ఇషా అంబానీతో జతకట్టిన అలియాభట్‌! ఇక దూకుడే.. | Sakshi
Sakshi News home page

ఇషా అంబానీతో జతకట్టిన అలియాభట్‌! ఇక దూకుడే..

Published Wed, Sep 6 2023 7:49 PM

Alia Bhatt announces Ed a mamma Reliance Retail JV with Isha Ambani - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ అలియా భట్ (Alia Bhatt), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ( Isha Ambani) జతకట్టారు. ఎడ్-ఎ-మమ్మా అనే వ్యాపార సంస్థతో బిజినెస్‌ రంగంలోనూ పేరుగాంచిన అలియాభట్‌, రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్‌తో చేతులు కలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశారు అలియాభట్‌. ఇషా అంబానీతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

‘బూట్‌స్ట్రాప్డ్ వెంచర్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma), భారతదేశపు అతిపెద్ద రిటైలర్ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ ( Reliance Retail Ventures Ltd) సంస్థలు చేతులు కలిపాయి. ఇక రెండూ కలిసి వ్యాపారం సాగిస్తాయి’ అని అలియాభట్‌ పేర్కొన్నారు. ఇద్దరు తల్లులమైన తాము ఇలా చేతులు కలపడం మరింత ప్రత్యేకమైందని వివరించారు.

(తండ్రికి తగ్గ తనయ.. ఆకట్టుకున్న ఇషా అంబానీ మాటలు!)

ఎడ్-ఎ-మమ్మా కంపెనీని 2020లో ఏర్పాటు చేశారు అలియా భట్‌. ఇది ప్రత్యేకంగా పిల్లలు, టీనేజనర్ల దుస్తులు, ప్రసూతి తల్లులకు సంబంధించిన దస్తులు విక్రయించే ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ. ఇక అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ, జిమ్మీ చూ వంటి ప్రముఖ బ్రాండ్‌ల సహకారంతో రిలయన్స్ రిటైల్ భారతదేశంలో అతిపెద్ద రిటైలర్‌లలో ఒకటిగా ఉంది. దీనికి డైరెక్టర్‌గా ఉన్న ఇషా అంబానీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు.

Advertisement
Advertisement