-
టీమిండియా నయా సంచలనాలు...
India vs England Test Series 2024: ఒకరు ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొడితే.. మరొకరు నిలకడగా ఆడుతూ ‘హీరో’ అయ్యారు.. ఇంకొకరు వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తే.. ఆఖరిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ఎంపిక సరైందే అని నిరూపించుకున్న ఆటగాడు మరొకరు. అవును... మీరు ఊహించిన పేర్లు నిజమే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ సందర్భంగా తళుక్కున మెరిసిన భారత నయా క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవ్దత్ పడిక్కల్ గురించే ఈ పరిచయ వాక్యాలు. స్వదేశంలో ఇంగ్లండ్తో తాజా సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ రజత్ పాటిదార్(టెస్టుల్లో), మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో 30 ఏళ్ల రజత్ పాటిదార్ మినహా మిగతా నలుగురు సత్తా చాటి.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యాలంటూ కితాబులు అందుకున్నారు. మరి ఈ సిరీస్లో వీరి ప్రదర్శన ఎలా ఉందో గమనిద్దాం! సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan).. సంచలనం రంజీల్లో పరుగుల వరద పారించి.. త్రిశతక వీరుడిగా పేరొందిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాజ్కోట్ టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. తండ్రి నౌషద్ ఖాన్, భార్య రొమానా జహూర్ సమక్షంలో.. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. తన తొలి మ్యాచ్లోనే మెరుపు అర్ధ శతకం(62) సాధించాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న సర్ఫరాజ్ ఖాన్.. దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే, అదే మ్యాచ్లో మరోసారి అర్ధ శతకం(68)తో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. తదుపరి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన(14,0) సర్ఫరాజ్ ఖాన్ ఐదో టెస్టులో మరోసారి ఫిఫ్టీ(56)అదరగొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టుల్లో కలిపి 200 పరుగులు సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 ధ్రువ్ జురెల్(Dhruv Jurel).. మెరుపులు రాజ్కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన మరో ఆటగాడు ధ్రువ్ జురెల్. ఈ మ్యాచ్లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ మొదటి ఇన్నింగ్స్లో అత్యంత విలువైన 90 పరుగులు సాధించాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 మరో టెస్టు మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఖరిదైన ఐదో టెస్టులో మాత్రం 15 పరుగులకే పరిమితమైనా.. వికెట్ కీపర్గా తన వంతు బాధ్యతను నెరవేర్చాడు. ఆకాశ్ దీప్(Akash Deep).. ఆకాశమే హద్దుగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టు ద్వారా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. 27 ఏళ్ల వయసులో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్లోనే.. అదీ ఒకే ఓవర్లో.. ఇంగ్లండ్ స్టార్లు బెన్ డకెట్, ఒలీ పోప్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్ క్రాలేను కూడా అవుట్ చేసి ఇంగ్లండ్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. తద్వారా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Drama on debut for Akash Deep! 🤯😓 A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW — JioCinema (@JioCinema) February 23, 2024 The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 దేవ్దత్ పడిక్కల్(Devdutt Padikkal).. జోరుగా హుషారుగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు కర్ణాటక బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్. కేరళలో జన్మించిన 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అరంగేట్రంలో 65 పరుగులతో దుమ్ములేపాడు. ఇక వీరికంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఈ సిరీస్లో వరుస డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్లో మొత్తంగా తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి 712 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన యశస్వి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఉపఖండ పిచ్లపై తాము సైతం అంటూ.. ఈ టీమిండియా యువ సంచలనాలతో పాటు ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు టామ్ హార్లే, షోయబ్ బషీర్ కూడా తమదైన ముద్ర వేయగలిగారు. షోయబ్ బషీర్ ఆడిన మూడు టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీయగా.. టామ్ హార్లే 22 వికెట్లతో సత్తా చాటాడు. -
అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టిన పడిక్కల్
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్.. తన కెరీర్లో మొదటి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో మ్యాచ్తో టెస్ట్ అరంగేట్రం చేసిన పడిక్కల్.. సిక్సర్ సాయంతో అర్దసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 103 బంతులు ఎదుర్కొన్న అతను.. 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 65 పరుగులు చేసి షోయబ్ బషీర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 పడిక్కల్కు ఇది మొదటి టెస్ట్ మ్యాచే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో పడిక్కల్తో పాటు ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్లోని టాప్ ఐదుగురు బ్యాటర్లు 50 పరుగుల మార్కును తాకారు. భారత్కు సంబంధించి టెస్ట్ క్రికెట్లో ఇలా జరగడం ఇది నాలుగో సారి. గతంలో ఆసీస్, న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన టెస్ట్ల్లో భారత టపార్డర్లోని ఐదుగురు ఆటగాళ్లు హాఫ్ సెంచరీ మార్కును దాటారు. ఈ ఇన్నింగ్స్లో యశస్వి (57), రోహిత్ శర్మ (103), శుభ్మన్ గిల్ (110), సర్ఫరాజ్ ఖాన్ (56) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (14), దృవ్ జురెల్ (15) క్రీజ్లో ఉన్నారు. 100 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్లో టీమిండియా స్కోర్ 426/5గా ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆండర్సన్, స్టోక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
Ind vs Eng: ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియాదే ఆధిపత్యం
India vs England 5th Test Day 1 updates: టీమిండియాతో ధర్మశాల వేదికగా గురువారం మొదలైన టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత స్పిన్నర్ల దెబ్బకు 218 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారత్ బ్యాటింగ్కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సరికి 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ శతకం(52)తో ఆకట్టుకుని.. వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్(26)తో కలిసి క్రీజులో ఉన్నాడు. ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 57 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అతడి ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్గా ఐదో టెస్టులో టీమిండియా తొలిరోజు 10 వికెట్లు తీయడంతో పాటు.. 135 పరుగులు చేసి ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) 24.2: రోహిత్ శర్మ అర్ధ శతకం బషీర్ బౌలింగ్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్మ్యాన్ తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా యశస్వి జైస్వాల్(57) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. షోయబ్ బషీర్ బౌలింగ్లో జైస్వాల్ స్టంపౌట్గా వెనుదిరిగాడు. శుబ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 104-1(21) 1000 పరుగుల వీరుడు 14.3: టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న యశస్వి జైస్వాల్. 16 ఇన్నింగ్స్లోనే అరుదైన మైలురాయిని చేరుకుని.. ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా రికార్డు. 13 ఓవర్ల ముగిసే సరికి భారత్ స్కోరు: 57/0 రోహిత్ 30, జైస్వాల్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11.4: హాఫ్ సెంచరీ కొట్టిన టీమిండియా 10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 47/0 జైస్వాల్ 25, రోహిత్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లలో టీమిండియా స్కోరు: 18-0 ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 4, రోహిత్ శర్మ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. 218 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్ ఐదో టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకే ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. అశ్విన్ ఖాతాలో మూడో వికెట్ 218 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో బెన్ ఫోక్స్ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎనిమిదో వికెట్ డౌన్ 49.4: అశ్విన్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి మార్క్ వుడ్ డకౌట్గా వెనుదిరిగాడు. షోయబ్ బషీర్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 183-8(50) ఏడో వికెట్ డౌన్ 49.2: వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్కు ఇంగ్లండ్ టెయిలెండర్ టామ్ హార్లే రూపంలో ధర్మశాల మ్యాచ్లో తొలి వికెట్ దక్కింది. మార్క్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ కుల్దీప్ బౌలింగ్లో స్టోక్స్ ఎల్బీడబ్ల్యూ. స్టోక్స్ రూపంలో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోగా.. కుల్దీప్ యాదవ్కు ఐదో వికెట్ దక్కింది. టామ్హర్లే క్రీజులోకి వచ్చాడు. ►ఇంగ్లండ్ జో రూట్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన రూట్.. జడేజా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో వికెట్ డౌన్.. 175 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ బెన్ స్టోక్స్ వచ్చాడు. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 37.2: టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి తన మాయాజాలం ప్రదర్శించాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టి ప్రమాదకరంగా మారిన ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే(79)ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. ఫలితంగా మూడో వికెట్నూ తనఖాతాలోనే వేసుకున్నాడు. వందో టెస్టు ఆడుతున్న జానీ బెయిర్ స్టో క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 143-3(38) రెండో వికెట్ డౌన్.. 100 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఓలీ పోప్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. లంచ్ విరామానికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలే(61) పరుగులతో ఉన్నాడు. తొలి వికెట్ డౌన్.. 64 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన బెన్ డకెట్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి ఓలీ పోప్ వచ్చాడు. 14.2: హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న ఇంగ్లండ్.. స్కోరు: 51/0. డకెట్ 21, క్రాలే 29 పరుగులతో ఆడుతున్నారు. 12 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు: 43/0 నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్.. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే(11), డక్కెట్(8) నిలకడగా ఆడుతున్నారు. 7 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్: 20/0 4 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 9/0 4 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో డక్కెట్, జాక్ క్రాలే(7) ఉన్నారు. ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రజిత్ పాటిదార్ స్ధానంలో పడిక్కల్కు చోటు దక్కింది. అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆకాష్ దీప్ ప్లేస్లో బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ సైతం ఒక మార్పుతో బరిలోకి దిగింది. పేసర్ రాబిన్సన్ స్ధానంలో మార్క్ వుడ్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కింది. ఇక భారత స్పిన్ లెజండ్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో సైతం తన వందో టెస్టులో బరిలోకి దిగాడు. తుది జట్లు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్స్టో, బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ -
Ind vs Eng: తిరిగి వెళ్లమన్న సెలక్టర్లు.. పాటిదార్పై వేటు?
'Go back and play Ranji...': BCCI wants To: ఇంగ్లండ్తో నామమాత్రపు ఐదో టెస్టులో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ సందర్భంగా నలుగురు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేయగా.. మరో ఆటగాడికీ ఛాన్స్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా స్వదేశంలో స్టోక్స్ బృందంతో టెస్టు సిరీస్ను రోహిత్ సేన ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. హైదరాబాద్లో ఆరంభ మ్యాచ్లో ఓడినా.. విశాఖపట్నం, రాజ్కోట్, రాంచిలలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి సొంతగడ్డపై ఈ మేరకు ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక విశాఖ టెస్టులో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్.. రాజ్కోట్లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. రాంచిలో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ టీమిండియా క్యాపులు అందుకున్నారు. వీరిలో రజత్ పాటిదార్కు వరుసగా మూడుసార్లు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ సిరీస్లో అతడు చేసిన పరుగులు 32,9,5,0,17,0. ఫలితంగా రజత్ పాటిదార్ వైఫల్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్లో లేని ఆటగాడిని జట్టులో కొనసాగించడం ఏమిటనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదో టెస్టు నుంచి పాటిదార్ను తప్పించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. రంజీ ట్రోఫీ 2023-24లో విదర్భతో మధ్యప్రదేశ్ సెమీ ఫైనల్లో ఆడాల్సిందిగా బీసీసీఐ తొలుత ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, కేఎల్ రాహుల్ ఫిట్నెస్ గురించి స్పష్టత రాకపోవడంతో పాటిదార్ విషయంలో నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. అయితే, రాహుల్ రాకపోయినా పాటిదార్ను తుదిజట్టు నుంచి తప్పించి.. అతడి స్థానంలో దేవ్దత్ పడిక్కల్ను ఆడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదనపు బ్యాటర్గా అతడిని జట్టుతోనే కొనసాగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కర్ణాటక బ్యాటర్ తాజా రంజీ సీజన్లో వరుస శతకాలతో ఆకట్టుకున్నాడు. భారత్-ఏ తరఫున కూడా రాణించాడు. చదవండి: Rohit Sharma: ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా? -
IND VS ENG 4th Test: పాటిదారా.. పడిక్కలా..?
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్ ఓ అడుగు ముందుకేసి ఇదివరకే తుది జట్టును కూడా ప్రకటించింది. తుది జట్టు విషయంలో టీమిండియానే ఎటూ తేల్చుకోలేకపోతుంది. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోవడంతో నాలుగో టెస్ట్కు అర్హత కోల్పోయాడు. రాహుల్కు ప్రత్యామ్నాయంగా రెండు, మూడు టెస్ట్లు ఆడిన రజత్ పాటిదార్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ ఒక్క స్థానంపై టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది. పాటిదార్కు మరో అవకాశం ఇవ్వాలా లేక దేవ్దత్ పడిక్కల్కు అరంగేట్రం చేసే ఛాన్స్ ఇవ్వాలా అని మేనేజ్మెంట్ జట్టు పీక్కుంటుంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ నోరు విప్పాడు. పాటిదార్ మంచి ప్లేయర్ అని, ఒకటి రెండు వైఫల్యాలకే ఏ ఆటగాడి నైపుణ్యాన్ని శంకించకూడదని పరోక్షంగా పాటిదార్ను వెనకేసుకొచ్చాడు. రాథోడ్కు పాటిదార్పై సదుద్దేశమే ఉన్నప్పటికీ టీమిండియా అభిమానులు మాత్రం దేవ్దత్ పడిక్కల్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పడిక్కల్ ఇటీవలికాలంలో సూపర్ ఫామ్లో ఉన్నాడని, పాటిదార్తో పోలిస్తే పడిక్కల్ చాలా బెటర్ అని వారభిప్రాయపడుతున్నారు. మరి నాలుగో స్థానంపై టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి కొన్ని గంటలు వేచి చూస్తే కాని తెలీదు. మరోవైపు బుమ్రాకు ప్రత్యామ్నాయంగా ఆకాశ్దీప్కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. రేపటి మ్యాచ్లో ఆకాశ్ అరంగేట్రం చేయడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. నాలుగో టెస్ట్కు భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పాటిదార్/దేవ్దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్దీప్
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement