-
రాజాసింగ్పై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసు
నిర్మల్, సాక్షి: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై జిల్లాలో కేసు నమోదు అయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ రాజాసింగ్తో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్పైనా కేసు నమోదు చేశారు ఖానాపూర్ పోలీసులు. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ తరఫున రాజాసింగ్, పాయల్ శంకర్లు ప్రచారంలో పాల్గొన్నారు. అయితే సమయం ముగిసినా కూడా ప్రచారం చేశారనే వీళ్లపై ఖానాపూర్ పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. -
విభజించి పాలించడమే బీజేపీ నైజం
● కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి కై లాస్నగర్: కుల, మతాల ప్రతిపాదికన విభజించి పాలించడమే బీజేపీ నైజమని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవాభవన్లో జరిగిన కార్యక్రమంలో పట్టణంలోని 33వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి సయ్యద్ సౌకత్ అలీతో పాటు పలువురు యువకులు కాంగ్రెస్లో చేరారు. వారికి ఆయన కాంగ్రెస్ కండువాలను కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సర్కార్ రిజర్వేషన్ల రద్దుకు, రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మళ్లీ పొరపాటున ఆ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మన మనుగడ ప్రశ్నార్థకంగా మారి జీవనం కష్టసాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, నాయకులు గిమ్మ సంతోష్రావు, లోక ప్రవీణ్రెడ్డి, మహ్మద్ రఫీక్, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన చామన్పెల్లి రైతులు
● ధాన్యం కొనుగోలు, తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన లక్ష్మణచాంద: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరుతూ మండలంలోని చామన్పల్లి రైతులు బుధవారం రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రం వద్ద సంచులు ఇచ్చే ముందు తేమ శాతం 18 ఉంటే సకాలంలో తూకం వేయకపోవడంతో తూకం వేసే క్రమంలో 40 కేజీల సంచి కేవలం 37 కేజీలు వస్తుందని రైతులు వాపోతున్నారు. తూకం వేసిన ధాన్యం సకాలంలో తరలించడం లేదన్నారు. దీనిపై మంగళవారం అధికారులకు విన్నవించినా ఎలాంటి స్పందన లేదని, అందుకే ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకుఇన ఆందోళన విరమించాలని రైతులకు సూచించగా ఉన్నతాధికారులు వచ్చి తమ సమస్య పరిష్కరించే వరకు విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. చివరకు పౌరసఫరాల అధికారి ముత్యంరెడ్డి వచ్చి వెంటనే నాలుగు లారీలు పంపిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
రుణమాఫీ చేసి చూపిస్తాం
● మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్తలమడుగు: రైతులకు ఇచ్చిన హామీలో భాగంగా ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని కజ్జర్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాట ఇస్తే తప్పడన్నారు. గల్లీలో కాంగ్రెస్, ఢిల్లీలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు పదవులు తప్పా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, తలమడుగు జెడ్పీటీసీ గోక గణేశ్రెడ్డి, ఎంపీపీ కళ్యాణ లక్ష్మి రాజేశ్వర్, ఎంపీటీసీ గోదావరి కమలాకర్, పూర్ణచందర్, ప్రకాష్ రావు, మాజీ జెడ్పీటీసీ బాపన్న, శ్రీనివాస్, నారాయణ, మాజీ ఎంపీటీసీ శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు. -
బెల్లం, పటిక పట్టివేత
కడెం: ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నరసింహారెడ్డి ఆదేశానుసారం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎంఏ.రజాక్ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని దోస్తునగర్లో ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 14 క్వింటాళ్ల బెల్లం, 60 కిలోల పటిక పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన బెల్లం, పటిక విక్రయిస్తున్న బండ్ల శంకర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐలు అక్బర్ హుస్సేన్, నజీర్ హుస్సేన్, లక్ష్మణ్, ఎస్సైలు వసంతరావు, సింధు, సిబ్బంది, పాల్గొన్నారు. నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం ఆదిలాబాద్టౌన్: రిమ్స్ నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. ఈ నెల 4న ఆమె స్వగ్రామం ఉట్నూర్ మండలంలోని కొత్తగూడకు వెళ్తానని ప్రిన్సిపాల్కు సెలవు పత్రం ఇచ్చింది. బుధవారం తన తండ్రి ఆమె కోసం కళాశాలకు రాగా ఇటీవల సెలవు పత్రం ఇచ్చి ఇంటికి వెళ్లిందని ప్రిన్సిపాల్ చెప్పడంతో వెంటనే టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏఎస్సై ముకుంద్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు కోటపల్లి: మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన డొబ్బల సంపత్ ద్విచక్ర వాహనంపై పార్పల్లి జాతీయ రహదారి మీదుగా చెన్నూర్కు వెళ్తుండగా చీకట్లో ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంలోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మారిశెట్టి విద్యాసాగర్ అంబులెన్స్కు సమాచారం అందించాడు. సంపత్ను అంబులెన్స్లో తరలించడంతో పాటు రూ.5వేలు అర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. -
ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి జైలు
సోన్: ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి జడ్జి అజయ్ కుమార్ జైలుశిక్షతో పాటు జరిమానా విధించినట్లు జైళ్ల అధికారి సక్రినాయక్ తెలిపారు. 2016లో సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామానికి చెందిన ఒంటెద్దుల సాయమ్మ (62)ను మహ్మద్ అల్లావుద్దీన్ నిర్లక్ష్యంగా లారీ నడుపుతూ ఢీకొట్టడంతో మృతి చెందింది. సాయమ్మ కుమారుడు సాయన్న అప్పట్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై పున్నంచందర్ కేసు నమోదు చేశారు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అజయ్ కుమార్ నిందితుడికి రెండు నెలల జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి లోకేశ్వరం: ఈ నెల 1న గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్సై దిగంబర్ తెలిపారు. మండలంలోని సాథ్గాం గ్రామానికి చెందిన ఉమ్మేడ నాగేష్ (51) భార్య జ్యోతి కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటినుంచి మానసికంగా కృంగిపోయిన నాగేష్ జీవితంపై విరక్తి చెందాడు. ఈనెల 1న పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుని కుమారుడు రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు. ఆస్ట్రేలియాలో ఇంద్రవెల్లి వ్యాపారి మృతి ఇంద్రవెల్లి: మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారి జన్నావార్ కిషోర్ (68) ఆస్ట్రేలియాలో అనా రోగ్యంతో మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 3న ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ సిటీలో ఉంటున్న తన కుమారుడు ఆతిష్ వద్దకు వెళ్లిన కిషోర్ తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని వారం రోజుల్లో స్వగ్రామానికి తీసుకురానున్నట్లు వారు పేర్కొన్నారు. ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య ఆదిలాబాద్టౌన్: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వన్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వన్టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ ధోబి కాలనీకి చెందిన కదూరి స్వామి (35) నాలుగేళ్లుగా శాంతినగర్లో అద్దెకు ఉంటున్నాడు. కొంత కాలంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. అతనికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఒంటరిగా ఉంటున్న ఆయన అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ఇంటి యజమాని మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. మృతుని సోదరుడు ప్రభుదాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. వడదెబ్బతో ఒకరి మృతి నేరడిగొండ: మండలంలోని వడూర్లో వడదెబ్బతో ఒకరు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామానికి చెందిన కందుకూరి రాములు (62) వడూర్లోని ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని ఇతరులకు కౌలుకు ఇచ్చేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే గ్రామంలో ఉంటున్న రాములు చించోలి(బి) గ్రామంలో స్థిరపడ్డాడు. ఎండలు అధికంగా ఉండడంతో వడదెబ్బకు గురై మృతి చెంది ఉండవచ్చని గ్రామస్తులు పేర్కొన్నారు. -
12వ తేదీలోగా రండి...
నిర్మల్ఖిల్లా: ప్రస్తుతం విద్యా సంస్థలకు వేసవికాలం సెలవులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. అయితే వేసవి సెలవుల్లో విద్యార్థులు, ఉద్యోగులు విహారయాత్రలు, తీర్థయాత్రలకు వెళ్లడానికి ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగ ఉపాధ్యాయులు శీతల ప్రాంతాలైన ఊటీ, గోవా, కొడైకెనాల్, జమ్మూ తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 13న సోమవారం రోజున లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటికే జిల్లా నుండి చాలామంది విహారయాత్రలకు కుటుంబ సమేతంగా వెళ్లారు. అయితే పోలింగ్ రోజు కంటే ముందే స్వస్థలాలకు చేరుకుని ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులు పిలుపునిస్తున్నారు. ఇదే అంశంపై మంగళవారం స్వీప్ ఆధ్వర్యంలో 5కే రన్ కూడా నిర్వహించారు. విహారయాత్రల నుండి తిరుగుముఖం.. సెలవులను సంతోషంగా గడిపిన వారంతా పోలింగ్ రోజు కంటే ముందే ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకున్నారు. ఓటుహక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని పోలింగ్ రోజు కల్లా స్వస్థలాలకు తరలిరానున్నారు. జిల్లా నుండి వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ఉపాధి కోసం హైదరాబాద్, వరంగల్, ముంబై, ఢిల్లీ, గుజరాత్ తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు కూడా ఓటుహక్కును వినియోగించుకోవడం కోసం స్వస్థలాలకు చేరుకుంటున్నారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారులు కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. ఎన్నికల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా అత్యధిక శాతం పోలింగ్ జరిగేలా అవగాహన కల్పిస్తున్నారు ఎన్నికల మహాక్రతువులో ఓటుహక్కు అత్యంత కీలకమని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఉదంతం స్ఫూర్తివంతం ఇంట్లో నుంచి కదల్లేని స్థితిలో ఉన్న వ్యక్తి ఓట్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్న మరుసటి రోజే మృతి చెందిన ఘటన నిర్మల్ రూరల్ మండలంలోని వెంగ్వాపేటలో చోటు చేసుకుంది. ఈ నెల 3న హనుమంతరావు (68) ఎన్నికల అధికారుల సమక్షంలో ఇంటి వద్దనే ఓటు వేశారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించి 4న తెల్లవారు జామున కన్నుమూశాడు. ఓటు వేయడంలో అలసత్వం ప్రదర్శించే పలువురిలో స్ఫూర్తిని రగిలించింది. ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలి ఓటింగ్ శాతం పెంచాలంటున్న ఎన్నికల అధికారులుపోలింగ్కు ముందే వచ్చేస్తాం.. ఏటా వేసవి సెలవుల్లో నాలుగైదు కుటుంబాల మిత్రులంతా కలిసి విజ్ఞాన విహార యాత్రలకు వెళ్తుంటాం. ఈసారి నార్త్ ఇండియాలోని జమ్మూ తదితర శీతల కేంద్రాలను విహార స్థలాలను సందర్శించాం. మే 13న ఎన్నికలు ఉండడంతో అంతకంటే ముందుగానే టూర్ ముగిసేలా ప్లాన్ చేసుకున్నాం. – స్వామిరెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, నిర్మల్ -
‘కాంగ్రెస్తోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం’
ఎదులాపురం: కాంగ్రెస్ పార్టీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం అవుతుందని మాదిగ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ నక్క రాందాస్ మాదిగ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ 360 రోజులవుతున్నా వర్గీకరణ ఊసేఎత్తడం లేదన్నారు. ఎన్నికలు వస్తేనే మంద కృష్ణ మాదిగకు వర్గీకరణ గుర్తుకు వస్తుందని, ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోయి మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. రాజ్యాంగ రక్షణ, వర్గీకరణ కేవలం కాంగ్రెస్తోనే సాధ్యం అవుతుందని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కే తమ మద్దతు ఉంటుందన్నారు. సమావేశంలో మనోజ్ కుమార్, మోతే బారిక్రావు, ప్రసన్నకుమార్, అశోక్, భూమన్న, మహేందర్, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. -
విడుదల చేయాలి
2020లో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమీషన్ రూ.2 లక్షల వరకు రావాల్సి ఉంది. సొంత ఖర్చులతో సెంటర్ నిర్వహించాం, అప్పులు చేసి సామాగ్రి కొనుగోలు చేసుకున్నాం. నాలుగేళ్లు సెంటర్ నిర్వహణ తీసుకోలేదు. 2024 యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. పెండింగ్ కమీషన్ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – గుర్రాల కళావతి, ప్యాడి సెంటర్ నిర్వాహకురాలు, దొనబండ రూ.2 లక్షలు రావాలి వరిధాన్యం కొనుగోలు కమీషన్ రూ.2 లక్షలు రావాల్సి ఉంది. కమీషన్ గురించి అధికారులను అడుగుతుంటే సమాధానం ఇవ్వడం లేదు. కష్టపడి సెంటర్ నడిపించాం. మా కష్టానికి ఫలితం దక్కడంలేదు. కమీషన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం.– ఆత్రం యశోద, సెంటర్ నిర్వాహకురాలు -
ఎంగ్లాపూర్ గ్రామస్తుల బైండోవర్
పెంబి: తమ గ్రామంలో సరైన సౌకర్యాలు లేవంటూ ఎంగ్లాపూర్ గ్రామ పంచాయతీలోని గుమ్మెన, కొలాంగూడ, నాయకపుగూడ గ్రామస్తులు అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించడంతో జిల్లా, మండల అధికారుల చొరవతో ఎట్టకేలకు ఓటు వేశారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా పోలీసుల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్వో ముందు సత్పవర్తన కలిగి ఉండేందుకు ఎంగ్లాపూర్ గ్రామానికి చెందిన లింగన్న, మల్లేశ్, రాజన్నను బైండోవర్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గడువు పెంపు
కైలాస్నగర్: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గడువును ఎన్నికల సంఘం ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలి పారు. తొలుత ఈ నెల 8వ తేదీ వరకు గడువు ఉండగా మరో రెండు రోజులు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఎన్నికల సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదిలాబాద్లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల, బోథ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. -
● తగ్గుతున్న గృహజ్యోతి లబ్ధిదారులు ● జిల్లాలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం ● ఈ నెలాఖరు వరకు మరింత పెరిగే అవకాశం
కైలాస్నగర్: జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. ఉక్కపోత, వడగాలులతో జనం బెంబేలెత్తుతున్నా రు. ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. వీటి వాడకం పెరగడంతో విద్యుత్ వినియోగ పరిమితి దాటిపోయి గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. ఫలితంగా ప్రభుత్వం నుంచి అందే రాయితీ వారికి దూరమవుతోంది. గడిచిన మూడు నెలల్లో గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గడం పెరిగిన విద్యుత్ వినియోగానికి నిదర్శనంగా నిలుస్తోంది. పెరిగిన విద్యుత్ వినియోగం జిల్లాలో మార్చితో పోల్చితే ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ వినియోగం పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45 డిగ్రీలకు చేరువయ్యాయి. వడ గాలులు సైతం వీస్తున్నాయి. ఉదయం 10 దాటితే ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను నాన్స్టాప్గా వినియోగిస్తున్నారు. గతేడాది మే నెలలో జిల్లా విద్యుత్ కోటా రోజుకు 1.257 మిలియన్ యూనిట్లు ఉండగా 1.066 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించారు. ఈ ఏడాది మే నెల రోజు వారి కోటా 1.28 మిలియన్ యూనిట్లు కాగా ప్రస్తుతం 1.59 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తున్నారు. గతేడాదితో పోల్చితే 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ను అధికంగా వాడుతున్నట్లు అధికారులు తెలిపారు. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు జిల్లాలో 2,73,934 విద్యుత్ కనెక్షన్లుండగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి గృహజ్యోతి కింద లబ్ధి పొందే వారు 1,04,157 మంది ఉన్నట్లుగా విద్యుత్శాఖ అఽధికారులు గుర్తించారు. తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ వెంటనే దాన్ని అమలు చేస్తూ అర్హులైన వారికి జీరో బిల్లులు జారీ చేశారు. కొంత మంది కనెక్షన్ల వివరాలు తప్పుగా రాయడం, ఆధార్ వివరాలు జత చేయకపోవడం వంటి కారణాలతో లబ్ధి పొందడం లేదు. తాజాగా పెరిగిన ఎండలతో గతంలో జీరో బిల్లులు పొందిన లబ్ధిదారులు సర్కారు రాయితీకి దూరమవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు 200 యూనిట్లు వినియోగించే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పరిమితి దాటితే మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన విద్యుత్ వినియోగంతో ఈ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన మూడు నెలల్లో 42,797 మంది తగ్గిపోయారు. ఏప్రిల్లో 3,611 మంది తగ్గిపోగా ఈ నెలలో 8వ తేదీ వరకు 38,772 మందికి జీరో బిల్లులు జారీ చేశారు. ఇంకా బిల్లులు జారీ చేయాల్సి ఉన్నందున ఎంత మంది తగ్గుతారనేదీ వెల్లడి కాలేదు. అయితే వారికి వచ్చే రాయితీ మాత్రం 8 రోజుల్లోనే రూ.1.54 కోట్లకు చేరడంతో నెలాఖరు వరకు రూ.3కోట్లకు చేరే అవకాశమున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. జీరో బిల్లులు రానటువంటి వారంతా బిల్లులు చెల్లించకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాలోని గృహజ్యోతి లబ్ధిదారులు, వారి రాయితీ సొమ్ము లబ్ధిదారులు రాయితీ సొమ్ము (రూ.కోట్లలో) మార్చి 81,569 రూ.2.20 ఏప్రిల్ 77,958 రూ.2.82 మే 38,772 రూ.1.54 (ఈనెల 8వ తేదీ వరకు) విద్యుత్ పొదుపుగా వాడుకోవాలి గృహజ్యోతి కింద లబ్ధి పొందాలంటే వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలి. ఎండల తీవ్రత కారణంగా అధికంగా వినియోగించడంతో 200 యూనిట్ల పరిమితి దాటి లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. ప్రభుత్వ రాయితీ సొమ్ము మాత్రం పెరుగుతోంది. లబ్ధిదారులు ప్రభుత్వ రాయితీ పొందాలంటే రోజుకు సరాసరి 6.67 యూనిట్లు మాత్రమే వినియోగించాలి. 25 రోజులకు 175 యూనిట్లు వినియోగించినా నెల సరాసరి వినియోగం 210 యూనిట్లు అవుతుంది. అలాంటి వారికి గృహజ్యోతి వర్తించదు. 25 రోజులకు 160 యూనిట్లు వినియోగిస్తే నెలకు 190 యూనిట్లుగా నమోదై పథకం కింద లబ్ధి పొందవచ్చు. వినియోగదారులు విషయాన్ని గమనించి ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. – జేఆర్.చౌహాన్, విద్యుత్ శాఖ ఎస్ఈ జిల్లాలో ఈ నెల 1 నుంచి నమోదైన విద్యుత్ వినియోగం వివరాలు తేదీ విద్యుత్ వినియోగం (మిలియన్ యూనిట్లలో) మే 1 1.565 2 1.571 3 1.582 4 1.602 5 1.509 6 1.601 7 1.503 8 1.605 -
No Headline
గత ఎన్నికల్లో ప్రధానపార్టీల వారీగా అభ్యర్థులు సాధించిన ఓట్లు.. పార్టీ అభ్యర్థి పేరు సాధించిన ఓట్లు శాతం బీజేపీ సోయం బాపూరావు 3,77,374 35.48 బీఆర్ఎస్ గొడం నగేశ్ 3,18,814 29.97 కాంగ్రెస్ రాథోడ్ రమేశ్ 3,14,238 29.54 ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటర్ల వివరాలు.. సంవత్సరం ఓటర్ల సంఖ్య 2019 14,88,353 2024 16,50,175 -
విద్యాశాఖలో ‘వసూళ్లు’
● ఇష్టారీతిన ప్రైవేట్ పాఠశాలల అనుమతులు ● జోరుగా ఉద్యోగుల చేతివాటం ● కోర్టు కేసుల కోసమేనని కవరింగ్! ● పట్టించుకోని ఉన్నతాధికారులు ఆదిలాబాద్టౌన్: విద్యాశాఖ కార్యాలయంలో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కొంతమంది అధికారులు, ఉద్యోగులను మచ్చిక చేసుకుని తమ పని కానిచ్చేస్తున్నారు. మామూళ్లకు ఆశపడి అధికారులు ఇష్టారీతిన అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి వసతులు, సౌకర్యాలు లేకున్నా ప్రైవేట్ స్కూళ్లను ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. ఎవరైనా వీటిపై ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోడం అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఏకంగా అధికారులపై తిరగబడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోనే వసూళ్ల పర్వం సాగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. మామూళ్ల పైనే దృష్టి.. ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి అనుమతులు, రెన్యూవల్ కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఐదారుగురు ఉద్యోగులు ఈ సెక్షన్లు చూస్తున్నారు. ఒకరిద్దరు చూడాల్సిన సెక్షన్లను పలువురు పంచుకొని వసూళ్లకు పాల్పడుతున్నారు. అయితే ఇద్దరికి మాత్రమే డబ్బులు వస్తున్నాయని మిగతా వారు చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ సెక్షన్లు మాకు ఉన్నా.. లేకున్నా ఒక్కటే అన్న భావన వారు వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో ఇద్దరు ప్రాథమిక, ప్రాథమికోన్నత విభాగాలను చూస్తుండగా, మిగతా కొందరు ఉన్నత పాఠశాలలకు సంబంధించిన అనుమతులు, రెన్యూవల్కు సంబంధించి చూస్తున్నారు. అయితే తమకు వచ్చే డబ్బులను కోర్టు కేసులకు ఉపయోగిస్తున్నామని చెప్పడం గమనార్హం. అలాగే సైన్స్ఫేర్లు, ఇతర కార్యక్రమాలకు సైతం ప్రైవేట్ పాఠశాలల నుంచి డబ్బులు వసూలు చేయడంతో వారు నిబంధనలు ఉల్లంఘించినా, విద్యార్థులను వేధించినా వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతున్నారు. వారం క్రితం జిల్లా కేంద్రానికి చెందిన ఉర్దూ మీడియం పాఠశాల యజమాని డీఈవో కార్యాలయంలో అధికారులపై మండిపడటం, అలాగే ఓ ప్రైవేట్ పాఠశాల యాజమన్య సంఘం నాయకుడు తాను చెప్పిన పని చేయలేదని ఉద్యోగులపై గరంగరం కావడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఒక్కో ప్రైవేట్ స్కూల్ అనుమతి కోసం రూ.1లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేయగా, కింది నుంచి పై వరకు పంచుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగుల పాత్ర కీలకమని ఆ శాఖలోనే గుసగసలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షణ అధికారులు ఉన్నప్పటికీ వారు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చేయి తడిపితేనే ఫైలు కదిలేది ప్రైవేట్ సెక్షన్లతో పాటు పలు సెక్షన్లలోనూ వసూళ్ల దందా సాగుతుందనే ఆరోపణలున్నాయి. ఏ ఫైల్ కదలాలన్నా చేయి తడపాల్సిందేనని పలువురు చెబుతున్నారు. సస్పెండ్, డిప్యూటేషన్లు, మెడికల్ బిల్లులు, ఇతర ఏ పనులైనా కొంత మంది ఉద్యోగులకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఉందని పలువురు పేర్కొంటున్నారు. రెగ్యులర్ ఉన్నతాధికారులు లేకపోవడంతోనే పాలన గాడితప్పిందనే విమర్శలున్నాయి. నా దృష్టికి రాలేదు.. వసూళ్లకు సంబంధించిన విషయం నా దృష్టికి రాలేదు. ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకువస్తే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – ప్రణీత, డీఈవో -
మోదీతోనే దేశానికి భవిష్యత్తు●
● గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇచ్చోడ: నరేంద్రమోదీ మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపడితేనే ఈ దేశానికి భవిష్యత్తు ఉంటుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్కు మద్దతుగా మండల కేంద్రంలో బుధవారం ప్రచారం చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీ టింగ్లో ఆయన మాట్లాడారు. ‘ఫిర్ ఏక్బార్ మోదీ సర్కార్’ నినాదంతో ప్రతీ కార్యకర్త పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఓటు వేస్తే రానున్న రోజుల్లో హిందువులంతా ఇంట్లో కూర్చొని గడపాల్సి వస్తుందని అన్నారు. రాహుల్గాంధీ ప్రధాని అయితే భారతదేశం ముస్లిం రాజ్యమవుతుందన్నారు. ఈ మేర కు అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి పార్టీ అభ్యర్థి నగేశ్కు మద్దతు ఇవ్వాలని కోరా రు. సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు ఆర్యణ్ మహరాజ్, పార్లమెంట్ కోఆర్డినేటర్ అశోక్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కు వినియోగంపై ‘మెప్మా’ అవగాహన
కైలాస్నగర్: ఈ నెల 13న నిర్వహించను న్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ త మ ఓటు హక్కు వినియోగించుకోవాలని మెప్మా టీఎంసీ భాగ్యలక్ష్మి కోరారు. స్వీప్ ప్రచారంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని మహాలక్ష్మివాడ, జై జవాన్ నగర్, తాటిగూడ, భాగ్యనగర్, క్రాంతినగర్ వార్డుల్లో బుధవారం అవగా హన ర్యాలీలు నిర్వహించారు. ఆయా కాలనీల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి ర్యాలీ చేపట్టడంతో పాటు తె లంగాణ సాంస్కృతి కళాకారులు తమ ఆ టపాటల ద్వారా ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీవో లు పన్నాలాల్, సందీప్రెడ్డి పాల్గొన్నారు. -
పోలింగ్ ప్రక్రియ క్షుణ్ణంగా పరిశీలించాలి
కైలాస్నగర్: పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరి శీలించాలని పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్ అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే మైక్రోఅబ్జర్వర్స్కు స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాక్ పోల్ నిర్వహణ, పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందా లేదా అనే దాన్ని ఎప్పటికప్పుడు పరిశీ లించాలన్నారు. కేంద్రాల్లో వసతులు, ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. ఎక్కడైనా ఈవీఎంలు పని చేయకపోతే వాటి స్థానంలో వేరే వాటిని ఏ విధంగా అమరుస్తున్నారో పరిశీలించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూడాలని సూచించారు. పోలింగ్కు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు పంపాలన్నారు. మాక్ పోల్ ఉదయం 5.30గంటలకు ఏజెంట్ల సమక్షంలో నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర అధికారులు నిర్వహిస్తున్న విధులు, టెండర్, ఛాలెంజ్ ఓటింగ్లు జరిగితే వాటి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. రిట ర్నింగ్ అధికారి రాజర్షి షా మాట్లాడుతూ.. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ సాగేలా విధులు నిర్వహించాలన్నారు. ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే సమాచారమందించాలన్నారు. అంతకు ముందు మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ మైక్రో అబ్జర్వర్స్ పాటించాల్సిన విధులు, మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీవోవినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్ మైక్రోఅబ్జర్వర్స్కు శిక్షణ -
‘రాజ్యాంగాన్ని రక్షించేది డీఎస్పీ మాత్రమే’
ఎదులాపురం: భారత రాజ్యాంగాన్ని రక్షించేది దేశంలో డీఎస్పీ మాత్రమే అని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్ మహరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు భారత రా జ్యాంగాన్ని మారుస్తామని అంటున్నాయ ని అన్నారు. ఈ నెల 10న ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ మహరాజ్ ఆదిలాబాద్లో పార్లమెంట్ అభ్యర్థి మెస్రం గంగాదేవి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. ఇందులో డీఎస్పీ నాయకులు రాజేశ్వర్, సంతోష్, ధర్మాజీ, రవి, ప్రశాంత్, నారాయణ తదితరులున్నారు. -
పోలింగ్ శాతం పెరిగేనా?
● భగ్గుమంటున్న భానుడు ● ఓటింగ్ నమోదుపై అభ్యర్థుల్లో గుబులు ● పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని డిమాండ్ అభ్యర్థుల్లో గుబులు పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్ది అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రచారానికి సమయం ఎక్కువగా లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఓటర్లను కలిసే పరిస్థితి లేదు. ఎండల కారణంగా ఉద యం, సాయంత్రం మాత్రమే ప్రచారం చేస్తూ ఓ టర్లను ఆకట్టుకునేందుకు చెమటోడ్చుతున్నారు. అత్యధిక ఓటర్లు ఉండే జిల్లా కేంద్రాలపైనే ఫోకస్ పెడుతున్నారు. తమదైన శైలిలో ప్రచారం ముమ్మరం చేశారు. అయితే రోజురోజుకు పెరుగుతున్న ఎండ వారిని కలవరపెడుతుంది. ఎండలు మరింత పెరిగే అవకాశమున్నందున పోలింగ్ శాతం ఎంత వరకు నమోదవుతుందనే దానిపై ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. ఓటర్లను ఏ విధంగా కేంద్రాలకు రప్పించాలనే దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు చేసిన ప్రచారం ఒకటైతే పోలింగ్ రోజున ఓటర్లు కేంద్రాలకు రావడం మరో ఎత్తనే దిశగా ప్రణాళిక రచిస్తున్నారు. అటు అధికారులు సైతం ప్రత్యేక కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నారు. సాయంత్రం ఓ గంట సమయం అదనంగా పెంచినప్పటికీ ఓటర్లు ఎంత మంది కదులుతారనేది ఆసక్తికరంగా మారింది. కై లాస్నగర్: భానుడు ఉగ్రరూపంతో జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు చేరువయ్యాయి. దీనికి తోడు వడగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 10 దాటితే చాలు ఇంటి నుంచి బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. మధ్నాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ నెల 13న నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ శాతం నమోదు అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. పోలింగ్ శాతం పెంపుపై జిల్లా యంత్రాంగం స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తుండగా.. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. పోలింగ్ రోజున ఓటర్లు ఏ మేరకు కదులుతారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదనంగా పెంచిన సమయం లాభిస్తుందా లేదోనని అభ్యర్థులు గుబులు చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 79.90 శాతం పోలింగ్ గతేడాది నవంబర్ 30న నిర్వహించిన అసెంబ్లీ ఎ న్నికల్లో వందశాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా యంత్రాంగం స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. అయినా జిల్లాలో 79.90 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. పట్టణ జనాభా కలిగిన ఆదిలాబాద్ నియోజకవర్గంలో 77.34 శాతం, ఆదివాసీ జనాభా ఎక్కువగా ఉన్న బోథ్ నియోజకవర్గంలో 83.42 శాతం నమోదైన విషయం తెలిసిందే. దీన్ని పరిశీలిస్తే ఓటు వినియోగంపై పట్టణ ప్రజలు అంతగా ఆసక్తి చూపనట్లుగా స్పష్టమవుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. సౌకర్యాలు కల్పిస్తేనే మేలు మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు ప్రతీ పోలింగ్ కేంద్రంలో షామియానాలు, కూలర్లు, తాగునీరు, ఓఆర్ఎస్ వంటి వసతులు కల్పించాలని, అలాగే వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇటీవల ప్రభుత్వ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ ప్రతినిధులు సైతం కలెక్టర్ను కలిసి దీనిపై వినతిపత్రం అందజేశారు. జిల్లాలో మొత్తం ఓటర్లు: 4,56,450 పురుష ఓటర్లు : 2,22,306 మహిళ ఓటర్లు : 2,34,135 ఇతరులు : 09 గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం : 79,90 -
జాతీయ లోక్అదాలత్ జయప్రదం చేయాలి
● జిల్లా జడ్జి ప్రభాకర్రావుఆదిలాబాద్టౌన్: బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు లోక్ అదాలత్ మంచి మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.ప్రభాకర్రావు అన్నా రు. జూన్ 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్పై కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, పోలీస్ అధి కారులు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. కా ర్యక్రమ విజయవంతం కోసం వారి అభిప్రాయాలు స్వీకరించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ.. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి మార్గమని తెలిపారు. కక్షిదారుల కు అవగాహన కల్పిస్తూ అత్యధిక కేసుల పరిష్కా రం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు ప్రమీల జైన్, మంజూల సూర్యవార్, దుర్గారాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
● రాజకీయ పార్టీల సమక్షంలో కంట్రోల్ యూనిట్ల ర్యాండమైజేషన్ కై లాస్నగర్: ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని నిర్మల్, ముధోల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కంట్రోల్ యూనిట్స్ సప్లిమెంటరీ సెకండ్ ర్యాండమైజేషన్ మంగళవారం నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షిషాతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పా ర్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆన్లైన్ ద్వారా ప్రక్రియ చేపట్టారు. కమిషనింగ్ సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తిన ఈవీఎంల స్థానంలో అదనంగా కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు మంగళవారం సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఆయా నియోజకవర్గాలకు 50చొప్పున ఈవీఎంల ను అదనంగా కేటాయించారు. ఇవి సెక్టోరల్ అధి కారుల వద్ద రిజర్వ్లో ఉంటాయని తెలిపారు. పోలింగ్ సమయంలో ఏవైనా సాంకేతిక సమస్య తలెత్తితే, నిమిషాల వ్యవధిలోనే వారు సంబంధిత పోలింగ్ స్టేషన్కు చేరుకుని వాటిని వినియోగంలోకి తీసుకురానున్నట్లుగా కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో ఆదిలా బాద్, నిర్మల్ అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, కిశోర్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా తదితరులు పాల్గొన్నారు. -
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ఆదిలాబాద్టౌన్: 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ ప్రా రంభమైంది. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో మంగళవారం ‘దోస్త్’ సహాయ కేంద్రాన్ని ప్రా రంభించారు. రిజిస్ట్రేషన్, ఇతర అనుమానాలను ఇక్కడ నివృత్తి చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తలెత్తే సాంకేతిక లోపాలు సరిదిద్దేందుకు సహా య కేంద్రంలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ అచ్చి శ్రీనివాస్, దోస్త్ కోఆర్డినేటర్ నర్సింగ్రావు ప్రకటనలో తెలిపారు. వివరాలకు 9703533626, 94410 15766 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
● కలెక్టర్ రాజర్షిషాఆదిలాబాద్టౌన్:విద్యార్థులుశాసీ్త్రయ దృక్పథం అల వర్చుకుని ముందుకు సాగాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. విద్యార్థులకు సైన్స్పై అవగాహన కల్పించేందుకు జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో వారం రో జులుగా నిర్వహించిన వేసవి సైన్స్శిక్షణ శిబిరం ము గిసింది. ప్రభుత్వ డైట్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతి థిగా హాజరయ్యారు. వారం పాటు విద్యార్థులు నే ర్చుకున్న అంశాలను వివరిస్తూ ప్రయోగాలు చేశా రు. వాటిని ఆసక్తిగా తిలకించిన కలెక్టర్ అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స మాజంలో పెరుగుతున్న మూఢ నమ్మకాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. శాసీ్త్రయ వైఖరి, ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలన్నారు. సమాజంలో మూ ఢ నమ్మకాలు నిరోధించేందకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత, జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, సెక్టోరియల్ అధికారి జే.నారాయణ, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్కుమార్, రవీందర్రెడ్డి, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఆదిలాబాద్టౌన్: ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆది లాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వన్టౌన్, టూటౌన్ పరి ధిలో గల ప్రాంతాల్లో మంగళవారం ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. సీఆర్పీఎఫ్, క్యూ ఆర్టీతో పాటు జిల్లా పోలీసులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు.ఎన్నికల నిబంధన లు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కార్యక్రమంలో వన్టౌన్, టూటౌన్ సీఐలు సత్యనారాయణ, అశోక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పలుచోట్ల వడగళ్లు
జిల్లాలో మంగళవారం ఇంద్రవెల్లి, సిరికొండ, తాంసి, తలమడుగు మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. మధ్యాహ్నం వరకు మండుటెండతో భానుడు ప్రతాపం చూపగా 3 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. పలుచోట్ల ఇళ్లపైకప్పులు లేచిపోయాయి. జొన్న, మామిడి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. తాంసి మార్కెట్యార్డులోని జొన్నల కొనుగోలు కేంద్రంలో వర్షానికి ధాన్యం బస్తాలు తడిశాయి. తలమడుగు మండలం పల్లి (బి), పల్లి(కె) గ్రామాల్లో జొన్నరైతులు చేతికొచ్చిన పంటను ఆరబెట్టేందుకు ఇబ్బందులు పడ్డారు. – ఇంద్రవెల్లి/తాంసి/తలమడుగు/సిరికొండ
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆ హీరోల్లాంటి సినిమాలు చేయాలని ఉంది: సత్యదేవ్
మోదీ వ్యాఖ్యలకు కొమ్మినేని కౌంటర్..
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
అభివృద్ధిపై నాన్ స్టాప్ స్పీచ్..టీడీపీకి దమ్ముంటే..
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
కొడితే ఫోర్లు, సిక్సర్లే!.. ఓడిపోతే అందరూ అనేవాళ్లే!
కనురెప్పల సోయగానికై.. ఇలా చేయండి!
మరికొద్ది గంటల్లో చార్ధామ్ యాత్ర.. ఇంతలోనే భారీ వర్షాలు!
మూడు రోజుల్లో 795 ఫ్లాట్లు అమ్మిన డీఎల్ఎఫ్.. ఎక్కడంటే..
'ఓ సంచారి అంతరంగం'..మనసును కదిలించే పుస్తకం!
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement