నాంపల్లి కోర్టు బిల్డింగ్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

నాంపల్లి కోర్టు బిల్డింగ్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Published Wed, Sep 20 2023 3:13 PM

Case Accused Suicide Attempt From Nampally Court Building - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి మహ్మద్ సలీముద్దీన్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశా. మెహదీపట్నం ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన డుసలీముద్దీన్ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. నేడు(బుధవారం) కోర్టులో పేషీ ఉండటంతో నాంపల్లి కోర్టులో హాజరయ్యాడు. ఈ క్రమంలో కోర్టు భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన సలీముద్దీన్‌ను ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement