-
NZ Vs Eng: కివీస్ బ్యాటర్ టామ్ బ్లండెల్ ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో
New Zealand vs England, 1st Test- Tom Blundell: ఇంగ్లండ్తో తొలి టెస్టులో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగి.. 181 బంతులు ఎదుర్కొన్న అతడు 138(19 ఫోర్లు, ఒక సిక్సర్) పరుగులు చేశాడు. ఓపెనింగ్ బ్యాటర్ డెవాన్ కాన్వే(77)తో కలిసి రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. కాన్వే అర్ధ శతకం, బ్లండెల్ శతకం కారణంగా ఆతిథ్య కివీస్ తొలి ఇన్నింగ్స్లో 306 పరుగులు చేసి ఇంగ్లండ్(తొలి ఇన్నింగ్స్ 325-9 డిక్లేర్డ్)కు దీటైన జవాబు ఇవ్వగలిగింది. ఇదిలా ఉంటే.. సెంచరీ హీరో టామ్ బ్లండెల్ ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా చరిత్ర సృష్టించాడు. బ్లండెల్ ప్రపంచ రికార్డు డే- నైట్ టెస్టులో శతకం సాధించిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పింక్బాల్ టెస్టులో సెంచరీతో మెరిసి ఈ ఘనత సాధించాడు. కాగా 2015 నుంచి డే- నైట్ టెస్టులు మొదలుకాగా న్యూజిలాండ్- ఇంగ్లండ్ మ్యాచ్ కంటే ముందు 20 మ్యాచ్లు జరిగాయి. అయితే, వీటిలో ఏ ఒక్క వికెట్ కీపర్ బ్యాటర్ కూడా శతకం సాధించలేకపోయాడు. ఆ అరుదైన ఘనత బ్లండెల్కే సాధ్యమైంది. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షపెట్టిన టామ్ బ్లండెల్.. కివీస్ 306 పరుగుల మేర స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక తన పేరిట ప్రపంచ రికార్డు లిఖించి సత్తా చాటాడు. చదవండి: Anderson- Stuart Broad: ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ సంచలనం.. 1000 వికెట్లతో.. Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా?! Tom Blundell (138) leads the batting effort with his highest Test score. Blundell and Tickner share a 59-run partnership for the 10th wicket, pushing the total 306. Time to bowl at Bay Oval! Follow play LIVE in NZ with @sparknzsport & @todayfm_nz 📲 #NZvENG pic.twitter.com/QO4XENUfSt — BLACKCAPS (@BLACKCAPS) February 17, 2023 -
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉప్పల్ వేదికగా మరో కీలక మ్యాచ్!
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం మరో అంతర్జాతీయ మ్యాచ్కు వేదిక కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్యలో ఆస్ట్రేలియా జట్టు భారత్లో పర్యటించనుంది. బోర్డర్-గావస్కర్ సిరీస్ లో భాగంగా ఇరు జట్లు నాలుగు టెస్టులు ఆడనున్నాయి. ఇందులో ఒకటి పింక్ బాల్ టెస్టుగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఈ సిరీస్కు ఇంకా బీసీసీఐ వేదికలను ఖారారు చేయలేదు. ఇక ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టుకు ఉప్పల్ స్టేడియం అతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం. అదే విధంగా రెండో టెస్టు ఢిల్లీ, మూడో టెస్టుకు ధర్మశాల, ఆఖరి టెస్టుకు ఆహ్మదాబాద్ వేదికలుగా నిర్ణయించాలని భావిస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా ఏడాది సెప్టెంబర్లో ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియాతో సిరీస్ డిసైడర్ ఆఖరి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియంకు తరలివచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా.. ముహార్తం ఫిక్స్! ఎప్పుడంటే? -
IND VS SL: పింక్బాల్ టెస్ట్పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి
భారత్-శ్రీలంక జట్ల మధ్య ఇటీవలే బెంగుళూరులో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ (పింక్ బాల్ టెస్ట్)పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్ కోసం వినియోగించిన పిచ్పై ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ పెదవి విరిచాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్కు బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. చర్యల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంకు ఓ డీమెరిట్ పాయింట్ ఇచ్చాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఓ వేదిక 5 డీమెరిట్ పాయింట్లు పొందితే, సంవత్సరం పాటు అక్కడ అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించకుండా నిషేధిస్తారు. కాగా, రిఫరీ జవగల్ శ్రీనాథ్కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సొంత మైదానం కావడం విశేషం. ఇదిలా ఉంటే, పింక్ బాల్ టెస్ట్లో టీమిండియా 3 రోజుల్లోనే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి రోజు నుంచే విపరీతంగా టర్న్ అవుతూ బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టింది. తొలి రోజు ఆటలో రికార్డు స్థాయిలో 16 వికెట్లు పతనమయ్యాయి. అయితే, భారత బ్యాటర్లు, ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలతో టీమిండియాకు 238 పరుగుల భారీ విజయాన్నందించాడు. లంక రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ కరుణరత్నే సూపర్ శతకంతో చెలరేగినప్పటికీ, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఇరు జట్లలోని స్పిన్నర్లు ఏకంగా 26 వికెట్లు పడగొట్టగా, టీమిండియా పేసు గుర్రం బుమ్రా నిర్జీవమైన పిచ్పై 8 వికెట్లతో (తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు) చెలరేగాడు. చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్.. అరుదైన ఘనత సాధించిన తొలి కెప్టెన్గా ప్రపంచ రికార్డు CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W — BCCI (@BCCI) March 14, 2022 -
చరిత్ర సృష్టించిన రోహిత్.. అరుదైన ఘనత సాధించిన తొలి కెప్టెన్గా ప్రపంచ రికార్డు
Rohit Sharma: శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను క్లీన్స్వీప్ (2-0) చేయడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఫుల్టైమ్ కెప్టెన్గా అరంగేట్రం సిరీస్ల్లోనే (మూడు ఫార్మాట్లు) క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన తొలి సారథిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.కోహ్లి నుంచి ఫుల్ టైమ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్ను వన్డే (3-0), టీ20 సిరీస్ (3-0)ల్లో వైట్వాష్ చేసిన రోహిత్.. తాజాగా శ్రీలంకను టెస్ట్ సిరీస్లో 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం సిరీస్ల్లో క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన తొలి కెప్టెన్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. Rohit Sharma Created History As Captain Only Captain in the History Of Cricket to have Won his First Series in all three formats by Cleansweep as full Time Captain. Well done, Captain Ro. pic.twitter.com/App7UuFLLw — CricketMAN2 (@ImTanujSingh) March 14, 2022 కాగా, బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు మొహాలీలో జరిగిన తొలి టెస్ట్లోనూ లంకపై భారీ విజయం (ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో) సాధించిన రోహిత్ సేన.. టెస్ట్ సిరీస్కు ముందు జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను కూడా 3-0 తేడాతో వైట్వాష్ చేసింది. ఈ భారత పర్యటనలో శ్రీలంక ఒక్క మ్యాచ్ కూడా గెలుపొందలేక రిక్త హస్తాలతో స్వదేశానికి తిరుగు పయనమైంది. రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్ల్లో అర్ధసెంచరీలతో రాణించిన శ్రేయస్ అయ్యర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. సిరీస్ ఆధ్యంతం రాణించిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లభించింది. Since @ImRo45 became full time Captain: 3-0 vs NZ (T20I) 3-0 vs WI (ODI) 3-0 vs WI (T20I) 3-0 vs SL (T20I) 2-0 vs SL (Tests) #INDvSL pic.twitter.com/ojREzqlA6M — Wasim Jaffer (@WasimJaffer14) March 14, 2022 CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W — BCCI (@BCCI) March 14, 2022 Rohit Sharma as Indian Captain 1st ODI Series - Won 1st T20I Series - Won 1st Test Series - Won*#INDvSL — CricBeat (@Cric_beat) March 14, 2022 రెండో టెస్ట్ సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్ : 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92, జయవిక్రమ 3/81) శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24) భారత్ రెండో ఇన్నింగ్స్ : 303/9 డిక్లేర్ ( శ్రేయస్ అయ్యర్ 67, జయవిక్రమ 4/78) శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 208 (కరుణరత్నే 107, అశ్విన్ 4/55) చదవండి: టెస్ట్ క్రికెట్లో టీమిండియా తిరుగులేని రికార్డు.. ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా..! Spirit of Cricket at its best as #TeamIndia congratulate Suranga Lakmal who played his last international match 🤜🤛 #SpiritOfCricket | #INDvSL | @Paytm pic.twitter.com/aa17CK5hqv — BCCI (@BCCI) March 14, 2022 -
టెస్ట్ క్రికెట్లో టీమిండియా తిరుగులేని రికార్డు.. ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా..!
టెస్ట్ క్రికెట్లో టీమిండియా తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. స్వదేశంలో వరుసగా 15 సిరీస్లు గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర పుటల్లో నిలిచింది. సోమవారం (మార్చి 14) శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో (పింక్ బాల్ టెస్ట్) గెలుపొందడం ద్వారా టీమిండియా స్వదేశంలో వరుసగా 15వ టెస్ట్ సిరీస్ విజయం సాధించి, ఇదివరకే తమ పేరటి ఉన్న రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. టీమిండియా చివరిసారిగా 2012 నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇంగ్లండ్తో (స్వదేశంలో) జరిగిన టెస్ట్ సిరీస్లో ఓడిపోయింది. నాడు మహేంద్ర సింగ్ ధోని జట్టు కెప్టెన్గా ఉన్నాడు. అప్పటి నుంచి భారత జట్టు స్వదేశంలో తిరుగులేని అజేయ జట్టుగా కొనసాగుతుంది. India's 15th consecutive series victory at home since losing the series to England in Dec 2012. No other home side has won more than 10 consecutive home series. #IndvSL #IndvsSL#DaynightTestmatch#PinkballTest — Mohandas Menon (@mohanstatsman) March 14, 2022 టీమిండియా తర్వాత స్వదేశంలో అత్యధిక వరుస టెస్ట్ సిరీస్లు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా ఉంది. కంగారూ జట్టు స్వదేశంలో వరుసగా 10 టెస్ట్ సిరీస్ల్లో విజయం సాధించింది. ఆసీస్ రెండుసార్లు (నవంబర్ 1994-నవంబర్ 2000 మధ్యలో ఓసారి, జులై 2004-నవంబర్ 2008 మధ్యలో మరోసారి) ఈ ఘనత సాధించడం విశేషం. కాగా, బెంగళూరు టెస్ట్లో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో లంకను చిత్తు చేసి 2 మ్యాచ్ల సిరీస్ని 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్లోనూ లంకపై భారీ విజయం (ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో) సాధించిన టీమిండియా.. టెస్ట్ సిరీస్కు ముందు జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను కూడా 3-0 తేడాతో వైట్వాష్ చేసింది. చదవండి: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement