్ (0) అవుట్ కాగా, రూట్ పొరపాటుతో లీస్ రనౌటయ్యాడు. ఈ దశలో పరిస్థితి చూస్తే ప్రత్యర్థిని కూల్చడానికి భారత్కు ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే రూట్, బెయిర్స్టో భాగస్వామ్యం టీమిండియా ఆశలపై నీళ్లు చల్లింది. ఆరంభంలో రూట్ చక్కటి షాట్లు ఆడగా, కుదురుకున్న తర్వాత బెయిర్స్టో దూకుడు పెంచాడు. మన బౌలర్లు పూర్తిగా పట్టు కోల్పోవడంతో ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు చేసిన రూట్, బెయిర్స్టో విజయానికి బాటలు వేస్తూ పటిష్ట స్థితిలో రోజును ముగించారు. 14 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్లో బెయిర్స్టో ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో విహారి వదిలేశాడు. అది పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో! స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 416; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 284; భారత్ రెండో ఇన్నింగ్స్: గిల్ (సి) క్రాలీ (బి) అండర్సన్ 4; పుజారా (సి) లీస్ (బి) బ్రాడ్ 66; విహారి (సి) బెయిర్స్టో (బి) బ్రాడ్ 11; కోహ్లి (సి) రూట్ (బి) స్టోక్స్ 20; పంత్ (సి) రూట్ (బి) లీచ్ 57; శ్రేయస్ (సి) అండర్సన్ (బి) పాట్స్ 19; జడేజా (బి) స్టోక్స్ 23; శార్దుల్ (సి) క్రాలీ (బి) పాట్స్ 4; షమీ (సి) లీస్ (బి) స్టోక్స్ 13; బుమ్రా (సి) క్రాలీ (బి) స్టోక్స్ 7; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 19; మొత్తం (81.5 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–75, 4–153, 5–190, 6–198, 7–207, 8–230, 9–236, 10–245. బౌలింగ్: అండర్సన్ 19–5–46–1, బ్రాడ్ 16–1– 58–2, పాట్స్ 17–3–50–2, లీచ్ 12–1–28–1, స్టోక్స్ 11.5–0–33–4, రూట్ 6–1–17–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: లీస్ (రనౌట్) 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0; రూట్ (బ్యాటింగ్) 76; బెయిర్స్టో (బ్యాటింగ్) 72; ఎక్స్ట్రాలు 9; మొత్తం (57 ఓవర్లలో 3 వికెట్లకు) 259. వికెట్ల పతనం: 1–107, 2–107, 3–109. బౌలింగ్: బుమ్రా 13–0–53–2, షమీ 12–2–49–0, రవీంద్ర జడేజా 15–2–53–0, సిరాజ్ 10–0–64–0, శార్దుల్ ఠాకూర్ 7–0–33–0. -
ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న క్రికెటర్లు వీరే
జూన్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లకు ఐసీసీ షార్ట్లిస్ట్ చేసింది. వారిలో ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు జానీ బెయిర్ స్టో, జో రూట్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డార్లీ మిచెల్ ఉన్నారు. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో బెయిర్ స్టో, రూట్ అదరగొట్టారు. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో బెయిర్ స్టో 394 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో రెండు సెంచరీలు,ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈ సిరీస్లో అత్యధిక పరుగుల సాధించిన జాబితాలో అతడు మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఇదే సిరీస్లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ డార్లీ మిచెల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్లో 538 పరుగులు చేసి మిచెల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా మూడు సెంచరీలు, రెండు ఆర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక రూట్ విషయానికి వస్తే. ఈ సిరీస్లో ఇంగ్లండ్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. మూడు మ్యాచ్లలో రూట్ 396 పరుగులు సాధించాడు. అతడు ఈ సిరీస్లో రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ చేశాడు. చదవండి: Rishabh Pant: టెస్టుల్లో పంత్ అరుదైన రికార్డు.. 49 ఏళ్ల తర్వాత..!
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement