-
ముగ్గురి ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్..
రాజేంద్రనగర్ (హైదరాబాద్): ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో దంపతుల మధ్య జరిగిన గొడవలే ఈ మరణాలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆనంద్ (38) ఇందిర (36) దంపతులు. వీరికి శ్రేయాన్స్ (4) ఒక్కడే కొడుకు. పాల వ్యాపారం చేసే ఆనంద్ మూడేళ్ల క్రితం నుంచి బండ్లగూడజాగీర్ సన్సిటీ ఏరియాలోని యమున అపార్ట్మెంట్స్లో ఉంటున్నాడు. ఆనంద్ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ బెట్టింగ్ల కారణంగా దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేసి, ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. 15 రోజుల క్రితం ఇరు కుటుంబాలకు చెందిన వారితోపాటు స్నేహితులు వచ్చి ఆన్లైన్లో గేమ్స్ ఆడొద్దని, బుద్ధిగా ఉండి కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పారు. అయినా ఆనంద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మూడురోజుల క్రితం మరోసారి ఆనంద్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడినట్టు సమాచారం. ఇదే విషయమై సోమవారం ఉదయం నుంచి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన సమయంలో ఇందిర తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆనంద్ కూడా తన స్నేహితులతోపాటు బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాచారం అందించాడు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతోపాటు బంధుమిత్రులు ఫోన్లు చేసినా, ఇద్దరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో వారంతా కంగారుపడి అపార్ట్మెంట్ వచ్చి చూడగా, మృతదేహాలు కనిపించాయి. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యను చంపి.. ఆపై ఆత్మహత్య ! ఘటనాస్థలిని పరిశీలించాక...దంపతులు మధ్య గొడవ జరిగి ఉండొచ్చని, ఆ క్రమంలోనే పెనుగులాటలో భార్య చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత కొడుకుకు క్రిమిసంహారక మందు తాగించి, ఆనంద్ కూడా అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. తండ్రీకొడుకు నోటి నుంచి నురగలు వస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఇందిర నోటి నుంచి ఎలాంటి నురుగులు రాలేదు. పోస్టుమార్టం నివేదిక తర్వాత అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఉదయం నుంచే దంపతులు గొడవ పడుతున్నట్టు వాచ్మెన్ పోలీసులు తెలిపాడు. -
Hyd: సీఐ ప్రాణాల్ని బలిగొన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్
హైదరాబాద్, సాక్షి: నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ నిండు ప్రాణం తీసింది. మరో వ్యక్తిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. ఎల్బీ నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ మృతి చెందగా.. ఎస్సై ఒకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. కార్ యూటర్న్ చేస్తు రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది. బైక్ పై ఉన్న ఒకరు మృతి చెందగా. మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాధిక్ అలీగా గుర్తించారు. అలాగే.. గాయపడిన వ్యక్తిని నారాయణ గూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కాజా వల్లి మోహినుదిన్గా గుర్తించారు. వీళ్లిద్దరూ మలక్పేటలోని క్వార్టర్స్లో ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్లో ఓ ఫంక్షన్ను వెళ్లి వస్తుండగా.. ఈ ఘోరం జరిగింది. కారుపై ‘డేంజర్’ ఛలాన్లు ఇదిలా ఉంటే.. ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కారు వినుషాశెట్టి అనే పేరుపై రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. అంతేకాదు.. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ ఛలాన్లు ఉండడం గమనార్హం. -
బోడుప్పల్లో ఘోరం.. స్టూడెంట్ దుర్మరణం
సాక్షి, క్రైమ్: బోడుప్పల్లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి వేగంగా కారు నడిపి ఒకరిని బలిగొన్నాడు. వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్ను ఢీ కొట్టింది. దీంతో ప్రమాదంలో బైక్పై ఉన్న యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. చనిపోయిన యువకుడి ఐడెంటిటీని.. బీటెక్ చదివే విశాల్గా గుర్తించారు పోలీసులు. విశాల్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్. పార్ట్ టైం జాబ్ కోసం ర్యాపిడో నడుపుతున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
కన్నీటి ధార
నగరంలో రెండు ఉదంతాల్లో ఆరుగురి మృతి : సంతానాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటూ.. వారే తమ లోకంగా బతుకుతున్న కన్నవారు కడుపుకోతకు ఒడిగట్టారు. చంటిపాపల కంటిరెప్పలను శాశ్వతంగా మూసేశారు. పేగు బంధాన్ని తుంచేసుకున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఆరుగురి ప్రాణాలను బలిగొన్నాయి. నగరంలో శుక్రవారం చోటుచేసున్న రెండు వేర్వేరు ఉదంతాల్లో నలుగురు చిన్నారులు సహా ఓ తల్లి, ఓ తండ్రి అసువులు బాయడం తీవ్ర విషాదాన్ని నింపింది. రహమత్ నగర్ పరిధి బోరబండలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి.. ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలు, భార్య చనిపోవడంతో ఇంటిపెద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కంటోన్మెంట్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లిలో ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి.. తాను విషం తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఒకేరోజు ఆరుగురు వ్యక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. – రహమత్నగర్/కంటోన్మెంట్ ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కష్ట పడి చదివి ఉద్యోగం సాధించారు. పెద్దలు కుదిర్చిన మేనరికం పెళ్లి చేసుకుంది. సొంత మేనబావనే మనువాడింది. వారికి ఇద్దరు మగ పిల్లలు. మేనరికం కారణంగా ఒక బాబుకు బుద్ధిమాంద్యం, మరోబాబుకు అంగవైకల్యం ఏర్పడింది. తమ పిల్లల దీనస్థితి చూసి చలించిపోయేవారు. మేనరికం మూలంగా జరిగిన అనర్థం తలుచుకుంటూ దిగులు చెందేవారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇంట్లో గొడవ జరగడం ఆమెను మరింత కలచి వేసింది. తాను మరణిస్తే.. తమ పిల్లలు దిక్కులేని వారవుతారని భావించి.. పిల్లలను ముందు చంపి.. ఆ తర్వాత తానూ తనువు చాలించిన విషాద ఘటన రహమత్ నగర్ పరిధిలోని బోరబండ డివిజన్ రాజ్నగర్లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.నాగర్కర్నూల్ జిల్లా పెద్దూరుకు చెందిన జ్యోతికి ఆరున్నరేళ్ల క్రితం నగరంలోని బోరబండ డివిజన్ రాజ్నగర్కు చెందిన ఆమె మేనబావ విజయ్ (కాంట్రాక్టర్)తో వివాహమైంది. కాగా.. జ్యోతి (34) బంజారాహిల్స్ ఎంబీటీనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు అర్జున్ (4), ఆదిత్య (2) ఉన్నారు. మేనరికపు వివాహం..పిల్లలకు బుద్ధిమాంద్యం.. మేనరికపు పెళ్లి కారణంగా పెద్దబ్బాయికి బుద్ధిమాంద్యం, చిన్న అబ్బాయికి అంగవైకల్యం ఏర్పడింది. వీరికి చికిత్స సైతం అందిస్తున్నారు. మేనరికం మూలంగా తమ పిల్లలు ఇలా అనారోగ్యం బారిన పడటం జ్యోతిని మానసిక క్షోభకు గురిచేసేది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం జ్యోతితో ఆమె మామ గొడవకు దిగాడు. ఈ ఘటన ఆమెను మరింత కలచి వేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అప్పటికే ఇంట్లో ఉంచిన విషాన్ని పిల్లలకు పాలల్లో తాగించి.. తాను కిటికీకి ఉరి వేసుకుంది. అప్పటికే జ్యోతి మృతి చెందగా, ఇరుపొరుగు వారు పిల్లలను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. భార్య, ఇద్దరు కుమారులు చనిపోవడంతో జ్యోతి భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఒకే కుటుంబంలో ముగ్గురు బలవర్మణం చెందడంతో బస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ కామల్ల రవికుమార్ పేర్కొన్నారు. స్రవంతి, శ్రావ్య మృతదేహాలు కంటోన్మెంట్ పరిధి ఓల్డ్ బోయిన్పల్లి భవాని నగర్లో ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంతాచారి అనే వ్యక్తికి భార్య అక్షయ, ఇద్దరు కుమార్తెలు స్రవంతి (8), శ్రావ్య (7) ఉన్నారు. సికింద్రాబాద్లో సిల్వర్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి భోజనాలు చేసిన తర్వాత శ్రీకాంతా చారి, భార్య కూతుళ్లతో మేడపై ఉన్న గదిలో నిద్రపోయారు. వేకువ జామున 4 గంటల సమయంలో శ్రీకాంతా చారి తన భార్య అక్షయకు సైతం నిద్రమాత్రలు కలిపిన నీళ్లు తాగించేందుకు యత్నించాడు. విషపు నీళ్లను తాగేందుకు ఆమె నిరాకరించింది. కానీ.. అప్పటికే ఆమె నోట్లోకి ఆ నీళ్లు చేరిన కారణంగా స్పృహ కోల్పోయింది. ఉదయం 5 గంటల సమయానికి ఆమెకు మెలకువ వచ్చి చూడగా భర్త, చిన్న కూతురు బెడ్పై, చిన్న కూతురు బాత్రూమ్లో విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే కింది పోర్షన్లో ఉండే అత్త, ఆడపడుచులను నిద్ర లేపి విషయం తెలిపింది. వారంతా పైకి వెళ్లి చూసే సరికే ముగ్గురూ పడిపోయి ఉన్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలికి వెళ్లి పంచనామా నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమా? సిల్వర్ వర్క్ చేస్తూ జీవనం సాగించే శ్రీకాంతా చారికి ఇటీవల బిజినెస్ సరిగా నడవడం లేదని తెలుస్తోంది. ఇదే విషయమై తరచూ బాధపడుతూ ఉండేవాడని మృతుడి భార్య, తల్లి జయమ్మ తెలిపారు. భార్యాభర్తల మధ్య కూడా ఎలాంటి వివాదాలు లేవని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు కూతుళ్లు, తండ్రి మృతదేహాలను చూసిన స్థానికులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. -
నాంపల్లి కోర్టు బిల్డింగ్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి మహ్మద్ సలీముద్దీన్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశా. మెహదీపట్నం ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన డుసలీముద్దీన్ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. నేడు(బుధవారం) కోర్టులో పేషీ ఉండటంతో నాంపల్లి కోర్టులో హాజరయ్యాడు. ఈ క్రమంలో కోర్టు భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన సలీముద్దీన్ను ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు పోలీసులు. ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
వివాహితపై అత్తింటివారి దాడి
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
వేడుకునేది ఓటర్ని కాదు! సూర్యుడ్ని!!
సాంఘిక విప్లవ నాయకుడు
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
జాలీ రైడ్
తప్పక చదవండి
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
Advertisement