-
‘బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసగించాయి’
భైంసాటౌన్: బీఆర్ఎస్, కాంగ్రెస్ మాదిగలను మోసం చేశాయని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్ మాదిగ ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని ఎస్ఎస్ కాటన్లో మాట్లాడుతూ.. పెద్దపల్లి, నాగర్కర్నూల్, వరంగల్ పార్ల మెంట్ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ నేతలు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. గతంలో కేంద్రం, రాష్ట్రంలో అధికా రంలో ఉన్నా వర్గీకరణ చేయకుండా ఓటు బ్యాంక్ కోసమే వాడుకున్నారని ఆరోపించారు. మందకృష్ణ మాదిగను మాజీ సీఎం కేసీఆర్ జైలుకు పంపి ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. ఎమ్మార్పీఎస్ లక్ష్యం వర్గీకరణ, అది బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. మాదిగలమంతా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేస్తామని తెలిపారు. ఆయన వెంట జాతీయ కార్యదర్శి నందకుమార్, నాయకులు గడ్డం తుకారాం, కత్తిబాబు, అంబేకర్ సాయిచరణ్, గంగాధర్, రాములు, సాయినాథ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
కరాటేలో శ్రీదేవికి బ్లాక్బెల్ట్
కడెం: మండలంలోని నవాబ్పేట్ గ్రామానికి చెందిన కొమురవెల్లి సిరిచందన–రమేశ్ దంపతుల కూతురు శ్రీదేవి కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన శ్రీదేవి పదేళ్లుగా ఒకినావ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇన్స్ట్రక్టర్ భూమేశ్ ఆధ్వర్యంలో కరాటేలో శిక్షణ పొందింది. ఈ నెల 5వ తేదీన కరీంనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచి ఒకినావ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ షిహాన్ కే వసంత్ చేతుల మీదుగా బ్లాక్బెల్ట్, సర్టిఫికెట్ అందుకుంది. -
నిర్మల్
బుధవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2024నేడు బీజేపీ బైక్ ర్యాలీ ఖానాపూర్: స్థానిక సాయిబాబా ఆలయం నుంచి బస్టాండ్ వరకు బుధవారం సాయంత్రం 4 గంటలకు చేపట్టనున్న బైక్ ర్యాలీ, అనంతరం నిర్వహించనున్న కార్నర్ మీటింగ్ను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్రెడ్డి, రాష్ట్ర నాయకుడు రితీశ్రాథోడ్ కోరారు. బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కార్యక్రమాలకు హాజరు కానున్నట్లు పేర్కొనారు. మంగళవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి కార్నర్మీటింగ్ స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, పట్టణాధ్యక్షుడు నాయిని సంతోష్, నాయకులు ఆకుల శ్రీనివాస్, రవీందర్రెడ్డి, బుచ్చన్న, మల్లయ్య, శ్రీనివాస్, రమేశ్, రవి తదితరులున్నారు. నిర్మల్: సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో వేగం పెరుగుతోంది. ఓటర్ల వద్దకు విస్తృతంగా చేరేందుకు పార్టీలు పలురకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ప్రతీ ఓటరును చేరేలా సోషల్మీడియాను వాడుకుంటున్నాయి. ఇటీవల పలు ఘటనలతో సామాజిక మాధ్యమాల్లో పార్టీల మధ్య వాడీవేడిగా మాటలయుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్సభలో ఆ పార్టీ నేతల ప్రసంగాల తీరుపై జిల్లాలో సోషల్మీడియా వేదికగా బీజేపీ ఆరోపణలు, కాంగ్రెస్ ప్రత్యారోపణల పోరు నడుస్తోంది. హీటెక్కిస్తున్న మాటలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీల మధ్య పోటాపోటీగా ప్రచారపర్వం సాగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏ చిన్న అంశాన్నీ వదులుకోవడం లేదు. ఎదుటి పార్టీ ఏమాత్రం నోరుజా రినా.. ప్రత్యర్థి పార్టీ ఎదురుదాడి చేస్తోంది. తాజా గా ఆదివారం నిర్మల్లో నిర్వహించిన రాహుల్గాంధీ సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయన మాటలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ నిర్మల్ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దయాకర్పై కేసు కూడా నమోదైంది. మరోవైపు అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై అద్దంకి దయాకర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆయనపై కామెంట్లు మాత్రం తగ్గడం లేదు. మరోవైపు బీజేపీ పోస్టులపై కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులూ ప్రతికామెంట్లు పెడుతున్నారు. గత ఎన్నికల్లో కేసులు.. సామాజిక మాధ్యమాల్లో వివిధ పార్టీల కార్యకర్తలు పెడుతున్న సందేశాలు చాలాసార్లు వివాదాస్పదం అవుతున్నాయి. సాధారణ సమయాల్లో పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల నాయకులు సీరియస్గా తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలు, అంతకుముందు ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన సందేశాలు వివాదాస్పదం కావడంతో, ప్రత్యర్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తులపై కేసులు కూడా నమోదయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సందేశాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులూ చేసిన సందర్భాలున్నాయి. పార్టీలకు సంబంధం ఉన్న వారితో పాటు సంబంధం లేని వారూ కేసుల్లో ఇరుక్కున్న పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. న్యూస్రీల్ రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోరు సామాజిక మాధ్యమాల్లో అదేతీరు నోరుజారుతున్న నేతలపై పోస్టులు హద్దు మీరుతున్నవారిపై కామెంట్లు ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు -
రేపు భైంసాలో కేటీఆర్ రోడ్షో
భైంసాటౌన్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 9న భైంసాకు రానున్నారని ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్, ముధోల్ ఎన్నికల ఇన్చార్జి రాథోడ్ జనార్దన్ తెలిపారు. మంగళవారం పట్టణంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం సాయంత్రం 5గంటలకు పట్టణంలోని పాత పోస్టాఫీస్ ప్రాంతంలో కేటీఆర్ రోడ్షోలో భాగంగా కార్నర్ మీటింగ్లో పాల్గొంటారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమన్వయ కమిటీ సభ్యులు పీ రమాదేవి, విలాస్ గాదేవార్, కిరణ్ కొమ్రేవార్, లోలం శ్యాంసుందర్ ఉన్నారు. -
తలసేమియా.. ప్రాణాంతకం!
తలసేమియా ప్రాణాంతక వ్యాధి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా వ్యాధిగ్రస్తులున్నారు. 15రోజులకోసారి వీరికి రక్తం ఎక్కించకుంటే ప్రమాదమే.. IIలోuఅంతా వ్యంగ్యమే.. రాజకీయ నేతల ప్రసంగాలతోపాటు సోషల్ మీడియా పోస్టుల్లోనూ ప్రచారశైలి మారిపోయింది. ప్రతీ అంశాన్ని వివాదాస్పదం చేసి, ఓటర్లలో చర్చనీయాంశంగా మార్చాలన్న తీరు కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీలపై ఆరోగ్యకరమైన విమర్శలు చేసేవాళ్లు. కానీ.. ఇప్పుడు నేరుగా అభ్యంతరకరమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న తీరు పెరుగుతోంది. ఏదిఏమైనా జనాల్లోకి చొచ్చుకు వెళ్లాలన్న లక్ష్యంతో నేతలు హద్దు మీరి మాట్లాడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం పార్టీల మధ్య ప్రచారతీరు అలాగే ఉంది. నేతలను మించి కార్యకర్తలు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉంటున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement