-
IPL 2023: 2022 సీన్ రిపీట్.. అప్పుడెలాగో, ఇప్పుడూ అలాగే..!
2022 సీన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ రిపీట్ కాబోతుందా అంటే..? కొన్ని గణాంకాలు ఆ ఫలితాన్నే సూచిస్తున్నాయి. గత సీజన్లో ఛాంపియన్గా అవతరించిన గుజరాత్, ఏరకంగా అయితే తమ ప్రస్థానాన్ని ప్రారంభించిందో (తొలి మ్యాచ్లో విజయం), ప్రస్తుత సీజన్లోనూ అలాగే మక్కీ టు మక్కీ సీన్ రిపీట్ చేస్తోంది. గత సీజన్లో 14 గ్రూప్ స్టేజీ మ్యాచ్లు ఆడిన గుజరాత్.. ప్రస్తుత సీజన్లోనూ అన్నే మ్యాచ్లు ఆడి గత సీజన్లోలాగే 10 విజయాలు, 4 అపజయాలను ఎదుర్కొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ గణాంకాలు చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తున్నప్పటికీ, గుజరాత్ మాత్రం కాపీ పేస్ట్ అన్న తరహాలోనే తమ జైత్రయాత్ర కొనసాగిస్తుంది. ఇక్కడ గుజరాత్ ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఓ రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. గ్రూప్ స్టేజీ మ్యాచ్ల్లో వరుస సీజన్లలో 5 కంటే తక్కువ మ్యాచ్లు ఓడిన తొలి జట్టుగా హార్ధిక్ సేన చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో జోరు కొనసాగిస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్.. తమ ఆఖరి గ్రూప్ మ్యాచ్లో ఆర్సీబీని మట్టికరిపించి, ముంబైని ప్లే ఆఫ్స్కు అర్హత సాధించేలా చేసింది. నిన్నటి మ్యాచ్లో ఆర్సీబీ ఓటమిపాలవ్వడంతో ప్లే ఆఫ్స్కు చేరిన నాలుగో జట్టుగా ముంబై నిలిచింది. గుజరాత్ ఓపెనర్ శుభ్మర్ గిల్ సుడిగాలి శతకంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలపై నీళ్లు చల్లాడు. రేపు (మే 23) జరుగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్-సీఎస్కే.. మే 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో-ముంబై.. మే 26న జరిగే క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్లో గెలిచిన జట్టు.. మే 28న జరిగే ఫైనల్లో క్వాలిఫయర్ 1 విన్నర్-క్వాలిఫయర్ 2 విన్నర్లు తలపడతాయి. చదవండి: IPL 2023: ధోనితో విభేదాలు.. మధ్యలో రవీంద్ర జడేజా భార్య..! -
CSK: అట్టడుగు నుంచి అగ్రస్థానానికి.. ఒక్క సీజన్లో ఎంత మార్పు..!
ఐపీఎల్ 2023లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సంచలన విజయాలు సాధిస్తూ (7 మ్యాచ్ల్లో 5 విజయాలు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. చివరి నుంచి రెండో స్థానంతో గత సీజన్ను ముగించిన సీఎస్కే.. ప్రస్తుత సీజన్లో అనూహ్యంగా పుంజుకుని ఓ రేంజ్లో ఇరగదీస్తుంది. ఈ సీజన్ను సైతం ఓటమితో (గుజరాత్ చేతిలో) ప్రారంభించిన ధోని సేన.. ఆతర్వాత ఆడిన 6 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క ఓటమిని (రాజస్థాన్) మూటగట్టుకుని బ్రేకుల్లేని బుల్డోజర్గా దూసుకుపోతుంది. నిన్న (ఏప్రిల్ 23) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టు.. హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా భారీ జంప్ చేసింది. కేకేఆర్పై భారీ స్కోర్ చేయడంతో ఆ జట్టు రన్రేట్ సైతం గణనీయంగా మెరుగుడింది. సీఎస్కేలో ఒక్క సీజన్లో ఇంత మార్పు రావడంతో ఆ జట్టు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు ఇదే జోరును కొనసాగించి, ఐదో టైటిల్ సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు యువకులు, వెటరన్ ఆటగాళ్ల సమ్మేళనంలా ఉన్న సీఎస్కే సైతం ఈ సారి ఎలాగైనా టైటిల్ సాధించాలని దృడ నిశ్చయంతో ఉంది. తమ సారధి ధోనికి బహుశా ఈ సీజన్ ఆఖరిది కావొచ్చనే సంకేతాలు అందడంతో సీఎస్కే సభ్యులంతా తమలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీసి టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు లాంటి వెటరన్లకు కూడా ఇదే సీజన్ ఆఖరిది అయ్యే అవకాశం ఉండటంతో, వారిని సైతం ఘనంగా సాగనంపాలని భారీగా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ అయిన తమ నాయకుడికి టైటిల్తో వీడ్కోలు పలకడమే తామందించగలిగే గౌరవమని సీఎస్కే సభ్యులు భావిస్తున్నారు. ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. కేకేఆర్ బౌలర్లపై సీఎస్కే బ్యాటర్లు ఓ రేంజ్లో డామినేషన్ చలాయించారు. రహానే (29 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (21 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), డెవాన్ కాన్వే (40 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో జేసన్ రాయ్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినప్పటికీ కేకేఆర్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
IPL 2023: ఏప్రిల్ 6.. ఏడాది గ్యాప్.. కేకేఆర్ బ్యాటర్ల మహోగ్రరూపం
ఐపీఎల్ 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్లు) పూనకం వచ్చినట్లు ఊగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. Still in awe of this... 🥰pic.twitter.com/amSg9sZdvU — KolkataKnightRiders (@KKRiders) April 6, 2023 ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికర విషయం ఏంటంటే.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున (ఏప్రిల్ 6, 2022) కేకేఆర్ ఆల్రౌండర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదాడు. నాడు ముంబై ఇండియన్స్పై కమిన్స్ 14 బంతుల్లోనే హాఫ్సెంచరీ కొట్టాడు. నిన్నటి మ్యాచ్లో శార్దూల్ కూడా కమిన్స్ తరహాలోనే రెచ్చిపోయి ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. ఒకే రోజు, ఏడాది గ్యాప్లో కేకేఆర్ బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చడం యాదృచ్చికంగా జరిగినప్పటికీ కేకేఆర్ అభిమానులు మాత్రం ఏప్రిల్ 6 గురించి చెప్పుకుంటూ తెగ సంబురపడిపోతున్నారు. 𝘚𝘢𝘮𝘢𝘫𝘩 𝘳𝘢𝘩𝘦 𝘩𝘰! 😌@imShard @patcummins30 #KKRvRCB | #AmiKKR | #TATAIPL 2023 pic.twitter.com/shanGi5s82 — KolkataKnightRiders (@KKRiders) April 6, 2023 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో కేకేఆర్ ఇన్నింగ్స్లో శార్దుల్తో పాటు రహ్మానుల్లా గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. Pat Cummins finishes things off in style! Also brings up the joint fastest half-century in #TATAIPL off 14 deliveries.#KKR win by 5 wickets with 24 balls to spare. Scorecard - https://t.co/22oFJJzGVN #KKRvMI #TATAIPL pic.twitter.com/r5ahBcIWgR — IndianPremierLeague (@IPL) April 6, 2022 అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీని.. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), ఇంపాక్ట్ ప్లేయర్ సుయశ్ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డెప్లెసిస్ (23) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన ఐపీఎల్ 2022 ఫైనల్.. ఎందుకంటే..?
ఈ ఏడాది (2022) మే 29న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం (మొతేరా) వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన ఆ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 1,01,566 మంది హాజరయ్యారు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్కు ఈ స్థాయిలో ప్రేక్షకులు హాజరుకావడం అదే తొలిసారి. దీంతో ఐపీఎల్-2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది. A proud moment for everyone as India creates the Guinness World Record. This one is for all our fans for their unmatched passion and unwavering support. Congratulations to @GCAMotera and @IPL pic.twitter.com/PPhalj4yjI— BCCI (@BCCI) November 27, 2022 ఈ విషయాన్ని బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఇవాళ (నవంబర్ 27) వెల్లడించింది. బీసీసీఐ తరఫున కార్యదర్శి జై షా గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి నుంచి అవార్డు ప్రతిని అందుకున్న దృష్యాన్ని షేర్ చేసింది. భారతీయులకు ఇదో గర్వించదగ్గ క్షణం. భారత్.. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఇది మా అభిమానులకు అంకితం.. మొతేరా, ఐపీఎల్కు అభినందనలు అంటూ బీసీసీఐ ట్విటర్లో రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే, నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. ఆడిన తొలి లీగ్లోనే అండర్ డాగ్గా బరిలోకి దిగిన హార్ధిక్ సేన ఛాంపియన్గా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగా, గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్లో 3 వికెట్లు పడగొట్టి, 30 బంతుల్లో 34 పరుగులు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. -
IPL 2023: ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
ఐపీఎల్-2023 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ, ఐపీఎల్ నిర్హహకాకులు ఆయా ఫ్రాంచైజీలకు సమాచారం కూడా అందించినట్లు తెలస్తోంది. కాగా ఈ మినీ వేలం దాదాపు డిసెంబర్ 16న జరిగే అవకాశం ఉంది. అయితే వేలంకు సంబంధించి వేదిక మాత్రం ఇంకా ఖరారు కాలేదు. కాగా ఐపీఎల్ 16వ సీజన్ వచ్చే ఏడాది మార్చి అఖరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సారి ఐపీఎల్ మ్యాచ్లను హోమ్, అవే పద్ధతిలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. అదే విదంగా ఈ మినీ వేలంలో ప్రతీ ప్రాంఛైజీ పర్స్ బ్యాలెన్స్ను 5 కోట్లు పెంచి 95 కోట్లుగా నిర్ణయించారు. ఒక వేళ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను వదిలివేయడం లేదా ఇతర జట్ల నుంచి తీసుకుంటే పర్స్ బ్యాలెన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు ముందు మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ను గుజరాత్ టైటాన్స్ కైవసం చేసుకుంది. అరంగేట్ర సీజన్లోనే హార్దిక్ పాండ్యా నేతత్వంలోని గుజరాత్ అదరగొట్టింది. ఆహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో రాజస్తాన్ను ఓడించి గుజరాత్ టైటిల్ను సొంతం చేసుకుంది. చదవండి: T20 WC 2022: పంత్కు కచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాల్సిందే: ఆసీస్ దిగ్గజం
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement