బాగా పనిచేస్తున్నారు.. ఇదే స్ఫూర్తి కొనసాగాలి
అనంతపురం అర్బన్: కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినోద్కుమార్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందని,ఇదే స్ఫూర్తిని పోలింగ్ ముగిసే వరకూ కొనసాగించాలని ప్రత్యేక సాధారణ పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఎన్నికల సంసిద్ధతపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, పరిశీలకులతో కలిసి నోడల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో పనిచేయడం ఒక ప్రత్యేక అవకాశంగా భావించాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పకడ్బందీ చర్యలు: కలెక్టర్ వినోద్కుమార్
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని ప్రత్యేక పరిశీలకునికి కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2,236 పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించామన్నారు. దివ్యాంగుల కోసం ర్యాంప్ లు నిర్మించామని, 576 వీల్ చైర్లు అందుబాటులో ఉంచామన్నారు. ఓటరు స్లిప్ల పంపిణీ త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ నిర్వహిస్తామన్నారు. 544 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ప్రతి ప్రక్రియను కచ్చితత్వంతో నిర్వహిస్తున్నామని వివరించారు.
పటిష్ట పోలీసు బందోబస్తు: ఎస్పీ అమిత్ బర్దర్
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ప్రత్యేక పరిశీకులకునికి ఎస్పీ అమిత్ బర్దర్ చెప్పారు. జిల్లాకు సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర, సమీకృత చెక్పోస్టులు ఏర్పాటు చేసి, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామన్నారు. పోలింగ్, కౌంటింగ్ కోసం భద్రత, బందోబస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో పరిశీలకులు మనీష్ సింగ్, అజయ్నాథ్ ఝ, రవికుమార్, విలాస్ వి. షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే, జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్, జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ విజయభాస్కర్రెడ్డి,ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, పార్లమెంట్ ఏఆర్ఓ రమేష్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు ప్రత్యేక సాధారణ పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా సూచన