భారత్- నేపాల్ సరిహద్దుల మీదుగా నకిలీ ధృవపత్రాలతో భారత్లోకి చొరబడేందుకు ఒక చైనా పౌరుడు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి డార్జిలింగ్ మీదుగా భారత్ సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమై ఆ వ్యక్తిని అరెస్టు చేశాయి.
ఉమేష్గా మారిన పెంగ్ యోంగ్జిన్
మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం భారత్-నేపాల్ సరిహద్దులోగల డార్జిలింగ్ స్పెషల్ సర్వీస్ బ్యూరో(ఎస్ఎస్బీ) పానీటంకీ అవుట్పోస్ట్ వద్ద ఒక చైనా పౌరుడిని అరెస్టు చేసింది. అతను అక్రమంగా భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్ఎస్బీఈ చర్య చేపట్టింది. అరెస్టయిన ఆ చైనా పౌరుని పేరు పెంగ్ యోంగ్జిన్. ఇతను నేపాల్లో ఉమేష్ అనే నకిలీ పేరుతో నివసిస్తున్నాడు. ఇదే పేరుతో నేపాల్లో పాస్పోర్టు కూడా చేయించుకున్నాడు. ఈ పాస్పోర్టు ఆధారంగానే ఆ చైనా పౌరుడు భారత్లోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేశాడు.
భారత్లోకి చొరబాటు వెనుక..
ఎస్ఎస్బీ తెలిపిన వివరాల ప్రకారం నేపాల్లో ఉంటున్న ఆ చైనా పౌరుడు అక్కడ పాస్పోర్ట్ పొందేందుకు స్థానికులు సహాయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఎస్ఎస్బీ అదుపులో ఉన్న ఆ చైనా పౌరుడిని విచారిస్తున్నారు. అతను అక్రమంగా భారత్లోకి ఎందుకు ప్రవేశించాలనుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
నేపాల్లో ఉంటూ..
భారత్లోని డార్జిలింగ్ జిల్లాలోని పానీటంకీ ప్రాంతం నేపాల్లోని కకర్వీటా పరిధిలోని డోక్లామా చికెన్ నెక్కు సమీపంలో ఉంది. ఈ సున్నిత ప్రాంతంలో ఇన్నాళ్లూ నివాసమున్న ఈ చైనా పౌరుడు అక్కడ ఎటువంటి కార్యకలాపాలు సాగించాడో తెలుసుకునేందుకు ఎస్ఎస్బీ ప్రయత్నిస్తోంది. భారత్-నేపాల్ సరిహద్దు 1850 కిలోమీటర్ల మేర ఉంది. అయితే ఆ చైనా యువకుడు తాను ఉండేందుకు డార్జిలింగ్ సమీపంలోని ప్రాంతాన్నే ఎందుకు ఎన్నుకున్నాడనేది అధికారుల ముందున్న ప్రశ్న. ఈ డోక్లామ్ రీజియన్ విషయంలో భారత్-చైనాల మధ్య వివాదం రగులుతోంది.
ఏడేళ్లుగా మారుపేరుతో..
భారత్లోకి పాక్ నుంచి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ ఉదంతం సంచలనంగా మారిన నేపధ్యంలో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. రక్షణ బలగాలు తనిఖీలు మరింత ముమ్మరం చేశాయి. కాగా పెంగ్ తన పేరు, గుర్తింపును మార్చుకుని నేపాల్లో అక్రమంగా గడచిన ఏడేళ్లుగా ఉంటున్నాడు. తాజాగా భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన అతనిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ సర్వీస్ బ్యూరో అతనిని సుదీర్ఘంగా విచారిస్తోంది.
ఇది కూడా చదవండి: ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి
Chinese National Arrested: నేపాల్లో చైనా ‘పెంగ్’.. భారత్లోకి చొరబడుతూ..
Published Sat, Jul 22 2023 7:40 AM
Advertisement
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ
అభివృద్ధి లేదంటూ అసత్య ప్రచారం.. కారణం ఇదే..
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
కిక్కిరిసిన కర్నూల్
డైరెక్ట్గా ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్ష్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
"కూటమి కట్టినా ఓటమి తప్పదు"
చెలరేగిన కోహ్లి, పటిదార్ 60 పరుగులతో బెంగళూరు ఘనవిజయం (ఫొటోలు)
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్
Advertisement