-
IPL 2024: అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్న చిచ్చరపిడుగులు వీళ్లే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పలువురు ఆటగాళ్లు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్నారు. బ్యాటర్ల విషయానికొస్తే.. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ సీజన్లో అన్ క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగి మెరుపులు మెరిపిస్తున్నాడు. రియాన్ ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి 58.43 సగటున 159.14 స్ట్రయిక్రేట్తో 409 పరుగులు చేసి నాలుగో లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు.అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగిన ఇరగదీస్తున్న మరో బ్యాటర్ అభిషేక్ శర్మ. ఈ ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఈ సీజన్లో అదిరిపోయే ప్రదర్శనలతో అంచనాలకు అందని రీతిలో రెచ్చిపోతూ తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అభిషేక్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో అదిరిపోయే స్ట్రయిక్రేట్తో 315 పరుగులు చేశాడు.వద్దనుకున్న ఆటగాడే గెలుపు గుర్రమయ్యాడు..ఈ ఐపీఎల్ సీజన్లో ఓ ఆటగాడు ప్రత్యేకించి అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. శశాంక్ సింగ్ అనే పంజాబ్ మిడిలార్డర్ బ్యాటర్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ సీజన్లో శశాంక్ మెరుపు స్ట్రయిక్రేట్తో 288 పరుగులు చేసి తన జట్టు సాధించిన ప్రతి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. శశాంక్ను ఈ సీజన్ వేలంలో పంజాబ్ పొరపాటున సొంతం చేసుకుందని ప్రచారం జరిగింది. పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మరో శశాంక్ అనుకుని ఈ శశాంక్ను సొంతం చేసుకుందని సోషల్మీడియా కోడై కూసింది. అంతిమంగా చూస్తే ఈ వద్దనుకున్న ఆటగాడే పంజాబ్ సాధించిన అరకొర విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.ఈ సీజన్లో రఫ్ఫాడిస్తున్న మరో ప్లేయర్ ప్రభ్సిమ్రన్ సింగ్. ప్రభ్సిమ్రన్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు స్ట్రయిక్రేట్తో 221 పరుగులు చేశాడు. అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తున్న మరో బ్యాటర్ నితీశ్కుమార్ రెడ్డి. ఈ ఎస్ఆర్హెచ్ మిడిలార్డర్ బ్యాటర్ ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్లతో తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నితీశ్ ఈ సీజన్ లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సన్రైజర్స్ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వీళ్లే కాక చాలామంది అన్క్యాప్డ్ బ్యాటర్లు ఈ సీజన్లో ఇరగదీస్తున్నారు.బౌలర్ల విషయానికొస్తే.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి బంతితో సత్తా చాటుతున్న వారిలో సన్రైజర్స్ పేసర్ నటరాజన్ ముందు వరుసలో ఉన్నాడు. నటరాజన్ గతంలో అద్భుతంగా రాణించినప్పటికీ.. గత కొన్ని సీజన్లలో ఇతని ప్రదర్శన సాధారణ స్థాయికి పడిపోయింది. దీంతో ఈ సీజన్కు ముందు ఇతనిపై ఎలాంటి అంచనాలు లేవు. అండర్ డాగ్గా బరిలోకి దిగిన నట్టూ.. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను సెకెండ్ లీడింగ్ వికెట్టేకర్గా కొనసాగుతున్నాడు. అన్క్యాప్డ్ ప్లేయర్లుగా బరిలోకి దిగి ఇరగదీస్తున్న బౌలర్లలో మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, సందీప్ శర్మ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ నట్టూ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. వీరంతా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమతమ జట్ల పాలిట గెలుపు గుర్రాలయ్యారు. -
‘నాకు దక్కలేదు.. సంజూ భయ్యాను మాత్రం సెలక్ట్ చేశారు’
‘‘నేను చాలా విషయాల్లో మెరుగుపడాలి. ప్రస్తుతం నేను నా అత్యుత్తమ ఫామ్లో లేను. ఒకవేళ ఫామ్లో ఉండి ఉంటే గనుక కచ్చితంగా మ్యాచ్ను విజయంతో ముగించేవాడిని.నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. అవి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇది నా అత్యుత్తమ ఇన్నింగ్సేనా అంటే కానేకాదు. ఒకవేళ సెంచరీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.మ్యాచ్లో ఓడిపోయిన జట్టుగా మిగిలిపోవడం నిరాశకు గురిచేస్తుంది. ఈరోజు మ్యాచ్లో మేము ఆఖరి వరకు పోరాడగలిగాం. ఓటమిని తలచుకుంటూ కూర్చుంటే ముందుకు సాగలేం.రెండు- మూడు ఓవర్లలో చేసిన తప్పుల కారణంగా మ్యాచ్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాం. టీ20 అంటేనే ఇలా ఉంటుంది. కాబట్టి తదుపరి మ్యాచ్పై దృష్టి సారించే క్రమంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం’’ అని రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అన్నాడు.కాగా ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్తాన్ గురువారం తలపడింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది.నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ రైజర్స్ సీనియర్ భువనేశ్వర్ కుమార్ రోవ్మన్ పావెల్ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో రాజస్తాన్ కథ ముగిసిపోయింది.ఫలితంగా ఈ మ్యాచ్లో రాజస్తాన్ కష్టాల్లో కూరకుపోయి ఉన్నవేళ.. 77 పరుగులతో రాణించిన రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా వరల్డ్కప్-2024కు ప్రకటించిన జట్టులో రిజర్వ్ ప్లేయర్గా అయినా పరాగ్కు చోటు దక్కుతుందని అతడి అభిమానులు ఆశపడ్డారు. అయితే, బీసీసీఐ మాత్రం 22 ఏళ్ల ఈ అసోం బ్యాటింగ్ ఆల్రౌండర్కు అప్పుడే పిలుపునిచ్చేందుకు సిద్ధంగా లేనట్లు స్పష్టం చేసింది. సంజూ భయ్యాకు చోటు దక్కడం సంతోషంఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ‘‘గతేడాది అసలు నేను ఐపీఎల్ పోటీలోనే లేను. కానీ ఈసారి నా గురించి ఏవో వదంతులు కూడా వినిపిస్తున్నాయి. నా గురించి అందరూ చర్చించుకునే స్థాయికి వచ్చాను.నా గురించి గళం వినిపిస్తున్న వారికి ధన్యవాదాలు. అయితే, నేను మాత్రం ఇప్పుడే వాటి(టీమిండియాలో చోటు) గురించి ఆలోచించడం లేదు. మా జట్టు నుంచి వరల్డ్కప్ టీమ్లో చోటు దక్కించుకున్న వారికి అభినందనలు. ముఖ్యంగా సంజూ భయ్యాకు చోటు దక్కడం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని రియాన్ పరాగ్ పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేశాడు.ఇక సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో 49 బంతుల్లో 77 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఈ సీజన్లో 409 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2024లో 400 పరుగుల మార్కు అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు.చదవండి: SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ -
వరల్డ్కప్కు సెలక్ట్ చేయలేదు.. ఆ కసి మొత్తం చూపించేశాడు
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో పరాగ్ విధ్వంసం సృష్టించాడు. 202 పరుగుల లక్ష్య చేధనలో ఎస్ఆర్హెచ్ బౌలర్లకు పరాగ్ చుక్కలు చూపించాడు. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన రాజస్తాన్ను పరాగ్ తన ఇన్నింగ్స్తో మ్యాచ్లో నిలిపాడు. పరాగ్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్తో కలిసి రెండో వికెట్కు 135 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 49 బంతులు ఎదుర్కొన్న పరాగ్.. 8 ఫోర్లు, 4 సిక్స్లతో 77 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీ20 వరల్డ్కప్కు సెలక్ట్ చేయలేదన్న కసి మొత్తం ఈ మ్యాచ్లో చూపించాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పరాగ్ అద్బుత ప్రదర్శన కనబరుస్తుండడంతో భారత వరల్డ్కప్ జట్టులో చోటు దక్కుతుందని భావించారు. కానీ సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన పరాగ్ 409 పరుగులు చేశాడు.ఎస్ఆర్హెచ్ చేతిలో ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ ఓటమి పాలైంది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(67), రియాన్ పరాగ్(77) హాఫ్ సెంచరీలతో పోరాట పటిమ కనబరిచారు.ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. నటరాజన్, కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. If you are one of those who trolled Riyan Parag during his tough time then you need to say sorry to him.He is slapping all of us with his exceptional performance.He is the finisher along with Rinku Singh who will bring the ICC trophy in future for Indiapic.twitter.com/Mk0IRvtfhJ— Sujeet Suman (@sujeetsuman1991) May 2, 2024 -
టీ20 వరల్డ్కప్లో ఓపెనర్లగా కోహ్లి, రోహిత్.. జైశ్వాల్కు నో ఛాన్స్?
టీ20 వరల్డ్కప్-2024కు మరో 54 రోజుల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్నాయి. జూన్ 2న డల్లాస్ వేదికగా యూనైటడ్ స్టేట్స్, కెనడా మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ పొట్టి ప్రపంచకప్ షురూ కానుంది. అయితే ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు తమ పూర్తి వివరాలను మే1 లోపు ప్రకటించాలని ఐసీసీ ఆయా జట్లకు ఇప్పటికే డెడ్లైన్ విధించింది. దీంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డుల తమ జట్లను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కూడా ఈ మెగా ఈవెంట్కు పంపే తమ జట్టును సిద్దం చేసే పనిలో పడింది. అయితే తొలుత 20 మంది సభ్యులతో కూడిన ప్రిలిమనరీ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో నుంచి మే 25లోపు 15 మంది సభ్యుల పేర్లను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ షార్ట్ లిస్ట్ చేయనున్నట్లు సమాచారం. రియాన్ పరాగ్కు ఛాన్స్.. అయితే ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్కు టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. మిడిలార్డర్లో అద్బుతంగా రాణిస్తుండడంతో పరాగ్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు వినికిడి. పరాగ్ ప్రస్తుతం తన కెరీర్లోనే అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. రాజస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన పరాగ్.. 63.60 సగటుతో 318 పరుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్కప్లో భారత ఇన్నింగ్స్ను కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రారంభించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో శుబ్మన్ గిల్ను బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేసి.. మరో యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ను రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉంచాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా ఐపీఎల్-2024లో జైశ్వాల్ దారుణ ప్రదర్శన కనబరిస్తున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన జైశ్వాల్17.29 సగటుతో 121 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ క్యాష్ రిచ్లీగ్లో అదరగొడుతున్న సీఎస్కే ఆల్రౌండర్ శివమ్ దూబేకు సైతం వరల్డ్కప్లో చోటు దక్కే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మెగా ఈవెంట్కు భారత జట్టను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ 30న ప్రకటించే అవకాశముంది. -
T20 WC: దుమ్ములేపుతున్నాడు.. సెలక్టర్లు అతడిని గుర్తుంచుకోవాలి!
ఐపీఎల్-2024 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 24 మ్యాచ్లు పూర్తి కాగా.. రాజస్తాన్ రాయల్స్ ఐదింట నాలుగు విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పాత కథనే పునరావృతం చేస్తూ ఐదింటి నాలుగు పరాజయాలతో ప్రస్తుతం అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ పూర్తైన దాదాపు ఐదు రోజుల వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో సీజన్ ప్రదర్శన ఆధారంగా టీమిండియా ఎంపిక జరుగనుందన్న నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాటల్లో వరుస హాఫ్ సెంచరీలు బాదుతున్న యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ను గుర్తుపెట్టుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా అసోం ఆల్రౌండర్ రియాన్ పరాగ్ దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్లో గత 15 ఇన్నింగ్స్లో పరాగ్ ఏకంగా 170.7 స్ట్రైక్రేటుతో 771 పరుగులు సాధించాడు. 15 ఇన్నింగ్స్లో పది హాఫ్ సెంచరీలు వరుసగా 45 (19), 61(34), 76*(37), 53*(29), 77(39), 72(36), 57*(33), 50*(31), 12(10), 8(10), 43(29), 84*(45), 54*(39), 4(4), 76(48) పరుగులు స్కోరు చేశాడు. ఇందులో ఏకంగా పది హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘అతడిపై సెలక్షన్ కమిటీ ఓ కన్నేసి ఉంచాలి. ఇక అతడేమో తన పనిని ఇలాగే చేసుకుపోతూ ఉంటే మంచిది’’ అని రియాన్ పరాగ్ మున్ముందు కూడా ఇలాగే దూసుకుపోవాలని ఆకాంక్షించాడు. అసోం తరఫున దేశవాళీ క్రికెట్లో కాగా అసోంలోని గువాహటిలో 2001లో జన్మించిన రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ హిట్టింగ్లో దిట్ట. అలాగే రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ కూడా! ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో రాణిస్తున్న రియాన్ పరాగ్ ఇంత వరకు టీమిండియాకు సెలక్ట్ కాలేదు. రాజస్తాన్ తరఫున దుమ్ములేపుతూ అయితే, ఐపీఎల్-2024లో మాత్రం అతడి ప్రదర్శన సెలక్టర్లను ఆకర్షించేలా ఉంది. రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రియాన్ పరాగ్ ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్లో కలిపి 261 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం రియాన్ పరాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తాజాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లోనూ పరాగ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 76 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్లో రాజస్తాన్ గుజరాత్ చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. Caution ⚠ It's Riyan Parag demolition on display 🔥💥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/dzKuPfTS0Q — JioCinema (@JioCinema) April 10, 2024 చదవండి: సంజూ శాంసన్కు భారీ జరిమానా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాయల్స్కు టైటాన్స్ షాక్
197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది... చివర్లో 4 ఓవర్లలో 59 పరుగులు చేయాల్సిన దశలో గెలుపు అసాధ్యంగా అనిపించింది. కానీ తర్వాతి నాలుగు ఓవర్లలో వరుసగా 17, 7, 20, 17 పరుగులు సాధించిన టైటాన్స్ అనూహ్య విజయాన్ని అందుకుంది. అప్పటి వరకు నియంత్రణతో బౌలింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ పేలవ బౌలింగ్, వ్యూహ వైఫల్యంతో చేజేతులా మ్యాచ్ను కోల్పోయి ఈ సీజన్లో తొలి ఓటమిని ఎదుర్కొంది. జైపూర్: వరుస విజయాలతో అజేయంగా దూసుకుపోతున్న రాజస్తాన్ రాయల్స్కు బ్రేక్ పడింది. బుధవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాయల్స్పై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్స్లు), సామ్సన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (44 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా, సాయి సుదర్శన్ (29 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. శతక భాగస్వామ్యం... గత మూడు మ్యాచ్లలో వైఫల్యాల తర్వాత ఈసారి యశస్వి (19 బంతుల్లో 24; 5 ఫోర్లు) కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చగా, గత మ్యాచ్లో సెంచరీ చేసిన బట్లర్ (8) విఫలమయ్యాడు. పవర్ప్లేలో రాజస్తాన్ 43 పరుగులే చేయగా... ఈ దశ నుంచి సామ్సన్, పరాగ్ భారీ భాగస్వామ్యం రాయల్స్ను పటిష్ట స్థితికి చేర్చింది. ఇద్దరూ వేగంగా పరుగులు సాధించారు. పరాగ్ 34 బంతుల్లో, సామ్సన్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నారు. ఎట్టకేలకు 19వ ఓవర్లో పరాగ్ను అవుట్ చేసి మోహిత్ ఈ జోడీని విడదీశాడు. అయితే ఉమేశ్ వేసిన చివరి ఓవర్లో సామ్సన్, హెట్మైర్ (13 నాటౌట్) చెరో సిక్స్ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. గిల్ కెప్టెన్ఇన్నింగ్స్... భారీ ఛేదనలో టైటాన్స్కు సుదర్శన్, శుబ్మన్ గిల్ దూకుడైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. వీరిద్దరు తొలి వికెట్కు 64 పరుగులు జోడించినా... అందుకు 50 బంతులు తీసుకున్నారు. రాయల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్తో వీరి పరుగుల వేగాన్ని నిరోధించింది. బౌల్ట్ తొలి 2 ఓవర్లలో 8 పరుగులే ఇవ్వగా... అవేశ్ బౌలింగ్లో 14 పరుగులు రాబట్టడంతో టైటాన్స్ స్కోరు పవర్ప్లే ముగిసే సరికి 44 పరుగులకు చేరింది. అయితే కుల్దీప్ సేన్ ఒక్కసారిగా గుజరాత్ను దెబ్బ తీశాడు. తన బౌలింగ్లో 6 పరుగుల వ్యవధిలో అతను సుదర్శన్, వేడ్ (4), మనోహర్ (1)లను వెనక్కి పంపించాడు. ఈ దశలో కెపె్టన్ గిల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 35 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయ్ శంకర్ (16) ప్రభావం చూపలేకపోగా... 28 బంతుల్లో 65 పరుగులు చేయాల్సిన స్థితిలో గిల్ వెనుదిరగడంతో టైటాన్స్ ఆశలు సన్నగిల్లాయి. అయితే కీలక సమయంలో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు), రాహుల్ తెవాటియా (11 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఆట జట్టును గెలిపించింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) వేడ్ (బి) ఉమేశ్ 24; బట్లర్ (సి) తెవాటియా (బి) రషీద్ 8; సామ్సన్ (నాటౌట్) 68; పరాగ్ (సి) శంకర్ (బి) మోహిత్ 76; హెట్మైర్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–32, 2–42, 3–172. బౌలింగ్: ఉమేశ్ 4–0–47–1, జాన్సన్ 4–0–37–0, రషీద్ 4–0–18–1, నూర్ 4–0–43–0, మోహిత్ 4–0–51–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 35; గిల్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 72; వేడ్ (బి) కుల్దీప్ 4; మనోహర్ (బి) కుల్దీప్ 1; విజయ్ శంకర్ (బి) చహల్ 16; తెవాటియా (రనౌట్) 22; షారుఖ్ (ఎల్బీ) (బి) అవేశ్ 14; రషీద్ ఖాన్ (నాటౌట్) 24; నూర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–64, 2–77, 3–79, 4–111, 5–133, 6–157, 7–195. బౌలింగ్: బౌల్ట్ 2–0–8–0, అవేశ్ 4–0–48–1, మహరాజ్ 2–0–16–0, అశి్వన్ 4–0–40–0, చహల్ 4–0–43–2, కుల్దీప్ సేన్ 4–0–41–3. ఐపీఎల్లో నేడు ముంబై X బెంగళూరు వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024 RR VS GT: శివాలెత్తిన సంజూ శాంసన్
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో శాంసన్ శివాలెత్తిపోయి మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ.. ప్రస్తుత సీజన్లో మూడో అర్దశతకాన్ని నమోదు చేశాడు. తొలుత లక్నోతో జరిగిన మ్యాచ్లో 52 బంతుల్లో అజేయమైన 82 పరుగులు చేసిన సంజూ.. ఆతర్వాత ఆర్సీబీపై 42 బంతుల్లో 69.. తాజాగా గుజరాత్పై 38 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్లో భీకరఫామ్లో ఉన్న సంజూ.. 5 మ్యాచ్ల్లో 157.69 స్టయిక్రేట్తో 82 సగటున 246 పరుగులు చేసి, విరాట్ (316), రియాన్ల (261) తర్వాత సీజన్ మూడో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. గుజరాత్తో మ్యాచ్లో సంజూతో పాటు రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో యశస్వి 24, బట్లర్ 8, హెట్మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. టార్గెట్ 197.. ఆచితూచి ఆడుతున్న గుజరాత్ రాజస్థాన్ నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 30/0గా ఉంది. సాయి సుదర్శన్ (19), శుభ్మన్ గిల్ (11) క్రీజ్లో ఉన్నారు. -
పిచ్చెక్కించిన రియాన్ పరాగ్.. మరో సుడిగాలి ఇన్నింగ్స్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రియాన్ పరాగ్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో రియాన్ మూడో హాఫ్ సెంచరీతో మెరిశాడు. గుజరాత్తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్లో రియాన్ 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో మెరుపు అర్దశతకం బాదాడు. రియాన్ హాఫ్ సెంచరీ మార్కును సిక్సర్తో అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 48 పరుగులు ఎదుర్కొన్న రియాన్.. 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. RIYAN PARAG ON FIRE IN IPL 2024. 🤯👌 pic.twitter.com/fincAlQBPh— Johns. (@CricCrazyJohns) April 10, 2024 ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రియాన్ చేసిన స్కోర్ల వివరాలు.. 43(29) vs LSG 84*(45) vs DC 54*(39) vs MI 4 (4) vs RCB 76 (48) vs GT ఈ సీజన్లో రియాన్ 5 మ్యాచ్ల్లో 158.18 స్ట్రయిక్రేట్తో 87 సగటున 261 పరుగులు చేసి విరాట్ కోహ్లి (316) తర్వాత సీజన్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. రియాన్, సంజూ మెరుపులు.. రాజస్థాన్ భారీ స్కోర్ మ్యాచ్ విషయానికొస్తే.. రియాన్ పరాగ్తో పాటు సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపులు మెరిపించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో యశస్వి 24, బట్లర్ 8, హెట్మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. -
#Riyan Parag: 'అతడొక సంచలనం.. సూర్యకుమార్లా ఆడుతున్నాడు'
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లో అదరగొట్టిన పరాగ్.. సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ శాంసన్, బట్లర్, జైశ్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట పరాగ్ సత్తాచాటాడు. తన అద్బుత ఇన్నింగ్స్తో రాజస్తాన్ను పరాగ్ గెలిపించాడు. ఈ మ్యాచ్లో 39 బంతులు ఎదుర్కొన్న పరాగ్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన పరాగ్.. 181 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో పరాగ్పై రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. పరాగ్ తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్ను గుర్తు చేస్తున్నడంటూ బాండ్ కొనియాడాడు."పరాగ్ అద్బుతమైన ఆటగాడు. అతడు తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్ను గుర్తు చేశాడు. సూర్య ముంబై ఇండియన్స్లోకి కొత్తగా వచ్చినప్పుడు ఈ తరహా ప్రదర్శనే చేసేవాడు. పరాగ్కు మంచి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడు కేవలం 22 ఏళ్ల వయస్సుకే అద్బుతమైన టాలెంట్ను సంపాందించుకున్నాడు. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది.ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అతడు దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అందుకే అతడికి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చాం. దేవ్దత్ పడిక్కల్ను వదులుకోవడంతో పరాగ్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. అతడి నుంచి ఈ తరహా ప్రదర్శన కోసం మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాము.రాజస్తాన్ అతడిపై పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు ప్రతిఫలం పొందుతుంది. మిగిలిన సీజన్లో కూడా రియాన్ తన ఫామ్ను కొనసాగించాలని ఆశిస్తున్నానని" క్రిక్ట్రాకర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాండ్ పేర్కొన్నాడు. -
#Riyan Parag: 'అతడొక సంచలనం.. సూర్యకుమార్లా ఆడుతున్నాడు'
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లో అదరగొట్టిన పరాగ్.. సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ శాంసన్, బట్లర్, జైశ్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట పరాగ్ సత్తాచాటాడు. తన అద్బుత ఇన్నింగ్స్తో రాజస్తాన్ను పరాగ్ గెలిపించాడు. ఈ మ్యాచ్లో 39 బంతులు ఎదుర్కొన్న పరాగ్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన పరాగ్.. 181 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో పరాగ్పై రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. పరాగ్ తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్ను గుర్తు చేస్తున్నడంటూ బాండ్ కొనియాడాడు. "పరాగ్ అద్బుతమైన ఆటగాడు. అతడు తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్ను గుర్తు చేశాడు. సూర్య ముంబై ఇండియన్స్లోకి కొత్తగా వచ్చినప్పుడు ఈ తరహా ప్రదర్శనే చేసేవాడు. పరాగ్కు మంచి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడు కేవలం 22 ఏళ్ల వయస్సుకే అద్బుతమైన టాలెంట్ను సంపాందించుకున్నాడు. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అతడు దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అందుకే అతడికి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చాం. దేవ్దత్ పడిక్కల్ను వదులుకోవడంతో పరాగ్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. అతడి నుంచి ఈ తరహా ప్రదర్శన కోసం మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాము. రాజస్తాన్ అతడిపై పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు ప్రతిఫలం పొందుతుంది. మిగిలిన సీజన్లో కూడా రియాన్ తన ఫామ్ను కొనసాగించాలని ఆశిస్తున్నానని" క్రిక్ట్రాకర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాండ్ పేర్కొన్నాడు. -
IPL 2024: సునామీలా దూసుకొస్తున్న రియాన్ పరాగ్
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఇటీవలికాలంలో పొట్టి ఫార్మాట్లో చెలరేగిపోతున్నాడు. గత 12 టీ20 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 9 హాఫ్ సెంచరీలతో విధ్వంసం సృష్టించాడు. ఈ మధ్యలో రియాన్ చేసిన స్కోర్లపై లుక్కేస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈ విధ్వంసకర ఆటగాడు గత 12 ఇన్నింగ్స్ల్లో 178.72 స్ట్రయిక్రేట్తో 107.83 సగటున 647 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే రియాన్ పొట్టి ఫార్మాట్పైకి సునామీలా దూసుకొస్తున్నట్లనిపిస్తుంది. రియాన్ తన ఫామ్ను ఇలాగే కొనసాగిస్తే టీ20 ఫార్మాట్ను శాశించడం ఖాయం. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో 3 మ్యాచ్ల్లో 160కిపైగా స్ట్రయిక్రేట్తో 181 సగటున రెండు హాఫ్ సెంచరీల సాయంతో 181 పరుగులు చేసిన రియాన్.. దిగ్గజ విరాట్ కోహ్లితో కలిసి సీజన్ లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ముంబై ఇండియన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించిన రియాన్.. ప్రస్తుత సీజన్లో వరుసగా 43 (29), 84 నాటౌట్ (45), 54 నాటౌట్ (39) స్కోర్లు చేశాడు. ముంబైతో మ్యాచ్లో సహచరులంతా తక్కువ స్కోర్లకే ఔటైతే రియాన్ ఒక్కడే నిలదొక్కుకుని మెరుపు ఇన్నింగ్స్తో మెరిశాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు బాదాడు. గత 12 ఇన్నింగ్స్ల్లో రియాన్ పరాగ్ చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయి. 61(34), 76*(37), 53*(29), 77(39), 72(36), 57*(33), 50*(31), 12(10), 8(10), 43(29), 84*(45), 54*(39) ముంబైతో మ్యాచ్ విషయానికొస్తే.. రియాన్తో పాటు ట్రెంట్ బౌల్ట్ (4-0-22-3), చహల్ (4-0-11-3) సత్తా చాటడంతో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై చెత్త ప్రదర్శన చేసి నిర్ణీత ఓవర్లలో కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్లో రోహిత్ సహా ముగ్గురు (నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్) గోల్డెన్ డకౌట్లయ్యారు. తిలక్ వర్మ (32), హార్దిక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బౌల్ట్ (4-0-22-3), చహల్ (4-0-11-3), బర్గర్ (4-0-32-2), ఆవేశ్ ఖాన్ (4-0-30-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని వణికించారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్.. 15.3 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. రియాన్ పరాగ్ (54 నాటౌట్) మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వి (10), బట్లర్ (13) మరోసారి నిరాశపరిచారు. సంజూ శాంసన్ 12, అశ్విన్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 3 వికెట్లు పడగొట్టగా.. మఫాక తన మొట్టమొదటి ఐపీఎల్ వికెట్ దక్కించుకున్నాడు. -
IPL 2024 : రాజస్తాన్ ‘హ్యాట్రిక్’ విజయం (ఫొటోలు)
-
ఒంటి చేత్తో మలుపు తిప్పిన రియాన్ పరాగ్
-
డ్యాన్స్తోనూ ఇరగదీసిన రియాన్ పరాగ్.. అదిరిపోయే వీడియో..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో సత్తా చాటిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్.. ఆన్ ఫీల్డ్లో తన ప్రవర్తన చేత బాగా పాపులరైన విషయం తెలిసిందే. రియాన్ మైదానంలో తాను ఏమి సాధించినా డ్యాన్స్లు చేస్తూ.. విచిత్ర హావభావాలు పలికిస్తూ.. డ్రెస్సింగ్ రూమ్కు ఇంకేదైనా సందేశాన్ని పంపిస్తూ సెలబ్రేట్ చేసుకుంటాడు. He was trolled badly in previous seasons for having self confidence and today he converted his words into action, Riyan Parag is here to rule. Missed his dance though @ParagRiyan ❤️pic.twitter.com/higJiikEQ7 — Yashvi (@BreatheKohli) March 28, 2024 ఇటీవలికాలంలో అతను చేసిన కొన్ని స్టంట్స్ సోషల్మీడియాలో బాగా వైరలయ్యాయి. దేశవాలీ టోర్నీలో సెంచరీ చేసిన అనంతరం నా స్థాయి ఇది కాదని సైగలు చేయడం, ఐపీఎల్లో హాఫ్ సెంచరీ అనంతరం డ్యాన్స్ చేయడం వంటివి జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. వీటి వల్ల చాలా పాపులరైన రియాన్.. ఓవరాక్షన్ స్టార్ అన్న అపవాదు కూడా తెచ్చుకున్నాడు. అయితే రియాన్ ఇటీవలికాలంలో బ్యాట్తో సమాధానం చెబుతూ ఆ ముద్రను చెరిపి వేసుకుంటున్నాడు. Sir Shubman Gill and Riyan parag dance 🥵😍 pic.twitter.com/SPIGnZtfDF — Pratheep (@Classypratheep) March 28, 2024 రియాన్ తాజా ప్రదర్శన (ఢిల్లీపై మెరుపు ఇన్నింగ్స్) నేపథ్యంలో జనాల్లో అతనిపై నెగిటివిటీ పోయి హీరో ఒపీనియన్ వస్తుంది. రాత్రికిరాత్రి రాజస్థాన్ ఫ్యాన్స్ రియాన్ను హీరోలా చూడటం మొదలుపెట్టారు. నిన్న రాత్రి నుంచి సోషల్మీడియాలో ఎక్కడ చూసినా రియానే కనిపిస్తున్నాడు. ఇతనికి సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో పాత వీడియో ఒకటి హల్చల్ చేస్తుంది. ఇందులో రియాన్ డ్యాన్స్తో ఇరగదీస్తాడు. ఈ వీడియోలో రియాన్ డ్యాన్స్తో ఇరగదీస్తుంటే శుభ్మన్ గిల్ అతన్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. ఫాస్ట్ బీట్ ఉండే ఓ ట్యూన్కు రియాన్ ప్రొఫెషనల్ డ్యాన్సర్లా స్టెప్పులేశాడు. ఈ వీడియో చూస్తే రియాన్పై ఇంప్రెషన్ ఇంకాస్త పెరుగుతుంది. మొత్తానికి రియాన్ బ్యాట్తోనే కాకుండా డ్యాన్స్తోనూ ఇరగదీశాడు. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి. ఇదిలా ఉంటే, ఢిల్లీతో నిన్న జరిగిన మ్యాచ్లో రియాన్ (45 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో రాయల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితై సీజన్లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. రాయల్స్ ఇన్నింగ్స్లో రియాన్తో పాటు అశ్విన్ (29; 3 సిక్సర్లు), జురెల్ (20; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఢిల్లీ విషయానికొస్తే.. నామమాత్రపు ఛేదనలో డేవిడ్ వార్నర్ (49) పర్వాలేదనిపించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లు బర్గర్ (3-0-29-2), చహల్ (3-0-19-2), ఆవేశ్ ఖాన్ (4-0-29-1) రాణించారు. -
నోర్జేకు చుక్కలు చూపించిన రియాన్ పరాగ్.. కాళరాత్రిలా మార్చేశాడు..!
ఓవరాక్షన్ స్టార్ అని పేరున్న రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్.. తనపై వేసిన ఆ ముద్ర తప్పని నిరూపించుకుంటున్నాడు. తరుచూ అతి చేష్టలతో వార్తల్లో నిలిచే పరాగ్.. గత కొంతకాలంగా ఓవరాక్షన్ తగ్గించుకుని ఆటపై దృష్టి పెడుతున్నాడు. ఈ క్రమంలో సక్సెస్ రుచి చూస్తున్నాడు. ఇటీవలికాలంలో అతని ప్రదర్శనలు అదిరిపోతున్నాయి. ఫార్మాట్ ఏదైనా రియాన్ చెలరేగిపోతున్నాడు. గతకొంతకాలంగా భీకర ఫామ్లో ఉన్న పరాగ్.. తన ఫామ్ను ఐపీఎల్లోనూ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్తో ఆడిన తొలి మ్యాచ్లో 43 పరుగులతో అలరించిన పరాగ్.. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో 45 బంతులు ఎదుర్కొన్న అతను.. 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. Riyan Parag at one point 26(26) and he smashed 24*(8) and he completed his fifty in 34 balls. - RIYAN PARAG, THE STAR. ⭐ pic.twitter.com/X1uHZRpQ7F — CricketMAN2 (@ImTanujSingh) March 28, 2024 పరాగ్ మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగడంతో రాజస్థాన్ ఢిల్లీని మట్టికరిపించింది. మ్యాచ్ మొత్తానికి రియాన్ మెరుపు ఇన్నింగ్సే హైలైట్గా నిలిచింది. మరి ముఖ్యంగా రియాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నోర్జే చుక్కలు చూపించిన తీరు విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. ఈ ఓవర్లో రియాన్ వరుసగా 4, 4, 6, 4, 6, 1 పరుగులు చేసి 25 పరుగులు పిండుకున్నాడు. రియాన్ దెబ్బకు నోర్జేకు నిన్నటి రాత్రి కాళరాత్రిలా మారింది. RIYAN PARAG SMASHED 25 RUNS IN THE FINAL OVER AGAINST NORTJE. 🔥🤯 - The Madman of Rajasthan Royals.pic.twitter.com/5bg7riHxY2 — Johns. (@CricCrazyJohns) March 28, 2024 నోర్జేను బహుశా ఏ బ్యాటర్ రియాన్లా చితబాది ఉండడు. రియాన్ ధాటికి నోర్జే 4 ఓవర్లలో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. రియాన్ నోర్జేకు చుక్కలు చూపిస్తున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. He was trolled badly in previous seasons for having self confidence and today he converted his words into action, Riyan Parag is here to rule. Missed his dance though @ParagRiyan ❤️pic.twitter.com/higJiikEQ7 — Yashvi (@BreatheKohli) March 28, 2024 ఒకనాడు ఓవరాక్షన్ స్టార్ అన్న నోళ్లే ఇప్పుడు రియాన్ను పొగుడుతున్నాయి. రాజస్థాన్ అభిమానులు రియాన్కు జేజేలు పలుకుతున్నారు. ఈ ఒక్క ఇన్నింగ్స్తో రియాన్ ఓవర్నైట్ హీరో అయిపోయాడు. రాయల్స్ మున్ముందు పరాగ్ నుంచి ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తుంది. కాగా, డీసీతో మ్యాచ్లో రియాన్ రెచ్చిపోవడంతో రాయల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితై సీజన్లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. రాయల్స్ ఇన్నింగ్స్లో రియాన్తో పాటు అశ్విన్ (29; 3 సిక్సర్లు), జురెల్ (20; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఢిల్లీ విషయానికొస్తే.. నామమాత్రపు ఛేదనలో డేవిడ్ వార్నర్ (49) పర్వాలేదనిపించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లు బర్గర్ (3-0-29-2), చహల్ (3-0-19-2), ఆవేశ్ ఖాన్ (4-0-29-1) రాణించారు. -
ఢిల్లీ క్యాపిటల్స్పై రాజస్తాన్ మెరుపు విజయం (ఫొటోలు)
-
పరాగ్ ప్రతాపం
జైపూర్: సొంతగడ్డపై రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. టాపార్డర్ చేతులెత్తేసిన వేళ రియాన్ పరాగ్ (45 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్స్లు) ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లందరినీ చితగ్గొట్టాడు. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిచింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రియాన్ పరాగ్ ఒంటిచేత్తో స్కోరుబోర్డును హోరెత్తించాడు. ఖలీల్, ముకేశ్, నోర్జే, అక్షర్, కుల్దీప్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి ఓడింది. డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్స్లు), ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. బర్గర్, చహల్ చెరో 2 వికెట్లు తీశారు. పరాగ్ మెరుపులతో.... రాజస్తాన్ ఆదిలోనే కష్టాల్లో పడింది. 7.2 ఓవర్లలో జట్టు స్కోరు 36/3. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (5) రెండో ఓవర్లో, కెప్టెన్ సంజూ సామ్సన్ (15) ఆరో ఓవర్లో పెవిలియన్ చేరారు. పవర్ప్లేలో వీళ్లిద్దరి వికెట్లు కోల్పోయిన రాయల్స్ 31 పరుగులే చేసింది. కాసేపటికే బట్లర్ (11)కు కుల్దీప్ ముగింపు పలికాడు. ఈ దశలో రియాన్ పరాగ్ ఇన్నింగ్స్కు అంత తానై నడిపించాడు. చెత్తబంతుల్ని బౌండరీలతో శిక్షించాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బ్యాటింగ్ ప్రమోషన్లో వచ్చిన అశ్విన్ (19 బంతుల్లో 29; 3 సిక్స్లు) చూడచక్కని సిక్స్లతో అలరించాడు. నాలుగో వికెట్కు 54 పరుగులు జతచేసిన అశ్విన్, పరాగ్ జోడీ ఇన్నింగ్స్ను నిలబెట్టింది. అశ్విన్ అవుటయ్యాక 15వ ఓవర్లో రాజస్తాన్ వంద పరుగుల మైలురాయిని చేరుకుంది. ఆ ఓవర్ ముగిసేసరికి రాజస్తాన్ జట్టు స్కోరు 108/4. ఇలాంటి స్థితి నుంచి 180 పైచిలుకు స్కోరు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. 34 బంతుల్లో పరాగ్ అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత పరాగ్ బ్యాట్ విధ్వంసమే చేసింది. దీంతో ధ్రువ్ జురెల్ (12 బంతుల్లో 20; 3 ఫోర్లు)తో పరాగ్ ఐదో వికెట్కు 23 బంతుల్లోనే 52 పరుగులు చకచకా జోడించాడు. ఆ తర్వాత హెట్మైర్తో కలిసి ఆరో వికెట్కు 16 బంతుల్లోనే 43 పరుగులు జతచేశాడు. నోర్జే వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో పరాగ్ వరుసగా 4, 4, 6, 4, 6, 1లతో 25 పరుగులు దంచుకున్నాడు. దీంతో చివరి 5 ఓవర్లలో రాజస్తాన్ 77 పరుగుల్ని అవలీలగా సాధించింది. బర్గర్ దెబ్బ... వార్నర్తో ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన మిచెల్ మార్‡్ష (12 బంతుల్లో 23; 5 ఫోర్లు) బౌండరీలతో రెచ్చిపోయాడు. కానీ అంతలోనే ఇంపాక్ట్ బౌలర్ నాండ్రె బర్గర్... మార్‡్షతో పాటు రికీ భుయ్ (0)ని మూడు బంతుల వ్యవధిలో అవుట్ చేసి ఢిల్లీని కష్టాల్లో పడేశాడు. ఈ దశలో వార్నర్ సిక్స్లు, ఫోర్లతో లక్ష్యానికి తగ్గ రన్రేట్తో క్యాపిటల్స్ ఇన్నింగ్స్ను ధాటిగా నడిపించాడు. 11 ఓవర్లదాకా 93/2 స్కోరుతో ఢిల్లీ పటిష్టస్థితిలో ఉంది. కానీ తర్వాతి ఓవర్లో ఫిఫ్టీకి పరుగు దూరంలో ఉన్న వార్నర్... సందీప్ శర్మ కళ్లు చెదిరే క్యాచ్కు నిష్క్రమించాడు. కాసేపటికే కెపె్టన్ రిషభ్ పంత్ (26 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్)ను స్పిన్నర్ చహల్ వెనక్కి పంపాడు. ఇంపాక్ట్గా వచ్చి న పొరెల్ (9) కూడా చహల్ బౌలింగ్లో బోల్తా పడ్డాడు. బౌల్ట్ క్యాచ్ వదిలేయడంతో 14 పరుగుల స్కోరువద్ద బతికిపోయిన స్టబ్స్ తర్వాత వరుస రెండు బంతుల్లో భారీ సిక్స్లు కొట్టాడు. అక్షర్ (13 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్) పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోయాడు. దీంతోపాటు డెత్ ఓవర్లలో సందీప్, అవేశ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఈ సీజన్లో జరిగిన 9 మ్యాచ్ ల్లోనూ హోమ్ టీమ్ నెగ్గడం విశేషం. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) ముకేశ్ 5; బట్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 11; సామ్సన్ (సి) పంత్ (బి) ఖలీల్ 15; పరాగ్ (నాటౌట్) 84; అశ్విన్ (సి) స్టబ్స్ (బి) అక్షర్ 29; జురెల్ (బి) నోర్జే 20; హెట్మైర్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–9, 2–30, 3–36, 4–90, 5–142. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–24–1, ముకేశ్ 4–0–49–1, నోర్జే 4–0–48–1, అక్షర్ పటేల్ 4–0–21–1, కుల్దీప్ 4–0–41–1 ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) సందీప్ (బి) అవేశ్ ఖాన్ 49; మార్‡్ష (బి) బర్గర్ 23; రికీ భుయ్ (సి) సామ్సన్ (బి) బర్గర్ 0; పంత్ (సి) సామ్సన్ (బి) చహల్ 28; స్టబ్స్ (నాటౌట్) 44; అభిõÙక్ పొరెల్ (సి) బట్లర్ (బి) చహల్ 9; అక్షర్ పటేల్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–30, 2–30, 3–97, 4–105, 5–122. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 3–0–29–0, బర్గర్ 3–0–29–2, అశ్విన్ 3–0–30–0, అవేశ్ ఖాన్ 4–0–29–1, చహల్ 3–0–19–2, సందీప్ 4–0–36–0. -
అన్న నీవు ఓవరాక్షన్ స్టార్ కాదు.. ఇక సూపర్ స్టార్వే! వీడియో వైరల్
రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ తన ఐపీఎల్ కెరీర్లోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో పరాగ్ విధ్వంసం స`ష్టించాడు. ఢిల్లీ బౌలర్లను పరాగ్ ఊచకోత కోశాడు. 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రాజస్తాన్ను పరాగ్ తన అద్భుత ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన రియాన్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన అన్రిజ్ నోర్జే బౌలింగ్లో పరాగ్ ఏకంగా 25 పరుగులు రాబట్టాడు. అందులో 3 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. కేవలం 45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 84 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అతడికి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం . అంతేకాకుండా ఇది పరాగ్కు 17 ఇన్నింగ్స్ల తర్వాత వచ్చిన హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 2019లో ఐపీఎల్లో రాజస్తాన్ తరపున డెబ్యూ చేసిన రియాన్ పరాగ్.. ఇప్పటివరకు 56 మ్యాచులు ఆడాడు. వాటిల్లో 727 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే పరాగ్ ఎప్పుడూ తన ఆటతో కంటే తన వింత చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో ఎక్కేవాడు. కానీ ఇప్పుడు ఆటతో కూడా అందరిని ఆకట్టుకుకుంటున్నాడు ఈ అస్సాం ఆల్రౌండర్. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన తొలి మ్యాచ్లోనూ 43 పరుగులతో అదరగొట్టాడు. ఓవరాల్గా రెండు మ్యాచ్లు 127 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పరాగ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పరాగ్ 2.O అంటూ కొనియాడుతున్నారు. https://t.co/b25Pi3Z0SU pic.twitter.com/hLnVRxlfBw — IndianPremierLeague (@IPL) March 28, 2024 -
అలా అయితే తొలి బంతికే అవుటయ్యే వాడిని!
గత సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడి కేవలం 78 పరుగులు.. ఆట కంటే కూడా అతి చేష్టలతోనే వార్తల్లో ఉంటాడంటూ ఘాటు విమర్శలు.. ఇక సోషల్ మీడియాలో అయితే ‘ఓవరాక్షన్’ స్టార్ అనే ట్యాగ్తో జరిగే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. మీరు ఊహించిన పేరు నిజమే.. రియాన్ పరాగ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడీ అసోం ఆల్రౌండర్. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన రియాన్.. రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్. నిజానికి రాజస్తాన్ రాయల్స్ జట్టులో రియాన్కు వచ్చినన్ని అవకాశాలు మరెవరికీ రాలేదు. అయినా.. వాటిని సద్వినియోగం చేసుకోలేక విమర్శలు మూటగట్టుకున్నాడతడు. అయితే, ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన రియాన్.. ఐపీఎల్-2024లోనూ శుభారంభం అందుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రియన్ పరాగ్.. కెప్టెన్ సంజూ శాంసన్(82 నాటౌట్)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 29 బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేశాడు. Fine Hitting On Display 💥 Sanju Samson brings up his 5️⃣0️⃣#RR 119/2 after 13 overs Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Follow the match ▶️ https://t.co/MBxM7IvOM8#TATAIPL | #RRvLSG pic.twitter.com/MTywnipKwl — IndianPremierLeague (@IPL) March 24, 2024 సంజూతో కలిసి 59 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. తద్వారా లక్నోపై రాజస్తాన్ విజయంలో తానూ భాగమయ్యాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. కెప్టెన్ సంజూ శాంసన్ వల్లే తన ఇన్నింగ్స్ సాఫీగా సాగిందని కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘ప్రాక్టీస్ చేసే సమయంలో కొత్తగా నేర్చుకున్న కొన్ని షాట్లను ఇక్కడ ట్రై చేస్తానని సంజూ భయ్యాతో చెప్పాను. తనతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నపుడు ‘ప్లీజ్ భయ్యా.. ఒక్కటంటే ఒక్క షాట్ కొడతా’ అని బతిమిలాడాను. కానీ భయ్యా మాత్రం.. ‘వద్దు.. వద్దు.. ఈ రోజు వికెట్ అంత అనుకూలంగా లేదు’ అని నన్ను వారించాడు. ఒకవేళ భయ్యా అలా చెప్పి ఉండకపోతే హడావుడిలో వికెట్ పారేసుకునేవాడినేమో. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్న షాట్లను సరైన పద్ధతిలో అమలు చేయలేకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భయ్యా జాగ్రత్తలు చెప్పకపోయి ఉంటే తొలి బంతికే అవుటయ్యే వాడిని’’ అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు. కాగా జైపూర్లో లక్నోతో ఆదివారం జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో గెలుపొందిన రాజస్తాన్ ఐపీఎల్-2024ను విజయంతో ఆరంభించింది. చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్.. మండిపడ్డ రోహిత్! పక్కనే అంబానీ.. -
RR Vs LSG: అన్న ఇది నీవేనా.. మేము అస్సలు ఊహించలేదు! వీడియో వైరల్
ఐపీఎల్లో గత కొన్ని సీజన్లగా తన ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకుంటున్న రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఎట్టకేలకు బ్యాట్ను ఝులిపించాడు. ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో పరాగ్ అదరగొట్టాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన పరాగ్ తన అద్బుతమైన ఇన్నింగ్స్తో అందరని ఆకట్టుకున్నాడు. కెప్టెన్ సంజూ శాంసన్తో కలిసి తన జట్టుకు భారీ స్కోర్ను అందించాడు. 29 బంతులు ఎదుర్కొన్న రియాన్.. ఒక ఫోర్, 3 సిక్స్లతో 43 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అన్న ఇది నీవేనా.. అస్సలు ఊహించలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా 2019లో ఐపీఎల్లో రాజస్తాన్ డెబ్యూ చేసిన రియాన్ పరాగ్.. ఇప్పటివరకు 55 మ్యాచులు ఆడాడు. వాటిల్లో 643 పరుగులు స్కోర్ చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ సంజూ శాంసన్ (52 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. శాంసన్తో పాటు రియాన్ పరాగ్ (43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్ తలా వికెట్ పడగొట్టారు. 𝙋𝙖𝙧𝙖𝙜 𝙥𝙤𝙬𝙚𝙧 💪#RRvLSG #TATAIPL #IPLonJioCinema #IPL2024 #JioCinemaSports pic.twitter.com/lzqzCLqBfY — JioCinema (@JioCinema) March 24, 2024 -
శతక్కొట్టిన బెంగాల్ మంత్రి.. చెలరేగిన షమీ తమ్ముడు
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా అసోం జట్టుపై బెంగాల్ ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుని.. ఏకంగా ఇన్నింగ్స్ 162 పరుగుల తేడాతో రియాన్ పరాగ్ సేనను మట్టికరిపించింది. గువాహటి వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన అసోం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బెంగాల్ 405 పరుగులకు ఆలౌట్ అయింది. అనుస్తుప్ మజుందార్(125), కెప్టెన్, బెంగాల్ క్రీడా శాఖా మంత్రి మనోజ్ తివారి(100) శతకాలకు తోడు.. లోయర్ ఆర్డర్లో కరణ్ లాల్(52), సూరజ్ సింధు జైస్వాల్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో ఈ మేరకు భారీ స్కోరు నమోదు చేసింది. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అసోం.. బెంగాల్ బౌలర్ల దెబ్బకు 103 పరుగులకే చాపచుట్టేసింది. దినేశ్ దాస్(50), సాహిల్ జైన్(40) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 5 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇక కెప్టెన్ రియాన్ పరాగ్ ఆబ్సెంట్ హర్ట్(0)గా వెనుదిరిగాడు. బెంగాల్ బౌలర్లలో పేసర్ మహ్మద్ కైఫ్(మహ్మద్ షమీ తమ్ముడు) నాలుగు వికెట్లతో చెలరేగగా.. సూరజ్ సింధు జైస్వాల్ మూడు, అంకిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ అసోంను ఫాలో ఆన్ ఆడించగా.. రెండో ఇన్నింగ్స్లో 140 పరుగులకే ఆలౌట్ అయి భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈసారి సూరజ్ సింధు జైస్వాల్ 5 వికెట్లతో చెలరేగగా... అంకిత్, కరణ్ లాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈసారీ రియాన్ ఆబ్సెంట్ హర్ట్గా వెనుదిరిగాడు. ఇక ఆదివారమే ముగిసిన ఈ మ్యాచ్లో బ్యాట్, బాల్తో అదరగొట్టిన సూరజ్ సింధు జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్.. తన అన్నలాగే సొంతరాష్ట్రం ఉత్తరప్రదేశ్కు కాకుండా బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది అరంగేట్రం చేసిన అతడు ఇప్పటికే అద్భుత ప్రదర్శనలతో తనదైన ముద్ర వేయడం విశేషం. చదవండి: శివమ్ దూబే మెరుపు శతకం -
వరుసగా రెండో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రియాన్ పరాగ్
రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్లో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ పరుగుల వరద పారిస్తున్నాడు. సీజన్లో వరుసగా రెండో సెంచరీతో చెలరేగిపోయాడు. చత్తీస్ఘడ్తో జరిగిన తొలి మ్యాచ్లో కేవలం 87 బంతుల్లోనే 11 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేసిన రియాన్.. కేరళతో జరుగుతున్న మ్యాచ్లో 104 బంతుల్లో బాధ్యతాయుతమైన శతకం బాదాడు. రియాన్ చేసిన ఈ రెండు శతకాలు తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చేసినవే కావడం విశేషం. చత్తీస్ఘడ్తో జరిగిన మ్యాచ్లో ఫాలో ఆన్ ఆడే సమయంలో శతక్కొట్టిన రియాన్.. కేరళతో జరుగుతున్న మ్యాచ్లో తన జట్టు 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో సెంచరీతో ఆదుకున్నాడు. చత్తీస్ఘడ్పై రియాన్ చేసిన సెంచరీ రంజీ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ (56 బంతుల్లో) కాగా.. కేరళపై చేసిన సెంచరీ అతని కెరీర్లో చిరకాలం గుర్తుండిపోయేది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్లో 419 పరుగులకు ఆలౌటైంది. సచిన్ బేబి సెంచరీతో (131) సత్తా చాటగా.. కున్నుమ్మల్ (83), కృష్ణ ప్రసాద్ (80), ప్రేమ్ (50) అర్ధసెంచరీలతో రాణించారు. అస్సాం బౌలర్లలో ముక్తర్ హుసేన్, రాహుల్ సింగ్ చెరో 3 వికెట్లు, సిద్దార్థ్ శర్మ 2, ఆకాశ్సేన్ గుప్తా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రియాన్ పరాగ్ (116) బాధ్యతాయుతమైన సెంచరీతో తన జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే రియాన్ మినహా అస్సాం ఇన్నింగ్స్లో ఎవరూ రాణించకపోడంతో ఆ జట్టు మరోసారి కష్టాల్లో పడింది. 212 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 207 పరుగులు వెనుపడి ఉంది. రాహుల్ హజారికా (9), సిద్దార్థ్ శర్మ (0), సుమిత్ (4), గోకుల్ శర్మ (12), సాహిల్ జైన్ (17) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. రిషవ్ దాస్ 31 పరుగులు చేశాడు. ఆకాశ్సేన్ గుప్తా (6), ముక్తర్ హుస్సేన్ (6) క్రీజ్లో ఉన్నారు. -
రియాన్ పరాగ్ సుడిగాలి శతకం
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ఛత్తీస్ఘడ్తో జరుగుతున్న మ్యాచ్లో అస్సాం సారధి రియాన్ పరాగ్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్లో అతను మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లోనే సుడిగాలి శతకం బాదాడు. జట్టు కష్టాల్లో (ఫాలో ఆన్) ఉన్నప్పుడు రియాన్ ఆడిన ఈ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటిగా కీర్తించబడుతుంది. రియాన్ మెరుపు శతకం సాయంతో అస్సాం దారుణ ఓటమి బారి నుంచి తప్పించుకుని, 21 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్ 6 వికెట్ల నష్టానికి 189 పరుగులుగా ఉంది. అస్సాం ఇన్నింగ్స్లో (సెకెండ్) రిషవ్ దాస్ 17, రాహుల్ హజారికా 39, సుమిత్ సుమిత్ 16, బిషల్ రాయ్ 8, దెనిశ్ దాస్ 0, ఆకాశ్సేన్ గుప్తా 3 పరుగులు చేసి ఔట్ కాగా.. రియాన్, కునాల్ క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు సౌరభ్ ముజుందార్ 5 వికెట్లతో చెలరేగడంతో అస్సాం తొలి ఇన్నింగ్స్లో159 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్ ఆడుతుంది. రవి కిరణ్ 3, వాసుదేవ్ ఓ వికెట్ పడగొట్టారు. అస్సాం తొలి ఇన్నింగ్స్లో దెనిశ్ దాస్ (52) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్ఘడ్.. కెప్టెన్ అమన్దీప్ దేశాయ్ సెంచరీతో (116) కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులకు ఆలౌటైంది. శశాంక్ సింగ్ (82), అశుతోష్ (58) అర్ధసెంచరీలతో రాణించారు. అస్సాం బౌలర్లలో ముక్తర్ హుస్సేన్, మ్రిన్మోయ్ దత్తా, ఆకాశ్సేన్ గుప్తా, రాహుల్ సింగ్, కునాల్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
విధ్వంసం సృష్టించిన రియాన్ పరాగ్
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా చత్తీస్ఘడ్తో జరుగుతున్న మ్యాచ్లో అస్సాం సారధి, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడైన రియాన్ పరాగ్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్లో అతను విధ్వంసం సృష్టించాడు. 40 బంతులు ఎదుర్కొన్న రియాన్.. 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూలిన అస్సాం ఫాలో ఆన్ ఆడుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ ఆ జట్టు పేలవ ప్రదర్శన చేస్తుంది. రియాన్ పరాగ్ తన జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి, 3 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుంది. అస్సాం సెకెండ్ ఇన్నింగ్స్లో రిషవ్ దాస్ 17, రాహుల్ హజారికా 39, సుమిత్ సుమిత్ 16, బిషల్ రాయ్ 8, దెనిశ్ దాస్ 0 పరుగులు చేసి ఔట్ కాగా.. రియాన్, ఆకాశ్సేన్ గుప్తా (3) క్రీజ్లో నిలిచారు. అంతకుముందు సౌరభ్ ముజుందార్ 5 వికెట్లతో చెలరేగడంతో అస్సాం తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. రవి కిరణ్ 3, వాసుదేవ్ ఓ వికెట్ పడగొట్టారు. అస్సాం తొలి ఇన్నింగ్స్లో దెనిశ్ దాస్ (52) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కెప్టెన్ అమన్దీప్ దేశాయ్ సెంచరీతో (116) కదంతొక్కడంతో చత్తీస్ఘడ్ తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులకు ఆలౌటైంది. శశాంక్ సింగ్ (82), అశుతోష్ (58) అర్ధసెంచరీలతో రాణించారు. అస్సాం బౌలర్లలో ముక్తర్ హుస్సేన్, మ్రిన్మోయ్ దత్తా, ఆకాశ్సేన్ గుప్తా, రాహుల్ సింగ్, కునాల్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
ఆసీస్తో టీ20 సిరీస్.. రియాన్ పరాగ్కు బంపర్ ఆఫర్..?
ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్కప్ తర్వాత టీమిండియా స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగే ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతి కల్పించి, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తారని తెలుస్తుంది. త్వరలో ప్రకటించబోయే జట్టులో ప్రస్తుత దేశవాలీ క్రికెట్ సెన్సేషన్ రియాన్ పరాగ్కు స్థానం పక్కా అని సమాచారం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు (అస్సాం కెప్టెన్గా) చేసి, భీకర ఫామ్లో ఉన్న రియాన్ సైతం భారత సెలక్టర్ల నుంచి పిలుపు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ముస్తాక్ అలీ టోర్నీలో మొత్తం 10 మ్యాచ్లు ఆడిన రియాన్ 85.00 సగటున, 182.79 స్ట్రైక్ రేట్తో 510 పరుగులు చేసి టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ టోర్నీలో రియాన్ 11 వికెట్లు కూడా పడగొట్టాడు. రియాన్ తన అద్భుతమైన ఆల్రౌండ్ ప్రతిభతో, కెప్టెన్సీ స్కిల్స్తో అస్సాంను సెమీస్ వరకు తీసుకెళ్లాడు. అయితే సెమీస్లో రియాన్తో పాటు జట్టు మొత్తం విఫలం కావడంతో అస్సాం టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీకి ముందు జరిగిన దియోదర్ ట్రోఫీలోనూ భీకర ఫామ్లో ఉండిన రియాన్ (ఈస్ట్ జోన్).. ఈ టోర్నీలో 5 మ్యాచ్లు ఆడి 88.50 సగటున 136.67 స్ట్రైక్ రేట్ 136.67తో రెండు సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 354 పరుగులు చేశాడు. ఈ టోర్నీలోనూ రియాన్ బ్యాట్తో పాటు బంతితోనూ రాణించాడు. ఈ టోర్నీలో అతను 19.09 సగటున 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని రియాన్ను భారత జట్టుకు ఎంపిక చేయడం ఖాయమని నెటిజన్లు అనుకుంటున్నారు. 21 ఏళ్ల రియాన్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
భారత్లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement