-
తిరుపతి జనసేన నాయకులతో నాగబాబు సమావేశం
-
ట్వీటు రాజా? పోటీ లేదా?
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడితే చాలు మెగా బ్రదర్స్ అయిన పవన్, నాగబాబు తెగ హడావుడి చేస్తారు. రాష్ట్రంలో మూడు పార్టీల పొత్తుల కోసం తాను ఎన్నో త్యాగాలు చేస్తున్నానని పవన్ కల్యాణ్ పదేపదే చెప్పుకుంటూ బాబుతో ప్యాకేజీ ఒప్పందం చేసుకుంటే... నాగబాబు మాత్రం తానో అపర మేధావి అనుకుంటూ.. ఎక్కడెక్కడో కొటేషన్లో, పిట్టకథలో తీసుకొని తన సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. ఆపై ప్రతి నెల మొదటి వారంలో తన సోషల్ మీడియాలో QR కోడ్ను షేర్ చేసి వంద రూపాయల నుంచి విరాళం పంపాలని కోరుతాడు. అలా ఎప్పుడూ ఆయన నెట్టింట మెగా ఫ్యాన్స్కు టచ్లో ఉంటారు. వాస్తవంగా నాగబాబు కూడా తమ్ముడు పవన్ టైపే! పవన్ స్టేజీపై ఊగిపోతూ మాట్లాడితే.. కొణిదెల నాగబాబు మాత్రం ఇంట్లో కూర్చోని ట్విటర్లో ఊగిపోతాడు. పసలేని తన ట్వీట్లతో ఆజ్ఞానంలో మునిగితేలుతూ అభిమానులపై తన జ్ఞాన ప్రదర్శన చూపిస్తాడు. జనసేనను రాజకీయ పార్టీగా బలపరచుకోండయ్యా అని తెలివైన అభిమానులు సలహాలు ఇస్తే.. వారందరినీ వైసీపీ కోవర్ట్లు అంటూ పార్టీ నుంచి వెళ్లిపోండి అంటారు. పవన్ ఏమో చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుంటే.. నాగబాబు మాత్రం పేటీఎం స్కానర్ పట్టుకుని సోషల్ మీడియాతో పాటు ప్రపంచం మొత్తం తిరుగుతాడు. ఫ్యాన్స్ అభిమానాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు మెగాబ్రదర్స్ ఇద్దరూ ఇలా ఎప్పుడూ బిజీగానే ఉంటారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి అందరి కంటే ముందుగానే అక్కడ ఎంట్రీ ఇచ్చాడు నాగబాబు.. అచ్యుతాపురంలో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఉన్నట్టుండి అన్నయ్యకు పవన్ షాకిచ్చాడు. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును జనసేన త్యాగం చేస్తుందని దానికి ఎల్లో కలరింగ్ ఇచ్చాడు. దీంతో ఎన్నికల యుద్ధం నుంచి కత్తి పట్టకుండానే వెనుతిరిగాడు. అప్పటి వరకు వారం రోజుల పాటు అక్కడ హడావుడి చేసిన నాగబాబు తన షెడ్యూల్కు ప్యాకప్ చెప్పడమే కాకుండా ఆ ఇంటికి టూలెట్ బోర్డు పెట్టేశాడు. ఆపై అనకాపల్లి నుంచి హైదరాబాద్కు మకాం మార్చేసి.. హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో నాగబాబు ఇంటికే పరిమితం అయి ట్వీట్లు చేసుకుంటూ కాలం గడపుతున్నాడు. వాస్తంగా అక్కడ నాగబాబు ఎంట్రీ సమయంలోనే ఆయనది ఐరన్ లెగ్ అంటూ జనసేన అభిమానులు చెప్పుకొచ్చారు. వారు అనుకున్నదే తర్వాత నిజమైంది. అనకాపల్లిలో నాగబాబు ఓట్లు అడగడం కంటే ప్రజలకు ఎక్కువగా క్యూ ఆర్ కోడ్ను చూపించేవారట. వంద రూపాయల నుంచి ఎంతైనా స్కాన్ చేయండి అని వారి ఫ్యాన్స్కు చెప్పేవారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా కొంతమేరకు అసహనానికి గురైయ్యారు. ఇన్నాళ్లూ పార్టీలో నాగబాబుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని భావించిన వారికి ఆయనకు అంత సీను లేదని ఫ్యాన్స్కు అర్థమైంది. నిజంగా జనసేనలో నాగబాబుకు పట్టున్నా, లేక పవన్ వద్ద పలుకుబడి ఉన్నా ఆయనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కారణంగా ఆయన సోదరుడు నాగబాబు పొలిటికల్ కేరీర్ ఇంతటితో క్లోజ్ అయినట్లే.. మరో కొద్దిరోజుల్లో చంద్రబాబు వల్ల పవన్ పొలిటికల్ కెరియర్ కూడా క్లోజ్ అవుతుందని మెగా ఫ్యాన్సే బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత పార్టీ పేరుతో వారిద్దరూ విరాళాలు రాబట్టుకోవడంలో బిజీగా ఉంటారని పలువురు జోష్యం చెబుతున్నారు. -
పవన్ కల్యాణ్ సొంత అన్నకే దిక్కులేదు.. మేమెంత?
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన శ్రేణుల్లో సరికొత్త అలజడి రేగుతోంది. ఇప్పటికే టీడీపీతో పొత్తులో అరకొర సీట్ల కేటాయింపు వీరికి మింగుడు పడడంలేదు. చాలీచాలని సీట్లతో ఎవరికి ఎసరు వస్తుందోనని లోలోన ఆందోళన చెందుతు న్నారు. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి తానే బరిలో ఉంటున్నానని, అచ్యుతాపురంలో కాపురం కూడా పెట్టి నానా హంగామా చేసిన నాగబాబు.. పక్షం రోజులు తిరక్కుండానే పలాయనం చిత్తగించారు. ఈ పరిణామానికి జనసేన క్యాడరు షాక్కు గురైంది. పవన్ కల్యాణ్ సొంత సోదరునికే ఈ పరిస్థితి వస్తే ఇక మేమెంత? అంటూ పార్టీలో టిక్కెట్లను ఆశిస్తున్న వారు నిర్వేదంలో పడిపోయారు. ఇన్నాళ్లూ పార్టీలో నాగబాబుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని భావించిన వారికి ఆయనకు అంత సీను లేదని తేటతెల్లమైంది. నిజంగా జనసేనలో పట్టున్నా, లేక పవన్ వద్ద పలుకుబడి ఉన్నా నాగబాబుకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. స్వయంగా అన్నకే పార్టీలో దిక్కు లేదని, ఇక ఆయనను నమ్ముకుంటే తాము నట్టేట మునిగినట్టేనని వాపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాగబాబుకు అన్ని విధాలా దన్నుగా నిలిచి, ఆయన వ్యవహారాలు చూస్తున్న యలమంచిలి ప్రాంతానికి చెందిన సుందరపు బ్రదర్స్ (విజయ్కుమార్, సతీష్కుమార్) సైతం నాగబాబు ఎపిసోడ్తో పత్తాలేకుండా పోయారు. వాస్తవానికి వీరిలో విజయకుమార్ యలమంచిలి, సతీష్కుమార్ గాజువాక సీట్లను ఆశిస్తున్నారు. ఇందుకోసం వీరు నాగబాబును ప్రసన్నం చేసుకుంటూ అటు అనకాపల్లి జిల్లాలోను, ఇటు విశాఖపట్నం జిల్లాలోనూ వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. నాగబాబు మనుషులుగా ముద్ర వేయించుకున్న వీరు కొంతమంది నుంచి వసూళ్లకు దిగారన్న ఆరోపణలున్నాయి. నాగబాబు తాజా పరిస్థితితో వీరు ఆందోళన చెందుతున్నట్టు చెబుతున్నారు. త్యాగాలకు సిద్ధంకండి.. మరోవైపు భీమిలి జనసేన సీటు తనకే ఖాయమైందని బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న పంచకర్ల సందీప్కు కాకుండా టీడీపీకి కేటాయిస్తున్నట్టు ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ సారి ఈ సీటును త్యాగం చేయాలని అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సందీప్కు స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే గాజువాక స్థానం నుంచి తమ అభ్యర్థే బరిలో ఉంటారన్న ప్రచారాన్ని టీడీపీ నేతలు విస్తృతం చేశారు. దీంతో అక్కడ జనసేన సీటును ఆశిస్తున్న సుందరపు సతీష్కుమార్, కోన తాతారావులు కూడా త్యాగాలు చేయాల్సి వస్తుందని అంటున్నారు. ఇక జనసేన నుంచి విశాఖ దక్షిణ సీటును వంశీకృష్ణ శ్రీనివాస్, సాధిక్, ప్రసాదరెడ్డి, కందుల నాగరాజు, డాక్టర్ మూగి శ్రీనివాసరావులు ఆశిస్తున్నారు. ఈ స్థానం నుంచి కూడా టీడీపీ అభ్యర్థే పోటీ చేస్తారని తెలియడంతో వీరంతా కలవరం చెందుతున్నారు. ఆ ఇద్దరిలో ఒక్కరికే చాన్స్? ఇక ఎమ్మెల్యే టిక్కెట్టును ఆశించి వైఎస్సార్సీపీ నుంచి జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్లు జంప్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరిలో ఒక్కరికే జనసేన సీటు దక్కవచ్చని చెబుతున్నారు. పెందుర్తి స్థానం పంచకర్లకు దాదాపు ఖరారైందని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే వంశీకృష్ణకు మొండి చెయ్యే గతయ్యే పరిస్థితి తలెత్తనుంది. అదే జరిగితే జనసేన త్యాగరాజుల జాబితాలో ఆయన కూడా చేరిపోనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కీలకనేతలు తమకు గుర్తింపు లేదని, నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి పరిణామాలతో ఇప్పటికే జాడలేకుండా పోయారు. ఇప్పుడు వీరికి త్యాగమూర్తులు కూడా తోడయ్యే అవకాశం ఉంది. -
అనకాపల్లి నుండి నాగబాబు పరార్
-
జెండా పీకేసిన నాగబాబు..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
తీరం మారింది
నిర్మాత బండ్ల గణేష్పై కేసు నమోదు
ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
తప్పక చదవండి
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- Bobbili: వాటీజ్ దిస్ ‘బేబీ’?
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
Advertisement