-
దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? టీడీపీ అధినేత నారా చంద్రబాబు యుక్తాయుక్త విచక్షణ మరిచి ‘రాళ్లతో కొట్టండి.. కర్రలతో బాదండి..’ అని సెలవిస్తే పచ్చదండు ఊరుకుంటుందా? ‘నిన్ను చంపితే ఏం చేస్తావ్..’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ నేతల గత వైఖరిని మరోసారి గుర్తు చేస్తున్నాయి. ‘ఓటు వేయకుంటే పోటు.. అడ్డు తగిలితే వేటు’.. స్థూలంగా చెప్పాలంటే టీడీపీ సిద్ధాంతం ఇదే. ప్రజల ఆశీస్సులతో గద్దెనెక్కాలనే ఆలోచనకే తావు లేకుండా తమకు తెలిసిన ‘దండన’ విద్యనే పచ్చ నేతలు నమ్ముకున్నారు. నిత్యం తగువులే తలంపుగా వ్యవహరిస్తూ ప్రత్యర్థి పారీ్టల నాయకులు, కార్యకర్తలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో టీడీపీ నేతల వికృత క్రీడకు బలైన రాజకీయ నాయకులు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నారు. అంతకు పది రెట్ల మంది అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. పచ్చటి పల్లెల్లో చిచ్చుపెట్టడమే కాకుండా తమ అహానికి, అవినీతికి అడ్డు వస్తున్నారనే కారణంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు మళ్లీ బరితెగించారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారాన్ని అడ్డంపెట్టుకుని పచ్చమూకలు రెచ్చిపోయాయి. పల్లెల్లో దాడులకు తెగబడ్డాయి. తమకు అడ్డువస్తే అంతమొందించడమే లక్ష్యంగా రెచ్చిపోయాయి. నేడు అధికార పక్షంపై వికృత రాతలతో శునకానందాన్ని పొందుతున్న పచ్చమీడియా నాడు కళ్లుండి చూడలేదని కబోదుల్లా చోధ్యం చూశాయి. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అరాచకాల్లో కొన్ని ప్రధాన ఘటనలు ఎంపీటీసీ భర్తను చంపారు 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్రిపూడి మండలం కెల్లంపల్లి సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలిగా తేలుకుట్ల గురవమ్మ పోటీ చేశారు. ఏప్రిల్ 11న గోసుకొండ అగ్రహారంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడటంతో గురవమ్మ భర్త వెంకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఒంగోలులో చికిత్స ΄పొందుతూ మృతి చెందారు. ఏడాది వ్యవధికే దిగులుతో గురవమ్మ కూడా కన్నుమూసింది.దాడులకు అంతే లేదు..పీసీపల్లిలో 2017 జూలైలో వైఎస్సార్ సీపీ ఎంపీపీ బత్తుల అంజయ్యపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. 2015 ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా నారాయణ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై ప్రశ్నించిన అప్పటి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్తోపాటు మరో ఏడుగురిపై అక్రమంగా కేసులు బనాయించారు. కొండపి నియోజకవర్గంలో అయ్యప్పరాజుపాలెంలో ఎంపీటీసీ ఎన్నికల రోజున ఐదుగురిపై దాడి చేసి గాయపరిచారు. జరుగుమల్లి మండలానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.జయబాబుపై టీడీపీ నేతలు దుర్మార్గంగా రేప్ కేసు పెట్టించారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో సాధారణ ఎన్నికల సమయంలో వెంకట్రావు అనే వ్యక్తి ఏజెంట్గా కూర్చున్నాడని అతనికి చెందిన రూ.5 లక్షల విలువ చేసే పొగాకును టీడీపీ నాయకులు తగలబెట్టారు. 2014లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సమయంలో టీడీపీ బరితెగించింది. మార్కాపురం జెడ్పీటీసీ రంగారెడ్డి ఓటింగ్లో పాల్గొనకుండా చేసేందుకు ఎస్సీ, ఎస్టీ కేసు పేరుతో అరెస్టు చేయించారు. గాజులపల్లెలో దాష్టీకం2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని పుల్లలచెరువు మండలం మర్రివేముల నుంచి ఆ పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యంలో గాజులపల్లెలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను రెచ్చగొట్టడమే కాకుండా మర్రివేముల నుంచి 100 మంది టీడీపీ కార్యకర్తలను తీసుకెళ్లి దమనకాండ సృష్టించారు. ఇళ్లలోకి చొరబడి ఆడామగా తేడా లేకుండా బయటకు లాక్కుని వచ్చి విచక్షణా రహితంగా దాడి చేశారు. బీరువాలు పగలగొట్టి రూ.2 లక్షల సొమ్ము లూటీ చేశారు. మమ్ము రమణ అనే నిండు గర్భిణిని కాలితో తన్నడంతో ఆమెకు అబార్షన్ చేయాల్సి వచ్చింది. మమ్ము చిన్న అంజయ్య అనే వ్యక్తిపై దాడి చేయడంతో ఎముకలన్నీ విరిగి ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి. సుమారు పది వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పురుగుమందు డబ్బాలు తెచ్చి కొందరిపై పోసి రాక్షసానందం పొందారు. రాళ్లదాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త బలి పొన్నలూరు మండలంలోని లింగంగుంట గ్రామంలో 2018 సెపె్టంబర్లో వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు రంగునీళ్లు చల్లి రెచ్చగొట్టారు. మరుసటి రోజు ఉదయం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కొందరు బహిర్భుమికి వెళ్లి వస్తున్న సమయంలో మాటువేసిన టీడీపీ నాయకులు కొందరు ఇంటిపైకి ఎక్కి ఒక్కసారిగా ఇటుక రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎనిమిరెడ్డి పెదబ్రహ్మయ్య చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.రెచ్చగొట్టి.. అక్రమ కేసులు పెట్టి.. ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో ఆలూరి శ్రీహరి ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని 2019లో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్ పెట్టడమే కాకుండా, బూతులు తిడుతూ.. తొడలు చరుస్తూ టీడీపీ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. దాడికి దిగడమే కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చి బాలినేనితోపాటు ఆయన కుమారుడు ప్రణీత్రెడ్డి, మరికొందరిపై నాన్బెయిలబుల్ కేసులు పెట్టించారు. కమ్మపాలెంలో దళితులు నివసించే ప్రాంతాల్లో డ్రెయినేజీ, రోడ్లు, పబ్లిక్ టాయ్లెట్కు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినా టీడీపీ నేతలు అడ్డుపుల్ల వేశారు. కమ్మపాలెంలో 119 మంది దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాల్లోకి వారిని వెళ్లనివ్వకుండా దామచర్ల అడ్డుకున్నారు. దళితులు మొత్తుకుంటున్నా వినకుండా ఆ స్థలంలో గుండా డ్రెయినేజీ నిర్మించి జులుం ప్రదర్శించారు. ఒంగోలు సమతా నగర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ప్రచారానికి ఉద్దేశపూర్వకంగా అడ్డుతగిలిన పచ్చ మందలో మేడికొండ మోహన్రావు, ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ చౌదరి, ఆయన భార్య కీలకంగా ఉన్నారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఏఆర్ కానిస్టేబుల్ భార్య మాట్లాడిన బూతులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయిన రోజున బండ్లమిట్టలోని దుకాణాలపై టీడీపీ నేతలు తెగబడ్డారు. ఓ ముస్లిం యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేయడమే కాకుండా, దుకాణం షట్టర్ మూతవేసి హల్చల్ చేశారు. గాయపడిన ముస్లిం యువకుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దాడిలో కీలక సూత్రధారి, సమతానగర్లో రచ్చకు కారణమైన మేడికొండ మోహన్రావే. నగరంలో రాజకీయ ఘర్షణలు ఎక్కడ జరిగినా మోహన్రావు పేరే ప్రధానంగా వినిపిస్తోంది. మోటా నవీన్ అనే ఎస్టీ యువకుడిని చితకబాది ముఖంపై మూత్రం పోసిన కేసులో నిందితుడు రామాంజనేయ చౌదరికి ఆశ్రయం కలి్పంచి పోలీసులకు చిక్కకుండా కొద్ది రోజులపాటు అడ్డుపడింది మోహన్రావే అన్న ఆరోపణలున్నాయి. దాడి కేసులో జైలుకు వళ్లి వచ్చిన మోహన్రావును ముందు పెట్టి దామచర్ల జనార్దన్ ఆడిస్తున్న డ్రామాలను ఎల్లో పత్రిక ప్రముఖంగా ప్రచురించడం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది. -
మీ అమూల్యమైన ఓటుతో ఆయన్ను గెలిపించండి: దిల్ రాజు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియతో పాటుగా ఎన్నికల ప్రచారం కూడా పీక్స్కు చేరుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే సినిమా నటులు విశాల్, భాను చందర్, కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు వంటి స్టార్స్ అందరూ వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు తెలుపుతూ మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొనసాగుతారని చెప్పారు. ఏపీలో సీఎం జగన్ చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ వారందరు కూడా పలు వ్యాఖ్యలు చేశారు.టాలీవుడ్ దిగ్గజ నిర్మాతగా కొనసాగుతున్న 'దిల్ రాజు' తాజాగా ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా ఎన్నికలో బరిలో ఉన్న తన మిత్రుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డిని గెలిపించాలని కోరుతూ దిల్ రాజు ఇలా చెప్పుకొచ్చారు. 'బాలినేని శ్రీనివాసుల రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఎన్నో మంచి పనులు ఒంగోలు కోసం చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ గారి కేబినెట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ నేతృత్వంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఇప్పటి వరకు ఐదుసార్లు ఒంగోలు నుంచి బాలినేని గెలిచారు. అనేక అభివృద్ధి పనులతో ఒంగోలు పట్టణాన్ని ముందంజలో ఉంచారు.ఇప్పుడు ఆరోసారి ఒంగోలు నుంచి ఎన్నికల బరిలో బాలినేని ఉన్నారు. ఆయన్ను తప్పకుండా అక్కడి ప్రజలు గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. కొద్దిరోజుల క్రితం బాలినేని శ్రీనివాసుల రెడ్డి గారి మీద ఒక డాక్యుమెంటరీని తీశాను. అందులో ఆయన రాజకీయ ప్రస్థానంతో పాటు ఒంగోలు కోసం ఆయన ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అందరూ తెలుసుకోవచ్చు. ఆ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ నందు అందుబాటులో ఉంది. మీ అమూల్యమైన ఓటు బాలినేని శ్రీనివాసులుకు వేస్తారని ప్రార్థిస్తున్నాను. అని ఆయన కోరారు. దిల్ రాజు మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది. Ace Producer #DilRaju Supports YCP ongole Mla Candidate #BalineniSrinivasReddy pic.twitter.com/d6mtAKZxHH— cinee worldd (@Cinee_Worldd) April 24, 2024 -
తప్పుడు కేసులు పెడితే ఊరుకోను మాజీ మంత్రి బాలినేని ఫైర్
-
పోలీసులు ఓవర్ యాక్షన్ బాలినేని ఆగ్రహం
-
టీడీపీ నేత జనార్దన్ తీరుపై బాలినేని ఆగ్రహం
-
లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న ఫ్యామిలీకి ఎంపీ సీటు..
-
అంతరాలు అంతం
పేదలకూ పెద్దల తరహాలోనే ఇళ్ల పట్టాల విషయంలో ఆ రోజు నేను అధికారులందరినీ ఒకటే అడిగా. మీకు, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రముఖులకు ప్రభుత్వం ఎలా ఇస్తోందని అడిగితే దానికి వేరే పద్ధతి ఉందన్నారు. ప్రముఖులకు ఇచ్చే విధానంలో, పూర్తి హక్కులతో రాష్ట్రంలో ప్రతి నిరుపేదకూ ఇంటి పట్టాలివ్వాలని ఆదేశాలివ్వడమే కాకుండా చట్టంలో మార్పులు చేశాం. ఈరోజు అవే పూర్తి హక్కులతో పట్టాలన్నీ రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ నా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నాం. - ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పేదలకో న్యాయం.. పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని సమూలంగా మారుస్తూ 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పేదలకు ఉచితంగా అందించిన ఇళ్ల పట్టాల నుంచి విద్య, వైద్యం, సామాజిక రంగాలలో ఇదే ఒరవడిని అనుసరిస్తూ ధనిక – పేద అంతరాలను తొలగిపోయేలా విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు. నాడు – నేడుతో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ చదువులను పేదింటి పిల్లలకు చేరువ చేయడంతోపాటు ఖరీదైన, నాణ్యమైన వైద్యాన్ని సర్కారీ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద లబ్దిదారులకు సర్వ హక్కులతో రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల పాటు పండుగలా కొనసాగనున్నాయి. రెండు రకాల రూల్సా..? దేశ చరిత్రలో తొలిసారిగా 31 లక్షల మందికి ఇచ్చిన డీ పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్న కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి జరుగుతోంది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం, మంచి చేయడంలో గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో అంతా గమనించాలి. పేదల బతుకులు మారి వారి బిడ్డలు గొప్పగా ఎదిగేలా 58 నెలలుగా మన ప్రతి అడుగూ పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. ఐఏఎస్లు, ఎమ్మెల్యేలు, ఇతర పెద్దలకు ఇచ్చే ప్లాట్లకు విధించే నిబంధనలే పేదలకూ వర్తింపచేయాలనే ఉద్దేశంతో కన్వేయన్స్ డీడ్లతో రిజిస్ట్రేషన్ చేసి అందిస్తున్నాం. రాష్ట్రంలో రెండు రకాల నిబంధనలు ఉన్నట్లు తెలుసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. పేదలకు ఒక రకంగా, పెద్దలకు మరో రకంగా నిబంధనలు ఉండటం సరికాదు. అలాంటి విధానాలపై తిరుగుబాటు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. 58 నెలల ప్రయాణంలో ప్రతి అడుగూ అలాగే వేస్తున్నాం. చదువుల్లో అంతరాన్ని తొలగిస్తూ.. పేదలకో న్యాయం, పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని మార్చేయాలనే తపనతో మన అడుగులు పడ్డాయి. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు పేద పిల్లలు గవర్నమెంట్ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుతుంటే డబ్బున్న వారి పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా మన గవర్నమెంట్ స్కూళ్లలో నాడు–నేడుతో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లిష్ మీడియంతో పాటు బైలింగ్యువల్ బుక్స్, బైజూస్ కంటెంట్, 8వ తరగతి నుంచి ట్యాబ్లు అందిస్తున్నాం. 6వ తరగతి నుంచి ప్రతి క్లాసు రూములో డిజిటల్ బోధన. ఐఎఫ్పీ ప్యానళ్లు అందుబాటులోకి తెచ్చాం. పేద పిల్లలు కాన్వెంట్ డ్రస్, షూస్ వేసుకుని చిరునవ్వుతో ప్రభుత్వ స్కూళ్లకు వెళుతున్నారు. సీబీఎస్ఈ నుంచి ఐబీ విద్యా విధానం స్థాయికి గవర్నమెంట్ బడులను తీసుకెళుతున్నాం. పెద్ద చదువులు చదివే పిల్లలకు వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ విద్యాదీవెన, వసతి దీవెనతో పాటు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, ఎంఐటీ, హార్వర్డ్ లాంటి ప్రఖ్యాత వర్సిటీల నుంచి ఉచితంగా ఆన్లైన్లో కోర్సులు చదివేలా మనందరి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డబ్బులేని వారి పిల్లలకు, డబ్బున్న వారి పిల్లలకు మధ్య చదువుల పరంగా అంతరాన్ని చెరిపేయడం అంటే ఇదీ అని చెప్పడానికి గర్వపడుతున్నా. పేదలకు, పెద్దలకు ఒకే రకమైన వైద్యం ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం ఇవాళ పేదలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,000కి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లింది మన ప్రభుత్వమే. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షల వరకు ఉచితంగా విస్తరించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. అంతేకాకుండా శస్త్ర చికిత్సల తరువాత రోగి విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు చేతిలో పెడుతూ ఆరోగ్య ఆసరా తెచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష ద్వారా ఉచితంగా వైద్యంతోపాటు మందులు కూడా అందుతోంది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. నేను చెప్పే ప్రతి మాటా కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. గతానికి, ఇప్పటికి మధ్య తేడాను గమనించండి. పేదలకు, పెద్దలకు ఒకే రకమైన వైద్యం అందించడం అంటే ఇదీ. బడుగు, బలహీన వర్గాలకు పదవులు గతంలో పెత్తందార్ల మనుషులు మాత్రమే అనుభవించిన నామినేటెడ్ పదవులను చట్టం చేసి ఏకంగా 50 శాతం బడుగు, బలహీన వర్గాల చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. సామాజిక అంతరాలను చెరిపేయడం అంటే ఇదీ. సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత అంటే ఇదీ. పేదల ఆంధ్రప్రదేశ్ వేరు... డబ్బున్న వారి ఆంధ్రప్రదేశ్ వేరు అనే భావాలను పూర్తిగా తుడిచి వేస్తూ, పేదలకో న్యాయం – డబ్బున్న వారికో న్యాయం అనే విధానాలను రద్దు చేస్తూ మన అడుగులు పడ్డాయి. సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీలు.. రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ వల్ల ఆస్తిపై అక్కచెల్లెమ్మల హక్కులు భద్రంగా ఉంటాయి. దొంగ సర్టిఫికెట్లు సృష్టించేందుకు వీలుండదు. ఎప్పుడు పడితే అప్పుడు రద్దు చేయలేరు. సచివాలయాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆస్తికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఎన్నిసార్లైనా పొందవచ్చు. అందులో హక్కుదారు మీరే అన్న విషయం సచివాలయాల్లో శాశ్వతంగా, భద్రంగా ఉంటుంది. సరిహద్దు రాళ్లతో స్థలం వద్ద అక్కచెల్లెమ్మల ఫొటో తీసి జియోట్యాగింగ్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఎవరూ కబ్జా చేయలేరు. పదేళ్లు కాగానే ఆ పట్టాలను అమ్ముకునేందుకు, వారసత్వంగా ఇచ్చేందుకు, గిఫ్ట్గా ఇచ్చేందుకు పట్టా భూములున్న వారితో సమానంగా ఆటోమేటిక్గా హక్కులు సంక్రమిస్తాయి. ఆ తేదీ వివరాలతో సహా స్పష్టంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో పొందుపరిచాం. ఎన్ఓసీ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. బ్యాంకు రుణాలు కావాలంటే సులభంగా తక్కువ వడ్డీకే అక్కచెల్లెమ్మలకు అందుతాయి. నా అక్కచెల్లెమ్మలు, పేదలకు ఇచ్చే స్థలాలు, హక్కులు, ఆత్మగౌరవం గురించి ఇంతగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూశారా? అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, మంచి తమ్ముడిగా ముఖ్యమంత్రి స్థానంలో వారి బిడ్డ ఉన్నాడు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతున్నాం. ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇవన్నీ చూస్తుంటే వంద మంది సినిమా విలన్ల కంటే, పురాణాల్లో రాక్షసులందరి కంటే ఒక్క చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అనిపిస్తుంది. చివరికి అమరావతిలో మనం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందంటూ ఆ పెద్దమనిషి నిస్సిగ్గుగా కోర్టుల్లో కేసులు వేసి తన లాయర్లతో వాదించాడు. ఇంత అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తి జంకు లేకుండా ప్రజల్లో తిరుగుతున్నాడంటే ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని వాదిస్తే తల్లిదండ్రులంతా గట్టి గుణపాఠం చెబుతారనే భయం లేకుండా చంద్రబాబు పాపిష్టి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దారుణమైన వ్యాఖ్యలు చేసి కూడా బరితెగించి తిరుగుతున్నారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? బీసీల తోకలు కత్తిరిస్తా.. ఖబడ్దార్! అని వ్యాఖ్యానిస్తే బీసీలంతా బుద్ధి చెబుతారన్న భయం కూడా లేకుండా ఉండగలుగుతున్నాడంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను మోసగించిన ఈ మాయలోడు ఏ జంకూ గొంకూ లేకుండా ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాడంటే ఇంతకన్నా దారుణం ఉందా? 650 వాగ్దానాలిచ్చి కనీసం 10 శాతం కూడా అమలు చేయకుండా ఎన్నికలొచ్చేసరికి నిస్సిగ్గుగా మళ్లీ కొత్త మేనిఫెస్టోతో సిద్ధమయ్యాడంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? మన ఖర్మ ఏమిటంటే ఇలాంటి వ్యక్తులతో ఈరోజు మనం రాజకీయాలు చేస్తున్నాం. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, ధర్మాన ప్రసాదరావు, మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఐజీ రామకృష్ణ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సీనియర్ ఐఏఎస్ ముత్యాలరాజు, కలెక్టర్ ఏఎస్.దినేష్కుమార్, ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెంటు కూడా ఇవ్వకపోగా బాబు కుట్రలు.. 2020 ఉగాది నాటికే ఈ ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మలకు ఇవ్వాలనుకున్నా కొందరు రాక్షసుల మాదిరిగా అవరోధాలు సృష్టించారు. అధికారంలో ఉండగా పేదవాడికి ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపానపోని చంద్రబాబు ఇవాళ మనం ఇస్తుంటే అడ్డుపడి ఆయన మనుషుల ద్వారా ఏకంగా 1,191 కేసులు దాఖలు చేశారు. వీటిని అధిగమించి ఇవాళ ఒక్క ఒంగోలులోనే 21 వేల మంది పేదలకు సర్వ హక్కులతో ఇళ్ల పట్టాలిస్తున్నాం. ఒంగోలు అర్బన్లో నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం యర్రజర్ల హిల్స్లో 866 ఎకరాలను 2020లోనే గుర్తించి 24 వేల ప్లాట్లతో లే అవుట్లు సిద్ధం చేశాం. ఈ గొప్ప కార్యక్రమానికి అడ్డుపడి చంద్రబాబు, ఆయన మనుషులు కోర్టులో కేసు వేశారు. ఒక్క ఒంగోలే కాకుండా ఏ జిల్లాలో చూసినా చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలివ్వలేదు. మనం ఇస్తుంటే ఆయన అసూయ దాగటం లేదు. ఇవన్నీ దాటుకుంటూ మీ బిడ్డ అడుగులు వేశాడు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్లేశ్వరపురం, ఎన్.అగ్రహారం, వెంగముక్కపాలెం, యర్రజెర్ల గ్రామాలకు చెందిన 342 మంది రైతన్నల దగ్గర నుంచి 536 ఎకరాల భూమిని సేకరించేందుకు రూ.210 కోట్లు ఖర్చు చేసి ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మరో రూ.21.33 కోట్లు లే అవుట్ అభివృద్ధి కోసం వ్యయం చేస్తున్నాం. ఇదే ఎన్.అగ్రహారం, మల్లేశ్వరపురంలో 31 బ్లాక్స్లో, వెంగముక్కపాలెం, యర్రజెర్లలో మరో 32 బ్లాక్స్తో జగనన్న మోడల్ టౌన్ షిప్స్ను పూర్తి మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నాం. ఎస్టీపీ ప్లాంట్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వాటర్ సప్లయ్ కోసం రూ.247 కోట్లు ఖర్చు చేసేలా ఆదేశాలు ఇచ్చాం. ఒంగోలుకు మంచి చేస్తూ పట్టణంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు మరో రూ.339 కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్కు కూడా ఈరోజే శంకుస్థాపన చేస్తున్నాం. బైబై బాబు అంటున్న బాబు సతీమణి చంద్రబాబును నేను ఇవన్నీ ప్రశి్నస్తే నన్ను సవాల్ చేస్తున్నావా? అంటాడే కానీ ఇంటింటికీ ఫలానా మంచి చేశాను అని మాత్రం చెప్పడు. గ్రామ గ్రామానికీ ఇదిగో ఈ ఈ మంచి చేశానని చెప్పలేడు. జగన్ మాదిరిగా బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి జమ చేశాననే మాటలు ఈ పెద్దమనిషి నోట్లో నుంచి రావు. ఆయన చేయలేదు కాబట్టే చెప్పలేడు. ఒకవైపు ఎన్నికలకు మనమంతా సిద్ధం అంటుంటే.. మరోవైపు చంద్రబాబు భార్య మా అయన సిద్ధంగా లేరని అంటున్నారు. ఏకంగా కుప్పంలోనే బైబై బాబు.. అంటూ ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తున్నాయి. ఇలాంటి చంద్రబాబును రాష్ట్రంలో ప్రజలెవరూ సమర్థించడం లేదు. కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించడంలేదు. ఏపీకి రానివారు, సొంత ఊరు ఏదంటే తెలియని వారు, రాష్ట్రంలో ఓటే లేని వారు, ఇక్కడ దోచుకున్నది పంచుకోవడానికి అలవాటైన నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబును సమర్థిస్తారు. నాకు ఆయన మాదిరిగా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి మద్దతు లేవు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడాలని కోరుతున్నా. నేను పైన దేవుడిని, కింద మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నా. మధ్యలో దళారులను, బ్రోకర్లను నమ్ముకోలేదు. అడ్డంకులను అధిగమించి.. అధికారంలోకి రాగానే అందరికీ స్థలాలు ఇవ్వడానికి 71,811 ఎకరాలను సేకరించి పంపిణీ చేశాం. 17,005 లే అవుట్లలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు, కరెంటు, మంచినీరు, పార్కులు, కామన్ ఏరియాలు, ఇతర సదుపాయాల కోసం రూ.32 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా 8.90 లక్షల ఇళ్లను ఇప్పటికే పూర్తి చేశాం. మిగతావి వివిధ దశల్లో వేగంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఆ ఇంటి స్థలాల విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంది. ఒంగోలులో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలం విలువ గజం రూ.10 వేల పైచిలుకే ఉన్నట్లు ఇంతకు ముందే అధికారులు చెప్పారు. ఇక్కడ రెండు లే అవుట్లలో పేదలకు ఇచ్చిన ఒక్కో స్థలం విలువే రూ.6 లక్షలు కాగా రూ.2.70 లక్షలు ఖర్చు చేసి ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. రోడ్లు, డ్రెయినేజీ, కరెంటు సదుపాయాల కోసం మరో రూ.లక్ష దాకా వెచ్చిస్తున్నాం. ఇలా ఇల్లు పూర్తయ్యే సరికే ఒక్కో ఇంటి విలువ రూ.10 లక్షలు పైమాటే ఉంటుందని చెప్పడానికి సంతోషపడుతున్నా. అక్కచెల్లెమ్మలను మిలియనీర్లుగా చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.7 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా విలువైన స్థిరాస్తిని పెడుతున్నాం. తద్వారా ఏకంగా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా అక్కచెల్లెమ్మల కోసం ఖర్చు చేశామని చెప్పేందుకు గర్వపడుతున్నా. మహిళలకు ఆర్థిక సాధికారత, భద్రత పేదింటి అక్కచెల్లెమ్మల సాధికారత కోసం వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి, ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలతోపాటు దిశ యాప్, సచివాలయంలో మహిళా పోలీసుల ద్వారా అండగా నిలబడ్డాం. నా అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత, భద్రత రెండూ అందుతున్నాయి. ఇవన్నీ గతంలో లేవు. మన పథకాల ఫలితంగా మహిళా ఆర్థిక సాధికారత పెరిగింది. అంతరాలు తగ్గుతున్నాయని నేను చెప్పడం కాదు.. నిన్ననే విడుదలైన జాతీయ గణాంకాలే చెబుతున్నాయి. ఆర్థిక అంతరాలను చెరిపేయడం అంటే ఇదీ. గత 58 నెలల్లో డీబీటీతో ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేయగా ఇందులో 75 శాతం పైచిలుకు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అందించగలిగాం. -
పేదల కోసం పెత్తందారులపై పోరాటాలెన్నో చేశాం: సీఎం జగన్
ప్రకాశం, సాక్షి: చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారాయన. .. ‘‘మరో మంచి పనికి ఒంగోలు నుంచి శ్రీకారం చుడుతున్నాం. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశాం. ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నాం. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నాం. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారాయన. .. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని సీఎం జగన్ ఒంగోలు సభలో గుర్తు చేశారు. అలాగే ఇంటింటికీ తలుపు తట్టి సేవలు అందిస్తున్నామని.. 58 నెలల పాలనలో మొత్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారాయన. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం ఆరోగ్యశ్రీ రిధిని రూ.25 లక్షలకు పెంచాం ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 3,300కు పెంచాం ఆస్పత్రిలో బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు రోగులు కోలుకునే వరకు ఆసరాగా ఉంటున్నాం గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి -
కుప్పం నుంచే చంద్రబాబు బైబై అంటున్నాడు: సీఎం జగన్
సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో ఒక్క పేదవాడికీ చంద్రబాబు సెంటు స్థలం ఇవ్వలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కానీ, మనం మంచి చేస్తుంటే కోర్టులకు వెళ్లి రాక్షసుల్లా అడ్డుకున్నారు. పేదలకు మంచి జరగకుండా కోర్టులో 1191 కేసులు వేశారు. చంద్రబాబు కుట్రలను అధిగమించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఇప్పటికీ కూడా ఇళ్ల స్థలాలను అడ్డుకునేందుకు చంద్రబాబు కేసులు వేశారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ నేడు ఒంగోలులో 21వేల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే, ఒంగోలులో మంచి నీటి పథకం కూడా ప్రారంభించారు. రూ.231 కోట్ల విలువ చేసే భూమిని అక్కచెల్లెమ్మలకు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మన పేదలకు మంచి మనం మంచి చేస్తుంటే చంద్రబాబులో అసూయ పుట్టుకొస్తోంది. వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందటాడు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని చంద్రబాబు అవమానించాడు. ఇన్ని కుట్రలు చేసి కూడా చంద్రబాబు ఇంకా బరితెగించి రాజకీయాల్లో ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. రుణమాఫీ పేరుతో పొదుపు సంఘాల మహిళలను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు 650 హామీలిచ్చి 10 శాతం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు నిసిగ్గుగా కొత్త మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నారు. చంద్రబాబు దారుణాలు ఎల్లో మీడియాకు కనిపించవు. మన ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి అబద్దాలు రాస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా?. చంద్రబాబులాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి. ఏం మంచి చేశాడో చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏమీ లేవు. మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారు. కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు. చంద్రబాబును సమర్థించే వాళ్లు ఏపీలో లేని వాళ్లు మాత్రమే. చంద్రబాబు మాదిరి నాకు నాన్రెసిడెంట్స్ ఆంధ్రాస్ మద్దతు లేదు. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా ఉండండి. దళారులు, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు. దేవుడి ఆశీస్సులు, ప్రజలే నా నమ్మకం. ఇదే సమయంలో.. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశామన్నారు. చరిత్రలోనే తొలిసారిగా పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ జరిగాయి. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు సర్వహక్కులు కల్పిస్తున్నాం. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు.. మన ప్రభుత్వ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. మన ప్రభుత్వంలో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు. విద్యార్థుల కోసం బైలింగ్వల్ పుస్తకాలు అందుబాటులోకి తెచ్చాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మార్చాం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ ఇచ్చాం. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విద్యాబోదన. ప్రభుత్వ స్కూల్స్లో ఐబీ విధానం తెచ్చాం. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు తెచ్చాం. మన విద్యార్థులు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదివేలా అడుగులు వేశాం. పేదలకు కార్పొరేట్ వైద్యం.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25లకు పెంచాం. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 3300లకు పెంచాం. వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ఆసుపత్రిలో బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు. రోగులు కోలుకునేవరకు ఆరోగ్య ఆసరా కింద సాయం. పేదల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్ విధానం తెచ్చాం. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించండి. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం. మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది. ఆర్థిక అంతరాలను తొలగించాం. పేదలకు డీబీటీ ద్వారా రూ.2లక్షల 55వేల కోట్లు అందించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 75 శాతం లబ్ధి చేకూర్చాం. మన ప్రభుత్వంలో బలహీనవర్గాలకు నామినేటెడ్ పదవులు ఇచ్చాం. గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇచ్చేవారు. పేదలకు పట్టాలు.. రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు ఉంటుంది. భవిష్యత్లో రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు. రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల కబ్జా చేసేందుకు కూడా వీలుపడదు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండటం వల్ల సులభంగా బ్యాంక్ రుణాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పేదల ఆత్మగౌరవం గురించి గత ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న కాలనీ లే అవుట్లు. 60వేల కోట్లతో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు. రాష్ట్రవ్యాప్తంగా 71,811 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోంది. మౌలిక సదుపాయాల కోసం ప్రతీ ఇంటికి లక్ష ఖర్చు చేశాం. అక్కచెల్లెమ్మలను లక్షాధికారులు కాదు.. మిలియనీర్లను చేస్తున్నాం. ప్రాంతాన్ని బట్టి ఇంటి స్థలం విలువ 2.5లక్షల నుంచి 15లక్షల వరకు ఉంటుంది. ఒంగోలులో పేదల ఇళ్ల కోసం 210 కోట్లతో భూమి కొనుగోలు చేశాం. మరో 21 కోట్లతో లేఅవుట్ల అభివృద్ధి చేశాం. ఒంగోలులో తాగునీటి కోసం రూ.334 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశాం. జగనన్న టౌన్షిప్లో మౌలిక వసతుల కోసం రూ.247 కోట్లు ఖర్చు చేశాం’ అని తెలిపారు. -
31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం: సీఎం జగన్
CM Jagan Public Meeting At Ongole Updates ప్రకాశం జిల్లా ఒంగోలులో ముగిసిన పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒంగోలు చరిత్రలో సువర్ణాధ్యాయం 21 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలతో భూ బదిలీ పత్రం అందజేసిన సీఎం జగన్ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పంపిణీలో భాగంగా ఈ కార్యక్రమం ఇది దేశంలోనే ఒక చరిత్ర: సీఎం జగన్ పేదరికం నుంచి పేదలు బయటపడాలి: సీఎం జగన్ ఇళ్ల పట్టాలతో పాటు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాం: సీఎం జగన్ ఈ స్థలాలపై బ్యాంకు రుణాలు కూడా తీసుకోవచ్చు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే సర్టిఫైడ్ కాపీలు తీసుకోవచ్చు రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లు ఆస్తి మీద అక్కచెల్లెమ్మలకు హక్కు కల్పిస్తున్నాం అక్కచెల్లెమ్మలను లక్షాధికారుల్ని కాదు.. మిలియనీర్లను చేస్తున్నాం వాళ్లు సిద్ధంగా లేరంట!: సీఎం జగన్ చురకలు చంద్రబాబు లాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి మనం సిద్ధం అంటుంటే.. చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేం అంటున్నారు కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మట్లేదు చంద్రబాబు మాదిరి నాన్ రెసిడన్స్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు బాబులా దళారులను, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు నేను నమ్ముకుంది దేవుడు.. ప్రజల్ని మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడండి చంద్రబాబు దుర్మార్గం ఏపాటిదంటే.. చంద్రబాబు రాజకీయ రాక్షసుడు వంద సినిమాల విలన్ల దుర్మార్గం కంటే.. చంద్రబాబు దుర్మార్గం ఎక్కువ ఇళ్ల స్థలాల పంపిణీ జరగకుండా 1191 కేసులు వేయించాడు తన హయాంలో సెంటు భూమి కూడా ఇవ్వలేదు ఆ కుట్రలు అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే.. కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందట! ఎస్సీలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అని బాబు అన్నాడు చంద్రబాబు 650 హామీలిచ్చి.. 10 కూడా నెరవేర్చలేదు నిస్సిగ్గుగా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం ఆర్థిక అంతరాలు తొలగించాం రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు రిజిస్ట్రేషన్ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలు కుదరదు గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్ కాపీలు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం ఆర్థిక అంతరాలు తొలగించాం రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు రిజిస్ట్రేషన్ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలు కుదరదు గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్ కాపీలు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం చికిత్స కోసం వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం ప్రొసీజర్స్ను 3,300కు పెంచాం పేదల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్ రోగులు కోలుకునేంత వరకు ప్రభుత్వమే ఆసరా పేదల సంక్షేమం కోసం ప్రతీ అడుగు వేశాం పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాం ఇంగ్లీష్, తెలుగు మీడియాల్లో పుస్తకాలు అందిస్తున్నాం ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాం కార్పొరేట్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ఒంగోలు నుంచి మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం పేదల కోసం పెత్తందారులతో ఎన్నో పోరాటాలు చేశాం 58 నెలల కాలంలో ప్రతీ అడుగు పేదల మంచి కోసమే వేశాం పాలనతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం ఇంటింటికే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు హక్కులు కల్పిస్తున్నాం పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నాం. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నాం. మాజీ మంత్రి బాలినేని ప్రసంగం పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా కోర్టుకు వెళ్లారు? పేదవాడికి మంచి జరగడం టీడీపీకి ఇష్టం లేదు టీడీపీ హయాంలో ఒక్క పేదవాడికైనా ఇల్లు ఇచ్చారా? ఒంగోలులో సీఎం జగన్.. ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్ సీఎం జగన్ వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన ఒంగోలులో సీఎం జగన్కు ఘన స్వాగతం జగనన్న పాలనలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కాసేపట్లో ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాల అందజేత కార్యక్రమం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేత సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ సాక్షితో.. మాజీ మంత్రి బాలినేని ►ఒంగోలు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో పేదలకు ఇళ్ల పట్టా పంపిణీ 21 వేలమంది అక్కాచెల్లెమ్మలకు పంపిణీ చేయనున్న సీఎం జగన్ ఒంగోలులో మంచి నీటి పథకం కూడా ప్రారంభం ► కాసేపట్లో ఒంగోలుకు చేరుకోనున్న సీఎం జగన్ సీఎం జగన్ ఒంగోలు పర్యటన ప్రకాశం జిల్లా ఒంగోలు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఎన్.అగ్రహారం చేరుకోనున్న సీఎం జగన్ 21వేల మంది అక్కచెళ్లెమ్మలకు ఇళ్లపట్టాలు పంపిణీ సీఎం జగన్ చేతుల మీదుగా ఒంగోలు మంచినీటి పథకం పనులు ప్రారంభం ఇళ్ల పట్టాల్లో చారిత్రక ఘట్టం పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తోంది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందించనుంది. 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ చేతుల మీదుగా.. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన కన్వేయన్స్ డీడ్లు, ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ ద్వారా రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లను లబ్దిదారులకు అందించనున్నారు. సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీ ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికి అందించడం, వాటిని సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేస్తుండడం దేశంలోనే ప్రథమం. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు ఉండేవి కాదు. “డి’ పట్టాలు కావడంతో అనుభవించడం మినహా హక్కులు లేనందున అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందిస్తోంది. వారి పేరు మీద ఆ పట్టాలను రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఈ డీడ్లు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. విలువైన స్థిరాస్తి.. ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం ఇప్పిస్తోంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో రూ. 40 వేల మేర లబ్ది చేకూరుస్తోంది. మొత్తంగా ఒక్కో లబ్దిదారుడికి రూ. 2.70 లక్షల మేర ప్రయోజనం దక్కుతోంది. మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ.లక్ష వరకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి ఇంటి విలువ రూపేణా కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువ చేసే విలువైన స్థిరాస్తిని సమకూర్చుతోంది. 17,005 లేఅవుట్లు.. 71,811 ఎకరాలు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కోసం దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని రీతిలో సీఎం జగన్ ప్రభుత్వం నిధులు వెచ్చించింది. 71,811 ఎకరాలను సేకరించి 31.19 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17,005 లేఅవుట్లు నిర్మించింది. 71,811 ఎకరాల్లో ప్రైవేట్గా 25,374 ఎకరాలు సేకరించారు. ఇందుకు భూసేకరణకు రూ.11,343 కోట్లు ఖర్చు చేసింది. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల కోసం ఇంత భారీగా భూసేకరణ చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. -
ఒంగోలు: సీఎం జగన్ సభకు భారీ ఏర్పాట్లు
-
23న ఒంగోలుకు సీఎం జగన్
ఒంగోలు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23వ తేదీన ఒంగోలు రానున్నారు. నగరంలోని 22వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నగర శివారు అగ్రహారం వద్ద నిర్వహించనున్న సభ ఏర్పాట్లను సోమవారం మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, కలెక్టర్ దినేష్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తీరుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లోని జగనన్న టౌన్షిప్లలో అర్హులైన 22వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని వివరించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందని చెప్పారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఆలోచనల మేరకు నగర పరిధిలో అర్హులైన 22 వేల మంది పేదలకు సీఎం చేతుల మీదుగా చేపడుతున్న పట్టాల పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జగనన్న టౌన్షిప్లను అర్బన్ డెవలప్మెంట్ టౌన్గా ఏర్పాటు చేయడంతోపాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పింస్తామన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మల్లేశ్వరపురం, అగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాలు భూసేకరణ చేశామన్నారు. పట్టాల పంపిణీ పూర్తి పారదర్శకంగా చేపట్టడంతోపాటు నగరంలోని 70 సచివాలయాల పరిధిలో కన్వేయడ్ డీడ్ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు. ఆర్డీవో విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఒంగోలులో సీఎం జగన్ పర్యటన..ఏర్పాట్లను పరిశీలించిన బాలినేని
-
టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు పర్యటించనున్నట్లు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అదే రోజున నగరంలో 25 వేల మంది పేదల కోసం సిద్ధం చేసిన ఇంటి స్థలాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామని బాలినేని తెలిపారు. అర్బన్ లేఔట్ను బాలినేని శుక్రవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు అడ్డుకునేందుకు కోర్టులో పిల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో పేదలకు పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు పదే పదే కోర్టుకు వెళ్తున్నారని.. వారికి ఇష్టం లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటానే తప్ప ఇంటి పట్టాలు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని బాలినేని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకచోట కోర్టుకెళ్లి ఇంటి స్థలాలను అడ్డుకున్న టీడీపీ.. మరోసారి కోర్టులో పిల్ వేయడంపై బాలినేని అసహన వ్యక్తం చేశారు. ఇంత నీచ రాజకీయం నా జీవితంలో చూడలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: చిల్లర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి వంశీ: ఎంపీ ఎంవీవీ ఫైర్ -
చెక్ బౌన్స్ కేసులో గణేశ్కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష
-
బండ్లగణేశ్కు బిగ్ షాక్.. ఆ కేసులో జైలు శిక్ష!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు బండ్లగణేశ్కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు వెలువరించింది. అంతే కాకుండా శిక్షతో పాటు బండ్లగణేశ్కు రూ.95 లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణాంతరం ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షల చెక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. గతంలో ఆరునెలల జైలు శిక్ష గతంలో 2017లో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. కానీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. షరతులతో కూడిన బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. కాగా.. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తరువాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. -
ఎంపీ సీటుపై వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్
-
ప్రకాశించిన సాధికారత
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంలో సామాజిక సాధికారత ప్రకాశించింది. సామాజిక చైతన్యం ఉవ్వెత్తున ఎగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు రోడ్లపైకి చేరి పండుగ చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను ప్రతిబింబిస్తూ నగరంలోని బడుగు, బలహీనవర్గాలు బుధవారం పెద్ద ఎత్తున సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాయి. ఒకప్పుడు అవమానాలకు గురైన తాము సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ భరోసాతో తలెత్తుకు తిరుగుతున్నామంటూ నినదించారు. జోరు వానలోనూ బస్సు యాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. నగర వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. భారీ గజమాలలు, సంప్రదాయ నృత్యాలు, డప్పుల మోతలు, బాణాసంచాతో జై జగన్ నినాదాలతో ఒంగోలు నగరం మార్మోగింది. కర్నూలు బైపాస్ రోడ్డు నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు ర్యాలీ సాగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కుల వృత్తులు ప్రతిబింబించేలా శకటాలను యాత్రలో ప్రదర్శించారు. అనంతరం ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ సెంటర్లో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సభలో మాట్లాడుతున్న మంత్రి మేరుగు నాగార్జున ఇదో సామాజిక విప్లవం: మంత్రి విడదల రజిని సభలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ తెచ్చిన సామాజిక సాధికారతకు ఈ వేదికపై ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మంత్రులు, మేయరు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నేతలే నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. మంత్రివర్గం నుంచి అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే సీఎం జగన్ పెద్దపీట వేశారని తెలిపారు. పేదవానికి కార్పొరేట్ వైద్యం, విద్య అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ఇదో సామాజిక విప్లవమని అన్నారు. బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నత చదువులు: ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆంధ్రాలో అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయి చదువులు చదివి అమెరికా, ఆ్రస్టేలియా, కెనడా వంటి దేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సీఎం జగన్ సుపరిపాలన చూశాక ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలను కూడా ఆంధ్రాలో కలపాలంటూ డిమాండ్లు వస్తున్నాయన్నారు. జగనన్న ఆలోచనలకు మేం నిదర్శనం: మంత్రి ఆదిమూలపు సురేశ్ సీఎం జగనన్న ఆలోచనా విధానానికి నిలువెత్తు నిదర్శనం ఈ సభావేదికపై ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజాప్రతినిధులమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను సీఎం జగన్ ఉన్నతంగా తీర్చిదిద్ది, ఇంగ్లిష్ మీడియం చదువులు అందించడాన్ని మిగతా రాష్ట్రాలూ అందిపుచ్చుకుంటున్నాయని తెలిపారు. ఇంగ్లిష్ మీడియం, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, అధునాతన ప్రభుత్వ ఆస్పత్రులతో సీఎం జగన్ రోల్ మోడల్గా నిలిచారన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి: మంత్రి మేరుగు పేదల పక్షపాతిగా సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. వైఎస్ జగన్ 75 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారని, ఇంతకంటే సామాజిక సాధికారత చేసే నాయకులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఒంగోలులో ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే పోటీ కూడా చేయను : బాలినేని ఒంగోలు నగర ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు 25 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడితే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వచ్చే నెలలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా 25 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంగోలులో పోటీ కూడా చేయనన్నారు. వైఎస్సార్ హయాంలో ఒంగోలులో వైద్య కళాశాల, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మించామని తెలిపారు. ఇప్పుడు ఒంగోలు నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.350 కోట్లతో మంచినీటి పథకానికి, మరో రూ.350 కోట్లతో కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఒంగోలులో సామాజిక సాధికార యాత్రకు భారీ ఏర్పాట్లు
-
ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో యాత్ర
-
విశాఖపట్నం సౌత్, ఒంగోలు, బనగానపల్లెలో బస్సు యాత్ర
-
సామాజిక సాధికార యాత్ర ఈరోజు షెడ్యూల్
-
నేడు విశాఖ సౌత్, బనగానపల్లి, ఒంగోలులో సామాజిక సాధికార యాత్ర
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలును, సామాజికన్యాయం, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర బుధవారం విశాఖపట్నం జిల్లా విశాఖ సౌత్, నంద్యాల జిల్లా బనగానపల్లి, ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పలు కార్యక్రమాలను పేదలకు వివరిస్తారు. విశాఖపట్నం: విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. ఉదయం 11:30 గంటలకు ఫార్చున్ ఇన్ హోటల్లో వైఎస్సార్సీపీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు డైమండ్ పార్క్ నుంచి రైల్వే న్యూ కాలనీ, మనోహర థియేటర్, దుర్గాలమ్మ గుడి, జగదాంబ జంక్షన్ మీదుగా టౌన్ కొత్త రోడ్డు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. 2:30 గంటలకు టౌన్ కొత్త రోడ్డులో జరగనున్న బహిరంగ సభలో రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, తదితరులు హాజరుకానున్నారు. ఒంగోలు: ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు ఒంగోలు నోవాసిస్ హోటల్లో వైఎస్సార్సీపీ నేతల విలేకర్ల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కర్నూల్ రోడ్డు బైపాస్ నుండి బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వరకు ర్యాలీ సాగనుంది. 4 గంటలకు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో రీజనల్ ఇంఛార్జ్ విజయసాయిరెడ్డి, ఎంపీ ఆర్.కృష్ణయ్య, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, విడదల రజని, తదితరులు హాజరుకానున్నారు. నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర సాగనుంది. బనగానపల్లె ధనలక్ష్మి ఫంక్షన్ హాలులో ముస్లిం మైనారిటీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఒంటిగంటకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం కూరగాయల మార్కెట్ మీదుగా పెట్రోల్ బంకు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ, మంత్రులు నారాయణ స్వామి, అంజాద్ భాషా, మాజీ మంత్రి పార్థసారథి హాజరుకానున్నారు. -
ఒంగోలులో సామజిక సాధికార యాత్రకు భారీ ఏర్పాట్లు
-
ప్రమాణం చేద్దామా?.. దామచర్లకు బాలినేని సవాల్
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో జరిగే అన్ని మీటింగ్లకు నన్ను పిలిచారని, మీడియా వాళ్లు అనవసరంగా ప్రతీది రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్కి అబద్ధాలు మాట్లాడటం అలవాటు. కాంట్రాక్టర్ల దగ్గర ఎవరు డబ్బులు తీసున్నారో ప్రమాణం చేద్దామా?. చీము, నెత్తురు, సిగ్గు ఉంటే నా ఛాలెంజ్కు స్పందించు’’ అంటూ సవాల్ విసిరారు. కొత్తపట్నం బ్రిడ్జి మెటీరియల్ కొనుగోలుకు నేను రూ.40 లక్షలు ఇచ్చా. నోటికి వచ్చినట్లు మాట్లాడితే పద్దతిగా ఉండదు’’ అని బాలినేని హెచ్చరించారు. చదవండి: తుస్సుమనిపించిన పవన్.. ఎందుకంత వణుకు?
Pagination
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
Advertisement