-
అక్కడ ఓడినా ఇక్కడ రికార్డులు తిరగరాస్తున్న వైల్డ్ డాగ్
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఎన్నో అంచనాల నడుమ మార్చి 2న విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. దీంతో థియేటర్లో విడుదలైన 19 రోజులకే ఇది ఓటీటీ బాట పట్టింది. కంటెంట్ పరంగా బాగున్నా కలెక్షన్ల పరంగా నిరాశపరచిన ‘వైల్డ్ డాగ్’ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో దుమ్మ దులుపుతోంది. వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. నివేదికల ప్రకారం.. ‘వైల్డ్ డాగ్’ కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూ కౌంట్ అందుకోవడం ద్వారా అన్ని దక్షిణ భారత చిత్రాల రికార్డును బద్దలు కొట్టింది. అతి తక్కువ సమయంలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. పాన్ ఇండియా రేంజ్ నిర్మాణ విలువలు, కథను నడిపిన తీరు, నాగార్జున నటన ఈ చిత్రానికి హైలెట్గా నిలువడంతో ఇతర భాషలలో కూడా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగు వర్షన్లో ఈ చిత్రం వ్యూస్ పరంగా 2 స్థానంలో ఉండగా, తమిళ వెర్షన్కుగానూ 5వ స్థానం దక్కింది. విడుదలై వారం కూడా కాలేదు కాబట్టి ఇంకా వ్యూస్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. చెప్పాలంటే నాగార్జునకు తమిళనాట పెద్దగా మార్కెట్ లేదు. కానీ, అక్కడి లోకల్ హీరోల సినిమాలను వెనక్కు నెట్టి మరీ ఓ రేంజ్లో వ్యూస్ సొంతం చేసుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రానికి ఒటీటీలో ఎంతటి రెస్పాన్స్ వస్తోందో. ఇక ఇతర భాషల్లో కూడా మంచి స్పందనతో రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటోంది. టాలీవుడ్లో కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. అలాగే తన కెరీర్లో ఒకే రకం జోనర్ సినిమాలను కాక భిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. ఈ క్రమంలోనే రొమాంటిక్, ఫ్యామిలీ కథల నుంచి ప్రస్తుతం యాక్షన్ నేఫథ్యంలోని కథలను ఎంచుకుంటున్నాడు. అలా చేసిన సినిమానే ‘వైల్డ్ డాగ్’. టెర్రరిజం బ్యాక్డ్రాప్లో కొత్త దర్శకుడు అషిషోర్ సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్లో నాలుగు భాషల్లో అంటే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ( చదవండి: ఆ కారణంతో క్రేజీ ఆఫర్లు వదులుకున్న ‘జాతిరత్నాలు’ హీరోయిన్ ) -
ఈ వీకెండ్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే..
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఎక్కడికి వెళ్లాలన్నా భయం భయంగానే ఉంటోంది. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమాలకు చూస్తూ ఎంటర్టైన్ అవ్వొచ్చు. ఈ వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలేంటి? ఏ ప్లాట్ఫాంలో ఎప్పుడు రిలీజ్ కానున్నాయి వంటి వివరాలు చూసేద్దాం. అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్డాగ్’. ఈ చిత్రంలో కింగ్ నాగ్ ఏసీపీ విజయ్ వర్మగా నటించారు. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకపోయినప్పటికీ, సినిమాకు మంచి స్పందన వచ్చింది. దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్22న విడుదలయ్యింది. కార్తీ, రష్మిక జంటగా నటించిన చిత్రం 'సుల్తాన్. ‘ఖైదీ’, ‘దొంగ’ వంటి సూపర్ హిట్స్ తర్వాత కార్తీ ఈ మూవీలో నటించారు.తమిళంలో రష్మికకు ఇదే తొలి చిత్రం.బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మించారు.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా మే 2 ఆహాలో విడుదల కానుంది. బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా కథానాయికగా నటించిన చిత్రం ‘సైనా’. ఈ మూవీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. పాత్ర కోసం పరిణీతి చోప్రా బ్యాడ్మింటన్లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపిన విషయం తెలిసిందే. అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో ఏప్రిల్23న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కన్నడ స్టార్ దర్శన్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం "రాబర్ట్". తెలుగులోనూ ఇదే పేరుతో రిలీజ్ అయ్యింది. అనుకోని పరిస్థితుల్లో కొడుకు ఓ గ్యాంగ్స్టర్తో పడిన ఇబ్బందుల నుంచే ఎలా భయపడ్డాడు అన్నదే ఈ సినిమా కథ. ఈ ఏడాది రిలీజ్ అయిన భారీ సినిమాల్లో ఇది కూడా ఒకటి. కన్నడలో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. జగపతి బాబు రవి కిషన్, వినోద్ ప్రభాకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 25న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీవాస్ నిర్మించాడు. ‘ఆహా’లో ఏప్రిల్ 23న రిలీజ్ అయ్యింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో యంగ్ హీరో పవన్తేజ్. ఈయన నటించిన డెబ్యూ మూవీ ఈ కథలో పాత్రలు కల్పితం. మేఘనా, లక్కీ, రఘు బాబు, అభయ్ బేతిగంటి ప్రధాన పాత్రలు పోషించారు. తొలి సినిమాతోనే పవన్ తేజ్ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 24న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. -
మంచిని పంచుకుంటే ఆనందమే
‘‘సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ)లో కొంత డబ్బు మిగిలే ఉంది. ఈ నగదును సినీ కార్మికులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించేందుకు వినియోగించాలనుకుంటున్నాం. 24శాఖల యూనియన్స్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం’’ అన్నారు చిరంజీవి. గత ఏడాది కరోనా టైమ్లో చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ఆరంభమైంది. విరాళాలు సేకరించి, సినీ పేద కార్మికులకు నిత్యావసరాలు అందజేసిన విషయం తెలిసిందే. ‘‘మంచి విషయాన్ని పది మందితో పంచుకోవడంలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. ‘వైల్డ్ డాగ్’ చూడగానే నాకదే అనిపించింది. తెలుగువాళ్లుగా మనమంతా గర్వపడే గొప్ప సినిమా ఇది’’ అని హీరో చిరంజీవి అన్నారు. నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న రిలీజైంది. ఈ సినిమాని ఆదివారం చిరంజీవి చూశారు. సోమవారం విలేకరుల సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా గురించి నిరంజన్ నాతో చెప్పినప్పుడు సాంగ్స్, రొమాంటిక్ సీన్స్ ఉండవు అన్నాడు. నాగ్ సినిమా అంటే ఇవన్నీ ఊహిస్తాం కానీ అవేవీ లేకుంటే డ్రైగా ఉంటుందనుకున్నాను. కానీ ‘వైల్డ్ డాగ్’ చూసేటప్పుడు ఆద్యంతం ఉత్కంఠగా అనిపించింది. ఇంటర్వెల్ కూడా ఆపకుండా చూశానంటే ఈ సినిమా మీద నా ఆసక్తి చివరిదాకా ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిందీ ‘యురి’ సినిమాకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇలాంటి సినిమా మనం ఎందుకు తీయలేకపోతున్నాం.. కమర్షియల్ ట్రాక్లో పడిపోయామా? అనుకుంటున్న సమయంలో నాగార్జున ‘వైల్డ్ డాగ్’ లాంటి సినిమా చేయడం గర్వంగా ఫీల్ అయ్యా’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘చిరంజీవి గారు ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ‘వైల్డ్ డాగ్’ అనడం గర్వంగా అనిపించింది’’ అన్నారు. ‘‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మేకర్స్ ఆఫ్ ‘క్షణం, ఘాజీ’ అని వేసుకున్నాం.. చిరంజీవిగారు ఫోన్ చేశాక మా తర్వాతి సినిమాకి మేకర్స్ ఆఫ్ ‘క్షణం, ఘాజీ’తో పాటు ‘వైల్డ్ డాగ్’ అని వేసుకోవాలనిపించింది’’ అన్నారు నిరంజన్ రెడ్డి. అహిషోర్ సాల్మన్ పాల్గొన్నారు. -
పెళ్లి చేసుకోవాలనుకున్నాం.. అంతలోనే గర్భవతినని తెలిసింది!
దియా మీర్జా.. ఇటు వ్యక్తిగత జీవితంలోనూ.. అటు కెరీర్ పరంగానూ మంచి జోష్లో ఉన్నారు. ఇటీవల విడుదలైన నాగార్జున వైల్డ్డాగ్ మూవీతో తెలుగు తెరపై సందడి చేసిన ఈ హైదరాబాదీ, శుక్రవారం ఓ శుభవార్తను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. తాను త్వరలోనే తల్లికాబోతున్నానని, మాతృత్వపు మధురిమలు ఆస్వాదించే క్షణాల కోసం ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న దియా మీర్జా, ఈ విషయం తెలియజేయగానే, పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చారా అన్న సందేహాలు తలెత్తాయి. ఇదే విషయాన్ని ఇన్స్టా వేదికగా ఆమె వద్ద ప్రస్తావించారు నెటిజన్లు. ‘‘జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్న మీకు శుభాకాంక్షలు. అయితే, మహిళా పూజారి సమక్షంలో, ఆమె చదువుతున్న వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని అనాదిగా ఆచరిస్తున్న కట్టుబాట్లను తెంచుకుని పురోగమిస్తున్నానని చెప్పిన ఓ మహిళ, పెళ్లికి ముందే గర్భవతినని ఎందుకు చెప్పలేకపోయారు? పెళ్లైన తర్వాతే గర్భం దాల్చాలనే కట్టుబాటును ఆమె అనుసరిస్తున్నారా? వివాహానికి ముందే అమ్మతనాన్ని ఆస్వాదిస్తే తప్పా? అని ఓ ఇన్స్టా యూజర్ ప్రశ్నలు సంధించారు. ఇందుకు బదులిచ్చిన దియా.. ‘‘మంచి ప్రశ్న అడిగారు. మా ఇద్దరికి బిడ్డ పుట్టబోతోంది కాబట్టి మేం పెళ్లి చేసుకోలేదు. వివాహ బంధంతో ముడిపడాలని ఎప్పటినుంచో ప్రణాళికలు రచించుకుంటూనే ఉన్నాం. అలాంటి సమయంలోనే మా జీవితంలోకి చిన్నారి రాబోతుందనే విషయం తెలిసింది. గర్భవతిని కాబట్టి హడావుడిగా పెళ్లిచేసుకోలేదు. ఇక ఈ విషయం వివాహానికి ముందే ప్రకటించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ, అప్పటికే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అంతా సవ్యంగా సాగుతుందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. అందుకే చెప్పలేదు. నిజానికి నా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం ఇది. ఇలాంటి ఒకరోజు కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇప్పుడు నా కల నెరవేరింది. మీరనుకుంటున్నట్లుగా తల్లికాబోతున్న విషయాన్ని ఆలస్యంగా ప్రకటించడంలో మరే ఇతర ఉద్దేశం లేదు’’ అని కుండబద్దలుకొట్టారు. ఇక బిడ్డను కనడం జీవితానికి గొప్ప బహుమతి అన్న దియా.. అది, పెళ్లికి ముందా, పెళ్లి తర్వాత అన్న విషయం పూర్తిగా వ్యక్తిగతం అని, సదరు మహిళ నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని, ఇందుకు సమాజం ఏమనుకుంటుందోనన్న భయాలు అక్కర్లేదని చెప్పుకొచ్చారు. కాగా తొలుత, నిర్మాత సాహిల్ సంఘాను వివాహమాడిన దియా మీర్జా.. ఐదేళ్ల తర్వాత అతడి నుంచి విడిపోయారు. అనంతరం డివోర్సీ అయిన వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ముంబైలో జరిగింది. చదవండి: ఆ రెండు లేకుండానే పెళ్లి: ఎందుకో చెప్పిన దియా Wild Dog Movie Review: విజయ్ వర్మ ఇన్వెస్టిగేషన్ అదిరింది -
వైల్డ్డాగ్ మూవీపై మెగాస్టార్ ప్రశంసలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
వివాహితపై అత్తింటివారి దాడి
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
వేడుకునేది ఓటర్ని కాదు! సూర్యుడ్ని!!
సాంఘిక విప్లవ నాయకుడు
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
జాలీ రైడ్
తప్పక చదవండి
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
Advertisement